
అఖిల్, భాగ్యశ్రీ బోర్సే కాంబో రిపీట్: వివరాలు ఇవే!
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే తమ ఎంటైర్ సినీ కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా లెనిన్ ని మాత్రం మర్చిపోవడం అసాధ్యం. ఎందుకంటే తమ కెరీర్ లో మొదటి సూపర్ హిట్. పైగా విజయం ఇచ్చిన బోనస్ ఏంటంటే ఆ ఇద్దరు అత్యుత్తమైన పెర్ఫార్మ్ ప్రదర్శించారు. వీరిద్దరి హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోందనే వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్లో 60 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఒక యాక్షన్ అండ్ లవ్ డ్రామాలో ఈ జోడీ మళ్లీ జతకట్టబోతున్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఒక నూతన దర్శకుడు చెప్పిన వైవిధ్యమైన లైన్ అఖిల్తో పాటు భాగ్యశ్రీకి కూడా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్కి ఇద్దరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ వార్త తెలిసినప్పటి నుండి అక్కినేని అభిమానులు సందడి చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ న్యూస్ రూమర్ హోదాలోనే తన మనుగడ కొనసాగిస్తోంది. కానీ ఈ న్యూస్ నిజమైతే మొట్టమొదట ఆనందించేది రూమర్ నే. also read: Toxic: టాక్సిక్ హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా? AKhil, Bhagyashri Borse
Aug 12, 2026 6:02PM
హీరోగా కేటీఆర్ కుమారుడు: సినీ ఎంట్రీ ఇస్తున్న కల్వకుంట్ల హిమాన్షు.!
మనం సాధారణంగా పొలిటిషియన్స్ పిల్లలను చూస్తే.. తండ్రి బాటలోనే రాజకీయం చేస్తారని లేదా సొంతంగా ఏవైనా బిజినెస్ లు చూసుకుంటారని అనుకుంటాం. కానీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ, టాలీవుడ్ సర్కిల్స్ లోనూ ఒక వార్త సంచలనం సృష్టిస్తోంది. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు, మాజీ సీఎం కేసీఆర్ మనవడు అయిన కల్వకుంట్ల హిమాన్షు.. త్వరలోనే వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారట. కల్వకుంట్ల కుటుంబం నుంచి మూడో తరం వారసుడిగా హిమాన్షు ఖచ్చితంగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ, అనూహ్యంగా ఆయన రాజకీయాల్లోకి కాకుండా.. వెండితెరపై మెరవడానికి రెడీ అవుతున్నారనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హిమాన్షు డెబ్యూ చాలా గ్రాండ్ గా ఉండబోతోందట. దీని కోసం టాలీవుడ్ లోని ఒక ప్రముఖ నిర్మాత, పవర్ ఫుల్ డైరెక్టర్ తో ఇప్పటికే చర్చలు కూడా పూర్తయ్యాయని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల హిమాన్షు అద్భుతమైన మేకోవర్ తో ఫిట్ గా, పక్కా "హీరో మెటీరియల్"లా కనిపిస్తున్నారు. తన లుక్స్ పై, ఫిజిక్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం చూస్తుంటే.. ఈ సినీ ఎంట్రీ వార్తలు కేవలం పుకార్లు మాత్రమే కావు, దీని వెనుక పెద్ద ప్లానింగే ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. KCR Grandson, KTR Son, Kalvakuntla Himanshu, Hero Entry, Telangana
Aug 12, 2026 11:24AM
సంచలన వార్త: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. వద్దంటున్న టాప్ డైరెక్టర్!
హీరో, దర్శకుడు. ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే చెప్పడం చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ ఇద్దరి దర్మం మాత్రం అభిమానులని, ప్రేక్షకులని అలరించి ఆ ఇద్దర్ని నమ్ముకున్న నిర్మాత ముఖంలో, సినీ కళామతల్లి మొహాల్లో నవ్వులు పూయించడం. కానీ ఇప్పుడు ఆ ఇద్దరకీ సంబంధించిన గాసిప్ ఒకటి తెలుగు ఫిల్మ్ సర్కిల్స్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా టాలీవుడ్లో ఒక మోస్ట్ క్రేజీ కాంబినేషన్ సెట్ అయిందంటే చాలు, అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు. అలాంటిది ఏకంగా ఇండియన్ సినీ పరిశ్రమలోనే అత్యంత క్రేజీ కాంబినేషన్లలో ఒకటిగా ముద్రపడిన ఒక స్టార్ హీరో, మరో అగ్ర దర్శకుడి మధ్య ఇప్పుడు సీక్వెల్ విషమై తీవ్రమైన అంతర్గత విభేదాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. భారీ బడ్జెట్ మరియు భారీ అంచనాల నడుమ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ బిగ్ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్స్ నుంచి బయటకు వచ్చిన ఒక తాజా వార్త సినిమా వర్గాలతో పాటు అభిమానులను సైతం తీవ్ర కలవరానికి గురిచేస్తోంది.అసలు విషయం ఏమిటంటే, ఈ భారీ చిత్రంలో నటిస్తున్న సదరు స్టార్ హీరో ఈ కథకు భారీ స్కోప్ ఉందని భావించి, దీనిని కేవలం ఒక్క భాగంతో ముగించకుండా "పార్ట్-2" కూడా నిర్మిస్తే బాగుంటుందని గట్టిగా పట్టుబడుతున్నారట. ఒకవేళ సీక్వెల్ చేస్తే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయవచ్చని హీరో భావిస్తున్నట్లు సమాచారం. కానీ సదరు స్టార్ డైరెక్టర్ మాత్రం హీరో ప్రతిపాదనకు ఏమాత్రం సుముఖంగా లేరని తెలుస్తోంది. కథను రెండు భాగాలుగా విస్తరిస్తే దాని ఆత్మ దెబ్బతింటుందని, సినిమా ల్యాగ్ అయి ప్రేక్షకులకు విసుగు తెప్పించే అవకాశం ఉందని దర్శకుడు అభిప్రాయపడుతున్నారట. సింగిల్ పార్ట్లోనే కథలోని అసలైన భావోద్వేగాలు, ఉత్కంఠని పకడ్బందీగా అందించవచ్చని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. Also read: వైరల్: పూరి జగన్నాధ్ కూతురు కలలోకి వచ్చిన ఆ దేవుడు.. పూర్తిగా లీనమైపోదంట ఈ అభిప్రాయ భేదాల వల్ల ప్రస్తుతం హీరో మరియు దర్శకుడి మధ్య తీవ్రమైన కోల్డ్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం సీక్వెల్ నిర్ణయానికే పరిమితం కాకుండా, సెట్స్లో సీన్స్ తీసే విధానంలో కూడా విభేదాలు బయటపడుతున్నాయట. కొన్ని సన్నివేశాల చిత్రీకరణ సమయంలో హీరో సూచించే మార్పులు, చేర్పులకు డైరెక్టర్ విముఖత చూపుతున్నారని సమాచారం. దీంతో వీరిద్దరి మధ్య ఈగో వార్ నడుస్తోందని, చిత్రీకరణ వాతావరణం కాస్త ఉద్రిక్తంగా మారుతోందని టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో టాలీవుడ్లోనే కాకుండా పాన్ ఇండియా వ్యాప్తంగా సీక్వెల్స్ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి పెద్ద సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించి వందల కోట్ల బిజినెస్ చేయడం కామన్ ట్రెండ్గా మారింది. ఈ నేపథ్యంలో సదరు స్టార్ హీరో కూడా తన ప్రాజెక్ట్ను రెండు భాగాలుగా చేయాలని కోరడంలో పెద్దగా వింతేమీ లేదని కొందరు వాదిస్తున్నారు. కానీ, డైరెక్టర్ మాత్రం కంటెంట్ నాణ్యతకే ప్రాధాన్యత ఇస్తూ పార్ట్-2 ప్రతిపాదనని తిరస్కరిస్తుండటం విశేషం. మరి చివరకి ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఎవరకి వాళ్ళు నియంతగా భావించుకుంటారు. కానీ అన్నిటికంటే పెద్ద నియంత కాలమే.. కాబట్టి వెయిట్ చేద్దాం. Hero, Director, Tollywood
Aug 11, 2026 4:42PM
బిగ్గెస్ట్ మల్టీస్టారర్: ఆ భారీ పాన్ ఇండియా మూవీలో వెంకటేష్.!
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ తన 64వ చిత్రం 'డేర్డెవిల్'ను రీసెంట్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. గతేడాది 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాతో అజిత్కు సాలిడ్ బ్లాక్బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ ఆధిక్ రవిచంద్రన్ ఈ ప్రాజెక్ట్ను డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈసారి కేవలం తమిళ మార్కెట్ మాత్రమే కాకుండా, పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేశారు. ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం ఒక సంచలన మల్టీస్టారర్ కాంబినేషన్ కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో టాలీవుడ్ విక్టరీ వెంకటేష్, మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురు స్టార్స్ కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే.. థియేటర్లు షేక్ అవ్వడం గ్యారెంటీ. త్వరలోనే ఈ మైండ్ బ్లోయింగ్ కాంబినేషన్ గురించి క్లారిటీ రానుంది. అజిత్ కుమార్ సతీమణి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ షాలిని తన కొత్త బ్యానర్ 'బ్రేవ్ హార్ట్స్ ప్రొడక్షన్'పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. Ajith Kumar, Dare Devil, Venkatesh, Mohanlal
Aug 11, 2026 11:15AMచిరు 158వ చిత్రంలో యంగ్ హీరోయిన్ ఎంట్రీ.. సెకండాఫ్లో మైండ్ బ్లాకింగ్ కేమియో?
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్లో రూపొందుతున్న 'మెగా 158'పై టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్కి సంబంధించి తాజాగా ఫిలింనగర్లో ఒక ఆసక్తికరమైన ప్రచారం ఊపందుకుంది. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ మీనాక్షి చౌదరి నటించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ చిత్రంలో ఆమె పూర్తిస్థాయి హీరోయిన్గా కాకుండా, కథను మలుపు తిప్పే ఒక విశిష్టమైన అతిథి పాత్రలో కనిపించనుందని సమాచారం. ముఖ్యంగా సినిమా సెకండాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాల్లో మీనాక్షి పాత్ర ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. చిరంజీవితో కలిసి ఆమె చేసే సీన్స్ అభిమానులకు మంచి థ్రిల్ ఇస్తాయని టాక్. ప్రస్తుతం ఈ పాత్ర విషయమై చిత్రబృందం ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి, బాబీ కలయికలో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించి భారీ విజయాన్ని అందుకుంది. దీంతో వీరిద్దరి కాంబోలో రూపుదిద్దుకుంటున్న ఈ రెండో సినిమాపై ట్రేడ్ వర్గాల్లోను, మెగా అభిమానుల్లోను విపరీతమైన క్రేజ్ నెలకొంది. మునుపటి చిత్రాల విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ కొత్త ప్రాజెక్ట్ను కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తుండటం విశేషం. ఈ ప్రాజెక్ట్లో హీరోయిన్ ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుండటంతో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. మీనాక్షి కేమియో గురించిన వార్త బయటకు రావడంతో అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అన్ని పనులు శరవేగంగా పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్లో 'మెగా 158'ని థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అతిత్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని బిగ్ అప్డేట్స్ వెలువడే అవకాశం ఉంది. Chiranjeevi, Bobby Kolli, Mega 158, Meenakshi Chaudhary, KVN Productions
Aug 10, 2026 11:40AM
హనుమంతుడిగా రామ్ చరణ్: 'వారణాసి'తో రాజమౌళి బిగ్గెస్ట్ గ్లోబల్ ప్లాన్.!
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న గ్లోబల్ ప్రాజెక్ట్ 'వారణాసి' గురించి ఒక మైండ్ బ్లాకింగ్ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ అడ్వెంచరస్ ఎపిక్లోకి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ఎంతో పవర్ఫుల్ అండ్ డివైన్ రోల్ అయిన 'హనుమంతుడి' పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నారనే న్యూస్.. ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్గా మారింది. గతంలో హనుమంతుడి పాత్ర కోసం వర్సటైల్ యాక్టర్ మాధవన్ పేరు ప్రముఖంగా వినిపించింది. రాజమౌళి విజన్కి తగ్గట్టు మాధవన్ లుక్ అండ్ పెర్ఫార్మన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా రామ్ చరణ్ పేరు తెరపైకి రావడంతో.. ఒక్కసారిగా అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి. 'వారణాసి' మూవీలో వచ్చే త్రేతాయుగం ఎపిసోడ్ లో మహేష్ బాబు కాసేపు శ్రీరాముడిగా కనువిందు చేయనున్నారు. ఆ ఎపిసోడ్ లో హనుమంతుడిగా రామ్ చరణ్ నటిస్తే.. ఆ మేనియా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో రామ్ చరణ్ను ఆల్రెడీ గ్లోబల్ వైడ్గా ప్రొజెక్ట్ చేశారు రాజమౌళి. చరణ్ లోని ఆ ఇంటెన్స్ అండ్ డివైన్ షేడ్స్ను.. 'అల్లూరి సీతారామరాజు' పాత్రలో క్లైమాక్స్ వద్ద ఎంతో అద్భుతంగా చూపించారు. అందుకే ఈ హనుమంతుడి క్యారెక్టర్కి రామ్ చరణ్ అయితేనే పర్ఫెక్ట్ న్యాయం జరుగుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. మరి ఇది నిజంగానే రాజమౌళి వేసిన బిగ్గెస్ట్ ప్లానా? లేక కేవలం సోషల్ మీడియాలో షికారు చేస్తున్న రూమరా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ మహేష్ బాబు, రామ్ చరణ్ కలిసి ఒకే ఫ్రేమ్లో కనిపించి.. అది కూడా రాజమౌళి మార్క్ మైండ్ బ్లోయింగ్ విజువల్స్తో ఉంటే... బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ ఖాయం. Ram Charan, Hanuman, Varanasi, Mahesh Babu, SS Rajamouli
Aug 8, 2026 2:43PM
అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ మూవీలో మరో స్టార్ హీరో.!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రాబోతున్న #AA23 సినిమా గురించి ఒక బిగ్ న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్లో కీలక పాత్ర కోసం ఓ స్టార్ హీరో రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ క్రేజీ కాంబో కావడంతో 'AA23'పై అనౌన్స్ మెంట్ తోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తన గత చిత్రం 'కూలీ'తో అంచనాలను అందుకోలేకపోయిన లోకేష్.. ఈసారి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసి, తన పవరేంటో చూపించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. అందుకే 'AA23' విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ భారీ ప్రాజెక్ట్లోకి ఒక ప్రముఖ బాలీవుడ్ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. 'AA23'లో కథకు కీలకమైన ఓ రోల్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ పేరును పరిశీలిస్తున్నారట. లోకేష్ కనగరాజ్ తన సినిమాల్లో ప్రతి పాత్రను ఎంత పవర్ఫుల్ గా డిజైన్ చేస్తారో తెలిసిందే. దీంతో ఇప్పుడు షాహిద్ కపూర్ పాత్ర ఎలా ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో 'రాకా' సినిమా చేస్తున్నారు. ఈ ఏడాది చివరి కల్లా ఆ మూవీ షూటింగ్ పూర్తి కానుంది. ఆ తర్వాత లోకేష్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. Allu Arjun, Lokesh Kanagaraj, AA23, Shahid Kapoor
Aug 6, 2026 3:12PM
మల్టీస్టారర్కి క్రేజీ టైటిల్.. 2027 సంక్రాంతికి నవ్వుల జాతరే.!
రవితేజ, శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. అలాంటిది ఈ ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే.. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురవడం ఖాయం. ఓ కామెడీ ఎంటర్టైనర్ కోసం రవితేజ, శ్రీవిష్ణు చేతులు కలపనున్నారు. ఈ మల్టీస్టారర్ కు హసిత్ గోలి దర్శకత్వం వహించనున్నారు. 'రాజ రాజ చోర', 'స్వాగ్' వంటి చిత్రాలతో ఆకట్టుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి.. ఈ ఇద్దరు హీరోల కోసం ఒక హిలేరియస్ ఫన్ రైడ్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్లు వినికిడి. ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ఈ చిత్రం రూపుదిద్దుకోనుందట. ఇక ఈ సినిమాకి 'వీరాధి వీరులు కేరాఫ్ మహిళా మండలి' అనే డిఫరెంట్ అండ్ క్యాచీ టైటిల్ను పరిశీలిస్తున్నారట. టైటిల్ వింటుంటేనే కడుపుబ్బా నవ్వించే ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ డ్రామా మన ముందుకు రాబోతోందని స్పష్టమవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ను ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ థియేటర్లకు రప్పించేలా 2027 సంక్రాంతి రేసులో నిలపాలని మేకర్స్ పక్కా స్కెచ్ వేస్తున్నారు. రవితేజ, శ్రీవిష్ణు కలిస్తే 2027 సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర నవ్వుల జాతరే అని చెప్పొచ్చు. Ravi Teja, Sree Vishnu, Multistarrer, Hasith Goli
Aug 5, 2026 2:23PM
చిరంజీవి, నాగార్జున మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి బిగ్ ప్లాన్.!
టాలీవుడ్ ఫోర్ పిల్లర్స్ లో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున బాండింగ్ ఎప్పుడూ ప్రత్యేకమే. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. ఓ రకంగా బ్రదర్స్ లా ఉంటారు. వీరిద్దరి కాంబినేషన్ లో మల్టీస్టారర్ వస్తే చూడాలనేది.. అభిమానులు దశాబ్దాల కల. ఇప్పుడు ఆ కలను నిజం చేసే బాధ్యతను డైరెక్టర్ అనిల్ రావిపూడి తన భుజాలపై వేసుకున్నారనే వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. నలుగురు సీనియర్ స్టార్స్ లో నాగార్జునతో తప్ప మిగతా ముగ్గురు స్టార్స్ తో రావిపూడి సినిమాలు చేశారు. చిరంజీవితో 'మన శంకర వరప్రసాద్ గారు', బాలకృష్ణతో 'భగవంత్ కేసరి' చేశారు. ఇక వెంకటేష్ అయితే 'ఎఫ్ 2', 'ఎఫ్ 3', 'సంక్రాంతికి వస్తున్నాం' చేశారు. అలాగే 'మన శంకర వరప్రసాద్ గారు'లోనూ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో సందడి చేయడం విశేషం. ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్ తో మరో మల్టీస్టారర్ చేస్తున్నారు రావిపూడి. అయితే నాగార్జునతో సినిమా చేస్తే.. నలుగురు స్టార్స్ తో సినిమాలు చేసిన డైరెక్టర్ గా అరుదైన ఘనత సాధించే అవకాశం అనిల్ రావిపూడికి ఉంటుంది. రావిపూడి సైతం ఇదే విషయాన్ని చెబుతూ.. నాగ్ తో సినిమా చేయాలని ఉందనే విషయాన్ని ఇప్పటికే బయటపెట్టారు. ఈ క్రమంలోనే నాగార్జునతో సినిమా ప్లాన్ చేస్తున్న అనిల్ రావిపూడి.. సోలోగా కాకుండా, చిరంజీవితో మల్టీస్టారర్ గా చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఒకవేళ నిజంగానే ఈ కాంబినేషన్ పట్టాలెక్కితే.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ ఖాయం. Anil Ravipudi, Chiranjeevi, Nagarjuna, Multistarrer
Jul 31, 2026 6:08PM
హీరోయిన్గా బాలయ్య కూతురు తేజస్విని ఎంట్రీ?
నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ కంటే ముందే బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుందనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తేజస్విని త్వరలోనే ఒక పవర్ఫుల్ ఫీమేల్ సెంట్రిక్ ప్రాజెక్ట్ ద్వారా వెండితెరపై మెరిసేందుకు సిద్ధమవుతున్నారట. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్కి భిన్నంగా, ఒక మంచి సామాజిక సందేశం ఉన్న లేడీ ఓరియంటెడ్ స్పోర్ట్స్ డ్రామా కథతో ఆమె ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. క్రియేటివ్ ఫీల్డ్ లో తేజస్విని కొంతకాలంగా యాక్టివ్ గా ఉంటున్నారు. ఓటీటీ వేదిక 'ఆహా'లో అఖండ విజయం సాధించిన బాలకృష్ణ 'అన్స్టాపబుల్' టాక్ షో వెనుక క్రియేటివ్ కన్సల్టెంట్గా వ్యవహరించారు. అలాగే బాలయ్య సినిమాల ప్రొడక్షన్, స్క్రిప్ట్ లు, కాస్ట్యూమ్స్ విషయంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు, ఇటీవల తేజస్విని వేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ వీడియోస్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. అలాగే ఒక కమర్షియల్ యాడ్ లో ఆమె స్క్రీన్ ప్రజెన్స్, కాన్ఫిడెన్స్ చూసి ఫ్యాన్స్ ప్రశంసలు కురిపించారు. నటిగా ఎంట్రీ ఇచ్చే క్రమంలో.. ఆడియన్స్ కి చేరువ అవ్వడంలో భాగంగానే తేజస్విని ఈ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే, నందమూరి ఫ్యామిలీ నుంచి వెండితెరపై అడుగుపెడుతున్న తొలి నటిగా తేజస్విని ఒక కొత్త చరిత్ర సృష్టిస్తారు. Balakrishna Daughter, Tejaswini Nandamuri, Acting Debut
Jul 31, 2026 4:15PM
ఎన్టీఆర్ కొత్త బిజినెస్.. గచ్చిబౌలిలో భారీ మల్టీప్లెక్స్.!
టాలీవుడ్ స్టార్ హీరోలు మల్టీప్లెక్స్ బిజినెస్లో కూడా తమ మార్క్ చూపిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు AMB సినిమాస్తో ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ AAA సినిమాస్తో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. అలాగే మాస్ మహారాజా రవితేజ కూడా ఏషియన్ సినిమాస్తో కలిసి ART సినిమాస్ తెచ్చారు. ఇప్పుడు ఈ బిజినెస్ రేస్లోకి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఐటీ హబ్ అయిన గచ్చిబౌలి ప్రాంతంలో తారక్ ఒక ప్రీమియం మల్టీప్లెక్స్ నిర్మించడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారట. గచ్చిబౌలి అంటేనే ఐటీ ఎంప్లాయిస్, యూత్, నైట్ లైఫ్తో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రైమ్ లోకేషన్. అలాంటి చోట తారక్ మల్టీప్లెక్స్ వస్తే ఆ క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేక్షకులు కేవలం సినిమా చూడటమే కాకుండా, ఒక లగ్జరీ ఎక్స్పీరియన్స్ని కోరుకుంటున్నారు. అందుకే మహేష్ బాబు, అల్లు అర్జున్ గ్లోబల్ స్టాండర్డ్స్తో థియేటర్లను నిర్మించి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తారక్ కూడా ఇదే బాటలో నడుస్తూ, ఐటీ కారిడార్లో ల్యాండ్ మార్క్గా నిలిచేలా ఒక గ్రాండ్ మల్టీప్లెక్స్ను ప్లాన్ చేస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. భారీ స్క్రీన్స్, అడ్వాన్స్డ్ డోల్బీ అట్మాస్ సౌండింగ్, వరల్డ్ క్లాస్ సీటింగ్ అండ్ ఫుడ్ కోర్ట్స్తో ఈ మల్టీప్లెక్స్ ఉండబోతోందట. ఒక బడా సంస్థతో కలిసి ఈ ప్రాజెక్ట్ పార్ట్నర్షిప్లో రూపుదిద్దుకునే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ ఇదే గనుక నిజమైతే.. త్వరలోనే గచ్చిబౌలిలో ఎన్టీఆర్ బ్రాండ్ నేమ్తో ఒక మైండ్ బ్లోయింగ్ విజువల్ హబ్ సిద్ధం కావడం ఖాయం. Jr NTR, Multiplex, Gachibowli, Hyderabad
Jul 31, 2026 3:43PM
జయకృష్ణ ఘట్టమనేని సెకండ్ మూవీ ఫిక్స్.. ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్తో బిగ్ ప్రాజెక్ట్.!
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ఘట్టమనేని మూడో తరం వారసుడు జయకృష్ణ తెలుగు తెరకు హీరోగా పరిచయమైన సినిమా 'శ్రీనివాస మంగాపురం'. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా నిన్న(జూలై 30) థియేటర్లలో అడుగుపెట్టింది. సినిమా టాక్ పరవాలేదు అనేలా ఉన్నా.. హీరోగా జయకృష్ణకు మంచి మార్కులే పడ్డాయి. యాక్టింగ్, స్క్రీన్ ప్రజెన్స్ బాగుందని.. సరైన స్క్రిప్ట్స్ పడితే హీరోగా నిలదొక్కుకుంటాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే జయకృష్ణ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. ఈ ఘట్టమనేని వారసుడి రెండో సినిమా లాక్ అయినట్లు సమాచారం. సూపర్ స్టార్ కృష్ణకు వీరాభిమాని అయిన ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మించనున్నారని టాక్. 'సామజవరగమన', 'నారీ నారీ నడుమ మురారి' సినిమాల దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన శ్రీవిష్ణుతో ఒక సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది అంటున్నారు. Jaya Krishna Ghattamaneni, Srinivasa Mangapuram, Anil Sunkara
Jul 31, 2026 3:09PM
వెంకీ అట్లూరి బిగ్ స్కెచ్.. ఆ స్టార్ హీరోతో పోలీస్ స్టోరీ.!
కోలీవుడ్ స్టార్ ధనుష్, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన 'సార్' చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ బ్లాక్బస్టర్ కాంబో మళ్లీ ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం జతకట్టబోతోందనే వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాబోయే ఈ చిత్రంలో ధనుష్ తొలిసారిగా ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారట. తన వైవిధ్యమైన నటనతో ఎన్నో రకాల పాత్రలకు ప్రాణం పోసిన ధనుష్, ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా పూర్తిస్థాయి పోలీస్ ఆఫీసర్గా నటించకపోవడం విశేషం. అందుకే ఈసారి ఆయన ఖాకీ యూనిఫాం ధరిస్తున్నారనే ప్రచారం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. దర్శకుడు వెంకీ అట్లూరి ధనుష్ కోసం ఒక పవర్ ఫుల్, ఎమోషనల్ కాన్సెప్ట్ తో కూడిన కథను సిద్ధం చేశారని టాక్. ఎమోషనల్ డ్రైవ్తో పాటు పక్కా కమర్షియల్ హంగులను మేళవించి ధనుష్ను సరికొత్త అవతార్లో ప్రెజెంట్ చేయడానికి స్క్రిప్ట్ డిజైన్ చేశారని తెలుస్తోంది. 'సార్' సినిమా తర్వాత మళ్లీ ఒక బలమైన లైన్తో వెంకీ అట్లూరి సంప్రదించగానే ధనుష్ కూడా వెంటనే ఇంప్రెస్ అయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. సోషల్ మీడియాలో కూడా ఈ కాంబో అప్డేట్పై నెటిజన్లు విశేషంగా చర్చించుకుంటున్నారు. ఒక వైవిధ్యమైన నటుడు పోలీస్ ఆఫీసర్ పాత్రను తనదైన శైలిలో ఎలా పోషిస్తారో చూడాలని అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు వెంకీ అట్లూరి.. సూర్య, మమితా బైజు కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' పోస్ట్ ప్రొడక్షన్ పనులతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. Dhanush, Venky Atluri, Vishwanath and Sons
Jul 30, 2026 1:14PM
ఊహించని ట్విస్ట్.. రెండు భాగాలుగా రాబోతున్న అల్లు అర్జున్ 'రాకా'.!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న హై-వోల్టేజ్ బిగ్ ప్రాజెక్ట్ 'రాకా' గురించి ఒక మైండ్ బ్లోయింగ్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాని ఒకే పార్ట్గా కాకుండా.. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను సన్ పిక్చర్స్ బ్యానర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అయితే, మార్కెట్లో దీనికి ఉన్న హ్యూజ్ డిమాండ్ దృష్టిలో ఉంచుకుని మేకర్స్ కోట్ చేసిన డిజిటల్ రైట్స్ నంబర్స్, ఓటిటి ప్లాట్ఫార్మ్స్ ఆఫర్ చేస్తున్న ఆఫర్లకు అంతగా మ్యాచ్ అవ్వలేదు. బడ్జెట్ రికవరీతో పాటు, బిజినెస్ పరంగా ప్రాజెక్ట్ రేంజ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే కథని విస్తరించి రెండు భాగాలుగా తేవడమే పర్ఫెక్ట్ రూట్ అని టీమ్ ఫిక్స్ అయ్యిందట. అట్లీ ఈ రెండు భాగాల ప్లాన్ గురించి అల్లు అర్జున్, అలాగే సన్ పిక్చర్స్ టీమ్తో డీటైల్డ్గా డిస్కస్ చేశారట. కథలోని డెప్త్, విజువల్ గ్రాండియర్ చూసిన తర్వాత అందరూ ఏకగ్రీవంగా ఈ రెండు భాగాల ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. సాధారణంగా రెండు భాగాల సినిమాలు అంటే ఏళ్ల తరబడి షూటింగ్స్ సాగుతూనే ఉంటాయి. కానీ 'రాకా' విషయంలో మాత్రం అలా జరగడం లేదు. మేకర్స్ వేసిన పక్కా స్కెచ్ ఏంటంటే... ఈ ఏడాది చివరి కల్లా 'రాకా' పార్ట్-1, పార్ట్-2 రెండింటి షూటింగ్ను కంప్లీట్ చేయడానికి టార్గెట్ పెట్టుకున్నారు. షూటింగ్ మొత్తం ఫినిష్ అయిన తర్వాతే గ్రాండ్గా ప్రమోషన్స్ అండ్ రిలీజ్ ప్లాన్ అనౌన్స్ చేయబోతున్నారు. షూటింగ్ పూర్తయిన వెంటనే అల్లు అర్జున్ ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా తన తదుపరి లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్లోకి అడుగుపెడతారు. ఈలోగా డైరెక్టర్ అట్లీ 'రాకా' రెండు భాగాల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మీద పూర్తిగా ఫోకస్ పెడతారు. Allu Arjun, Atlee, Raaka Movie, Two Parts
Jul 29, 2026 3:52PM
దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్న మరో టాలీవుడ్ హీరో.!
టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో సుధీర్ బాబు. కథల ఎంపికలో వైవిధ్యం చూపుతూ, ఫిట్నెస్, యాక్షన్ సన్నివేశాల్లో అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇప్పుడు సరికొత్త సంచలనానికి తెరలేపబోతున్నారు. 2012లో వచ్చిన 'శివ మనసులో శృతి' చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయమైన సుధీర్ బాబు, తన 14 ఏళ్ల కెరీర్లో ఇప్పటివరకు 20కి పైగా సినిమాల్లో నటించారు. 'ప్రేమకథా చిత్రమ్', 'సమ్మోహనం' వంటి క్లాసిక్ హిట్స్తో పాటు 'నన్ను దోచుకుందువటే', 'శ్రీదేవి సోడా సెంటర్', 'మా నాన్న సూపర్హీరో' లాంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే గతేడాది భారీ అంచనాలతో తెరకెక్కిన పాన్ ఇండియా పౌరాణిక మిస్టరీ చిత్రం 'జటాధర' బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయి విజయాన్ని సాధించలేకపోయింది. ఈ క్రమంలో తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న సుధీర్ బాబు, ఇప్పుడొక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇటీవలి కాలంలో టాలీవుడ్ యువ హీరోలు కేవలం నటనకే పరిమితం కాకుండా కథారచన, దర్శకత్వ బాధ్యతలను కూడా తమ భుజస్కంధాలపై వేసుకుంటున్నారు. ఇప్పటికే ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని 'RAPO 23'తో డైరెక్టర్ గా డెబ్యూ అవుతున్నట్లు ప్రకటించగా, మరోవైపు యంగ్ హీరో విశ్వక్ సేన్ 'ఫలక్నుమా దాస్', 'దాస్ కా ధమ్కీ'లతో దర్శకుడిగా నిరూపించుకున్నారు. అలాగే కిరణ్ అబ్బవరం కూడా స్వీయ దర్శకత్వంలో ఒక ప్రాజెక్టును మొదలుపెట్టారు. ఇప్పుడు ఇదే క్రమంలో సుధీర్ బాబు కూడా మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం, సుధీర్ బాబు గత కొన్ని నెలలుగా ఒక విభిన్నమైన, పవర్ఫుల్ స్క్రిప్ట్పై తీవ్రంగా కసరత్తు చేశారు. ఒక సరికొత్త కాన్సెప్ట్తో తన స్వంత కథను సిద్ధం చేసుకున్న ఆయన, ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో ఆయనే హీరోగా నటించబోతున్నారు. స్వయంగా కథ రాసుకుని, హీరోగా నటిస్తూ, డైరెక్షన్ కూడా చేయనుండటంతో ఈ ప్రాజెక్ట్పై టాలీవుడ్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. కృష్ణ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, సుపర్ స్టార్ మహేష్ బాబు అండదండలు ఉన్నప్పటికీ.. సుధీర్ బాబు ఎప్పుడూ సొంత కాళ్లపై నిలబడటానికే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ తన నటనతో మెప్పిస్తున్నప్పటికీ సరైన కమర్షియల్ సక్సెస్ పడక చాలారోజులు అవుతుండటంతో, ఈసారి ఎలాగైనా గ్రాండ్ కమ్బ్యాక్ ఇవ్వాలనే పట్టుదలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. Sudheer Babu, Directorial Debut, Actor Director, Tollywood
Jul 27, 2026 10:22AM
సినిమాగా తెరకెక్కకుండా 30 లక్షలు సంపాదించిన కథ.. ఆ రైటర్ ఎవరో తెలుసా!
ఒక సినిమా హిట్ అవ్వడానికి ముఖ్యంగా కావాల్సింది కథ.. ఆ కథ తర్వాతనే హీరో, హీరోయిన్, దర్శకుడుతో పాటు ఇతర టెక్నీషియన్స్. ఆ అందరి పని తనం సినిమా విజయంలో కీ రోల్ పోషిస్తుంది. కానీ సినిమాకి అసలైన లివర్ మాత్రం 'కథ' మాత్రమే. కథ సరిగ్గా లేకపోతే కోట్లాది రూపాయల బడ్జెట్ పెట్టినా, భారీ స్టార్ కాస్టింగ్ ఉన్నా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అందుకే ఇండస్ట్రీలో ఒక సామెత ఉంది – "కథే నాయకుడు, కథే కథానాయకుడు" అని! ఈ నేపథ్యంలో కథ యొక్క గొప్పతనానికి సంబంధించిన న్యూస్ ఒకటి సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ప్రముఖ దర్శకుల దగ్గర రచయితగా చేసిన రైటర్ ఒకాయన నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటనని ఆధారంగా చేసుకొని ఒక కథ తయారు చేసాడు. ఆ కథని టాప్ ప్రొడ్యూసర్ ల దగ్గరనుంచి, చిన్న ప్రొడ్యూసర్ ల వరకు అందరికి వినిపించాడు. అందరూ వినగానే మైమరచిపోయి లక్ష దగ్గర నుంచి ఐదు లక్షల దాకా అడ్వాన్స్ ఇచ్చారు. కానీ కథ మాత్రం ఇంతవరకు సినిమాగా తెరకెక్కలేదు. దాంతో ఆ రైటర్ తెరకెక్కని ఆ కథ వల్ల ముప్పై లక్షల వరకు సంపాదించాడు. సినీ రూల్స్ ప్రకారం అడ్వాన్స్ ఇచ్చి ఆ తర్వాత నెంబర్ ఆఫ్ డేస్ లో తెరకెక్కించకపోతే అడ్వాన్స్ డబ్బులు వెనక్కి ఇవ్వరు. Also read: Chiranjeevi: సెంటిమెంట్ నిజమైందా! అభిమానుల కన్నీళ్లు ఆ రైటర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో తెలుగు వాడి సత్తా చాటుతున్న టాప్ దర్శకుడి తొలి సినిమాకి కథని అందించాడు. ఆ చిత్రంలోని హీరో కూడా పాన్ ఇండియా కట్ అవుట్ . ప్రస్తుతం ఆ రైటర్ తన భార్య పేరుతో సీరియల్స్ కి పని చేసుకుంటున్నాడు. cinema, story, director, hero
Jul 24, 2026 5:14PM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com




