
Godhavari : నందుకు మురళి రాసిన లవ్ లెటర్ రచ్చ.. పెళ్లిచూపుల్లో ఊహించని ట్విస్ట్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -13 లో......నందుకి మురళి లవ్ లెటర్ రాస్తాడు. ఆ లెటర్ నేను నందుకి ఇస్తానని సూర్య అంటాడు. దానికి మురళి సరే అంటాడు. సూర్య లెటర్ తీసుకొని శంకర్ ఇంటికి వెళ్తాడు. అక్కడ నందు ఉంటుంది. తనకి సైగ చేస్తాడు. పట్టించుకోకపోవడంతో అప్పుడే స్కూల్ నుంచి వస్తున్న కిన్నెరకి లెటర్ ఇచ్చి.. ఇది మీ నందు అక్కకి ఇవ్వమని చెప్తాడు. దాంతో కిన్నెరా వెళ్లి ఆ లెటర్ నందుకి ఇస్తుంది. ఈ లెటర్ ఎవరు ఇచ్చారని నందు అడుగుతుంది. బయటున్నాడు ఒకతను అని కిన్నెరా చెప్తుంది. సరే అతన్ని తీసుకొని లోపలకి రా అని నందు చెప్తుంది. నందు ఆ లెటర్ తీసుకొని వెళ్లి ఈ లవ్ లెటర్ గౌతమ్ కి అనుకుంటా ..ఎవరో ఇచ్చారు కిన్నెరా అతన్ని లోపలికి తీసుకొని వస్తుందని నందు చెప్తుంది. అప్పుడే సూర్యని తీసుకొని కిన్నెర లోపలకీ వస్తుంది. సూర్యని చూసి సింహాద్రి మేనల్లుడు అని గుర్తు పడుతారు. మా గౌతమికి ఎందుకు లెటర్ రాసావని అడుగుతారు. అయ్యో తనకి కాదు లెటర్ అని సూర్య అంటాడు. అంటే మా జానూ కా అని నందు అడుగుతుంది. లేదని సూర్య అంటాడు. అంటే నాకా.. నాకు ఆల్రెడీ NRI సంబంధం వచ్చిందని నందు అంటుంది. ముందు వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్పండి.. మొన్న పెంపకం గురించి మాట్లాడింది కదా అని జానూ అంటుంది. సింహాద్రికి శంకర్ ఫోన్ చేయబోతుంటే అప్పుడే మురళి వచ్చి.. ఆ లెటర్ ని నందుకి ఇవ్వమని నేనే పంపించానని చెప్తాడు. దాంతో మురళిని శంకర్ బయటకు తీసుకొని వెళ్లి అసలు విషయం చెప్తాడు. ఆ తర్వాత నా మనవడికి ఇచ్చి చెయ్యడం లేదు.. నేను ఈ ఇంట్లో ఉండనని ఇంటి పెద్దావిడ బయటకు వెళ్తుంటే.. నువ్వు ఇంట్లో నుంచి వెళ్తే నా మీద ఒట్టే అని మురళి అంటాడు. ఆ తర్వాత జశ్వంత్ తో గౌతమి ఫోన్ మాట్లాడుతుంది. అప్పుడే నందు వచ్చి.. ఫోన్ లాక్కొని ఎవరితో మాట్లాడుతున్నావ్ జశ్వంత్ తోనా అంటుంది. అవును అక్క కాలేజీకీ వెళ్లడం లేదు కదా అందుకే ఫోన్ చేసి ఏం జరిగిందో కనుకుంటున్నానని గౌతమి అంటుంది. ఆ తర్వాత మరుసటిరోజు పెళ్లిచూపులకి అబ్బాయి వాళ్ళు వస్తారు. అబ్బాయి రాలేదని శంకర్ అడుగుతాడు. ఈ ఊళ్ళో అబ్బాయికి ఫ్రెండ్ ఉన్నాడు.. తనతో వస్తానని అన్నాడని అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
May 26, 2026 10:47AM.webp)
Brahmamudi : సీఈఓ పోటీలో రాజు.. ఉద్యోగం పోవడంతో వెంకీ ఆవేదన!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1041 లో....రేఖ దగ్గరికి ఇందు వచ్చి.. ఆంటీ ఆ రాజు గాడు సీఈఓగా పోటీ చెయ్యాలని అనుకుంటున్నాడు.. వాడు అనుకున్నది చేసి బోర్డు మెంబర్స్ ని తన వైపుకి తిప్పుకుంటాడని ఇందు అనగానే రేఖ షాక్ అవుతుంది. ఆ మాటలన్నీ రాజు విని ప్లాన్ చేసింది నువ్వు ఇప్పుడు తన ముందు నన్ను ఇరికిస్తావా నీ సంగతి చెప్తానని రాజు అనుకుంటాడు. ఆ తర్వాత వెంకీ ఆఫీస్ కి వెళ్తాడు. నిన్ను జాబ్ లో నుంచి తీసేస్తున్నాను.. నువ్వు ఇంకా అప్డేట్ అవ్వడం లేదని మేనేజర్ అనగానే సర్ నేను నిజాయితీగా పనిచేస్తున్నాను కదా అని వెంకీ అనగానే కావలసింది నిజాయితీ కాదు అప్డేట్ అవ్వాలి.. పాతకాలం లాగా అక్కడే ఉంటానంటే కుదరదని మేనేజర్ వెంకీకి చెప్తాడు. దానికి వెంకి రిక్వెస్ట్ చేస్తాడు. అయిన మేనేజర్ వినడు. మరొకవైపు రాజు భోజనం చేస్తాడు. చికెన్ లో పెరుగు కలుపుకొని తింటాడు.అది చూసి అపర్ణ తన కొడుకు రాజ్ అలాగే తినేవాడని గతంలో జరిగింది గుర్తుచేసుకొని బాధపడుతుంది. ఏంటి అమ్మమ్మ అలా ఉన్నావని రాజు అడుగుతాడు. మా అబ్బాయి కూడా అచ్ఛం ఇలాగే తినేవాడని అపర్ణ అంటుంది. ఏంటి ఆంటీ తనలో నీ కొడుకుని చూసి మురిసిపోతున్నావా అని అపర్ణతో రేఖ అంటుంది. ఆ తర్వాత రాజు నువ్వు సీఈఓగా పోటీ చేస్తున్నావంట అందుకోసం బోర్డు మెంబర్స్ తో మాట్లాడావట అని రేఖ అడుగుతుంది. అవునని రాజు చెప్తాడు. ట్రై చెయ్ అని రేఖ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు వెంకి ఇంటికి వెళ్లి నా జాబ్ పోయిందని చెప్పగానే వాళ్ళ అమ్మనాన్న బాధపడతారు. ఇక మనం ఎలా బతుకుతామోనని చలపతి టెన్షన్ పడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
May 26, 2026 10:43AM.webp)
Karthika Deepam2: కూతురు అంటూ నోరు జారిన దశరథ్..
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -679 లో......సుమిత్ర ఒళ్ళో తల వాల్చి దీప పడుకుంటుంది. అప్పుడే జ్యోత్స్న వచ్చి సుమిత్ర, దీపలని అలా చూసి షాక్ అవుతుంది. ఈ దీప అనుకున్నది చేసిందని కోప్పడుతుంది. దగ్గరికి వెళ్లి మమ్మీ ట్యాబ్లెట్ వేసుకున్నావా అని అడుగుతుంది. వేసుకున్నానని సుమిత్ర చెప్తుంది. జ్యో మా అమ్మమ్మ ఒళ్ళో అమ్మ పడుకుంది.. అమ్మ ఒళ్ళో నేను పడుకుంటానని శౌర్య అంటుంది. తర్వాత దీప ఒళ్ళో శౌర్య పడుకుంటుంది. అది చూసి జ్యోత్స్న కోపంగా వెళ్ళిపోతుంది. అప్పుడే కార్తీక్ వచ్చి తల్లి కూతుళ్లు అలా ఉండడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే దశరథ్ వచ్చి వాళ్ళు అలా ఉండడం చూసి ఒక ఫోటో తీసి మురిసిపోతాడు. ఆ తర్వాత జ్యోత్స్న నిద్రపోకుండా ఆలోచిస్తుంటే ఏంటే ఇంకా నిద్ర పోవడం లేదని కాంచన అడుగుతుంది. నువ్వు పడుకో అత్త నా గురించి నీకెందుకని అంటుంది. ఉండు మా నాన్నకి అన్నయ్యకి ఫోన్ చేస్తానని కాంచన అనగానే వద్దు పడుకుంటున్నానని జ్యోత్స్న పడుకుంటుంది. మరుసటి రోజు జ్యోత్స్న నిద్ర లేచేసరికి పూజ చేసి గంట సౌండ్ వినిపిస్తుంది. అది విని జ్యోత్స్న కోపంగా కిందకి వస్తుంది. పారిజాతం ఎదురుపడుతుంది. నువ్వు ఇక్కడే ఉన్నవా అయితే ఎవరు పూజ చేసిందని జ్యోత్స్న అంటుంది. గంట కొడుతూ శౌర్యా వస్తుంది. వెనకాల దీప వస్తుంది. ఇంట్లో అందరు హాల్లోకీ వస్తారు. నా కూతురు మొదటి రోజు ఇంట్లో అడుగుపెట్టి పూజ చేసింది.. తన కాళ్ళ పట్టీల సౌండ్ ఇల్లంతా సందడిగా మారిందని దశరథ్ అనగానే అందరు షాక్ అవుతారు. ఏంటి అన్నయ్య జ్యోత్స్నని అనాల్సిన మాటలు దీపని అంటున్నావని కాంచన అనగానే ఇలా అన్నాను ఏంటని దశరథ్ అనుకుంటాడు. దాంతో దశరత్, కార్తీక్ కలిసి కవర్ చేస్తారు. ఆ తర్వాత దీప గుడికి వెళ్ళడానికి రెడీ అవుతుంది. కార్తీక్ ని కూడా తీసుకొని వెళ్ళమని కాంచన అంటుంది. ఇప్పుడు గానీ మేం ఇద్దరం వెళ్తే ఇంకా ఏమైనా ఉందా కాంపిటేషన్ మీరు కలిసి ఉండొద్దని చర్చ పెడుతుంది జ్యోత్స్న అని కార్తీక్ అంటాడు. అలా ఏం లేదు మీరు ఇద్దరు గుడికి వెళ్లి రండీ కానీ గంటలో రావాలని జ్యోత్స్న చెప్పగానే కార్తీక్, దీప బయల్దేర్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
May 26, 2026 10:23AM.webp)
Illu illalu pillalu : అమూల్యను ఏడిపించిన విశ్వ గ్యాంగ్.. చందుకి అసలు నిజం చెప్పేసిన వల్లి!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -480 లో.....సాగర్ ఆఫీస్ కి రెడీ అవుతూ నర్మద బాక్స్ తీసుకొని రా అంటాడు. దాంతో నర్మద ఎంప్టీ బాక్స్ తీసుకొని వచ్చి రెడీ అంటుంది. ఏంటి జోక్ చేస్తున్నావా అని సాగర్ అంటాడు. ఫస్ట్ బాక్స్ తీసుకొని రా అని సాగర్ అంటాడు. జోక్ చేసింది ఎవరని నర్మద అంటుంది. నువ్వు అన్ని పిలవగానే తీసుకొని రావడానికి మనం కలిసి లేము సపరేట్ గా ఉన్నాం.. నువ్వు సరుకులు ఎక్కడ తీసుకొని వచ్చావని నర్మద అంటుంది. సరే సాయంత్రం తీసుకొని వస్తానని సాగర్ బయల్దేరతాడు. ఆ తర్వాత తిరుపతి పేపర్ చదువుతూ అత్తాకోడళ్ల గొడవలో భాగంగా ఇంట్లో నుంచి అత్త వెళ్ళిపోయిందని చదువుతాడు. అప్పుడే సాగర్ వెళ్తుంటే ఇండైరెక్ట్ గా రామారాజు తనకి కౌంటర్ వేస్తాడు. సాగర్ కూడా అలాగే మాట్లాడుతాడు. రామరాజు పైకి అలా మాట్లాడుతున్నా లోపల తనకి బాధ ఉంటుంది. ఆ తర్వాత అమూల్యకి బాక్స్ ఇచ్చి వేదవతి కాలేజీకి వెళ్ళమంటుంది. నేను వెళ్ళనని అమూల్య ఏడుస్తుంది. అసలు ఏం జరిగింది చెప్పమని నర్మద, ప్రేమ, ధీరజ్ అడుగుతారు. కాలేజీలో విశ్వ ఫ్రెండ్స్ అంతా కలిసి.. నువ్వు విశ్వతో ఉన్నావ్ కదా ఫస్ట్ నైట్ అయిందా అని ఏడిపించారని అమూల్య చెప్తుంది. వాడిని చంపేస్తానని ధీరజ్ అంటాడు. ఇప్పుడు అతన్ని ఏదైనా అంటే మనకే ప్రాబ్లమ్.. ఎందుకంటే అతను డైరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వలేదు.. తన ఫ్రెండ్స్ ద్వారా అలా చేసాడు.. ఇప్పుడు మనం రియాక్ట్ అయిన నేను నీ చెల్లిని ఏమైనా అన్నానా అంటాడని ధీరజ్ తో నర్మద అంటుంది. నాకు వాడికి ఎలా బుద్ది చెప్పాలో తెలుసని ధీరజ్ అంటాడు. మరొకవైపు చందు తండ్రి కాబోతున్నాడని చిన్నపిల్లల ఫొటోస్, బొమ్మలు తీసుకొని వస్తాడు. అవన్నీ చూసి ఇవన్నీ ఎందుకని వల్లి అడుగుతుంది. నువ్వు కడుపుతో ఉన్నావ్ కదా ఇవన్నీ చూస్తే ప్రశాంతంగా ఉంటావని చందు అనగానే వల్లి బాధపడుతుంది. బా నేను ప్రెగ్నెంట్ కాదు మా వాళ్ళు ఇదంతా నన్ను ఇంట్లోకి రప్పించడానికి ప్లాన్ చేశారని వల్లి చెప్పగానే చందు షాక్ అవుతాడు. అప్పుడే సుకన్య వచ్చి చాలా బాగా యాక్టింగ్ చేసావ్ వల్లి.. ఇదంతా ఫ్రాంక్ చేసామని సుకన్య అంటుంది. ఏంటి వల్లి ఇలాంటి విషయంలో ఫ్రాంక్ చేస్తారా అని చందు కోప్పడతాడు. అక్కడ నుంచి చందు వెళ్ళిపోయాక ఎందుకు నిజం చెప్తున్నావ్.. నేను లేట్ గా వచ్చి ఉంటే పరిస్థితి ఏంటని సుకన్య అంటుంది. దాంతో వల్లి ఏడుస్తుంది. పుట్టబోయే బిడ్డపై చందు ఆశలు పెంచుకుంటున్నాడని ఏడుస్తుంది వల్లి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
May 26, 2026 10:18AM.webp)
Podharillu : నాటకాలాడుతున్న ప్రతాప్.. చివరి నిమిషంలో చక్రి ఊహించని ట్విస్ట్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -121 లో...నారాయణతో ప్రతాప్ నువ్వుతు మాట్లాడుతాడు. అప్పుడే చక్రి, కేశవ ఇంటికి వస్తారు. ప్రతాప్ ని అక్కడ చూసి ఇద్దరు షాక్ అవుతారు. అమ్మ మహా అల్లుడు గారు వచ్చాడని ప్రతాప్ అంటాడు. మహా బయటకు వస్తుంది. అల్లుడు గారు నిన్న కలిసినప్పుడు నేను కోపంగా మాట్లాడాను.. తను మాత్రం సౌమ్యంగా మాట్లాడాడు. తన మాటల వల్లే నాలో మార్పు వచ్చిందని ప్రతాప్ అంటాడు. ఆ తర్వాత ప్రతాప్ లోపలికి వచ్చి లలిత వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడతాడు. ఇది ఇల్లు అంటారా. నేను వచ్చేసరికి ఇక్కడ మహా పనిమనిషి లాగా ఇంట్లో బూజు దులుపుతుందని ప్రతాప్ చెప్తాడు. మహా మిమ్మల్ని నమ్మిందా అని లలిత అడుగుతుంది. అది నమ్మడం ఏంటి.. తన దగ్గర నేను ఎలా ఉంటానో అలా ఉన్నానని ప్రతాప్ అంటాడు. మీరు ఎలాగైనా ముందు దాన్ని ఇక్కడికి తీసుకొని రండి తర్వాత చూద్దామని లలిత అంటుంది. మరొకవైపు మాధవ, చక్రి, కేశవ, కన్నా నలుగురు కలిసి అసలు ఆయన ఎందుకు వచ్చాడని అనుకుంటారు. నాకు కొంచెం డౌట్ గానే ఉందని నారాయణ అంటాడు. ఆ తర్వాత నారాయణ, ప్రతాప్ తో కలిసి డ్రింక్ చేస్తాడు. మందు తాగాక అసలు ఆయన ఎందుకు వచ్చాడో చెప్తాడేమోనని నారాయణ అనుకుంటాడు కానీ ప్రతాప్ ఏం చెప్పడు అదంతా కేశవ, చక్రి పక్కన ఉండి చూస్తారు. ఆ తర్వాత ప్రతాప్ భోజనం చేస్తాడు. ప్రతాప్, మహా సరదాగా మాట్లాడుకుంటారు. నేను వెళ్తానని ప్రతాప్ అనగానే ఇంత రాత్రా అని మహా అంటుంది. నా కూతురు అల్లుడిని ఇంటికి తీసుకొని వెళ్తానని ప్రతాప్ అంటాడు. ఇప్పుడు ఎందుకని మహా అంటుంది. నువ్వు మొదటిసారి వచ్చినప్పుడు అవమానం జరిగిందని ప్రతాప్ అంటాడు. ఇప్పుడు రాను నాన్న నా గోల్ కి నేను రీచ్ అయ్యాక వస్తానని మహా అంటుంది. మాధవ వెళ్ళమని చెప్తాడు. దాంతో మహా సరే అంటుంది. ఆ తర్వాత ప్రతాప్ బెడ్ పై పడుకుంటాడు. మహా నేలపై పడుకుంటుంది. అల్లుడుగారు మీరు ఎక్కడ పడుకుంటారని ప్రతాప్ అడుగుతాడు. నేను బయట పడుకుంటానని చక్రి చెప్తాడు. మా నాన్న నాకు పెళ్లి అయిందని అల్లుడుగారు అంటున్నాడు.. కాదని చెప్తే మళ్ళీ తీసుకొని వెళ్లి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు.. ఇప్పుడు అసలు నిజం చెప్పొద్దని మహా అనుకుంటుంది. ఆ తర్వాత ఉదయం ప్రతాప్ వెళ్ళడానికి రెడీ అవుతాడు. చక్రి వచ్చి నేను రావడం లేదు.. మహాలక్ష్మిని కూడా పంపించడం లేదని అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
May 26, 2026 10:15AM.webp)
Jayam serial : సుధా నిజం తెలిసి షాకైన శకుంతల.. బాక్సింగ్ రింగ్లోకి రుద్ర ఎంట్రీ!
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -278 లో.. సుధా గురించి శకుంతలకి తెలియగానే ఇంట్లో అందరిపై శకుంతల కోప్పడుతుంది. ఇంట్లో అందరు నేను చెప్పినట్టు వింటున్నారు అనుకున్నాను కానీ నన్ను మోసం చేస్తున్నారనుకోలేదని శకుంతల కోప్పడి వెళ్తుంది. తన వెనకాలే ప్రీతి వెళ్తుంటే.. వద్దు తనని ఒంటరిగా వదిలేయ్ మని పెద్దసారు అంటాడు. ఆ తర్వాత ఏంటి బ్రో ఇలా జరిగింది.. ఇన్నిరోజులు నీపై అత్తయ్య నమ్మకం పెట్టుకుంది.. అది ఈ రోజుతో పోయిందని వీరుతో ఇషిక అంటుంది. మరొకవైపు గంగ, రుద్ర జరిగిన దాని గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు అత్తయ్యకి వీరుపై కోపంగా ఉంది. ఇంకా కోపం పెంచి అతన్ని అత్తయ్యకి దూరం చేయాలని గంగ అంటుంది. ఇప్పుడు వీరు ఆలోచించేది దాని గురించి కాదేమోనని రుద్ర అంటాడు. మరోవైపు ఇషిక, వీరు ఇద్దరే మాట్లాడుకుంటారు. నేను ఆలోచించేది జరిగింది దాని గురించి కాదు.. విశ్వనాథ్ కూతురు అసలు ఎక్కడ ఉండి ఉంటుంది.. తను తప్పిపోవడానికి వెనకాల ఏదో కుట్ర ఉందని అనిపిస్తుంది.. ఆ అమ్మాయి ఎక్కడుందో కనుక్కోవాలని ఇషికతో వీరు అంటాడు. ఆ తర్వాత ఆ విశ్వ నాథ్ గారి అమ్మాయిని వీరు కంటే ముందు మనం కనిపెట్టాలని గంగ, రుద్ర అనుకుంటారు. విశ్వనాథ్ ఒక స్కెచ్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్లి తన కూతురు చిన్నప్పటి ఫోటో చూపించి ఇప్పుడు ఈ పాప ఎలా ఉంటుందో స్కెచ్ గియ్యమని చెప్తాడు. అందుకు అతను ఒప్పుకుంటాడు. రెండు రోజుల్లో గీసి ఇస్తానని అతను అంటాడు. మరొకవైపు త్వరలో బాక్సింగ్ పోటీ జరుగుతుందని పేపర్ లో చూసి రుద్రకి రంగా చెప్తాడు. ఇక నువ్వు పూర్తిగా బాక్సింగ్ పై శ్రద్ధ పెట్టాలి.. అందుకు కావల్సిన ఫుడ్ ని తీసుకొని వద్దాం పదా అని రుద్ర అంటాడు. రుద్ర, గంగ, రంగా ముగ్గురు కలిసి సూపర్ మార్కెట్ కీ వెళ్లి తనకి కావలసిన డ్రై ఫ్రూట్స్ కోసం చూస్తారు. అక్కడ ప్రమీల విషయంలో కార్తీక్ చూపిస్తున్న ఇంట్రస్ట్ గురించి గంగతో మక్కం చెప్తాడు. అది విని గంగ హ్యాపీగా ఫీల్ అవుతుంది. రుద్రకి చెప్పాలని వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
May 26, 2026 10:12AM.webp)
కామాఖ్యా గుడికి వెళ్లిన శ్రీముఖి అవినాష్!
బుల్లితెర మీద ఏ షో చూసిన హోస్ట్ గా శ్రీముఖినే కనిపిస్తుంది. ఎక్కువగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో చేస్తూ ఉంది. రీసెంట్ గా "మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్" రియాలిటీ షోకి హోస్ట్ గా చేసింది. అవకాశం వస్తే అటు సిల్వర్ స్క్రీన్ మీద కూడా మెరుస్తోంది శ్రీముఖి. అదుర్స్, పటాస్, నేను శైలజ, మేస్ట్రో , భోళా శంకర్ వంటి మూవీస్ లో నటించింది. అలాగే "మా ఇంటి బంగారం" అనే మూవీలో కూడా నటించింది. సమంత నటించిన ఈ మూవీలో శ్రీముఖి కూడా కనిపించబోతోంది. ఈ మూవీ త్వరలో వచ్చే నెలలో రిలీజ్ కాబోతోంది . ఇక శ్రీముఖి రీసెంట్ గా కామాఖ్యా టెంపుల్ కి వెళ్ళొచ్చింది. ఆ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. శ్రీముఖికి కొంచెం దైవ భక్తి కూడా ఎక్కువే. షూటింగ్స్ లో గ్యాప్ దొరికితే అలా టెంపుల్స్ కి వెళ్లి వస్తూ ఆ పిక్స్ ని వీడియోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు కూడా తన ఫ్రెండ్ అవినాష్ తో కలిసి కామాఖ్యా టెంపుల్ కి వెళ్ళింది. సంప్రదాయ రీతిలో ముస్తాబై అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసింది. "జై మా కామాఖ్యా" అంటూ ఒక టాగ్ లైన్ కూడా పెట్టుకుంది. ఇక నెటిజన్స్ ఐతే ఫుల్ ఫిదా ఐపోతున్నారు. "కామాఖ్యా టెంపుల్ కి వెళ్తే పెళ్లి కానీ వారికి పెళ్లి అవుతుంది అంట. సో శ్రీముఖికి తొందర్లో పెళ్లి అవుతుంది అని అనిపిస్తుంది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
May 25, 2026 4:00PM.webp)
నేనే నా అర్ధాంగి ప్రశ్నకు నవదీప్ అదిరిపోయే రిప్లై!
నవదీప్ పేరుకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరమే లేదు. సిల్వర్ స్క్రీన్ మీద తనకంటూ ప్రూవ్ చేసుకున్నాడు. చాలామూవీస్ లో మర్చిపోలేని రోల్స్ లో నటించాడు. ఇక స్మాల్ స్క్రీన్ మీద బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోకి జడ్జ్ గా వచ్చి తిరుగులేని పేరు తెచ్చుకున్నాడు. ఇక నవదీప్ ఇప్పుడు మాస్ జాతర కామెడీ షోకి జడ్జ్ గా ఉన్నాడు. ఇక రకరకాల ప్లేసెస్ కి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. రీసెంట్ గా ఒక బైక్ వేసుకుని ఒక బ్రిడ్జి మీద రైడ్ చేసి ఆ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. దానికి మాములుగా రాలేదు కామెంట్స్ . ఇంతకు ఆ బ్రిడ్జి గురించి చెప్పాలంటే నేపాల్లోని పర్బత్ , బగ్లుంగ్ జిల్లాల్లో ఉన్న కుష్మా సస్పెన్షన్ బ్రిడ్జ్ ప్రాంతం ప్రత్యేకంగా గండకి గోల్డెన్ బ్రిడ్జ్ లేదా కుష్మా-బలేవా బ్రిడ్జ్ అని పిలుస్తారు. ఈ బ్రిడ్జి మీద నవదీప్ చేసిన రైడ్ చూసిన ఒక నెటిజన్ "ఇండియన్ టామ్ క్రూజ్" అని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇక రీసెంట్ గా జిమ్ చేస్తూ ఉన్న ఒక బ్లాక్ అండ్ వైట్ వీడియోని పోస్ట్ చేసాడు. దానికి ఒక కొంటె కామెంట్ కూడా వచ్చింది. దాన్ని కూడా నవదీప్ పోస్ట్ చేసాడు. "మీరు ఇంత మంచిగా బాడీని మెయింటైన్ చేస్తున్నారు. మీ వైఫ్ ఉంటేనే కదా ఆ బాడీకి అర్ధం. తిట్టుకోకండి" అనే సరికి నవదీప్ కూడా ఇంకా కొంటె రిప్లై పెట్టాడు. "నేనే నా అర్ధాంగి" అన్నాడు. ఇక నవదీప్ నటించిన దండోరా, న్యూసెన్స్ మోవీస్తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు.
May 25, 2026 3:07PM.webp)
ఎవరు అందాల బుట్టబొమ్మ సెన్సేషన్ అవుతున్న డ్రామా జూనియర్స్ మెంటార్!
ప్రత్యూష పనస ఈమె డ్రామా జూనియర్స్ సీజన్ 9 కి మరో మెంటార్ గా ఉన్నారు. ఈమె హైదరాబాద్ లో ఉంటూ ఇంటరెస్టింగ్ కంటెంట్ మీద రీల్స్, వీడియోస్ చేస్తూ అప్ డేట్ చేస్తూ ఉంటారు. ఈమె ఫ్యాషన్, లైఫ్స్టైల్ క్రియేటర్ గా ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో ఈమెకు సుమారు సుమారు 1 మిలియన్ వరకు ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె తన ఫ్యాషన్, లైఫ్స్టైల్, ట్రెండీ అవుట్ ఫైట్స్ అంటే ముఖ్యంగా హాఫ్ శారీ లుక్స్ తో ఎక్కువగా ఫోటోలను షేర్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఫ్యాషన్కు సంబంధించిన ప్రమోషన్స్ , కొలాబరేషన్స్ ఎక్కువగా చేస్తుంటారు. అంతే కాదు పాపులర్ సాంగ్స్ కి రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో బాగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఇన్స్టాగ్రామ్ లో ఈమె లంగా వోణి రీల్స్ కి క్యూటీ, బుజ్జితల్లి, చిన్నపిల్లలా ఉన్నావ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఈమె అచ్చమైన పదహారణాల తెలుగింటి పిల్లల కనిపిస్తుంది అంటూ ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కో రీల్ కి లక్షల్లో వ్యూస్ వస్తూ ఉంటాయి..
May 25, 2026 2:35PM
ప్లీజ్ మా ఇంటి దగ్గరకు ఎవరూ రాకండి!ఆదిరెడ్డి అసలేమైందంటే?
బిగ్ బాస్ రివ్యూస్ చెప్తూ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ ఐన వ్యక్తి ఆదిరెడ్డి. ఈ రివ్యూస్ తో పాపులర్ కావడంతో బిగ్ బాస్ సీజన్ 6 కి హౌస్ లోకి వెళ్ళాడు. అక్కడ టాస్కులు ఆడి టాప్ 5 లో నిలబడ్డాడు. ఆదిరెడ్డి భార్య కవితతో కలిసి ఇష్మార్ట్ జోడికి వెళ్లి టాస్కులు ఆడి ఇంకా ఫేమస్ అయ్యాడు. అలాంటి ఆది రెడ్డి రీసెంట్ గా ఒక ఇంటరెస్టింగ్ పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసాడు. "ప్లీజ్ మా ఇంటి దగ్గరకు ఎవరూ రాకండి . ఫండ్ రైజింగ్ కోసం హెల్ప్ కోసం కూడా దయచేసి ఎవరూ రావొద్దు. చాలా ప్రాబ్లంగా ఉంటోంది. రోజూ వస్తున్నారు. నేను ఇంకా వీడియోస్ చేస్తే ఇంకా ఎక్కువ వస్తారు అందుకే చేయలేకపోతున్నాను. ప్రెజెంట్ మన హౌస్ అందరికీ తెలుసు. అందుకే వస్తున్నారు. ఒకప్పుడు హౌస్ తెలీనప్పుడు చాలా వీడియోస్ చేసాను కానీ ఇప్పుడు చాలా చాలా ప్రాబ్లమ్ గా ఉంటోంది. సో ప్లీజ్ అలా ఎవరూ రాకండి ప్లీజ్ ప్లీజ్. ఈ మధ్య కాలంలో పేషెంట్స్ ని కూడా తీసుకుని కూడా వస్తున్నారు. ప్లీజ్ అది చాలా బాధగా ప్రాబ్లమ్ గా ఉంటుంది. అర్ధం చేసుకోండి ప్లీజ్. " అంటూ ఒక ఇన్స్టాగ్రామ్ స్టేటస్ పెట్టాడు. ఇక ఆదిరెడ్డి సోషల్ మీడియా కంటెంట్ చేస్తూ మరో వైపు బిజినెస్ చేస్తూ ఉంటాడు.
May 25, 2026 2:22PM.webp)
బిగ్ బాస్ షో ఎప్పుడుంతే!
బుల్లితెర మీద చాలా షోస్ పూర్తైపోయాయి. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ మొదలుకావడానికి సిద్ధమైపోయింది. ఐతే గత సీజన్ నుంచి అంటే బిగ్ బాస్ సీజన్ 9 నుంచి చూస్తే కామన్ పీపుల్ కోసం బిబి అగ్ని పరీక్షా పేరుతో ముందుగా ఫిల్టరేషన్ ప్రాసెస్ ఒక దాన్ని నడిపిస్తున్నారు. అందులో ఫైనల్స్ కి వెళ్ళేవాళ్ళను మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 లేటెస్ట్ అప్ డేట్స్ ని మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి ఇస్తున్నాడు. ఐతే కొత్త బిగ్ బాస్ సీజన్ కి "ప్లే లైక్ ఇంకాగ్నిటో" బిగ్ బాస్ లోకి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోందంటూ చెప్పుకొచ్చాడు. జూన్ మొదటి వారంలో అంటే జూన్ 7 లేదా 8 తేదీల్లో అగ్నిపరీక్ష 2 ప్రోమో రిలీజ్ కాబోతోంది అంటే బిగ్ బాస్ కి ఎలా అప్లై చేసుకోవాలనే రూల్స్ అందులో ఉండబోతున్నాయట. ఇక లాస్ట్ సీజన్ లో కామన్ పీపుల్ ని చాలా మందిని సెలెక్ట్ చేశారు. ఇక సీజన్ 1 విన్నర్ గా శివ బాలాజీ, సీజన్ 2 లో కౌశల్ మందా, సీజన్ 3 లో రాహుల్ సిప్లిగంజ్, సీజన్ 4 లో అభిజిత్, సీజన్ 5 లో విజె సన్నీ, సీజన్ 6 లో రేవంత్, సీజన్ 7 లో పల్లవి ప్రశాంత్, సీజన్ 8 లో నిఖిల్ మలయక్కల్, సీజన్ 9 లో కళ్యాణ్ పడాల టైటిల్స్ ని గెలిచారు. ఈ 9 సీజన్స్ లో ఇద్దరు మాత్రమే కామన్ మ్యాన్ క్యాటిగరీలో వచ్చి టైటిల్ ని గెలుచుకున్నారు.
May 25, 2026 12:25PM.webp)
అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీకి సెలెక్ట్ ఐపోయిన ముస్కాన్!
జీ తెలుగులో డ్రామా జూనియర్స్ సీజన్ 9 స్టార్ట్ ఐపోయింది. ఇక ఇందులో వస్తున్న చిన్నారుల్ని చూస్తుంటే వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తున్న స్కిట్స్ , చెప్తున్నా డైలాగ్స్ వింటుంటే వామ్మో వీళ్ళు పిల్లలా పిడుగులా అన్నట్టుగా ఉన్నారు. ఇక ముందుగా తేజస్విని - ముస్కాన్ అనే ఇద్దరు చిన్నారులు అనంతపురం నుంచి డ్రామా జూనియర్స్ కి వచ్చి సెలెక్ట్ అయ్యారు. ఇందులో ముస్కాన్ చేసిన కామెడీ తిప్పిన మూతి, చెప్పిన డైలాగ్స్ మాములుగా లేదు. రోజా అక్క అంటూ శ్రీకాంత అన్న అంటూ అనిల్ మామ అంటూ అందరినీ ఆట పట్టించింది. ఇక ఈ ఇద్దరు చిన్నారులు సుధీర్ మీద పడ్డారు. నువ్వు ముందు యాంకరింగ్ చేసి చావు అంటూ అరిచారు. ఇక ముస్కాన్ చేసిన హడావిడికి అనిల్ రావిపూడి ఫుల్ ఫిదా ఇపోయారు. "ముస్కాన్ నీ టైమింగ్ చాలా బాగుంది, నీ ఓవర్ యాక్షన్ బాగుంది , నీ బిల్డప్ బాగుంది." అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. దాంతో థ్యాంక్యూ అంటూ చెప్పేసరికి ఇది లేడీ దేవానంద్ అయ్యా అంటూ అనిల్ అనేసారు. ఇక రోజా జడ్జ్మెంట్ ఇచ్చారు "చాలా క్యూట్ ఉన్నావ్ రా ముస్కాన్. పిట్టా కొంచెం కూత ఘనం" అన్నారు. ఇంతలో సుధీర్ "మాములుగా రోజా గారు అందరినీ సీరియస్ గా చూడడం చూసాను రోజా గారినే సీరియస్ గా చూస్తోంది" అంటూ కామెంట్ చేసాడు. దాంతో అనిల్ రావిపూడి "ముస్కాన్ మినీ రోజా కూడా " అన్నారు. ఇక శ్రీకాంత్ జడ్జ్మెంట్ చెప్తూ "ముస్కాన్ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే అనిల్ మాత్రం నెక్స్ట తన సినిమాలో అవకాశం ఇచ్చేస్తాడు" అన్నారు. "ఇచ్చేసినట్టే..లేదంటే అది వచ్చి కొట్టేలా ఉంది" అన్నారు అనిల్ రావిపూడి. ఇక ముస్కాన్ ఇప్పుడు 2 వ తరగతికి వెళ్తున్నట్టు చెప్పింది. ఇలా షోలోకి ఎంట్రీ ఇచ్చిందో లేదో అప్పుడే అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీలోకి సెలెక్ట్ ఐపోయింది.
May 25, 2026 10:41AM.webp)
విష్ణు ప్రియకు ఫారెన్ సంబంధాలు!
జీ తెలుగులో ప్రసారమవుతున్న ఫామిలీ అసెంబ్లీ షోలో విష్ణుప్రియ - రోజా కంబినేషన్ ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ అవుతున్నారు. ఇక ఈ వారం ఎపిసోడ్ లో విష్ణు ప్రియా నాకు పెళ్లి కావాలి అంటూ రోజాని తెగ సతాయించింది."మీకు నా ప్రాబ్లమ్ చెప్పుకుందామని వస్తే" అంటూ విష్ణుప్రియ తెగ నాంచింది. దాంతో రోజా ఏంటా ప్రాబ్లమ్ చెప్పు అన్నారు. "నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను" అంది విష్ణుప్రియ. "ఇలా ఒంటెలా ఉంటే అలా ఒంటరిగానే మిగిలిపోతారు. ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావ్ " అన్నారు రోజా. "నాకు మాత్రం సెక్యూరిటీ కావాలి కదా మేడం. ఇంట్లో దొంగలు పడ్డారు మేడం " అంది విష్ణుప్రియ. "సెక్యూరిటీ ఎందుకు. కుక్కల్ని పెంచుకోవచ్చుగా " అన్నారు. "కుక్క ఉంది జాగ్రత్త అని బోర్డు కూడా పెట్టాను " అంది. "ఐతే వెంటనే ఆ బోర్డు మార్చి కుక్కలున్నాయి జాగ్రత్త " అని పెట్టు అన్నారు. "నాకు ఉంది ఒక కుక్కే మేడం కుక్కలున్నాయి అని ఎందుకు" అంటూ అడిగింది. "ఉన్నాయ్ నీకు తెలీదు. నువ్వు అరిస్తే వెళ్లిపోతాయి" అంటూ రోజా కామెడీ చేసారు. "మేడం అసలు నా ఫాలోయింగ్ మీకు అర్ధం కావట్లేదు. ఫారెన్ నుంచి సంబంధాలు వస్తున్నాయి. ఒకతను ఐతే నిన్నే పెళ్లిచేసుకుంటా అని నాకు మెయిల్ చేస్తున్నాడు " అంది. "నువ్వు మేల్ అని తెలీక నీకు మెయిల్ చేసి ఉంటాడు" అంది. అంతే విష్ణుప్రియ షాకైపోయింది. "నాకు మాత్రం నా చేయి ఇలా పట్టుకుని అక్కడ చుక్క చూపిస్తాడని ఆశ ఉండదా మేడం " అంది. "నీకు ఒక చుక్క చూపిస్తే నువ్వు 100 చుక్కలు చూపిస్తావని వాడికి భయం " అన్నారు. "నాకు మాత్రం ఏడడుగులు వేయాలని ఆశ ఉండదా మేడం " అంది. "నీతో ఏడడుగులు వేస్తె నువ్వు 70 అడుగుల లోతుకు తొక్కేస్తావని వాడికి తెలీదా" అన్నారు.
May 25, 2026 10:22AMకూతురు బాక్సింగ్ ఛాంపియన్ అయితేనే క్షమిస్తానన్న విశ్వ.. శకుంతల, పెద్దసారు మధ్య గొడవ!
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్- 277లో.. విశ్వ ఇంటికి వీరు, రుద్ర, గంగ, రంగ, పెద్దసారు వెళ్తారు. సుధాకి ఆవకాయ పచ్చడి ఇచ్చి బయటకు వస్తుంటే బయట కార్ లో ఉన్న శకుంతల చూస్తుంది. ఇంటికి పోనియ్ సూర్య అని కోపంగా శకుంతల అంటుంది. ఇక ఇంటికి వెళ్ళి సీరియస్ గా కూర్చుంటుంది శకుంతల. ఇక మరోవైపు విశ్వని కార్ లో పైడిరాజు తీసుకెళ్తుంటాడు. కార్ ఆపమని విశ్వ అంటాడు. నాకు ఎందుకు అబద్ధం చెప్పావ్ అని విశ్వ అడుగుతాడు. అదేంటి సర్ అని పైడిరాజు అడుగగా నువ్వు జాయిన్ అయ్యేటప్పుడు నీ డ్రైవింగ్ లైసెన్స్ ని చూసాను కానీ నువ్వు ఎక్స్పైరీ అయిపోయిందని అబద్ధం చెప్పావ్ అంటే నాకు నచ్చని వ్యక్తులు ఎవరో నా ఇంటికి వచ్చారు ఎవరని పైడిరాజుపై విశ్వ ఫైర్ అవుతాడు. గంగ, రుద్ర సర్ అని పైడిరాజు అంటాడు. మళ్ళీ అబద్ధం చెప్తున్నావ్.. వాళ్ళిద్దరూ వస్తే నేను ఏం అనను అని నీకు తెలుసు.. చెప్పు ఎవరొచ్చారని గట్టిగా అడిగేసరికి సుధా వాళ్ళ అన్నయ్య గారు వచ్చారని పైడిరాజు చెప్పగానే విశ్వ షాక్ అవుతాడు. నేను లేను సమయం చూసి కలుసుకుంటున్నారా అని విశ్వ అనగానే ఎంతైనా వాళ్ళిద్దరూ అన్నాచెల్లెల్లు కదా.. ఆ రక్తసంబంధం వచ్చేంతవరకు ఉంటుందని పైడిరాజు అంటాడు. నీకు వాళ్ళ గురించి తెలియదు.. నా ప్రేమని అవమానించారు.. నన్ను తక్కువ చేసి మాట్లాడారు.. నేనెందుకు పనికి రాను అన్నట్టుగా మాట్లారు అంటూ తన గతాన్ని చెప్తాడు విశ్వ. ఇక లాభం లేదు.. వైజాగ్ నుండి వెళ్ళిపోవాలని విశ్వ అంటాడు. మీ కూతురు దొరికితే సంతోషంగా ఉంటారా అని పైడిరాజు అనగానే ఉండను .. వాళ్ళకి ఇంకా దూరం చేస్తానని విశ్వ అంటాడు. అదే మీ కూతురు మీలాగే బాక్సింగ్ ఛాంపియన్ అవుతే ఏం చేస్తారని పైడిరాజు అంటాడు. అప్పుడు నేను వెళ్ళి క్షమించమని అడిగి, సుధాని తనని కలుపుతానని విశ్వ అంటాడు. అయితే ధీరజ్ మీద గంగ గెలిస్తేనే అలా చేస్తానని పైడిరాజుతో విశ్వ అంటాడు. మరోవైపు గంగ, రంగా, రుద్ర, వీరు, పెద్దసారు బయట వెయిట్ చేస్తుంటారు. మీ అత్తయ్య ఫుల్ ఫైర్ లో ఉంది వీరు.. ఫస్ట్ మీరంతా వెళ్ళండి.. నేను తర్వాత వస్తానని పెద్దసారు అనగానే మీరు తప్పించుకుంటారా అని రంగా అంటాడు. మాకు తిట్లు పడతాయి కదా పెద్దోరు అని గంగ అనగానే సరే అయితే ఫస్ట్ రుద్ర, గంగ వెళ్తారు. తర్వాత వీరు వెళ్తాడు.. తర్వాత నేను వస్తానని పెద్దసారు అనగానే మొదటగా గంగ,రుద్ర లోపలికి వచ్చి.. అమ్మగారు నేను అమ్మనాన్నలని చూడటానికి వెళ్ళానని గంగ అంటుంది. నేను గంగని తీసుకుని రావడానికి వెళ్ళానని రుద్ర అంటాడు. మిమ్మల్ని నేనేం అడుగలేదు.. అడుగను.. నా వాళ్ళని మాత్రమే అడుగుతాను. నా భర్తని మాత్రమే అడుగుతానని శకుంతల అంటుంది. ఇక తర్వాత పెద్దసారు వస్తాడు. ఏంటి మీరంతా ఇక్కడున్నారు.. ఎవరికి ఏం పనులు లేవా.. వెళ్ళండి వెళ్ళండి ఎవరి పనులు వారు చూస్కోండి అని పెద్దసారు అనగానే ఆగండి అందరు.. మీ నాటకం బయట పడుతుందని అందరిని పంపిస్తున్నారా అని శకుంతల అంటుంది. నాటకమేంటి అని పెద్దసారు అనగానే మీరు సుధా దగ్గరకి ఎందుకు వెళ్ళారని శకుంతల అడుగుతుంది. ఈ ఇంట్లో మొదటిసారి ఆవకాయ పచ్చడి పెట్టాం కదా.. ఆడపడుచుకి ఇస్తే ఇంటికి మంచిది అని సుధాకి ఇవ్వాడానికి వెళ్ళానని పెద్దసారు చెప్తాడు. అంటే నా మాట కాదని వెళ్ళారు.. మీరంతా నన్ను మోసం చేసి సుధా దగ్గరికి వెళ్ళారు.. మీరంతా నా కుటుంబం అనుకున్నాను కానీ నా తమ్ముడి చావుకి కారణం అయిన దాని దగ్గరికి వెళ్ళారు. అది చస్తే బాగుండు అని శకుంతల అంటుంది. శకుంతలా.. మాటలు జాగ్రత్త.. తను ఈ ఇంటి ఆడపడుచు.. ఎంత కోపం ఉన్నా ఒకరి చావు కోరుకోకూడదని పెద్దసారు ఫైర్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
May 24, 2026 10:59AMడైనింగ్ టేబుల్ దగ్గర పెద్ద రచ్చ.. దీపను కూతురిలా అక్కున చేర్చుకున్న సుమిత్ర!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -678 లో......అందరం భోజనం చేద్దాం పదండి అని శివన్నారాయణ అనగానే దీప, బావ మనతో భోజనం చెయ్యడం నాకు ఇష్టం లేదని జ్యోత్స్న అంటుంది. ఎందుకే మమ్మల్ని ఇంకా పని వాళ్ళలాగే చూస్తున్నావా అని కాంచన అంటుంది. ఇది నా తాత ఇల్లు నాకు నచ్చిన దగ్గర భోజనం చేస్తానని కార్తీక్ అంటాడు. అవును నువ్వు నా కొడుకు కూతురివి.. కార్తీక్ నాకు కూతురి కొడుకు.. నాకు ఇద్దరు సమానమే ఏదైనా ఉంటే మీరు ఆఫీస్ లో చూసుకోండి అని జ్యోత్స్నతో శివన్నారాయణ కోప్పడతాడు. ఆ తర్వాత అందరు భోజనం చేస్తారు. శౌర్య తనకి రసం కావాలని అంటుంది. ఇంట్లో చాలీచాలని కూరలతో తింటారు కదా అని జ్యోత్స్న వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతుంది. తనకి కార్తీక్ మంచి కౌంటర్ ఇస్తాడు. మరొకవైపు కాశీ రెడీ అవుతుంటే స్వప్న వెనకాల నుంచి వెళ్ళి హగ్ చేసుకుంటుంది. ఇద్దరు సరదాగా కాసేపు మాట్లాడుకుంటారు. మరొకవైపు జ్యోత్స్న భోజనం చేసి కోపంగా అక్కడ నుంచి వస్తుంటే దీప తన వెనకాలే వచ్చి ఏంటి బుజ్జమ్మ అని జ్యోత్స్న బుగ్గగిల్లుతుంది దీప. ఏంటి ఇంత గట్టిగా గిల్లావని జ్యోత్స్న అంటుంది. నీలాగా సుకుమారంగా పెరగలేదు కదా అందుకే నా చేతులు ఇలా ఉంటాయని దీప అంటుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. ఇక దీప, కార్తీక్ ఇద్దరు కలిసి జ్యోత్స్నని ఒక ఆట ఆడుకుంటారు. ఇద్దరు ఒకేసారి జ్యోత్స్న చెంపగిల్లుతారు. ఆ తర్వాత శివన్నారాయణ, కార్తీక్, దశరథ్ ఒక గదిలో పడుకుంటారు. సుమిత్ర గదిలో దీప పడుకుంటుంది. నేలపైన చాప వేస్తుంది. కింద ఎందుకు పైన పడుకోమని సుమిత్ర అంటుంది. శౌర్య, సుమిత్ర ఒళ్ళో పడుకుంటుంది. నువ్వు కూడా నా ఒళ్ళో పడుకో దీప.. నీకు అమ్మ అనుకోని పడుకోమని సుమిత్ర అనగానే దీప ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
May 24, 2026 9:22AMగూడు చెదిరిన పక్షుల్లా నా పిల్లలు వెళ్ళిపోతారా? ఎమోషనల్ అయిన రామరాజు!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu ). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-479 లో.. సుకన్య చేసిన పనికి భాగ్యం తనని కొడుతుంది. ఎందుకలా కొడుతున్నావని సుకన్య అడుగగా ఆ నర్మద వాళ్ళని బయటకి పంపించడానికి నేను ప్లాన్ చేస్తే నువ్వేమో వాళ్ళని ఇదే ఉండేలా ప్లాన్ చేస్తావా అని భాగ్యం తిట్టగానే తనని వల్లి ఆపుతుంది. ఇక తర్వాత ప్లాన్ చెప్తుంది. ఇకనుండి ఆ నర్మదకి కంట్లో నుండి నీళ్ళు తప్పా.. నోట్లో నుండి మాట బయటకు రాదని వల్లి అనగానే భాగ్యం, ఆనందరావు, సుకన్య హ్యాపీగా ఫీల్ అవుతారు. రామరాజు ఒంటరిగా కూర్చొని కుటుంబం గురించి ఆలోచిస్తూ ఎమోషనల్ అవుతాడు. అప్పుడే అక్కడికి వేదవతి వస్తుంది. ఎందుకండి ఇలా బాధపడుతున్నారని అడుగుతుంది. అందరు కలిసి ఉండాలని అనుకున్నా కానీ ఇలా జరుగుతుందని రామరాజు అంటాడు. ఏం కాదులేండి అన వేదవతి అనగానే ఇందాక మీ అక్కయ్య , అన్నయ్య మీ కొడుకులే నీకు శత్రువులు అని అన్నారు.. గూడు చెదిరిపోగానే పక్షులన్నీ ఎగిరిపోయినట్టు నా పిల్లలు నన్ను వదిలేసి వెళ్ళిపోతానని అన్నారు.. నా బతుకే కాదు నా చావు కూడా అనాధగా ముగిసిపోతుందని అన్నారు. ఆ మాట ఎక్కడ నిజమవుతుందోనని భయంగా ఉందని రామరాజు అంటుంటే అలా మాట్లాడకండి అంటూ వేదవతి ఎమోషనల్ అవుతుంది. ధీరజ్, ప్రేమ ఇద్దరు మాట్లాడుకుంటారు . ఈ ఇల్లుకి ఏదో మబ్బు కమ్మేసినట్టుంది. అందుకే ఈ గొడవలు అని ప్రేమ బాధపడుతుంది. అవన్నీ తొలగిపోయి ఈ ఇంట్లో అందరు సంతోషంగా ఉండేలా చేస్తానని ధీరజ్ అంటాడు. మరోవైపు సాగర్.. అది జరగదని అంటాడు. పిచ్చోడిలా మాట్లాడకు సాగర్, నువ్వు తాళి కట్టావ్ కాబట్టి సరిపోయింది లేదంటే నీ చెంపపగులగొట్టేవాడిని అని నర్మద అనగానే సాగర్ షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావని సాగర్ అనగానే ఎంతసేపు వెళ్ళిపోవాలనే ఆలోచిస్తున్నావ్ కానీ వెళ్ళాక ఎలా ఉంటావ్.. అయిన వాళ్ళు లేకుండా ఎలా సంతోషంగా బ్రతుకుతావ్.. బయటకు వెళ్ళాక మళ్ళీ తిరిగి రాగలవా అని నర్మద అనగానే అదే వద్దు అని అంటున్నా.. అమూల్య పెళ్ళి తర్వాత మనం వెళ్ళిపోదామని సాగర్ అనేసి వెళ్ళిపోతాడు. మరోవైపు రామరాజు బాధపడుతుంటాడు. అమూల్యని కాలేజీలో విశ్వ అవమానిస్తాడు. అది తల్చుకొని అమూల్య కంగారుపడుతుంది. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే ఆ విశ్వ గాడిని చంపేస్తారని అమూల్య అనుకుంటుంది. అదే సమయంలో విశ్వ హ్యాపీగా మందు కొడుతూ అమూల్య గురించి ఆలోచిస్తాడు. మరుసటి రోజు నర్మద, వేదవతి ఇద్దరు గీతకి చెరోవైపు ఉండి మాట్లాడుకుంటారు. ఓయ్ గవర్నమెంట్ కోడలా ఏంటి ఇది అని అడుగుతుంది వేదవతి. గీత అని నర్మద అనగానే ఆల్రెడీ మండుతుంది. ఇంకా పెట్రోల్ పోయకు అని వేదవతి అనగానే నాకు కూడా అలాగే ఉంది అని నర్మద అంటుంది. ఏంటి వాడు అలా చేస్తున్నాడని వేదవతి అనగానే నా భర్త కంటే ముందు నీ కొడుకు అని నర్మద అంటుంది. ఇక ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంటే అప్పుడే ధీరజ్ వచ్చి ఆపుతాడు. ప్రేమ వచ్చి నర్మదని హగ్ చేసుకొని ఎప్పటిలాగే సరదాగా మాట్లాడుకుంటారు. అది చూసిన శ్రీవల్లి, సుకన్య ఓర్బలేకపోతారు. ఇక వల్లి వచ్చి.. ప్రేమ నువ్వేం చేస్తున్నావ్ గీత ఎందుకు దాటావని అంటుంది. మామయ్యని మళ్ళీ మాటలు అనిపించడానికే ఇలా చేస్తున్నావా అని వల్లి అనేటప్పడే రామరాజు వస్తాడు. ఇంకోసారి ఇలా చేయకమ్మా అని ప్రేమతో అనేసి రామరాజు వెళ్తాడు. ఇక సుకన్య, వల్లి ఇద్దరు హైఫై ఇచ్చుకుంటారు. అది చూసిన నర్మద.. మీ ఇద్దరిని చూస్తే ఏదో డౌట్ గా ఉందని, అదే కన్ఫమ్ అయితే మీకు మాములుగా ఉండదని అంటుంది. దాంతో ఇద్దరు టెన్షన్ పడతారు. వల్లి వదిన జాగ్రత్త.. నర్మద వదిన ఎంత మంచిదో అంత గయ్యాలీ.. తేడా వస్తే తాట తీస్తుందని ధీరజ్ అంటాడు. దాంతో అదేం లేదని వల్లి, సుకన్య అంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
May 24, 2026 9:00AM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com








