ఆ సినిమా వల్ల కొన్ని వందల పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి.. ఎందుకని?
సినిమా అనేది ఎంతో ప్రభావవంతమైన మాధ్యమం అనే విషయం అందరికీ తెలిసిందే. సినిమాల ప్రభావం వల్ల కొందరి జీవితాల్లో నెగెటివ్గా కావచ్చు, పాజిటివ్గా కావచ్చు కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయనే వార్తలు మనం వింటూ ఉంటాం. అయితే ఒక సినిమా వల్ల కొన్ని వందల పెళ్లిళ్లు వాయిదా పడడం ఏమిటి? అనేది ఆసక్తికరంగా మారిన విషయం. అసలేం జరిగింది? ఆ సినిమాకి, ఆ పెళ్ల్లిళ్లకు ఉన్న సంబంధం ఏమిటి? అనే విషయం గురించి తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపుýర్ అయిన ‘దేవదాసు’ కథ గురించి అందరికీ తెలిసిందే. బెంగాలీ రచయిత శరత్చంద్ర ఛటోపాధ్యాయ్ రాసిన ఈ నవల మొదటిసారి 1917లో పబ్లిష్ అయింది. ఈ కథ ఆధారంగా 1935 నుంచి ఇప్పటివరకు వివిధ భాషల్లో 20 సినిమాలు రూపొందాయి. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి నటించిన ‘దేవదాసు’ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. చివరిసారిగా 2002లో షారూక్ ఖాన్, ఐశ్వర్యారాయ్, మాధురి దీక్షిత్ ప్రధాన పాత్రల్లో హిందీలో ‘దేవ్దాస్’ పేరుతో ఈ కథ తెరపైకి వచ్చింది. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ‘దేవ్దాస్’ చిత్రం షూటింగ్ 2001లో ప్రారంభించారు. ఆరోజుల్లోనే భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. విజువల్గా ద్భుతంగా ఉండాలన్న ఉద్దేశంతో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించారు. సినిమాలోని చంద్రముఖి పాత్రకు సంబంధించిన కోట సెట్ను ఎంతో భారీగా నిర్మించారు. దాదాపు కిలోమీటరు మేర ఈ సెట్ ఉంటుంది. ఆరోజుల్లో ఆ సెట్ను చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఆ సెట్ ఎఫెక్టివ్గా కనిపించేందుకు 2,500 పవర్ఫుల్ లైట్స్ను ఏర్పాటు చేశారు. వాటి కోసం పెద్ద మొత్తంలో జనరేటర్స్ తెప్పించారు. ముంబాయిలో ఉన్న జనరేటర్స్ అన్నీ ‘దేవ్దాస్’ సెట్లోనే ఉన్నాయని చెప్ప్పుకున్నారు. దాదాపు 30 రోజుల పాటు ఆ సెట్లో షూటింగ్ జరిగింది. అది పెళ్లిళ్ల సీజన్. చాలా ప్రాంతాల్లో పెళ్లిళ్ల కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే అక్కడ లైటింగ్ కోసం జనరేటర్స్ అవసరం అయ్యాయి. కానీ, అవన్నీ ‘దేవ్దాస్’ షూటింగ్లో ఉండిపోయాయి. దాంతో ఆ నెలలో కొన్ని వందల పెళ్లిళ్లు వాయిదా పడ్డాయని అప్పట్లో న్యూస్ చక్కర్లు కొట్టింది. 50 కోట్ల బడ్జెట్తో రూపొందిన ‘దేవ్దాస్’ 2002 జూలై 12న విడుదలై ఘనవిజయం సాధించింది. దాదాపు 168 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సష్టించింది. మొదట 2002 మే 23న కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. అంతర్జాతీయ స్థాయిలో ‘దేవ్దాస్’ చిత్రానికి ప్రశంసలు లభించాయి.
Mar 31, 2026దాసరిపై కోపంతో సెట్ నుంచి వెళ్లిపోయిన ఎస్.వి.రంగారావు.. అసలేం జరిగింది?
1973లో విడుదలైన ‘తాత మనవడు’ చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన దాసరి నారాయణరావు తొలి సినిమాతోనే ఇండస్ట్రీలోని ప్రముఖుల దష్టిని ఆకర్షించారు. అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆత్రేయ వంటి గొప్ప రచయిత దాసరి భుజం తట్టి ప్రశంసించారంటే దాసరి ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి గొప్ప డైరెక్టర్ని పరిచయం చేసిన ఘనత నిర్మాత కె.రాఘవకు దక్కుతుంది. దాసరిని డైరెక్టర్గా పరిచయం చేయడానికి ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటిని అధిగమించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ‘తాత మనవడు’ ఘనవిజయం సాధించడంతో దాసరితోనే రెండో సినిమా ప్రారంభించారు రాఘవ. ఆ సినిమా పేరు ‘సంసారం సాగరం’. ఈ చిత్రంలో కూడా ఎస్.వి.రంగారావు ముఖ్యపాత్ర పోషించారు. తాత మనవడు చిత్రంలో దాసరి రాసిన డైలాగులు తన గాత్రంలో ఎంతో అద్భుతంగా పలికించిన ఎస్వీఆర్.. ఈ సినిమాకి వచ్చే సరికి అలాంటి డైలాగులే చెప్పేందుకు అభ్యంతరం చెప్పారు. సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన జయంతి గురించి, ఆమె గొప్ప తనం గురించి ప్రస్తావిస్తూ చెప్పే డైలాగుల పేపర్ను ఎస్వీఆర్కి ఇచ్చారు దాసరి. ఆ డైలాగులు చదువుకున్న ఎస్వీఆర్.. అంత పెద్ద డైలాగు అవసరం లేదని, తగ్గించి చెప్పినా ఏమీ తేడా ఉండదని, అందులో నుంచి రెండు లైన్లు కట్ చేసి చెబుతానన్నారు. కానీ, దాసరి దానికి ఒప్ప్పుకోలేదు. తనలాంటి సీనియర్ నటుడు చెప్పిన మాట ఒక కొత్త దర్శకుడు వినకపోవడం ఎస్వీఆర్కి బాగా కోపం తెప్పించింది. ఆ సీన్ చెయ్యను అంటూ పేపర్లు విసిరి కొట్టి, కాస్ట్యూమ్ కూడా తీసేసి సెట్ నుంచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న నిర్మాత రాఘవ.. కారులో వెళుతున్న ఎస్వీఆర్ను మరో కారులో ఫాలో అయ్యారు. అలా కొంత దూరం వెళ్లిన తర్వాత మనసు మార్చుకొని తిరిగి సెట్కి వచ్చారు ఎస్వీఆర్. మారు మాట్లాడకుండా దాసరి ఇచ్చిన డైలాగును యధాతథంగా చెప్పి సింగిల్ షాట్లో సీన్ ఓకే చేశారు. ఒక మంచి దర్శకుడ్ని, రచయితను అవమానించినందుకు ఎస్వీఆర్ ఎంతో బాధపడ్డారు. ‘డైరెక్టర్ అంటే నీలా ఉండాలి. నేను చెప్పాను కదా అని డైలాగు మార్చలేదు. నువ్వు తప్పకుండా గొప్ప దర్శకుడివి అవుతావు’ అంటూ దాసరిని ఆశీర్వదించారు ఎస్వీఆర్. ఆరోజు సెట్లో దాసరి, ఎస్వీఆర్ మధ్య జరిగిన వాగ్వాదం యూనిట్ మెంబర్స్ అందర్నీ కలవరపరిచింది. ఇకపై షూటింగ్ జరుగుతుందా లేదా అనే అనుమానం కూడా వారికి కలిగింది. అయితే ఎస్వీఆర్ అంత గొప్ప నటుడైనా ఎలాంటి ఈగోలకు వెళ్లకుండా తిరిగి సెట్కి వచ్చి తను ఇచ్చిన డైలాగ్ను ఏమాత్రం మార్చకుండా చెప్పి, ఆ తర్వాత అభినందించడం నిజంగా తన జీవితంలో మర్చిపోలేని సంఘటన అని పలు సందర్భాల్లో చెప్పారు దాసరి.
Mar 31, 2026రజినీకాంత్ అలా దూసుకెళ్లారు.. చిరంజీవి మాత్రం మధ్యలోనే ఆగిపోయారు!
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో 1970వ దశకంలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్స్టార్ రజినీకాంత్ల గురించి ప్రత్యేకంగా చెప్ప్పుకోవాలి. ఎందుకంటే ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం తమ టాలెంట్తో నటులుగా పరిచయమై స్టార్స్గా ఎదిగారు చిరంజీవి, రజినీకాంత్. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక దశలో తెలుగులో చిరంజీవి టాప్ హీరో అయితే, తమిళ్లో రజినీకాంత్ టాప్ హీరోగా చక్రం తిప్పారు. ఈ ఇద్దరు స్టార్స్కి హాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ వచ్చింది. అయితే మొదట రజినీకాంత్ని ఆ ఛాన్స్ వరించింది. ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ అశోక్ అమత్రాజ్ హాలీవుడ్లో సినిమాలు చేస్తూ నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన సోదరుడు విజయ్ అమత్రాజ్ జేమ్స్బాండ్ సిరీస్లో వచ్చిన ‘ఆక్టోపస్సీ’ చిత్రంలో రోజర్ మూర్తో కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇండియన్ బ్యాక్డ్రాప్లో ఒక హాలీవుడ్ మూవీ తియ్యాలనుకున్నారు అశోక్. అప్పటికే సూపర్స్టార్గా వెలిగిపోతూ జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న రజినీకాంత్ హీరోగా ఆ సినిమా చేసేందుకు ప్లాన్ చేశారు. రజినీ కూడా సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హాలీవుడ్ నుంచి దాదాపు 25 మంది టెక్నీషియన్స్ని ఇండియా తీసుకొచ్చి 1987లో ‘బ్లడ్ స్టోన్’ పేరుతో చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించారు విజయ్ అమత్రాజ్. ఈ సినిమాలో రజినీకాంత్ టాక్సీ డ్రైవర్గా నటించారు. 1 మిలియన్ అమెరికన్ డాలర్లతో నిర్మించిన ఈ సినిమా మంచి విజయం సాధించి 5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. హాలీవుడ్ సినిమాలో హీరోగా నటించిన ఇండియన్ హీరోగా రజినీకాంత్కి మంచి పేరు తెచ్చింది ‘బ్లడ్ స్టోన’. దాదాపు 10 సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవికి హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అమెరికాలో స్థిరపడిన ముగ్గురు భారతీయులు ఈ సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు. 1940లో విడుదలైన ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ చిత్రం చాలా పెద్ద విజయం సాధించింది. దానికి కొనసాగింపుగా ది రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ పేరుతో ఇంగ్లీష్లో, తెలుగులో అబూ బాగ్దాద్ గజదొంగ పేరుతో సినిమాను నిర్మించాలని ప్లాన్ చేశారు. ఆరోజుల్లోనే ఈ సినిమాకి 50 కోట్ల బడ్జెట్ నిర్ణయించారు. ఇప్పటి లెక్కల ప్రకారం చూస్తే దాదాపు 500 కోట్లు అని చెప్పాలి. హాలీవుడ్ నుంచి టెక్నీషియన్స్ని రప్పించారు. సెకండ్ యూనిట్ డైరెక్టర్గా సురేష్ కష్ణను ఎంపిక చేశారు. 1998 సెప్టెంబర్లో రామోజీ ఫిలిం సిటీలో ఈ చిత్రం ప్రారంభోత్సవం ఎంతో ఘనంగా జరిగింది. అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. ఇంగ్లీష్ వెర్షన్ గంటన్నరగా, తెలుగు వెర్షన్ రెండున్నర గంటలుగా నిర్ణయించారు. తెలుగు వెర్షన్లో 5 పాటలు, కొన్ని కామెడీ సీన్స్ని కూడా జోడించారు. ఎ.ఆర్.రెహమాన్కి సంగీతాన్ని చేసే బాధ్యత అప్పగించారు. కొంత షూటింగ్ జరిగిన తర్వాత మూడు నిమిషాల నిడివి వుండే ఒక ట్రైలర్ను రిలీజ్ చేశారు. అది చూసిన తెలుగు బయ్యర్లు పోటీ పడ్డారు. ఆరోజుల్లో చిరంజీవి సినిమాకి 8 కోట్లు బిజినెస్ జరిగేది. ఈ సినిమాకి 12 కోట్ల వరకు బిజినెస్ ఆఫర్స్ వచ్చాయి. అంతా బాగానే ఉంది అనుకుంటున్న తరుణంలో పెద్ద సమస్య వచ్చి పడింది. ఇది ఇస్లామిక్ మతానికి సంబంధించిన కథ. ఖురాన్ అనేది వారికి ఎంతో పవిత్రమైంది. కథ ప్రకారం ఖురాన్ పాతగా కనిపించడం కోసం దానిపై కాఫీని ఒలికించారు. ఇది ఆ మతస్థులకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ సినిమా షూటింగ్ ఆపెయ్యాలంటూ ఆందోళన చేపట్టారు. చిత్ర నిర్మాతలు ముగ్గురి మీదా కేసులు పెట్టారు. దీంతో షూటింగ్ అర్థాంతరంగా ఆగిపోయింది. ఈ కేసుల వల్ల నిర్మాతలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ గొడవలతో సినిమాను పక్కన పెట్టేశారు. అలా చిరంజీవికి వచ్చిన హాలీవుడ్ సినిమా అవకాశం చేజారిపోయింది. ఆ అనుభవంతో కొత్త నిర్మాతలతో సినిమా చెయ్యకూడదని చిరంజీవి నిర్ణయించుకున్నారు. అన్నీ సక్రమంగా జరిగి ఉంటే హాలీవుడ్ సినిమాలో హీరోగా నటించిన తొలి తెలుగు నటుడు అనే ఘనత చిరంజీవికి దక్కి ఉండేది.
Mar 30, 2026శ్రీరామదాసు చిత్రానికి 20 ఏళ్లు.. వైరల్గా మారుతున్న నాగ్ ఫ్యాన్స్ డిమాండ్!
- భక్త రామదాసుగా నాగార్జున విశ్వరూపం - మళ్ళీ థియేటర్లలోకి ‘శ్రీరామదాసు’? - అన్నమయ్య తర్వాత నాగార్జునకు అంతటి పేరు తెచ్చిన శ్రీరామదాసు టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున కెరీర్లో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు ఉన్నాయి. అయితే ఆయన చేసిన ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ వంటి భక్తిరస చిత్రాలు ప్రేక్షకులకు అందించిన అనుభూతి అద్వితీయం. ముఖ్యంగా 2006లో విడుదలైన ‘శ్రీరామదాసు’ చిత్రంలోని దృశ్యాలు, పాటలు ప్రతి తెలుగు లోగిలిలో వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన జ్ఞాపకాలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భద్రాచల రామదాసుగా పిలవబడే కంచర్ల గోపన్న జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. నాగార్జున తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన చిత్రాల్లో ఇది ఒకటి అనడంలో సందేహం లేదు. గోపన్నగా ఆయన చూపించిన ఎమోషన్స్, ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో నాగార్జున పలికించే హావభావాలు ఇప్పటికీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం ఎం.ఎం. కీరవాణి అందించిన సంగీతం. ‘అంతా రామమయం’, ‘అదిగో అదిగో భద్రగిరి’, ‘పలుకే బంగారమాయెనా’ పాటలతోపాటు సినిమాలోని అన్ని పాటలూ ప్రేక్షకుల్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. అప్పట్లో ఈ పాటల ఆల్బమ్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కేవలం పాటల కోసమే థియేటర్లకు వెళ్ళిన ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. శ్రీరామదాసు చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు కబీర్ దాసు పాత్రలో నటించడం ఒక విశేషం. తండ్రీకొడుకులు కలిసి నటించిన ఈ ఆధ్యాత్మిక కావ్యం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. సుమారు 18 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం 32 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, నాగార్జునకు ఉత్తమ నటుడిగా నంది అవార్డును కూడా తెచ్చిపెట్టింది. ప్రస్తుతం టాలీవుడ్లో రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ‘శ్రీరామదాసు’ చిత్రాన్ని 4K వెర్షన్లో థియేటర్లలోకి తీసుకురావాలని అక్కినేని అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. నాగార్జున ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, ఇలాంటి క్లాసిక్ సినిమాల జ్ఞాపకాలు ఆయన స్టార్డమ్ను ఎప్పుడూ పదిలంగా ఉంచుతాయి. అప్పట్లో టెక్నాలజీ పరిమితంగా ఉన్నా, రాఘవేంద్రరావు చూపించిన విజువల్స్ ఇప్పటికీ ఫ్రెష్గా అనిపిస్తాయి. మరి అక్కినేని అభిమానులు చేస్తున్న రీరిలీజ్ డిమాండ్పై నాగార్జునతో సహా రాఘవేంద్రరావు ఎలా స్పందిస్తారో చూడాలి. అలాగే ఈ సినిమా మళ్లీ థియేటర్లలో సందడి చేస్తే అది ఏ మేర సంచలనం సృష్టిస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Mar 30, 2026.webp)
ఒక్క స్టార్ హీరో కూడా లేని రావుగోపాలరావు అంతిమయాత్ర.. ఎందుకలా చేశారు?
తెలుగు సినిమా చరిత్రలో ఎంతోమంది గొప్ప నటులు వున్నారు. వారిలో రావుగోపాలరావు ప్రత్యేకం అని చెప్పాలి. తన విలక్షణమైన గొంతుతో, డైలాగ్ డెలివరీతో విలనిజానికే కొత్త అర్థం చెప్పారు. తెరపై గంభీరంగా కనిపించే ఈ మహానటుడి వ్యక్తిగత జీవితం మరియు ఆయన చివరి రోజులకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఆయన భార్య కమల కుమారి ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. రావుగోపాలరావు షూటింగ్ సమయంలో చాలా క్రమశిక్షణతో ఉండేవారు. పని పట్ల ఆయనకు ఉన్న గౌరవం అపారం. ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి సమయం ఇచ్చేవారు. ఆయన ఆహారపు అలవాట్లు కూడా చాలా సాదాసీదాగా ఉండేవి. బయట ఎంత పెద్ద స్టార్ అయినా ఇంట్లో మాత్రం చాలా సరళంగా ఉండేవారని ఆమె తెలిపారు. రావుగోపాలరావుకు కిడ్నీ సంబంధిత సమస్యలు ఉండేవని, చివరి రోజుల్లో అవి తీవ్రమయ్యాయని ఆమె పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, ఆయన తన వృత్తి పట్ల ఉన్న మక్కువతో పనులను కొనసాగించే ప్రయత్నం చేసేవారు. చివరికి ఆ అనారోగ్యమే 1994 ఆగస్టు 13న ఆయనను మనకు దూరం చేసింది. రావుగోపాలరావు చనిపోయిన సమయంలో ఆయన అంత్యక్రియలకు ఒక్క స్టార్ హీరో కూడా హాజరు కాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్టార్ హీరోలు రాకపోవడం తమను ఎంతో బాధించింది అన్నారు. అంతేకాదు, ఒక్క నిర్మాత కూడా అంతిమ యాత్రలో లేరు. అల్లు రామలింగయ్య, పి.ఎల్. నారాయణ, రేలంగి నరసింహారావు వంటి కొందరు సినీ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. అంతటి మహానటుడికి జరగాల్సిన గౌరవం ఆ సమయంలో సరిగ్గా జరగలేదని ఆమె అభిప్రాయపడ్డారు. సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలు శాశ్వతం. తరం మారినా రావుగోపాలరావు డైలాగులు నేటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఆయన భార్య పంచుకున్న ఈ విషయాలు ఆ మహానటుడి జీవితం వెనుక ఉన్న మరో కోణాన్ని మనకు తెలియజేస్తోంది.
Mar 30, 2026రెబల్స్టార్ జీవితంలో పెద్ద వివాదం.. ఇప్పటికీ అది మిస్టరీనే!
- సినీ పరిశ్రమలో రారాజు అనిపించుకున్న కృష్ణంరాజు జీవితంలో చెరగని మచ్చ ఇదే.. - అసలు ఆ రచయితకి, కృష్ణంరాజుకి మధ్య ఏం జరిగింది? ప్రతి మనిషి జీవితంలో వెలుగు నీడలు అనేవి సర్వ సాధారణం. తమ కెరీర్లో ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నవారు సైతం ఏదో ఒక సందర్భంలో కొన్ని వివాదాల బారిన పడతారు. కొన్ని అప్పటికప్పుడు సమసిపోతాయి. మరికొన్ని వారి మరణానంతరం కూడా చర్చనీయాంశంగా మారుతుంటాయి. అలాంటి ఓ వివాదం రెబల్స్టార్ కృష్ణంరాజు జీవితంలో ఉంది. అది ఎంతవరకు నిజం అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 1966లో ‘చిలకా గోరింకా’ చిత్రంతో హీరోగా ఇండస్ట్రీకి వచ్చిన కృష్ణంరాజు ఆ తర్వాత విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారు తప్ప సోలో హీరో మాత్రం అవ్వలేకపోయారు. 60కి పైగా సినిమాల్లో వివిధ పాత్రలు పోషించిన తర్వాత 1974లో తనే సొంతంగా నిర్మించిన ‘కృష్ణవేణి’ చిత్రంతో మరోసారి హీరోగా ఎంట్రీ ఇచ్చారు కృష్ణంరాజు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ కృష్ణంరాజుకి హీరోగా ఆశించిన స్థాయిలో పేరు రాలేదు. 1976లో మళ్లీ తన సొంత నిర్మాణ సంస్థలోనే బాపు దర్శకత్వంలో చేసిన ‘భక్త కన్నప్ప’తో హీరోగా కృష్ణంరాజుకు మంచి బ్రేక్ వచ్చింది. ఈ సినిమాలో ఆయన నటనకు మంచి ప్రశంసలు లభించాయి. సూపర్స్టార్ కృష్ణకు ‘అల్లూరి సీతారామరాజు’ ఎంత పేరు తెచ్చిందో.. ‘భక్త కన్నప్ప’ చిత్రం కృష్ణంరాజుకి అంతటి పేరు తీసుకొచ్చింది. కన్నప్ప పాత్రలో ఆయన్ని అద్భుతంగా చూపించడంలో బాపు పాత్ర ఎంత ఉందో, రచయిత ముళ్లపూడి వెంకటరమణ పాత్ర కూడా అంతే ఉంది. ఈ సినిమా తర్వాత చేసిన చాలా సినిమాలు కృష్ణంరాజును హీరోగా ఒక స్థాయిలో నిలబెట్టాయి. అదే క్రమంలో వచ్చిన ‘కటకటాల రుద్రయ్య’ ఆయన్ని రెబల్స్టార్ని చేసింది. ఆ తర్వాత బాపు, రమణ కాంబినేషన్లోనే చేసిన ‘మనవూరి పాండవులు’ కృష్ణంరాజు కెరీర్లో మరో గొప్ప సినిమాగా నిలిచింది. ఇదిలా ఉంటే.. ‘భక్త కన్నప్ప’ సినిమాకి సంబంధించి ఒక వ్యక్తి దగ్గర ఫైనాన్స్ తీసుకున్నారు కృష్ణంరాజు. దానికి ముళ్లపూడి హామీ సంతకం చేశారు. ఈ సినిమా విజయం సాధించి మంచి లాభాలు తెచ్చినప్పటికీ ఆ ఫైనాన్సియర్కి ఇవ్వాల్సిన మొతాన్ని కృష్ణంరాజు చెల్లించలేదు. మధ్యలో హామీ ఉన్నందుకు దానికి సంబంధించిన వడ్డీలు కూడా ముళ్లపూడి కట్టాల్సి వచ్చింది. సంవత్సరాలు గడుస్తున్నా.. ఆ డబ్బు గురించి కృష్ణంరాజు పట్టించుకోలేదు. దీంతో హామీగా ఉన్న ముళ్లపూడి ఇంటిని ఆ ఫైనాన్సియర్ తన పేర రాయించేసుకున్నారు. దాంతో తన మిత్రుడైన బాపు ఇంటిపైన ఉన్న పోర్షన్కి షిఫ్ట్ అయింది ముళ్లపూడి కుటుంబం. విషయం అక్కడి వరకు రావడానికి కారణాలు ఏమిటి అనే విషయంలో రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. తను మధ్యలో ఉండి ఇప్పించిన డబ్బును ఎంత కాలమైనా తిరిగి చెల్లించకపోవడంతో అప్పటికి పరిశ్రమలో పెద్దగా వ్యవహరిస్తున్న డివిఎస్ రాజుకి ఈ విషయం గురించి చెప్పారు ముళ్లపూడి. అప్పుడాయన కృష్ణంరాజుకు ఫోన్ చేసి మందలించారని అంటారు. తమ మధ్య ఉన్న వ్యవహారాన్ని డివిఎస్ రాజుకు చెప్పడం వల్ల కృష్ణంరాజు హర్ట్ అయి అప్పు చెల్లించకుండా దాటవేస్తూ వచ్చారు. ఆ తర్వాత కొందరు సినీ పెద్దల దగ్గర కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు ముళ్లపూడి. కానీ, దాన్ని పరిష్కరించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో తన ఇంటిని ఆ ఫైనాన్సియర్కి రాసిచ్చెయ్యాల్సిన పరిస్థితి ముళ్లపూడికి వచ్చింది. ఇదొక వెర్షన్ అయితే... ‘భక్త కన్నప్ప’ రిలీజ్ అయిన 9 సంవత్సరాల తర్వాత బాపు, రమణల కాంబినేషన్లోనే ‘బుల్లెట్’ అనే సినిమా చేశారు కృష్ణంరాజు. ఈ సినిమాకి ముళ్లపూడి వెంకరమణ నిర్మాత కాగా, కృష్ణంరాజు సమర్పకుడు. వీరి మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదం ఉంటే కలిసి సినిమా చేయడం ఎలా సాధ్యమైంది అనేది కొందరి వాదన. ముళ్లపూడి ఇల్లు కోల్పోవడానికి మరేదైనా కారణం అయి ఉండవచ్చని, అందుకే పరిశ్రమలోని పెద్దలు కూడా ఆయన తరఫున మాట్లాడలేదని చెప్పుకుంటారు. అలా కృష్ణంరాజు, ముళ్లపూడి మధ్య వివాదం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.
Mar 24, 2026ఒక పాట విషయంలో పందెం కాసి.. రామానాయుడుతో తిట్లు తిన్న వాణిశ్రీ!
రకరకాల వ్యాపారాలు చేసి విసిగిపోయిన మూవీమొఘల్ డా.డి.రామానాయుడు.. చిత్ర నిర్మాత కావాలనుకున్నారు. అందులో భాగంగానే మద్రాస్ చేరుకున్న ఆయన.. కొందరు మిత్రులు కలిసి అనురాగం అనే సినిమా చేస్తున్నారని తెలిసి అందులో భాగస్వామిగా చేరారు. అయితే టైటిల్స్లో ఆయన పేరు వెయ్యడం కుదరదని డైరెక్టర్ చెప్పారు. దాంతో సినిమా పూర్తయ్యే వరకు సెట్లోనే ఉండి ప్రొడక్షన్కి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకునేవారు. ఆ అనుభవంతో ఆ తర్వాతి సంవత్సరం ఎన్టీఆర్ హీరోగా నిర్మించిన రాముడు భీముడు చిత్రంతో సోలో ప్రొడ్యూసర్గా మారారు రామానాయుడు. ఈ సినిమా ఘన విజయం సాధించి రామానాయుడుకి నిర్మాతగా మంచి పేరు తెచ్చింది. ఆ ఉత్సాహంతో వరసగా సినిమాలు నిర్మించారు. అందులో కొన్ని విజయం సాధించగా, మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. ఆ క్రమంలోనే ద్రోహి అనే సినిమా భారీ నష్టాన్ని మిగిల్చింది. అప్పటివరకు వరసగా సినిమాలు తీసిన రామానాయుడు ఒక్క సినిమా ఫ్లాప్తో అయోమయంలో పడిపోయారు. అప్పటివరకు చేసిన సినిమాల వల్ల 12 లక్షలు నష్టపోయారు. అయినా అధైర్యపడకుండా 15 లక్షల భారీబడ్జెట్తో ‘ప్రేమనగర్’ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమా హిట్ అయి డబ్బులొస్తేనే ఇండస్ట్రీలో ఉండాలనీ, లేకపోతే ఊరికి వెళ్లిపోయి వ్యవసాయం చేసుకోవాలని అనుకున్నారు. అందుకే ఎంతో శ్రద్దగా అన్ని విషయాలూ జాగ్రత్తగా చూసుకున్నారు. అప్పటివరకు ఎఎన్నార్ చేసిన సినిమాల కంటే ఎక్కువ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. సినిమాలో ఎఎన్నార్, జ్యోతిలక్ష్మిలపై ‘లేలేలే.. నా రాజా’ పాటను మరుసటి రోజు చిత్రీకరించేందుకు సెట్లో ఏర్పాట్లు చేస్తున్నారు. వాణశ్రీ సెట్లో కూర్చొని ఆ పాటను వింటున్నారు. ‘నాగేశ్వరరావుగారు ఈ పాట విన్నారా?’ అని రామానాయుడుని అడిగారు వాణిశ్రీ. ‘ఇంకా వినలేదు.. ఇప్ప్పుడు ఆయన వచ్చిన తర్వాత వినిపిస్తాం’ అన్నారు. దానికి వాణిశ్రీ నవ్వి.. ‘ఆయనకు ఇలాంటి పాటలు నచ్చవు. చెయ్యను అని చెప్తారు చూడండి’ అన్నారు. ‘ఆయన తప్పకుండా చేస్తారు. పందెం కాస్తావా?’ అంటూ డైరెక్టర్ ప్రకాశరావు ముందుకొచ్చారు. ఇది జరిగిన కాసేపటికి ఎఎన్నార్ సెట్కి వచ్చారు. ఆయన్ని చూసి ‘లేలేలే నా రాజా’ అంటూ పాట పాడారు వాణిశ్రీ. అది విన్న ఆయన ‘ఏ సినిమాలోది ఈ పాట.. దరిద్రంగా ఉంది’ అన్నారు. ‘మన సినిమాలోదే. ఈ పాటను మీరు, జ్యోతిలక్క్ష్మీ చెయ్యాలట’ అన్నారు వాణిశ్రీ. దాంతో రామానాయుడు, ప్రకాశరావు వైపు సీరియస్గా చూశారు ఎఎన్నార్. ‘ఈ పాట నేను చెయ్యడం లేదు’ అని అక్కడ్నించి విసురుగా వెళ్లిపోయారు. ఎఎన్నార్ అటు వెళ్లగానే, వాణశ్రీపై సీరియస్ అయ్యారు రామానాయుడు. ‘నీకు బుద్ధుందా లేదా? కామ్గా కూర్చోవచ్చుగా. ఆయన రాగానే ఆ పాటెందుకు పాడాలి?’ అన్నారు. తన వల్ల ఆ పాట క్యాన్సిల్ అవుతుందేమోనని టెన్షన్ పడ్డారు వాణిశ్రీ. మర్నాడు భయంభయంగానే సెట్కి వచ్చారు. రామానాయుడు, ప్రకాశరావు హ్యాపీ మూడ్లో కనిపించేసరికి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. ‘నాగేశ్వరరావుగారు పాట చెయ్యడానికి ఒప్ప్పుకున్నారు. నువ్వే ఓడిపోయావు’ అన్నారు ప్రకాశరావు. తన సినిమాల్లోని పాటల్లో అశ్లీల పదాలు ఉండడానికి ఒప్ప్పుకోని నాగేశ్వరరావుగారు ఈ పాట చెయ్యడానికి ఎలా ఒప్ప్పుకున్నారు అనే సందేహం వాణిశ్రీలో బాగా పెరిగిపోయింది. ఆ తర్వాత ఆయన్ని కలిసినపుడు ఇదే విషయాన్ని అడిగారు. దానికి అక్కినేని ‘సినిమాలో నేను చేస్తున్న పాత్ర వ్యక్తిత్వం అలాంటిది కాబట్టి.. ఈ తరహా పాట ఉంటే బాగుంటుందని ప్రకాశరావుగారు కన్విన్స్ చేశారు. ఆయన చెప్పింది కరెక్టే కదా అని నేను కూడా పాట చేసేందుకు ఒప్ప్పుకున్నాను’ అని వివరించారు.
Mar 21, 2026ఎన్టీఆర్ ఫేవరెట్ హీరోయిన్ కృష్ణకుమారి.. హడావిడిగా పెళ్లి చేసుకోవడానికి రీజన్ ఇదే!
1949లో ‘మనదేశం’ చిత్రంతో సినిమా రంగంలో ప్రవేశించిన నటరత్న ఎన్.టి.రామారావు.. ‘పాతాళభైరవి’ చిత్రంతో మాస్ హీరోగా అవతరించారు. ఆ తర్వాత ఎన్నో పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించి వారి అభిమానాన్ని సంపాదించుకున్నారు. దాదాపు 35 సంవత్సరాల పాటు హీరోగా కొనసాగిన ఎన్టీఆర్.. తన కెరీర్లో 47 మంది హీరోయిన్లతో కలిసి నటించారు. అంతమంది హీరోయిన్లతో చేసినా ఆయన ఫేవరెట్ హీరోయిన్ మాత్రం ఒక్కరే. ఆమె కృష్ణకుమారి. ఎన్టీఆర్తో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు జమున. వీరిద్దరి కాంబినేషన్లో 31 సినిమాలు వచ్చాయి. ఆమె తర్వాత సావిత్రి 26, అంజలీదేవి 26 సినిమాల్లో నటించారు. 25 సినిమా లతో ఆ తర్వాతి స్థానంలో కృష్ణకుమారి ఉన్నారు. ఎన్టీఆర్, కృష్ణకుమారి కలిసి నటించిన మొదటి సినిమా పిచ్చిపుల్లయ్య. అలాగే చివరి చిత్రం వరకట్నం. అయితే ఈ రెండూ ఎన్టీఆర్ సొంత బేనర్లో నిర్మించిన సినిమాలు కావడం విశేషం. 1960వ దశకంలో ఎన్టీఆర్, కృష్ణకుమారి కాంబినేషన్కు మంచి క్రేజ్ వచ్చింది. వీరిద్దరూ కలిసి చేసిన చాలా సినిమాలు సూపర్హిట్ అయి ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. మిగతా హీరోయిన్లతో కలిసి లెక్కకు మించిన సినిమాలు చేసినా ఎన్టీఆర్, కృష్ణకుమారి విషయంలో మాత్రం రకరకాల ప్రచారాలు జరిగాయి. ఎన్టీఆర్, కృష్ణకుమారి మధ్య ఏదో ఉందని పరిశ్రమలో గుసగుసలు మొదలయ్యాయి. ఆరోజుల్లో సినిమా తారలకు సంబంధించిన గాసిప్స్ ఎక్కువ ప్రచురించేది ‘కాగడా’ పత్రిక. ఎన్టీఆర్, కృష్ణకుమారి పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఆ పత్రికలో ప్రచురించారు కూడా. పరిశ్రమలో జోరుగా సాగుతున్న ఈ ప్రచారం కృష్ణకుమారి దష్టికి వచ్చింది. అప్పటికి ఎన్టీఆర్తో మరో నాలుగు సినిమాలు కమిట్ అయి ఉన్నారామె. అవికాక మరికొన్ని సినిమాల్లో కూడా హీరోయిన్గా బుక్ అయ్యారు. అవన్నీ పక్కన పెట్టేసి వ్యాపార వేత్త అజయ్ ఖేతాన్ను పెళ్లి చేసేసుకున్నారు. హడావిడిగా ఈ పెళ్లి జరగడంతో సొంత అక్క అయిన షావుకారు జానకి కూడా పెళ్లికి హాజరు కాలేకపోయారు. పెళ్లి అయ్యేనాటికి కృష్ణకుమారి వయసు 36 ఏళ్లు. అప్పటికీ ఆమె టాప్ హీరోయిన్గానే ఉన్నారు. సడన్గా పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం కృష్ణకుమారి ఎందుకు తీసుకున్నారనేది ఎవరికీ అర్థం కాలేదు. తనకు, ఎన్టీఆర్కు మధ్య ఏదో ఉందనే ప్రచారం వల్లే హడావిడిగా పెళ్లి చేసుకున్నారని పత్రికలు, ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. పెళ్లి నాటికి కమిట్ అయిన సినిమాలను పక్కన పెట్టి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు కృష్ణకుమారి. దాదాపు రెండేళ్ళ తర్వాత నిర్మాత ఎ.వి.సుబ్బారావు బలవంతం మీద అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన భార్యాబిడ్డలు చిత్రంలో నటించారు. సినిమాల్లో కొనసాగేందుకు భర్త అజయ్ ఖేతాన్, అత్తగారు ప్రోత్సహించారు. అలా చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. 1982లో విడుదలైన బంగారు భూమి చిత్రంతో నటనకు ఫుల్స్టాప్ పెట్టారు కృష్ణకుమారి. దాదాపు 20 సంవత్సరాల తర్వాత దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ఫూల్స్ చిత్రంలో నటించారు. అదే కృష్ణకుమారి నటించిన చివరి సినిమా.
Mar 21, 2026విలన్ నుంచి విద్యావేత్త వరకు.. మంచు మోహన్బాబు అరుదైన సినీ ప్రస్థానం!
(మార్చి 19 మంచు మోహన్బాబు పుట్టినరోజు సందర్భంగా..) - మోహన్బాబు కెరీర్లో మైలురాళ్ళు ఇవే - మంచు భక్తవత్సలం టు కలెక్షన్ కింగ్ - నటుడిగా 550, నిర్మాతగా 72 సినిమాలు టాలీవుడ్ లెజెండరీ నటుడు, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే నటుడు డా.మంచు మోహన్బాబు. ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో విలన్గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన చేయని క్యారెక్టర్ లేదు. తనదైన డైలాగ్ డెలివరీతో, విలక్షణమైన బాడీ లాంగ్వేజ్తో కొన్ని వందల పాత్రలకు ప్రాణం పోసిన ఈ నట దిగ్గజం మోహన్బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం. 1952 మార్చి 19న చిత్తూరు జిల్లాలోని మోదుగులపాలెంలో మంచు నారాయణస్వామి నాయుడు, లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు మోహన్బాబు. ఆయన అసలు పేరు భక్తవత్సలంనాయుడు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మద్రాస్లోని వైఎంసిఎ కాలేజీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్గా చాలాకాలం పనిచేశారు. 1970 ప్రాంతంలో సినిమాల మీద ఆసక్తితో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరి అసిస్టెంట్ డైరెక్టర్గా 5 సంవత్సరాలపాటు పనిచేశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు ప్రోత్సాహంతో ‘స్వర్గం నరకం’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ సినిమాలో ఆయన నటన చూసి పరిశ్రమ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. సహనటుడిగా, విలన్గా, హీరోగా పలు విభిన్నమైన పాత్రలు పోషించిన మోహన్బాబు మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నారు. తన 50 సంవత్సరాల కెరీర్లో 550కి పైగా సినిమాల్లో నటించి కలెక్షన్కింగ్గా పేరు తెచ్చుకున్నారు. కొన్ని తమిళ సినిమాల్లో కూడా నటించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా మోహన్ బాబు తన సత్తా చాటారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్పై తొలి ప్రయత్నంగా తనే హీరోగా నటిస్తూ ‘ప్రతిజ్ఞ’ చిత్రాన్ని నిర్మించారు. అప్పటి నుంచి తన బేనర్లో పలు విభిన్నమైన సినిమాలు నిర్మించి అభిరుచిగల నిర్మాత అనిపించుకున్నారు. ‘పెదరాయుడు’, ‘అసెంబ్లీ రౌడీ’, ‘అల్లుడుగారు’, ‘రౌడీగారి పెళ్లాం’, ‘మేజర్ చంద్రకాంత్’ వంటి విజయవంతమైన సినిమాలు నిర్మించారు. తన బేనర్లో మొత్తం 72 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు మోహన్బాబు. కేవలం వెండితెరకే పరిమితం కాకుండా, విద్యా రంగంలోనూ మోహన్బాబు తనదైన ముద్ర వేశారు. శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ద్వారా వేలమంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ఒకప్పుడు తాను ఎదుర్కొన్న వివక్షను మరెవరూ ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో కులమతాలకు అతీతంగా విద్యాదానం చేస్తూ సమాజంపై తనకున్న బాధ్యతను చాటుకుంటున్నారు. శ్రీ విద్యానికేతన్ ఇప్ప్పుడు మోహన్బాబు యూనివర్సిటీగా రూపాంతరం చెంది ఉన్నత విద్యను అందిస్తోంది. నటుడుగా, నిర్మాతగా, విద్యావేత్తగానే కాకుండా రాజకీయాల్లోనూ ప్రవేశించి 1995 నుంచి 2001 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. పూర్తి స్థాయిలో కాకపోయినా అప్ప్పుడప్ప్పుడు తనకు సరిపడా క్యారెక్టర్స్ వస్తే తెరపై కనిపిస్తున్నారు. గత ఏడాది మంచు లక్క్ష్మీ ప్రధాన పాత్ర పోషించిన ‘దక్ష’ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు. రాబోయే చిత్రాల్లో నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంలో, సూపర్స్టార్ కష్ణ మనవడు, రమేష్బాబు తనయుడు జయకష్ణ హీరోగా అజయ్ భూపతి రూపొందిస్తున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు మంచు మోహన్బాబు.
Mar 18, 2026లెజండరీ డైరెక్టర్ రిజెక్ట్ చేసిన ఈ ముగ్గురూ.. స్టార్స్ అయిపోయారు. ఎవరో తెలుసా?
చిత్ర పరిశ్రమలో నటీనటులుగా గానీ, టెక్నీషియన్స్గా గానీ సక్సెస్ అవ్వాలంటే డెఫినెట్గా టాలెంట్ అనేది అవసరం. ఎంతో మంది సినీ ప్రముఖులు చెప్పినట్టు టాలెంట్తోపాటు ఆవగింజంత అదష్టం కూడా కావాలి. టాలెంట్ ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో రాణించలేకపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. అయితే టైమ్ని ఆర్టిస్టులు బాగా నమ్ముతారు. తమకు కూడా టైమ్ వస్తే చక్రం తిప్పేస్తాం అంటుంటారు. కొందరి విషయంలో అది నిజమే అనిపిస్తుంది. ఇండస్ట్రీలోని వివిధ శాఖల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న చాలా మంది.. మొదట్లో రిజెక్ట్ అయినవారే. బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లి సూపర్స్టార్ అయ్యారు. అలాగే మధుర గాయకుడు ఘంటసాలకు తొలి రోజుల్లో ఎదురైన అవమానాలు తక్కువేమీ కాదు. ఇప్పటికీ ఆయన పాటల్ని అందరూ ఆస్వాదిస్తున్నారంటే ఆ గానంలోని మాధుర్యమే కారణం. సినిమా ప్రయత్నాల్లో భాగంగా రిజెక్ట్ అయిన సందర్భాలు సినిమా కళాకారులకు చాలా ఉంటాయి. పాతతరంలో లెజండరీ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న ఆదుర్తి సుబ్బారావు రిజెక్ట్ చేసిన ముగ్గురు నటీనటులు ఆ తర్వాత స్టార్స్గా పేరు తెచ్చుకున్నారు. ఆ ముగ్గురూ ఎవరు, వారిలోని టాలెంట్ని ఆదుర్తి ఎందుకు గుర్తించలేకపోయారు అనే విషయాల గురించి తెలుసుకుందాం. 1948లో కల్పన అనే హిందీ చిత్రం ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించిన ఆదుర్తి సుబ్బారావు.. 1954లో వచ్చిన అమర సందేశం చిత్రం ద్వారా డైరెక్టర్గా పరిచయమయ్యారు. రెండో సినిమా తోడికోడళ్లుతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత మాంగల్యబలం, వెలుగు నీడలు, ఇద్దరు మిత్రులు, మంచి మనసులు, చదువుకున్న అమ్మాయిలు, మూగ మనసులు, దాగుడు మూతలు, డాక్టర్ చక్రవర్తి, సుమంగళి.. ఇలా ఎన్నో అపురూపమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. అలా ఓ 20 సినిమాలు డైరెక్ట్ చేసిన తర్వాత స్టార్స్తో కాకుండా కొత్తవారితో ‘తేనె మనసులు’ చిత్రం చెయ్యాలనుకున్నారు. హీరో నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకూ అందరూ కొత్తవారు కావాలంటూ పేపర్ ప్రకటన ఇచ్చారు ఆదుర్తి. ఊహించిన దానికంటే ఎక్కువ మంది తమ వివరాలను తెలియజేస్తూ ఫోటోలు పంపించారు. వారిలో కొందరిని సెలెక్ట్ చేసి ఆడిషన్కి పిలిచారు. ‘తేనె మనసులు’ సినిమాలో రామ్మోహన్ను హీరోగా ముందుగానే సెలెక్ట్ చేసుకున్నారు. మరో హీరో, ఇద్దరు హీరోయిన్లు, మిగతా నటీనటుల కోసం ఆడిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఆడిషన్కి హాజరైన వారిలో కష్ణ, కష్ణంరాజు, జయలలిత, హేమమాలిని కూడా ఉన్నారు. అయితే వారిలో కష్ణను మాత్రమే ఎంపిక చేశారు ఆదుర్తి. హీరోయిన్లుగా సంధ్యారాణి, సుకన్య సెలెక్ట్ అయ్యారు. కష్ణంరాజు, జయలలిత, హేమమాలినిలను రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత ఈ ముగ్గురూ స్టార్స్గా ఎలా ఎదిగారో అందరికీ తెలుసు. హీరోగా పరిచయమై కొన్ని సినిమాల్లో విలన్గా కూడా నటించి, ఆ తర్వాత హీరోగా ఎన్నో సూపర్హిట్ సినిమాలు చేశారు కష్ణంరాజు. తన నటనతో ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకొని రెబల్స్టార్గా పేరు తెచ్చుకున్నారు. 1961లో బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమైన జయలలిత.. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో బాలనటిగా కనిపించారు. ఒక వయసుకు వచ్చిన తర్వాత డాన్సర్గా కొన్ని సినిమాలు చేశారు. తేనె మనసులు విడుదలైన సంవత్సరమే మనుషులు మమతలు చిత్రం ద్వారా తెలుగులో హీరోయిన్గా పరిచయమయ్యారు జయలలిత. ఆ తర్వాత తమిళ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. వివిధ భాషల్లో హీరోయిన్గా తన సత్తా ఏమిటో చూపించి అందరు స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ అయిపోయారు జయలలిత. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక హేమమాలిని విషయానికి వస్తే.. తమిళ్లో ఇదు సాతియం, తెలుగులో పాండవ వనవాసం చిత్రాల్లో డాన్సర్గా నటించారు. తేనె మనసులు ఆడిషన్ తర్వాత చాలా కాలం వరకు ఆమెకు సినిమా అవకాశాలు రాలేదు. 1968లో వచ్చిన సప్నోంకా సౌదాగర్ చిత్రంలో తొలిసారి రాజ్కపూర్ సరసన హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత ఎన్నో సూపర్హిట్ సినిమాల్లో తన అందంతో, అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు హేమమాలిని. హీరోయిన్గా ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. అలా దేశవ్యాప్తంగా ‘డ్రీమ్ గర్ల్’ అని పిలిపించుకున్నారు. ఆదుర్తి సుబ్బారావు రిజెక్ట్ చేసిన కష్ణంరాజు, జయలలిత, హేమమాలిని.. ఈ ముగ్గురి కెరీర్ ఎంతో ఉజ్వలంగా సాగడం స్టార్ స్టేటస్ తెచ్చుకోవడం నిజంగా గొప్ప విశేషమనే చెప్పాలి. ఎంతో మంది గొప్ప నటీనటులతో సినిమాలు రూపొందించిన ఆదుర్తి సుబ్బారావు.. ఈ ముగ్గురిలోని టాలెంట్ని గుర్తించలేకపోవడం ఆరోజుల్లో అందర్నీ ఆశ్చర్యపరిచింది.
Mar 18, 2026రజినీకాంత్ హీరోగా, చిరంజీవి విలన్గా 45 ఏళ్ళ క్రితం విడుదలైన సినిమా గురించి మీకు తెలుసా?
1978లో ప్రాణం ఖరీదు చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరంజీవి.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గా నటించి తనని తాను ప్రూవ్ చేసుకున్నారు. అలా 30 సినిమాలు చేసిన తర్వాత 1981లో రజినీకాంత్ హీరోగా నటించిన ‘రణవీరన్’ అనే తమిళ సినిమాలో విలన్గా నటించారు. అప్పటికే న్యాయంకావాలి, మొగుడు కావాలి, పున్నమినాగు, కోతలరాయుడు, నకిలీ మనిషి, లవ్ ఇన్ సింగపూర్ వంటి సినిమాలు చేశారు. అంతకుముందు కెరీర్ ప్రారంభంలోనే చిరంజీవి హీరోగా ఓ తమిళ సినిమా ప్రారంభమైంది. ఎన్టీఆర్, ఎఎన్నార్, కష్ణ, శోభన్బాబు వంటి టాప్ హీరోల సినిమాల్లో హీరోయిన్గా నటించిన కె.ఆర్.విజయ.. ఈ సినిమాలో హీరోయిన్. నటుడిగా ఎదుగుతున్న సమయంలోనే అంతటి సీనియర్ హీరోయిన్తో సినిమా చేసే అవకాశం రావడం నిజంగా చిరంజీవి అదష్టమనే చెప్పాలి. అయితే ఈ సినిమా కొంత షూటింగ్ జరిగిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఈ సినిమా షూటింగ్ సజావుగా జరిగి ఉంటే హీరోగా తమిళ్లో కూడా చిరంజీవి మంచి పేరు తెచ్చుకునే వారని కె.ఆర్.విజయ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. రజినీకాంత్లోని కమర్షియల్ యాంగిల్ని మొదట గుర్తించిన దర్శకుడు ఎస్.పి.ముత్తురామన్. వీరిద్దరి కాంబినేషన్లో 25కి పైగా సినిమాలు వచ్చాయి. మొదట కె.బాలచందర్ వంటి దర్శకుల సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ వచ్చిన రజినీకాంత్.. ముత్తురామన్ వల్ల కమర్షియల్ హీరోగా మారిపోయారు. అలా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘రణవీరన్’. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన వీరప్పన్.. స్వతహాగ రచయిత. ఎంజీఆర్ని దష్టిలో పెట్టుకొని ఈ కథను సిద్ధం చేశారు. అయన రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా చెయ్యలేకపోయారు. దాంతో రజినీకాంత్కి అవకాశం వచ్చింది. శ్రీదేవిని హీరోయిన్గా, చిరంజీవిని విలన్గా తీసుకున్నారు. తమిళ్లో అప్పటికే మంచి యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న రజినీకాంత్కి ‘రణవీరన్’ మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ ఎక్కువగానే ఉంటుంది. చిరంజీవి, రజినీకాంత్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్లు ఎంతో థ్రిల్లింగ్గా ఉంటాయి. 1981 అక్టోబర్ 26న తమిళ్లో విడుదలైన ఈ సినిమా కమర్షియల్గా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను మరుసటి ఏడాది ‘బందిపోటు సింహం’ పేరుతో తెలుగులోకి డబ్ చేశారు. అయితే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను అంతగా రిసీవ్ చేసుకోలేదు. అప్పటి నుంచి రజినీకాంత్, చిరంజీవి మంచి స్నేహం ఉంది. చిరంజీవి మెగాస్టార్గా ఎదిగిన తర్వాత తను హీరోగా నటిస్తున్న సినిమాలో గెస్ట్ రోల్ చెయ్యాల్సిందిగా రజినీకాంత్ రిక్వెస్ట్ చేశారు. 1989లో విడుదలైన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రానికి రీమేక్గా తమిళ్లో రూపొందిన మా పిళ్లయ్ చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు చిరంజీవి.
Mar 17, 2026ఎన్టీఆర్ సినిమా గురించి ఒకే పత్రికలో.. పాజిటివ్ రివ్యూ, నెగెటివ్ రివ్యూ.. ఎందుకలా వేశారు?
ఒక సినిమా థియేటర్లో రిలీజ్ అయింది అంటే దాని భవిష్యత్తు ఏమిటి, ఎన్నిరోజులు ఆడే ఛాన్స్ ఉంది.. అనేది క్షణాల్లో ప్రపంచానికి తెలిసిపోతోంది. ఇటీవలికాలంలో పెరిగిపోయిన మీడియా, సోషల్ మీడియా వల్ల ఇది సాధ్యపడుతోంది. సినిమాలను సమీక్షించడం అనే పద్ధతి ఇప్పటిది కాదు. సినిమా పుట్టిన నాటి నుంచే ఉంది. అయితే అప్పట్లో ప్రింట్ మీడియా మాత్రమే ఉండేది కాబట్టి పత్రిక వచ్చే వరకు పాఠకులు ఎదురుచూసేవారు. సరిగ్గా పాతిక సంవత్సరాల క్రితం కూడా ఇదే పద్ధతి ఉంది అంటే మీరు నమ్ముతారా? కానీ, ఇది నిజం. సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజుల తర్వాత ఒక దినపత్రికలో దానికి సంబంధించిన రివ్యూ వచ్చేది. కొంతమంది ఆ రివ్యూ చూసిన తర్వాతే సినిమాకి వెళ్లేవారు. అప్పట్లో వెబ్సైట్లు, ఛానల్స్ అంత ప్రభావవంతంగా పనిచేయకపోవడం వల్ల ఆ దినపత్రికలోని రివ్యూనే ప్రామాణికంగా తీసుకునేవారు. 65 సంవత్సరాల వెనక్కి వెళితే.. ఒక సినిమాకి సంబంధించిన సమీక్షను ఒకే పత్రికలో రెండు సార్లు ప్రింట్ చెయ్యాల్సి వచ్చింది. ఒకసారి నెగెటివ్గా, ఒకసారి పాజిటివ్గా ప్రింట్ అయింది. ఎవరైనా సినిమా బాగుండకపోతే నెగెటివ్ రివ్యూ రాస్తారు, బాగుంటే పాజిటివ్ రివ్యూ ఇస్తారు. అలా కాకుండా రెండు రకాల రివ్యూలు ఒకే పత్రికలో ప్రింట్ అవ్వడానికి రీజన్ ఏమిటి? ఇంతకీ అది సినిమా అనేది తెలుసుకుందాం. ఎన్.టి.రామారావు, సావిత్రి, జమున, జగ్గయ్య ప్రధాన పాత్రల్లో ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించిన చిత్రం ‘అప్ప్పుచేసి పప్ప్పుకూడు’. 1959 జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. మొదటి నాలుగు వారాలు కలెక్షన్స్ బాగానే ఉన్నప్పటికీ ఎబౌ ఏవరేజ్ సినిమా అనిపించుకుంది. అయితే రీరిలీజ్లో ఈ సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టింది. తెలుగు సినిమా చరిత్రలో ఒక క్లాసిక్గా ఈ చిత్రం నిలిచింది. ఈ సినిమా విడుదలైన తర్వాత వివిధ పత్రికల్లో సినిమాకి అనుకూలంగా సమీక్షలు వచ్చాయి. అందులో ఆంధ్రప్రతికలో మాత్రం నెగెటివ్ రివ్యూ వచ్చింది. సినిమాలో దొర్లిన పొరపాట్లు, కథ, కథనాల్లో ఉన్న లొసుగుల్ని ప్రస్తావిస్తూ ఆ సమీక్ష సాగింది. దీన్ని ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ రాశారు. సినిమా అంతా గందరగోళంగా ఉందని, కథ ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉందని తన రివ్యూలో పేర్కొన్నారు. ఈ రివ్యూ చదివిన నిర్మాత చక్రపాణి ఆశ్చర్యపోయారు. అందరూ సినిమా బాగుందని రాస్తే, ఆ పత్రికలో ఎందుకలా వచ్చింది అనే విషయం తెలుసుకోవాలనుకున్నారు. అప్పట్లో ఆంధ్రపత్రికకు ఎడిటర్గా పనిచేస్తున్న శంభుప్రసాద్ దగ్గర ఈ ప్రస్తావన తీసుకొచ్చారు చక్రపాణి. సినిమా గురించి రమణగారు తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు తప్ప నెగెటివ్గా రాయాలనే ఉద్దేశంతో అలా చేయలేదు అని చక్రపాణికి చెప్పారు శంభుప్రసాద్. సినిమా గురించి పాజిటివ్ రివ్యూ కావాలంటే మీరే ఎవరితోనైనా రాయించి పంపండి. దాన్ని కూడా ప్రింట్ చేస్తాం అని చెప్పారు శంభుప్రసాద్. అప్ప్పుడు ఈ విషయాన్ని చందమామ మ్యాగజైన్కి ఎడిటర్గా ఉన్న కొడవటిగంటి కుటుంబరావు దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన అంతకుముందు ఆంధ్రపత్రిక వారపత్రికకు ఎడిటర్గా కూడా పనిచేశారు. ‘అప్ప్పుచేసి పప్ప్పుకూడు’ రిలీజ్ అయ్యే టైమ్కి ఆయన విజయ కాంపౌండ్లోనే ఉండడంతో ఆయన్ని అప్రోచ్ అయ్యారు చక్రపాణి. మన సినిమా గురించి ఎలా రాస్తే జనంలోకి వెళ్తుందో అలా రివ్యూ రాయమని కుటుంబరావును కోరారు చక్రపాణి. ఆయన చెప్పినట్టుగానే సినిమాలోని లొసుగుల్ని తడమకుండా పాజిటివ్గా రివ్యూ రాసి ఇచ్చారు. దాన్ని శంభుప్రసాద్కి పంపారు చక్రపాణి. ఆ రివ్యూను యధాతథంగా ఆంధ్రపత్రికలో ప్రింట్ చేశారు. అలా ఈ సినిమా గురించి ఒక పాజిటివ్ రివ్యూ, ఒక నెగెటివ్ రివ్యూ ఒకే పత్రికలో రావడం అనేది విశేషంగా చెప్ప్పుకోవచ్చు.
Mar 17, 2026
ఎన్టీఆర్కు బంగారం.. ఎస్వీఆర్కు మోటార్ సైకిల్!
తెలుగు సినిమా చరిత్రలో ఒక క్లాసిక్ మూవీగా నిలిచిన ‘పాతాళభైరవి’(Pathala Bhairavi) చిత్రం ఈ ఏడాది మార్చి 15కి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో నిర్మాణం జరుపుకున్న ఈ సినిమా ఘనవిజయం సాధించి విజయ సంస్థకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఆరోజుల్లో హీరోలతో సహా నటీనటులంతా నెల జీతానికి సినిమాలు చేసేవారు. ‘పాతాళభైరవి’ సూపర్హిట్ కావడంతో విజయ సంస్థలో పనిచేస్తున్న వారందరికీ మూడు నెలల జీతం బోనస్గా ప్రకటించారు. ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్.టి.రామారావుకు 5 తులాల బంగారు గొలుసును బహూకరించారు విజయ అధినేతలు. అలాగే ఎస్.వి.రంగారావుకు 5 వేల రూపాయలు ఖరీదు చేసే మోటార్ సైకిల్ను అందించారు. ఈ సినిమా వల్ల వచ్చిన లాభాలతోనే విజయ సంస్థను మరింత విస్తరించారు నాగిరెడ్డి, చక్రపాణి.
Mar 15, 2026
ఎంతో మంది నటీనటులకు గొప్ప టర్నింగ్ పాయింట్ ‘పాతాళభైరవి’
75 సంవత్సరాల క్రితం విడుదలై సంచలన విజయం సాధించిన ‘పాతాళభైరవి’(Pathala Bhairavi) తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక క్లాసిక్ మూవీగా నిలిచింది. ఎన్.టి.రామారావు, కె.వి.రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా విజయ సంస్థకు మంచి లాభాలు తెచ్చిపెట్టడమే కాకుండా ఎంతో మంది నటీనటులకు లైఫ్ ఇచ్చింది. అప్పటివరకు నాలుగు సినిమాలు చేసిన ఎన్టీఆర్.. ‘పాతాళభైరవి’తో మాస్ హీరోగా ఎదిగారు. నేపాళ మాంత్రికుడిగా నటించిన ఎస్వీఆర్ కెరీర్కి ఇది మంచి పునాది వేసింది. సినిమాలోని అంజిగాడు పాత్రను వల్లూరి బాలకృష్ణ పోషించారు. ఈ సినిమా తర్వాత ఆయన్ని అందరూ అంజిగాడు అనే పిలిచేవారు. మహానటిగా ప్రేక్షకుల నీరాజనాలందుకున్న సావిత్రి ఈ సినిమాలోని ఒక సాంగ్ బిట్ ద్వారా తొలిసారి తెరపై కనిపించారు. సదాజపుడుగా నటించిన పద్మనాభంకు మంచి పేరు తెచ్చి నటుడుగా బిజీ అవ్వడానికి ఈ సినిమా కారణమైంది. ఇలా ఈ ఒక్క సినిమాతో నటీనటులే కాదు, సాంకేతిక నిపుణులు కూడా బిజీ అయిపోయారు.
Mar 14, 2026
‘పాతాళభైరవి’కి మొదట అనుకున్న హీరో ఎన్టీఆర్ కాదు!
నటరత్న ఎన్.టి.రామారావు కెరీర్ని టర్న్ చేసిన సినిమా, ఆయన్ని మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ‘పాతాళభైరవి’(Pathala Bhairavi). 1951 మార్చి 15న విడుదలైన ఈ సినిమా ఈ ఏడాదికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ కెరీర్లో ఓ మైల్స్టోన్లా నిలిచిపోయిన ఈ సినిమా వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ‘పాతాళభైరవి’ చిత్రంలో ఎన్టీఆర్ తోటరాముడుగా నటించారు. అయితే ఈ సినిమాలో మొదట అనుకున్న హీరో ఎన్టీఆర్ కాదు. ఇద్దర్ని దాటుకొని ఆయనకు ఆ అవకాశం వచ్చింది. అప్పటికే జానపద హీరోగా మంచి పేరు తెచ్చుకున్న ఎఎన్నార్ను తీసుకోవాలనుకున్నారు కె.వి.రెడ్డి. కానీ, నాగిరెడ్డి, చక్రపాణి మాత్రం ఎన్టీఆర్ అయితే బాగుంటుంది అన్నారు. అయితే వారిద్దర్నీ కాదని కాకినాడకు చెందిన వై.రాజారెడ్డిని తోటరాముడు క్యారెక్టర్కి ఎంపిక చేశారు. మేకప్ టెస్ట్ చేసి రిహార్సల్స్ కూడా చేయించారు. అయితే ఆయనకు కాస్త నత్తి ఉండడం వల్ల ఆ అవకాశం ఎన్టీఆర్ను వరించింది. ‘పాతాళభైరవి’తో ఎన్టీఆర్ స్టార్ హీరో అయిపోయారు.
Mar 14, 2026
75 ఏళ్ళ క్రితం రెండు కొత్త రికార్డులు క్రియేట్ చేసిన ‘పాతాళభైరవి’
1951 మార్చి 15న ‘పాతాళభైరవి’(Pathala Bhairavi) చిత్రాన్ని 13 ప్రింట్లతో రిలీజ్ చేశారు. తమిళ్ వెర్షన్ 1951 మే 17న విడుదలైంది. మొదటి మూడు వారాలు ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత క్రమంగా ప్రింట్లు పెరిగాయి, థియేటర్లు పెరిగాయి. అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ‘పాతాళభైరవి’ కాసుల వర్షం కురిపించింది. అప్పటివరకు వచ్చిన సినిమాల్లో భారీ బడ్జెట్తో నిర్మించిన తొలి సినిమా ఇదే. ఎన్టీఆర్ను మాస్ హీరోగా నిలబెట్టిన ఈ సినిమా 75 ఏళ్ల క్రితమే రజతోత్సవం జరుపుకున్న తొలి సినిమాగా, 200 రోజులు ప్రదర్శింపడిన తొలి చిత్రంగా, ‘పాతాళభైరవి’ రెండు కొత్త రికార్డులు నమోదు చేసింది.. ఆరోజుల్లో నటీనటులు, సాంకేతిక నిపుణులు విజయ సంస్థలో నెలవారీ జీతానికి పనిచేసేవారు. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో సిబ్బందికి మూడు నెలల బోనస్ ప్రకటించారు విజయ అధినేతలు. ఈ సినిమా ద్వారా వచ్చిన లాభాలతోనే విజయ ప్రొడక్షన్స్ సంస్థను మరింత విస్తరించారు.
Mar 14, 2026
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com



