.webp)
నాగార్జున అగ్నిపరీక్ష-2 వెనుక అసలు ప్లాన్ ఇదేనా!
తెలుగు బుల్లితెర పై ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కి రంగం సిద్దమయ్యింది. లాస్ట్ సీజన్లో మాదిరిగానే ఈసారి కూడా "అగ్నిపరీక్ష" ద్వారా కామన్ మ్యాన్ ఇంట్లోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తున్నారు.జూన్ 12 నుంచి జూన్ 20 వరకు అగ్నిపరీక్ష కోసం ఆడిషన్ వీడియోలను పంపాలని బిగ్ బాస్ టీమ్ వెల్లడించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రోమోలో హోస్ట్ నాగార్జున అక్కినేని మాట్లాడుతూ "జీవితంలో అద్భుతాలు సాధించేందుకు సామాన్యులకు కొన్ని అవకాశాలే వస్తాయి. అలాంటి అవకాశం మళ్లీ మీ ముందుకు వచ్చింది.. అదే బిగ్ బాస్ అగ్నిపరీక్ష-2" అని హీరో అండ్ హోస్ట్ నాగ్ చెప్పడం ఆడియన్స్ లో ఒక హైప్ ని క్రియేట్ చేసింది. గత సీజన్ నుంచి స్టార్ట్ చేసిన అగ్నిపరీక్ష కాన్సెప్ట్ మంచి ఆదరణ పొందింది. వేలాది మంది దరఖాస్తు చేసుకోగా, చివరకు కొద్దిమందికే బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లే అవకాశం లభించింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్ వంటి కంటెస్టెంట్లకు విశేషమైన గుర్తింపు లభించింది. సెలబ్రిటీ కంటెస్టెంట్లతో సామాన్యుల మధ్య జరిగిన పోటీ గత సీజన్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దీంతో ఈసారి అగ్నిపరీక్షపై మరింత ఆసక్తి నెలకొంది. ఇప్పటికే బిగ్ బాస్ 10లో పాల్గొనే అవకాశం ఉన్న పలువురు ప్రముఖుల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా నిఖిల్ , పల్లవి గౌడ, తేజస్విని గౌడ , పల్లవి రామిశెట్టి, హరి వీళ్లంతా కుక్కు విత్ జాతిరత్నాలు, ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో ప్రస్తుతం చేస్తున్నారు. వీళ్లంతా వేళ్ళ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరిలో ఎవరెవరు ఫైనల్ లిస్ట్ లో ఉంటారు అనేది చోటు దక్కించుకుంటారో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇంటరెస్ట్ , టాలెంట్ , యూనిక్ క్వాలిటీ ఉన్నవాళ్లకు నిజంగా ఇదొక మంచి అవకాశం కూడా. మరి ఈసారి కామన్ మ్యాన్ క్యాటిగరీలో ఎంత మంది వెళతారో ఎలా అలరిస్తారో చూడాలి.
Jun 13, 2026 11:01AM.webp)
Godhavari : నందు పెళ్లి కోసం జానూ సాహసం.. సూర్యతో బైక్ జర్నీలో ఊహించని ట్విస్ట్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -29 లో..... పెళ్లి సంబంధం వద్దని అరవింద్ వాళ్ళు చెప్పడం.. మేము పెళ్లి చెయ్యలేమని అనుకుంటున్నారా చేస్తాం.. తోట కూడా ఇస్తామని జానూ చెప్తుంది. తోట ప్రాబ్లమ్ లో ఉందని సింహాద్రి అంకుల్ చెప్పాడని అరవింద్ చెప్పగానే.. మీరు అమెరికా వెళ్ళడానికి పది రోజులు టైమ్ ఉంది కదా ఆ లోపు తోట రిజిస్ట్రేషన్ పేపర్స్ మీకు ఇచ్చి పెళ్లి జరిపిస్తానని వాళ్లకి జానూ చెప్తుంది. ఆ తర్వాత సూర్య బైక్ పై జానూ వెళ్తు.. నా ఫ్రెండ్ అలాంటి వాడు.. ఇలాంటి వాడు అని బిల్డప్ ఇచ్చావని సూర్యని జానూ తిడుతుంది. ఏంటండి అలా అంటున్నారని సూర్య అంటాడు. అప్పుడే బండి ఆగిపోతుంది. అమ్మాయి బండి ఎక్కినప్పుడు బండిలో పెట్రోల్ ఉందో లేదో చూసుకోవాలి కదా అని జానూ అంటుంది. నా బైక్ ఎక్కింది నా లవర్ అయితే అన్నీ చెక్ చేసుకునే వాడిని కానీ నువ్వు కాదుగా అని సూర్య అంటాడు. ఆ తర్వాత జానూ బైక్ మీద కూర్చొని ఉంటుంది. సూర్య బండి తోసుకుంటూ వెళ్తాడు. కాసేపటికి జానూ ఇంటికి వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళావ్ .. ఏంటే నీ బోడి పెత్తనాలు.. ఇప్పుడు పెళ్లి వాళ్ళింటికి వెళ్లడం అవసరమా అని జానూపై శారద కోప్పడుతుంది. ఏంటి జాను పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళావా.. నా పెళ్లి గురించి మాట్లాడడానికి వెళ్ళావా అని నందు ఎక్సైట్ అవుతుంది. ఏమన్నారే చెప్పు నువ్వు వెళ్తున్నానని చెప్తే నేను వచ్చేదాన్ని కదా అని నందు అంటుంది. అక్కడ జరిగింది మొత్తం జానూ చెప్తుంది. అక్కడే మురళి కూడా ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jun 13, 2026 10:31AM.webp)
Brahmamudi : రేఖ కుతంత్రాన్ని తిప్పికొట్టిన రాజు.. ఇందు వేలిముద్ర పడకుండా ఆపగలిగాడా?
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1057 లో.... రాజు, శేషు కలిసి డ్రింక్ చేస్తారు. ఆ తర్వాత అందరికి ఇందు భోజనం సిద్ధం చేస్తుంది. అందరిని పిలుస్తుంది. అప్పుడే రేఖ డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి ఇందుని సంతకం పెట్టమని చెప్తుంది. ఇందు ఆ పేపర్స్ చూస్తుంది. చదివితే వాళ్లకి డౌట్ వస్తుందేమోనని సైలెంట్ గా ఉంటుంది. అమ్మ ఇందు నువ్వు సీఈఓ కదా కనీసం ఎవరైనా డాక్యుమెంట్స్ ఇచ్చినప్పుడు చదివినట్లు అయిన యాక్టింగ్ చెయ్యమని శేషు చెప్తాడు. అదంతా ఏం అవసరం లేదు.. ముందు సంతకం పెట్టమని రేఖ అంటుంది. వద్దు ముందు చదువుతున్నట్లు ఉండడం ప్రాక్టీస్ చెయ్యాల్సిందేనని శేషు అంటాడు. దాంతో ఇందు పేపర్స్ లో ఉన్నది చదువుతుంది. ఇప్పుడు సంతకం పెడితే కంపెనీకి నష్టం వస్తుంది.. అంతేకాకుండా ప్రాబ్లమ్ లో పడుతుందని ఇందు అనుకుంటుంది. ఏంటమ్మా ఇందు ఏదో పేపర్లు తిప్పి అందులో తప్పు ఇన్ఫర్మేషన్ ఉన్నట్లు మొహం అలా పెట్టావని శేషు అడుగుతాడు. ఇప్పుడు ఇందులో ఉన్నది చెప్తే నాకు చదువు ఎలా వచ్చని అనుకుంటారని ఇందు సైలెంట్ గా ఉంటుంది. వేలిముద్ర పెట్టమని రేఖ అంటుంది. స్టాంప్ ప్యాడ్ లేదని ఇందు అంటుంది. నా దగ్గర ఉంది కదా అని భ్రమరాంబ ఇస్తుంది. ఇందు వేలిముద్ర వెయ్యబోతుంటే అప్పుడే రాజు ఎంట్రీ ఇస్తాడు. నా పర్మిషన్ లేకుండా ఇందు సంతకాలు చెయ్యడం ఏంటని అడుగుతాడు. నువ్వా సీఈఓ.. ఇందునా అని రేఖ అడుగుతుంది.. ఇప్పుడు భార్య సర్పంచ్ అయితే భర్తే కదా అన్నీ చూసుకునేది అందుకే ఇందు ఏం సంతకం పెట్టాలన్న ముందు నేను చూడాలని రాజు అంటాడు. ఆ తర్వాత పేపర్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ చదివి..... ఇంత మోసం చేస్తారా.. ఇప్పుడు ఇందు సంతకం చేస్తే ఎంత నష్టమని రాజు అంటాడు. ఇక మీదట ఏం చేయాలన్నా కూడా నన్ను అడగాలని రాజు అందరికి చెప్తాడు. రాజు వచ్చి సేవ్ చేసాడని అపర్ణ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తరువాయి భాగంలో ఇందు వచ్చి రాజుని హగ్ చేసుకొని.. రాజు ఐ లవ్ యు అని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే
Jun 13, 2026 10:30AM.webp)
Karthika Deepam2 : దీపకు క్షమాపణలు చెప్పిన జ్యోత్స్న.. అసలు ప్లాన్ వేరే ఉందా?
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -695 లో.... నేనొక నిర్ణయం తీసుకున్నానంటూ శివన్నారాయణ ఇంట్లో అందరిని పిలుస్తాడు. అంతకంటే ముందు మీతో మాట్లాడాలని జ్యోత్స్న అంటుంది. నేను గెలవాలనుకున్నాను కానీ ఎలా గెలిచినా పర్వాలేదని దీపపై అలా కుట్ర చేపించాను.. నేను చేసిన తప్పుకి దీపకి సారీ చెప్పాలనుకుంటున్నానని జ్యోత్స్న అనగానే అందరు షాక్ అవుతారు. ఉన్నట్లుండి మేడమ్ లో ఇంత మార్పు ఏంటోనని కార్తీక్ అంటాడు. దీప సారీ.... నాకు బావ మీద నమ్మకం ఉంది.. దీపకి ఎలాంటి హెల్ప్ చెయ్యడని మీరు ఇక ఇంటికి వెళ్లొచ్చు బావ అని జ్యోత్స్న అనగానే అందరు ఆశ్చర్యంగా చూస్తారు. మరి అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేయమని కాంచన అంటుంది. అది చెయ్యను ఎందుకంటే బావే కదా నా పెళ్లి చేస్తానని బాధ్యత తీసుకున్నాడని జ్యోత్స్న అంటుంది. దీపకి జ్యోత్స్న సారీ చెప్పకపోయింటే నా నిర్ణయం చెప్దామనుకున్నాను కానీ ఇప్పుడు అవసరం లేదని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత దాని నిర్ణయం మారకముందే మనం వెళ్ళిపోదామని కాంచన అంటుంది. ఆ తర్వాత ఏంటి పారు పార్టీ మార్చినట్లున్నావని కార్తీక్ అనగానే అదేం లేదురా దానికి డౌట్ వస్తుందని అలా చేసానంతే అని పారు అంటుంది. ఆ తర్వాత కార్తీక్, దీప దగ్గరికి జ్యోత్స్న వస్తుంది. మీ అమ్మ అన్నదానికి మురిసిపోతున్నట్లున్నావని జ్యోత్స్న అంటుంది. ఏం చేసినా సుమిత్ర కూతురు దీప అని కార్తీక్ అంటాడు. అప్పుడే శివన్నారాయణ వచ్చి ఏమంటున్నావ్ రా అని అడుగుతాడు. దాంతో కార్తీక్ కవర్ చేస్తాడు. ఆ తర్వాత జ్యోత్స్న, శివన్నారాయణ ఆఫీస్ కి వెళ్తుంటారు. నువ్వు అసలు నా మనవరాలు కాదని శివన్నారాయణ అనగానే జ్యోత్స్న షాక్ అయి కార్ ఆపుతుంది. అంటే నువ్వు ఎవరివి.. నా వారసత్వం అని శివన్నారాయణ అనగానే జ్యోత్స్న రిలాక్స్ అవుతుంది. రౌడీ లు జ్యోత్స్న దగ్గరికి వస్తారు. ఎవరు వాళ్ళు అని శివన్నారాయణ అడుగుతాడు. ఏదో చందా కోసమని జ్యోత్స్న అంటుంది. కార్ దిగి వాళ్ళతో మాట్లాడుతుంది జ్యోత్స్న. మీరు చెప్పింది చేసాం.. యాభై లక్షలు ఇవ్వండి అని జ్యోత్స్నని అడుగుతారు. ఇవ్వను అనేసరికి జ్యోత్స్నను తీసుకొని వెళ్ళాలనుకుంటారు. అది శివన్నారాయణ చూస్తాడు. వచ్చి వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తాడు శివన్నారాయణ. రౌడీలు గొడవ చేస్తారు. అప్పుడే సూరజ్ వచ్చి జ్యోత్స్న, శివన్నారాయణ వాళ్ళని సేవ్ చేస్తాడు. మరోవైపు ఇంకా సూరజ్ రాలేదని దీప చూస్తుంటుంది. శివన్నారాయణ తన దగ్గరికి వెళ్లి తన కాలికి గాయం అయిందని జరిగింది చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jun 13, 2026 10:27AM.webp)
Illu illalu pillalu: నర్మద గట్టి వార్నింగ్.. భద్రావతి ప్రతీకార జ్వాల!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu )'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్- 496 లో శ్రీవల్లి, సుకన్య, భాగ్యం, ఆనందరావు నలుగురు కలిసి భాగ్యం వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటారు. ఆ ధీరజ్ వచ్చి నా ఆశలన్నీ నీరుకార్చాడని డిస్సప్పాయింట్ అవుతుంది శ్రీవల్లి. మేము వెళ్ళి చెడగొట్టాలని చూశాము కానీ వాడిని ఆ నర్మద, ప్రేమ పట్టేసుకున్నారని ఆనందరావు టంగ్ స్లిప్ అవుతాడు. అసలు మీరెందుకు వెళ్ళారని వాళ్ళని వల్లి తిడుతుంది. ఇందులో కూడా మనకి ఏదో మంచి జరుగుతుందని అనిపిస్తుందని నా సిక్త్ సెన్స్ చెప్తుందని సుకన్య అనగానే అసలు నీకు సెన్స్ ఉందా అని వల్లి తిడుతుంది. అప్పుడే చందు వస్తాడు. వినేశాడేమో అని అందరు కంగారుపడతారు కానీ అతను వినడు. మీకు కొంపలు కూల్చడమే తెలుసనుకున్నాను కానీ ఆ రౌడీని పట్టుకోవడానికి మీరు కూడా హెల్ప్ చేశారని తెలిసిందని చందు అనగానే అవునని ఆనందరావు, భాగ్యం అంటారు. మార్పు మంచిదే కదా.. ఎవరైనా ఎప్పుడైనా మారాల్సిందే కదా.. వీళ్ళు ఇప్పుడు మారారు అని సుకన్య కవర్ చేస్తుంది. ఇక ఆ ఛేజింగ్ లో అమ్మకి చేయి వంకరపోయింది, నాన్న కి కాలు వంకరపోయిందని వల్లి, సుకన్య యాక్ట్ చేస్తారు. అది నమ్మేస్తాడు చందు. రైస్ మిల్ కి వచ్చే అవకాశం ఇవ్వు అల్లుడు అని భాగ్యం, ఆనందరావు రిక్వెస్ట్ చేస్తారు. సుకన్య , వల్లి కూడా రిక్వెస్ట్ చేయడంతో వచ్చి బుద్ధిగా వర్క్ చేసుకో లేదంటే అని చందు అనబోతుండగా మీకు ఆ అవకాశం ఇవ్వను అల్లుడు అని ఆనందరావు అంటాడు. ఆ తర్వాత చందు వెళ్ళిపోతాడు. ఇక సుకన్య, వల్లి, భాగ్యం, ఆనందరావు డ్యాన్స్ చేస్తుంటారు. అప్పుడే అక్కడికి నర్మద వస్తుంది. మామయ్య రైస్ మిల్ కి రావడానికి ఏదో కారణం ఉందని అనిపిస్తుంది అది తెలియాలి మీకు మాములుగా ఉండదు. ఇంట్లో చిన్న చిన్న గొడవలున్నాయని మీకు గ్యాప్ ఇచ్చాను కానీ మా కళ్ళు ఎప్పుడూ మీ పైనే ఉంటాయని నర్మద వార్నింగ్ ఇచ్చేసి వెళ్తుంది. మరోవైపు భద్రవతి కోపంతో ఇంట్లోని వస్తువులను పడేస్తూ ధీరజ్ ని తిడుతుంది. వాడు అంతలా రెచ్చిపోయి మాట్లాడటానికి కారణం ప్రేమే అని సేనాపతి అంటాడు. ఇక ఆ ధీరజ్ గాడికి గట్టి గుణపాఠం చెప్పాలని ఇద్దరు అనుకుంటారు. మరోవైపు ధీరజ్ కి తగిలిన గాయాలకి కాపడం పెట్టడానికి క్లాత్ వాటర్ తీసుకుని వస్తుంది ప్రేమ.ఇక అదే సమయంలో ప్రేమ చేతికి అయిన గాయం చూసి ఆంటిమెంట్ తీసి రాస్తాడు ధీరజ్. ఇక ఇద్దరు ప్రేమగా చూసుకుంటారు. అప్పుడే నర్మద వస్తుంది. ఇక ప్రేమ చేసిందంతా చెప్తుంది నర్మద. నా కోసం ఇదంతా చేశావా అని ప్రేమని దగ్గరికి తీసుకుంటాడు ధీరజ్. మరుసటి రోజు చందు మిల్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంటాడు. అప్పుడే శ్రీవల్లి ఎదురుగా వచ్చి మాట్లాడుతుంది. టైమ్ కి ట్యాబ్లెట్స్ వేసుకోమని చెప్పి వెళ్ళిపోతూ మళ్ళీ ఆగుతాడు చందు. ఏంటి బావ ఆగావు అని వల్లి అడుగగా మన బిడ్డ హార్ట్ బీట్ వినాలని ఉందని చందు అనగానే వల్లి టెన్షన్ పడుతుంది. అప్పుడే సుకన్య, గుమ్మం దగ్గర నర్మద, ప్రేమ వస్తారు. కడుపులో బిడ్డ హార్ట్ బీట్ వినాలని చందు బావ అనుకుంటే వల్లి ఎందుకు ఇంత టెన్షన్ పడుతుందని ప్రేమ, నర్మద అనుకుంటారు. మరోవైపు ఇప్పుడు ఎందుకు బావ అని వల్లి అంటుంది. అదేంటి నువ్వు హ్యాపీగా ఒప్పుకుంటావని అనుకుంటుంటే ఎందుకు అంటావేంటని చందు అంటాడు. ఇక చేసేదేమీ లేక సరే అంటుంది వల్లి. ఇక శ్రీవల్లి కడపు దగ్గర తల వాల్చుతాడు చందు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jun 13, 2026 10:25AM.webp)
Podharillu : శైలు ఆగ్రహం.. మహా ఆఫీస్లో చక్రి రచ్చ!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -135 లో... మీ నాన్నకి గాయం అయింది. నీ వల్లే వెళ్లి సారీ చెప్పమని కన్నాతో మహా అంటుంది. నేను చెప్పను.. అసలు ఆయన్ని నాన్న అని కూడా పిలవను.. అతను, రోడ్డు మీద వెళ్ళే అతను ఒకటే నాకు అని కన్నా కోపంగా మాట్లాడి.. అక్కడ నుంచి వెళ్తాడు. వాడు నీతో ఆలా మాట్లాడడం ఏంటని మాధవ అంటాడు. నేను చూసుకుంటాను లే పెద్ది అని మహా అంటుంది. ఆ తర్వాత కన్నా అన్నది అలోచించుకుంటాడు. మళ్ళీ మహా దగ్గరికి వచ్చి సారీ చెప్తాడు కన్నా. మీతో అలా మాట్లాడి ఉండాల్సింది కాదని కన్నా అంటాడు. ఆ తర్వాత మహా ఇంట్లో అందరికి బిర్యానీ చేస్తుంది. ఇప్పుడు ఇంట్లో బిర్యానీకి వెళ్తే ఆ సివంగి కన్నతల్లి గురించి ఆరా తీస్తుందని భయపడి లోపలికి వెళ్ళడు నారాయణ. కానీ మహానే బిర్యానీ తీసుకొని వచ్చి నారాయణకి ఇస్తుంది. నువ్వు బిర్యాని పెట్టి నిజం రాబట్టాలనుకుంటున్నావు కదా.. అసలు జరగదని నారాయణ అంటాడు. ఆ తర్వాత శైలు దగ్గరికి కేశవ వెళ్తాడు. తను పట్టించుకోకుండా వెళ్తుంటే తన చెయ్ పట్టుకొని ఆపుతాడు. నీ పెళ్ళాన్న లవర్ నా చెయ్ పట్టుకున్నావని శైలు కోప్పడుతుంది. ఆ తర్వాత మహా ఆఫీస్ కి వెళ్తుంది. తనకి ఒక సెకండ్ హ్యాండ్ స్కూటీ చూడరా అని కేశవతో చక్రి చెప్తాడు. మహా ఆఫీస్ కి వెళ్తుంది. తన ఆఫీస్ వాళ్లతో కలిసి సరదాగా మాట్లాడుతుంది. విక్కీతో కలిసి భోజనం చేస్తుంది. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారని విక్కీ అడుగుతాడు. కానీ మహా ఏం చెప్పదు. ఆ తర్వాత మహాకి చక్రి ఫోన్ చేసి మాట్లాడుతాడు. అప్పుడే సంతోష్ ఆఫీస్ లో ఎవరితోనో గొడవపడుతాడు. అది చక్రి ఫోన్ లో విని మహాని తిడుతున్నాడనుకొని ఆఫీస్ కి వెళ్లి వాడి సంగతి చెప్పాలనుకుంటాడు. ఆఫీస్ కి వెళ్లి మహాని తిట్టింది ఎవరని అడుగుతాడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని మహా కోప్పడుతుంది. అందరి ముందు నా తల తీసేసినట్లు ఉందని చక్రిపై మహా కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jun 13, 2026 10:23AM.webp)
Jayam serial : ప్రీతి శ్రీమంతం వేడుకలో ఊహించని మలుపు.. వీరు కుతంత్రాలకు విశ్వ గట్టి కౌంటర్!
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -293 లో.... శకుంతల, పెద్దసారు ఇద్దరు ప్రీతి శ్రీమంతానికి సుధాని పిలవడానికి వెళ్తారు. అప్పుడే ఇంట్లో గొడవ జరగాలని వీరు అనుకుంటాడు. విశ్వకి వీరు ఫోన్ చేసి.. మీ ఇంట్లో ఇప్పుడు విజయేంద్ర ప్రతాప్ శకుంతల ఉన్నారని చెప్తాడు. దాంతో విశ్వకి కోపం వస్తుంది. విశ్వ వచ్చి ఇంట్లో గొడవ చేస్తాడని, వాళ్లని అవమనిస్తాడని వీరు, ఇషిక అనుకుంటారు. ఆ తర్వాత విశ్వకి సుధా కాల్ చేసి.. మా అన్నయ్య వాళ్ళు వచ్చారు.. మీరు త్వరగా ఇంటికి రమ్మని చెప్తుంది. ఫోన్ రుద్ర తీసుకొని మావయ్య మీరు త్వరగా ఇంటికి రండి.. మీ కోసం ఇంట్లో వెయిట్ చేస్తున్నామని రుద్ర అంటాడు. ఆ తర్వాత విశ్వ కోపంగా ఇంటికి వస్తాడు. తన కోపం చూసి ఇంట్లో వాళ్ళని మెడపట్టుకొని గెంటెయ్యడం ఖాయమని వీరు, ఇషిక అనుకుంటారు కానీ విశ్వ రాగానే రుద్ర తనతో బాగా మాట్లాడతాడు పెద్దసారు కూడా బాగా మాట్లాడతాడు. శకుంతల బొట్టు పెట్టి మరీ సుధాని ఆహ్వానిస్తుంది. మీరు ఇద్దరు తప్పకుండా రావాలి విశ్వ అని పెద్దసారు చెప్తాడు. మీరు కుటుంబంతో వచ్చి పిలవడం అది మీ సంస్కారం.. నేను రావడం అనేది నా సంస్కారం అని విశ్వ సాఫ్ట్ గా మాట్లాడుతుంటే.. వీరు, ఇషిక షాక్ అవుతారు. ఆ తర్వాత విశ్వని పెద్దసారు హగ్ చేసుకొని జరిగింది మర్చిపోయి ఇంటికి రా విశ్వ అని చెప్తాడు. మరొకవైపు అక్కడ విశ్వ సర్ ఉన్నా.. గొడవ జరగలేదని గంగ, రంగా,ఇందుమతి, రాఘవ వాళ్ళు ఆశ్చర్యంగా మాట్లాడుకుంటారు సుధా అత్త కూతురు వచ్చింది కదా.. అన్నయ్యకి పెళ్లి అవ్వకుంటే తనకి ఇచ్చి పెళ్లి చేసేవారని గంగని స్నేహ, ప్రీతీ వాళ్ళు ఆటపట్టిస్తారు. ఆ తర్వాత చాలా థాంక్స్ అని విశ్వ కాళ్ళు పట్టుకుంటుంది సుధా.. మా వాళ్ళు వచ్చినా మీరు మర్యాదగా మాట్లాడారు. థాంక్స్ అని సుధా అంటుంటే.. ఏం చేసినా నీ కోసమే అని విశ్వ అంటాడు. అయితే శ్రీమంతానికి వస్తున్నారు కదా అని సుధా అనగానే వస్తానని విశ్వ అంటాడు. రెండు కుటుంబాలు కలిసిపోతే మేం అనుకున్నది ఎలా జరుగుతుందని నిషా అనుకొని నాన్నని ఎందుకు ఫోర్స్ చేస్తున్నావమ్మా అని అడుగుతుంది. నోరు ముయ్.. నువ్వు ఇలాంటి విషయల గురించి మాట్లాడవద్దని తనని విశ్వ కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jun 13, 2026 10:19AM.webp)
Godhavari : నందు పెళ్లి కోసం జానూ సాహసం.. సింహాద్రి గుట్టు రట్టు చేయనున్న సూర్య!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -28 లో.... నందు తన పెళ్లి గురించి సింహాద్రితో మాట్లాడుతుంది. దాంతో నువ్వే అనుకున్నాను ఇంట్లో అందరు ఇలాగే ఉన్నారు కదా.. తండ్రి పోయి రెండు రోజులు కూడా అవ్వలేదు.. అప్పుడే పెళ్లి కావాలట అని భువన అంటుంది. అది మాట్లాడిన సందర్భం తప్పు కావచ్చు కానీ తప్పు మాట్లాడలేదు.. పెళ్లి వరకు వచ్చి ఆగిపోతే ఆ బాధ ఎలా ఉంటుంది.. మీకు తెలియనిది కాదని భువనతో జానూ అంటుంది. ఆ తర్వాత పెళ్లి గురించి ఇప్పుడే అడిగితే వాళ్ళు ఏమనుకుంటారు.. వాళ్లకి తండ్రి చనిపోయిన బాధ ఏ మాత్రం కూడా లేదని అనుకోరా అని శారద కోప్పడుతుంది. నాకు బాధగానే ఉంది కానీ పెళ్లి వరకు వచ్చి ఆగిపోతే నా పరిస్థితి గురించి ఆలోచించారా అని నందు అంటుంది. ఆ తర్వాత మురళి వంక వాళ్ళ అమ్మ శారదా కోపంగా చూస్తుంది. ఏంటి అమ్మా .. అలా చూస్తున్నావని మురళి అడుగుతాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి.. నువ్వు ఆ ఇంటికి వెళ్లకని.. నీ దగ్గర మాట తీసుకున్నాను.. నా తమ్ముడు లేడు.. ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి.. ఆ నందు చూసావా ఎలా మాట్లాడుతుందోనని శాంతి అంటుంది. తప్పు ఎవరిది నీది కదా.. ఎందుకు వాళ్ళతో అలా కోపంగా మాట్లాడావని మురళి అడుగుతాడు. మరొకవైపు జానూ దేవుడికి మొక్కుకుంటుంది. ఆ తర్వాత ఏంటీ జానూ పిలిచావని సూర్య అడుగుతాడు. రెండు హెల్ప్ లు కావాలని జానూ అంటుంది. నాకు ఇప్పుడు జాబ్ కావాలి.. ఇంకొకటి అక్క పెళ్లి అమెరికా అబ్బాయితో జరిపించాలని జానూ అనగానే జరిపిద్దామని సూర్య అంటాడు. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్లి మాట్లాడుదామని జానూ అనగానే ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్లేసరికి అబ్బాయి బ్యాగ్ రెడీ చేసుకుంటాడు. ఎందుకు బ్యాగ్ రెడీ చేస్తున్నారని జానూ అడుగుతుంది. మా వాడు అమెరికా వెళ్ళడానికి పది రోజులు టైమ్ ఉంది. ఇప్పటి నుండే ప్యాక్ చేసుకుంటున్నాడని అబ్బాయి వాళ్ళ నాన్న అంటాడు. ఈ పెళ్లి జరగదని వాళ్ళు అంటారు. మేము పెళ్లి ఘనంగా చేస్తాం.. మీరు అనుకున్నట్ల తోట ఇస్తామని జానూ చెప్తుంది. తోట ప్రాబ్లమ్ లో ఉందని సింహాద్రి అంకుల్ చెప్పాడని అబ్బాయి అంటాడు. తోట రిజిస్ట్రేషన్ పేపర్స్ మీకు ఇచ్చి.. ఈ పదిరోజుల్లో పెళ్లి చేస్తానని జానూ వాళ్ళకి మాటిస్తుంది. తరువాయి భాగంలో తోట నాది అని సింహాద్రి తన ఫ్రెండ్స్ కి చెప్తుంటే జానూ, సూర్య వెళ్తారు. తోట ఎవరిది అంకుల్ అని జానూ అడుగగా సింహాద్రి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jun 12, 2026 11:42AM
Brahmamudi : ఐశ్వర్య చెంప చెల్లుమనిపించిన ఇందు.. అసలు ట్విస్ట్ బయటపెట్టిన రాజు!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1056 లో...నువ్వు సీఈఓ అయింది ఆ రేఖ చెప్పినట్లు వినడానికా అని ఇందుపై అపర్ణ కోప్పడుతుంది. అయ్యో అమ్మమ్మ.. మీకు ఈ ఇందు గురించి తెలియదు.. నా సపోర్ట్ తో ఇందు సీఈఓ అయిందని రేఖ అనుకుంటుంది.. కానీ కానీ ఇక్కడ ఎవరికి తెలియని విషయం ఏంటంటే అలా రేఖ తనకి సపోర్ట్ చేసేలా ప్లాన్ చేసింది ఇందునే అని రాజు చెప్తాడు. ఏంటమ్మ అని ఇందుని అపర్ణ అడుగుతుంది. మీరు నాపై నమ్మకం ఉంచండి అమ్మలో ఉన్న ధైర్యం.. మీరు నాలో ఉందని చెప్పారు. ఆ ధైర్యమే నన్ను ముందుకు నడిపిస్తుందని అపర్ణ వాళ్ళకి ఇందు చెప్తుంది. ఆ తర్వాత ఐశ్వర్య దగ్గరికి ఇందు వచ్చి.. తన చెంప చెల్లుమనిపిస్తుంది. ఏంటే నన్ను కొడుతున్నావ్.. సీఈఓ అయ్యానన్న పొగరు వచ్చిందా అని ఐశ్వర్య కోప్పడుతుంది. నువ్వు చేసిన పనికి ఏం చేసినా తప్పు లేదు.. నేను నీ గురించి కుటుంబం గురించి ఆలోచించే కదా.. సీఈఓ అయిందని ఇందు చెప్తుంది. నువ్వు ఇంకా నటించకని ఐశ్వర్య అనగానే సరే నేను నటిస్తున్నాను.. ఇక మీదట నువ్వే అన్ని చూసుకో.. నీ అప్పు కూడా నేను తీర్చను.. నీ ఖర్చులకి డబ్బు కూడా ఇవ్వను.. ఆంటీని కూడా ఇవ్వనివ్వనని ఇందు చెప్తుంది. మరొకవైపు నువ్వు సీఈఓ అవుతావనుకుంటే దాన్ని సీఈఓ చేసావేంటని రేఖని భూషణ్ అడుగుతాడు. ఇప్పుడు మనం ఎన్నో రోజులుగా ఒక డీల్ వస్తే వద్దనుకున్నాం.. దొంగ బంగారం కొనడం.. ఇప్పుడు అది డీలింగ్ కుదర్చుకుంటున్నాము.. దానికి సంబంధించిన వాటిపై ఇందు సంతకం చేస్తుంది. అప్పుడు కోట్లు మనకి.. ప్రాబ్లమ్ తనకి అని రేఖ చెప్తుంది. దాంతో ప్లాన్ అదిరిందని రేఖతో భూషణ్ అంటాడు. డబ్బు చూసి ఎన్ని రోజులు అవుతుందోనని భ్రమరాంబ అంటుంది. ముందు అయితే డబ్బు రాగానే అప్పులన్ని తీర్చాలని భూషణ్ అంటాడు. అప్పులన్నీ తీర్చేసి ఆస్తులన్నీ నా పేరున చేసుకుంటానని రేఖ అంటుంది. మరొకవైపు ఐశ్వర్య అద్దంలో తన మొహం చూసుకుంటూ చెంపకి పడ్డ చేతివేలు అచ్చులు చూసుకొని మాట్లాడతుంది. ఇందు నిన్ను వదిలిపెట్టనే అని ఐశ్వర్య అంటుంది. అప్పుడే స్వాతి వస్తుంది. ఏమైంది అక్క చెంపకి చెయ్ అడ్డం పెట్టావని ఐశ్చర్యని స్వాతి అడుగుతుంది. ఏం లేదని ఐశ్వర్య అనగానే చెయ్ తీసి స్వాతి చూస్తుంది. ఏంటి అక్క ఎవరో కొట్టినట్లున్నారు.. ఇందు అక్క అయితేనే ఇలా కొడుతుందని స్వాతి అంటుంది. నేను అంత చూసానులే అక్క అని స్వాతి అంటుంటే.. ఐశ్వర్యకి ఇంకా కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jun 12, 2026 11:38AM.webp)
Karthika Deepam2 : జ్యోత్స్నకు తాత శివన్నారాయణ ఊహించని షాక్..
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -694 లో.....జ్యోత్స్న కావాలనే దీపని ఓడించడానికి కుట్ర చేసిందని సాక్ష్యలతో సహా సూరజ్ నిరూపిస్తాడు. దాంతో జ్యోత్స్నని అందరు తిడతారు. నిన్ను తిట్టడానికి కూడా నాకు మాటలు రావడం లేదు.. ఇక మీద ఇది నా కుటుంబమని చెప్పాల్సి వస్తే అందులో నువ్వు ఉండవు.. నీకు మనవరాలు ఉంది కదా అని ఎవరైనా అడిగితే ఒకప్పుడు ఉండేది.. ఇప్పుడు దీపలో నా మనవరాలిని చూసుకుంటున్నానని చెప్తానంటూ శివన్నారాయణ అంటాడు. మావయ్య గారు కరెక్ట్ గా చెప్పారు.. దానితో ఎవరు మాట్లాడకండి అని సుమిత్ర అంటుంది. అందరు వెళ్ళిపోతారు.. సూరజ్ వెళ్తు నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుందని అంటాడు. సూరజ్ వెళ్తుంటే జ్యోత్స్న చిటికేసి పిలుస్తుంది. నిన్ను చీకట్లో నిల్చొపెట్టి రివెంజ్ తీర్చుకుంటే నువ్వు మాత్రం నా ఇంట్లో పట్టపగలు దొషిని చేసావ్.. శబాష్ రా నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నానని సూరజ్ ని జ్యోత్స్న పొగుడుతుంది. కానీ నిన్ను అంత తేలికగా వదలను చంపేస్తానని జ్యోత్స్న వార్నింగ్ ఇస్తుంది కానీ సూరజ్ నవ్వుతు ఉంటాడు. ఎంట్రా నీకు వార్నింగ్ ఇస్తున్నానని జ్యోత్స్న అంటుంది. నువ్వు వార్నింగ్ ఇస్తే నేను ఎందుకు తీసుకోవాలని సూరజ్ అంటాడు. ఐ లవ్ యూ అని సూరజ్ చెప్పగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. ఏమన్నావని అడుగుతుంది. నేను మళ్ళీ ఎందుకు చెప్పాలి.. చాలా థాంక్స్ నీ అందమైన చేతులతో నన్ను తాకావ్.. నన్ను తాకిన మొదటి అమ్మాయివి నువ్వే అని సూరజ్ అంటుంటే.. జ్యోత్స్నకి ఇంకా కోపం వస్తుంది. ఆ తర్వాత దీప, కార్తీక్ జరిగింది గుర్తుచేసుకొని మాట్లాడుకుంటారు. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. సూరజ్ ఇచ్చిన షాక్ నుంచి బయటకు రాకముందే.. మళ్ళీ దీప, కార్తీక్ ఇద్దరు తమ మాటలతో జ్యోత్స్నని టార్చర్ పెడతారు. ఆ తర్వాత జ్యోత్స్న రౌడీకి ఫోన్ చేసి సూరజ్ ని చంపమని చెప్తుంది. మరోవైపు సుమిత్ర దగ్గరికి దీప వెళ్తుంది. దీప నన్ను క్షమించు నా కూతురు చేసిన పనుల వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడ్డావని సుమిత్ర అంటుంది. అలా అనకండి అమ్మ అని దీప చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jun 12, 2026 11:35AM.webp)
Illu illalu pillalu : రౌడీని పట్టుకొచ్చిన నర్మద, ప్రేమ.. జైలు నుండి ధీరజ్ విడుదల!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-495 లో.. నర్మద, ప్రేమ ఇద్దరు కలిసి అసలు నేరస్థుడిని తీసుకొస్తారు. వాడిని చూసి ఎస్ఐ టెన్షన్ పడతాడు. వీడే సర్ మామిడికాయలతో కారులోకి వచ్చిందని నర్మద, ప్రేమ చెప్తారు. మీరు చెప్పేది నేను నమ్మాలా.. దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంటుందని ఎస్ఐ అంటాడు. రేయ్ ధీరజ్ ని తీసుకొని రండ్రా అని అనగానే సరే అయితే మీరు తీసుకెళ్ళండి మేము వీడిని ఎస్పీ దగ్గరికి తీసుకెళ్ళి నిజం చెప్పిస్తాం.. అప్పుడు తెలుస్తుంది.. వీడితో అలా చెప్పించింది ఎవరో.. వీడికి మాదకద్రవ్యాలు ఇచ్చింది ఎవరో.. వీడి వెనుక ఉంది ఎవరో.. అంతా తెలుస్తుందని నర్మద అనగానే ఎస్ఐ భయపడతాడు. ఎక్కడ తన గురించి తెలుస్తుందో ఎమోనని ఎస్ఐ టెన్షన్ పడతాడు. సర్లే వదిలేయండి అని ఎస్ఐ వాడిని తీసుకొని.. రేయ్ నువ్వేనా కార్ లో మాదకద్రవ్యాలు తీసుకొచ్చిందని అడుగుతాడు. వాడు అవునని అనడంతో.. ధీరజ్ ని వదిలేసి వీడిని తీసుకెళ్ళండి అని ఎస్ఐ చెప్తాడు. దాంతో పోలీసులు ధీరజ్ ని వదిలేసి వాడిని తీసుకెళ్తారు. ఇక రామరాజు, చందు, నర్మద, ప్రేమ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ధీరజ్ ని రామరాజు హగ్ చేసుకొని చాలా సంతోషంగా ఉందిరా.. వెంటనే మనం ఇంటికి వెళ్ళాలి.. మీ అమ్మ ఎదురుచూస్తోందిరా అని అంటాడు. ఇక ప్రేమ వెళ్ళి ధీరజ్ ని హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. అప్పుడే ప్రేమ చేతికి ఉన్న గాయం చూస్తాడు ధీరజ్. ఏం అయిందని అడుగుతాడు. ఇక ఆ రౌడీని చేజ్ చేస్తున్నప్పుడు ప్రేమకి తగిలిన గాయమని జరిగిందంతా చెప్పగానే.. సభాష్ అమ్మా రామరాజు కోడళ్ళు అనిపించారని రామరాజు అంటాడు. ధీరజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక అందరు ఇంటికి బయల్దేరతారు. మరోవైపు ఇంట్లో ఉన్న దేవుడికి వేదవతి మొక్కుకుంటుంది. అదంతా శ్రీవల్లి, సుకన్య చూస్తారు. ఈవిడ ఇక్కడ మొక్కుకుంటే అక్కడ ధీరజ్ ని వదిలేస్తారా ఏంటని శ్రీవల్లి అనుకోగానే కార్ ఇంటి ముందుకొస్తుంది. అందులో నుండి ధీరజ్, ప్రేమ, నర్మద, రామరాజు, చందు దిగుతారు. ఇక ధీరజ్ ని చూడగానే వేదవతి ఎమోషనల్ అవుతుంది. వచ్చి ధీరజ్ ని హత్తుకొని ఏడుస్తుంది. ఇక ధీరజ్ ని చేయి పట్టుకొని భద్రవతి, సేనాపతిల ఇంటి ముందుకి వెళ్తుంది ప్రేమ. వాళ్ళని పిలవగానే సేనాపతి, భద్రవతి వస్తారు. మీరు ఎన్ని కుట్రలు చేసి మమ్మల్ని విడదియ్యాలని చూసినా మేము ఇంకా ఇంకా దగ్గరవుతామని ప్రేమ చెప్తుంది. మేము ఇప్పుడు ఎవ్వరు విడదియ్యలేనంత ప్రేమలో ఉన్నామని ప్రేమ అనగానే భద్రవతి, సేనాపతి కోపంగా చూస్తారు. నా కుటుంబమే నాకు బలం, బలహీనత. ఏదైనా ఆపదొస్తే అందరు నాకు బలంగా ఒకే త్రాటిపై నిలబడతారని రామరాజు గర్వంగా చెప్తాడు. ఇక అందరు రామరాజు ఇంటిగుమ్మం దాకా వెళ్తారు. ఇంటి లోపల సుకన్య, శ్రీవల్లి ఉంటారు. ఇంటికి వచ్చిన వారికి దిష్టి తీయాలని కూడా తెలియదా అని శ్రీవల్లిని వేదవతి తిట్టగానే తను హారతి తీసుకొస్తుంది. ఇక దాని తర్వాత అందరు ఇంట్లోకి వెళ్తారు. జరిగిందంతా నర్మద, ప్రేమ చెప్తుంటే ఆనందరావు, భాగ్యం వచ్చి మేము కూడా హెల్ప్ చేశామని చెప్తారు. ఆ తర్వాత అందరు నవ్వుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jun 12, 2026 11:33AM.webp)
Podharillu : శైలుకు సారీ చెప్పమన్న మహా.. రమణయ్యకు నారాయణ వార్నింగ్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -134 లో..... కేశవ డల్ గా ఉంటాడు. ఏమైందని చక్రి అడుగుతాడు. దాంతో శైలు పట్ల తను బెహేవ్ చేసిన తీరు గురించి చెప్తాడు. నువ్వు కిడ్నాప్ అయిన రోజున నిన్ను వెతకడానికి వెళ్తుంటే ఊరికే ఫోన్ చేసి విసిగించింది.. అందుకే కొట్టానని కేశవ అంటాడు. ఒరేయ్ ఆ అమ్మాయి నువ్వు అంత చిరాకు పడ్డా వస్తుందంటే అర్థం చేసుకో.. ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది.. ప్రేమించిన వాడిగా చెప్తున్నానని చక్రి అంటాడు. నీది వన్ సైడ్ లవ్ అంతే అని కేశవ అంటాడు. లవ్ అయితే ఉంది కదా అని చక్రి అంటాడు. వాళ్ళ మాటలు వింటున్నట్లుగా మహా వెనకాల కన్పిస్తుంది. ఆ తర్వాత ఉదయం కేశవ దగ్గరికి మహా వచ్చి.. రాత్రి మీ మాటలు విన్నానని మహా అంటుంది. నాకు చాల గిల్టీగా ఉంది.. ఆ అమ్మాయి ని కొట్టానని కేశవ అనగానే వెళ్లి తనకు సారీ చెప్పండి అని మహా చెప్తుంది. ఆ తర్వాత మహా ఆఫీస్ కి రెడీ అవుతుంది. నేను డ్రాప్ చేస్తానని చక్రి అంటుంటే వద్దు ముద్దపప్పులా ఉంటే ఏం తెలుస్తుంది.. స్వతంత్రంగా ఉంటేనే అన్నీ తెలుస్తాయి.. నేను వెళ్తానని మహా అంటుంది. అయినా నేను ఉన్నాను కదా అని కన్నా అంటాడు. కన్నా భుజం పై చెయ్ వేసి మహా వెళ్తుంటే కన్నాని చక్రి తిట్టుకుంటాడు. ఆ తర్వాత మహా ఆఫీస్ లో ఒక డిజైన్ వేస్తుంది. అది బాలేదని విక్కీ చెప్తాడు. సరే మళ్ళీ వేసుకొని వస్తానని మహా అంటుంది. ఆ తర్వాత మాధవ వాళ్ళు మహా కోసం ఒక వాష్ రూమ్ కట్టడానికి సిద్ధమవుతారు. అందుకోసం అక్కడ తవ్వుతారు. అప్పుడే నారాయణ వాళ్ళ అన్న రమణయ్య వచ్చి.. ఏంటి కోర్ట్ పర్మిషన్ తీసుకున్నారా అని కోప్పడతాడు. ఇల్లుకి ఏం రిపేర్ అయినా కోర్ట్ పర్మిషన్ తీసుకొని మొదలుపెట్టాలి లేదంటే కంప్లైంట్ ఇస్తానని రమణయ్య అంటుంటే మాధవ మాత్రం తనని రిక్వెస్ట్ చేస్తాడు. నువ్వు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్లకపోతే గాయత్రి అత్తగారింటికి వెళ్లి అది పెళ్లి ముందురోజు లేచిపోయిందని చెప్తానని నారాయణ అనగానే అమ్మాయిని అడ్డం పెట్టుకుంటున్నావని రమణయ్య అంటాడు. మరి ఒక అమ్మాయి కోసం వాష్ రూమ్ కడుతుంటే ఎందుకు అడ్డుపడుతున్నావని నారాయణ అనగానే అతను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మహా వస్తుంది. ఎందుకు ఇవన్నీ పనులు అని మహా అడుగుతుంది. నారాయణ ఆల్రెడీ చేతికి గాయం ఉంటుంది. ఇంకా నొప్పి వస్తుంది.. మీరు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారని నారాయణని మహా లోపలికి తీసుకొని వెళ్తుంది. ఒరేయ్ కన్నా నీ వల్లే మీ నాన్నకి గాయం అయింది.. వెళ్లి సారీ చెప్పమని కన్నాతో మహా అంటుంది. నేను చెప్పనని కన్నా అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jun 12, 2026 11:30AM.webp)
Jayam serial : సుధా ఇంటికి వెళ్లిన శకుంతల.. విశ్వనాథ్కు ఫోన్ చేసి మరీ చెప్పిన వీరు!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -292 లో.....ప్రీతీ శ్రీమంతానికి సుధా పిన్నిని పిలవడానికి వెళదాం బావ అని రుద్రతో వీరు అనగానే నేను రానని రుద్ర చెప్తాడు. ఎందుకని వీరు అనగానే ఇప్పుడు మనం వెళ్లి పిలిస్తే అత్తయ్య వస్తుంది కానీ మావయ్య విశ్వనాథ్ గారు ఏం అంటారు. శ్రీమంతం చేస్తున్న వాళ్ళు చెప్పడానికి కూడా రాలేదంటే నువ్వంటే అంత ఇష్టం లేదా అని మావయ్య అంటాడు. అది బాగోదు అందుకే పెద్దమ్మ, పెద్దనాన్న వెళ్లి పిలవాలని రుద్ర అంటాడు. అవును శకుంతల అని పెద్దసారు అంటాడు. నేను వెళ్ళనని శకుంతల చెప్పి లోపలికి వెళ్తుంది. పెద్దమ్మని ఒప్పించే బాధ్యత నీదే అని వీరుతో రుద్ర చెప్తాడు. దాంతో శకుంతల దగ్గరికి వీరు వెళ్లి అత్తయ్య ఒప్పుకోండి.. ఆ వీరు కావాలనే మిమ్మల్ని ఇరికించాడు.. ఇప్పుడు ప్రీతి దృష్టిలో బ్యాడ్ అవ్వకండి.. వాళ్ళు వచ్చాక మనం చేసేది మనం చేద్దామని వీరు అనగానే శకుంతల ఒప్పుకుంటుంది. ఆ తర్వాత అత్తయ్య ఒప్పుకుందని వీరు చెప్తాడు. ఆ తర్వాత రుద్ర టీవీలో ఫుట్ బాల్ పోటీ గురించి వింటాడు. అప్పుడే అతడికి భాను గుర్తు వస్తాడు. తనకి ఫుడ్ బాల్ అంటే చాలా ఇష్టమని చెప్పిన విషయం గుర్తుచేసుకుంటాడు. అప్పుడే పెద్దసారు వస్తాడు. భానుకి ఫుట్ బాల్ అంటే చాలా ఇష్టమని చెప్తాడు. తన కోసం ఏదైనా చెయ్యాలని రుద్ర అంటాడు. పిల్లలకు ఉచితంగా నేర్పించాలని రుద్ర అనగానే కోచ్ లు ఎంతమంది కావాలో, దానికి ఏం కావాలో చెప్పు చేద్దాం.. నువ్వు ఏం అడిగితే అది చేస్తాను.. అన్ని ఏర్పాట్లు నువ్వు దగ్గరుండి చూసుకోమని పెద్దసారు చెప్తాడు. ఆ తర్వాత శకుంతల, పెద్దసారు, ఇషిక వీరు అందరు కలిసి సుధాని పిలవడానికి వస్తారు. వాళ్లని చూసి సుధా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఎందుకు బ్రో అత్తయ్య వచ్చేలా చేసావని వీరుని ఇషిక అడుగుతుంది. ఇప్పుడు ఆ విశ్వనాథ్ ఇంట్లో లేడని వచ్చారు. ఇప్పుడు అతన్ని రప్పిస్తే ఇంట్లో పెద్దగొడవ జరుగుతుందని ఇషికతో వీరు అంటాడు. అనుకున్నట్లుగానే విశ్వకి ఫోన్ చేస్తాడు వీరు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jun 12, 2026 11:28AM
మొగుళ్లు కరెక్టా? పెళ్లాలు కరెక్టా...సేవ్ ది టైగర్స్ 3 టీమ్ రచ్చ!
బుల్లితెరపై ప్రేక్షకులను అలరించే కార్యక్రమాల్లో ప్రధానంగా కుటుంబ సంబంధాలు, దాంపత్య బంధాలపై జరిగే డిబేట్స్ కి ఎప్పుడూ స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఆదివారం విత్ స్టార్ మా పరివారం ప్రోమో రిలీజ్ అయ్యింది.తాజాగా ప్రసారంకానున్న ఓ షోలో “మొగుళ్లు కరెక్టా? పెళ్ళాలు కరెక్టా?” అనే అంశంపై ఆసక్తికరమైన చర్చ సాగింది. ప్రోమో స్టార్టింగ్ లో హోస్ట్ సరదాగా “ఈరోజు మొగుళ్లు కరెక్టా లేదా పెళ్లాళ్లు కరెక్టా అనేది తేల్చేయబోతున్నాం” అంటూ సందడి చేశారు. ఇక ఈ షోకి "సేవ్ ది టైగర్స్ 3 " సీజన్ నుంచీ నటీనటులు వచ్చారు. తమ తమ అభిప్రాయాలను పంచుకున్నారు." గేట్ కమిటీ గేట్ కమిటీ అంటారు . గేట్ కమిటీ లేమున్నదండీ " అండూ ప్రియదర్శి అడిగాడు. " గేట్ కమిటీ కాదు. గేటెడ్ కమిటీ " అన్నాడు అవినాష్. "మా ఆయన గట్లనే అంటడు నువ్వు చెప్పు బేబీ" అంటూ జోర్దార్ సుజాత వాళ్ళ ఆయన్ని వెనకేసుకొచ్చింది. " ఆమె బేబీ అని ప్రేమగా పిలుస్తుంది కదండీ" అని శ్రీముఖి అనేసరికి " ఆమె బేబీ అన్నా బర్రె అన్నట్టే ఉంటుంది." అన్నాడు అభినవ్ గోమఠం. "ఆ అమ్మాయి ఒక తమిళ్ సీరియల్ ఒకటి సైన్ చేసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య తెలియకుండానే ఒక చాలా పెద్ద గ్యాప్ అనేది వచ్చింది." అంటూ శ్రీముఖి తేజస్విని గౌడ, అమరదీప్ ని ఉద్దేశించి చెప్పింది. " నా గ్యాప్ తో ఏ ప్రాబ్లం లేకపోవడం, దాని ప్రాబ్లం " అన్నాడు అమరదీప్. ఇంతలో యాదమ్మ వాళ్ళ వైఫ్ స్టెల్లా " ఒక రిలేషన్షిప్ లో కావాల్సింది నమ్మకం, ప్రేమ." అంది. "విక్రమ్ నీ నుంచి భరణం కావాలని అనుకుంటాడు " అంటూ శ్రీముఖి చెప్పేసరికి "అతనికెందుకు ఇవ్వాలి నాకే అతను ఇవ్వాలి " అంటూ రేఖ అలియాస్ దేవియని శర్మ అడిగింది. "నువ్వు కూడా సంపాదిస్తున్నప్పుడు విడిపోయినప్పుడు నీది కూడా నాకు ఇవ్వాలి " అన్నాడు విక్రమ్ అలియాస్ చైతన్య . "మీరు ఎంత కరెక్టుగా చెప్తున్నారని అంటే మిమ్మల్ని నమ్ముకొని గంగూలీ కూడా పక్కనుంచి ఇదేదో కరెక్ట్ గా ఉన్నట్టుంది" అనుకుంటున్నాడు అంది శ్రీముఖి . తర్వాత ప్రియదర్శి " ఇది యాక్చువల్లీ మనం అంటుంటాం కదా. లైఫ్ ఇమిటేట్స్ ఆర్ట్ ఆర్ట్ ఇమిటేట్స్ లైఫ్ " అంటూ తెగ క్లాస్ తీసుకున్నాడు ప్రియదర్శి. దాంతో ఎవరికీ వాళ్ళు లేచి వెళ్లిపోయారు. ఇక శ్రీముఖి ఐతే "మీకు అర్ధం కావట్లేదు మీరు టూ డేస్ నుంచి చెప్తున్నారు." అంది. దాంతో ప్రియదర్శి ఫీలైపోయాడు.
Jun 11, 2026 3:01PM.webp)
హెలికాప్టర్ను షేర్ ఆటో చేసిన సుడిగాలి సుధీర్!
బుల్లితెరపై ఆడియన్స్ ని అలరిస్తున్న ఫేమస్ కామెడీ అండ్ ఎంటర్టైనింగ్ ప్రోగ్రాం చిన్నారుల డ్రామా జూనియర్స్ సీజన్-9 . సరికొత్త స్కిట్స్ తో ఈ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ ప్రోమోలో హోస్ట్ సుడిగాలి సుధీర్ చేసిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించబోతోంది . స్కిట్ లో భాగంగా ఓ చిన్నారి అట్టపెట్టెతో చేసిన ఒక హెలికాప్టర్ మోడల్ను తీసుకురాగా, అందులో ఎక్కి ఆకాశంలో ఎగురుతున్నట్లు నటించారు. దీంతో పిల్లలు జడ్జీలపై వరుస పంచ్లు వేస్తూ సందడి చేశారు. "అది కాకి కాదు... సుధీర్" అంటూ ఓ చిన్నారి వేసిన డైలాగ్ అందరినీ నవ్వుల్లో ముంచింది. ఇంకో చిన్నారి ఐతే విమానాన్ని పట్టుకుని "ఎంత ఎండాకాలమైతే మాత్రం ఇంత పెద్ద ఫ్యాన్ తెస్తావా" అంటూ చెప్పిన డైలాగ్ కి రోజా నవ్వేశారు. జడ్జి శ్రీకాంత్ గారి ఇంటి మీద ఇన్ని బట్టలు ఆరేసి ఉన్నాయేంటీరా అని మరో చిన్నారి అనేసరికి "అవి ఉతకడం వల్లే కదా ఉదయం సెట్కి లేట్ గా వచ్చారు " అని పంచ్ వేయగా అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. అనిల్ రావిపూడి ఇంటి ముందు "చుక్కల ముగ్గు ఎంత బాగుందో " అని ఇంకో చిన్నారి అనేసరికి "వచ్చానంటే ఆ ఫ్యాన్ రెక్కలిరిసేత్తాను" అన్నారు. ఇక సుధీర్ పైలెట్ అవతారం ఎత్తాడు. సుధీర్ కామెడీ హైలెట్ గా నిలిచింది. హెలికాప్టర్ను షేర్ ఆటోలా మార్చేసి అందులో అనిల్ రావిపూడి, శ్రీకాంత్, ధన్య బాలకృష్ణను కస్టమర్లుగా ఎక్కించుకుంటాడు. హార్న్, హ్యాండిల్, డ్రైవింగ్ స్టైల్ అన్నీ షేర్ ఆటోను గుర్తు చేసేలా ఉండటంతో జడ్జీలు నవ్వులు ఆపుకోలేకపోయారు."కాస్త స్టార్టింగ్ ట్రబుల్... మీరు దిగి తోయండి" అని శ్రీకాంత్ను అడిగాడు , "నేను తోయాలా?" అని ఆయన ఆశ్చర్యపోయారు . వెంటనే "ఖడ్గం సినిమాలో హెలికాప్టర్ను తాడుతో లాక్కెళ్లారు.. ఇప్పుడు కాస్త తోయలేరా?" అని సుధీర్ ఇచ్చిన కౌంటర్తో సెట్లో నవ్వుల వెల్లువ ఎగిసిపడింది.ఇక "గేట్ పడింది.. ట్రైన్ వెళ్లాక పోదాం", "ఇది ఆటో పైలెట్ సార్" అంటూ సుధీర్ వరుసగా పేల్చిన పంచ్లకు జడ్జీలు పగలబడి నవ్వేశారు. చివరికి "అనవసరంగా షోకి ఒప్పుకున్నా.. ఆపేయండయ్యా, నేను కిందకు దిగేసి వెళ్తాను" అంటూ శ్రీకాంత్ సరదాగా చెప్పడం ప్రోమోకు ఆకర్షణగా నిలిచింది.
Jun 11, 2026 12:55PM
నేనెక్కడ ఉంటే అదే స్వర్గం..అలీ, ప్రదీప్ లవ్లీ కౌంటర్స్!
కుక్కు విత్ జాతిరత్నాలు షో నెక్స్ట్ వీక్ ప్రోమో ఫుల్ నవ్వులు కురిపించింది. రాకింగ్ రాకేష్ సెట్ లోకి వస్తూనే ఇంప్రెస్ చేసే డైలాగ్ వేసాడు. "స్వర్గం అంటే దేవతలు ఉంటారని అందరికీ తెలుసు. దేవతలకు మించిన దేవకన్య ఒకటి ఉంటుంది చూడండి ఆ దేవకన్య మీరు" అని రాకింగ్ రాకేష్ అనేసరికి జడ్జ్ శ్రీదేవి ఫిదా ఇపోయారు. వైట్ శారీలో నిజంగా సెట్ లో దేవకన్యలా మురిసిపోయారు. "ఇక్కడ ఓకే. ఇక్కడేంటి " అంటూ ఆలీ ముచ్చెర్ల అరుణాని చూపిస్తూ అడిగారు. " యెదవ తెలివితేటలు చూపించుకే" అంటూ బ్యాక్ గ్రౌండ్ డైలాగ్ వచ్చింది. వెంటనే రాకేష్ ఆలీ దగ్గరకు వెళ్లి "నీకు దణ్ణం పెడతా ఏదో ఒకటనకుని ఇచ్చా నన్ను ఇరికించకు " అన్నాడు రాకేష్. " నేనే వరస్ట్ అనుకున్నాను. నాకన్నా వారెస్టుగా ఉన్నాడు " అంటూ యాదమ్మ రాజు రాకేష్ మీద కౌంటర్ వేసాడు. " ఈ నిమ్మకాయతో మిమ్మల్ని అందరినీ వశం చేసుకుంటా" అన్నాడు హరి . "వశం అంటే ఏంటి సర్." అన్నాడు ప్రదీప్. "వశం రసం" అన్నాడు యాదమ్మ రాజు . " నేను నీకోసం వచ్చా. రా బాలిక" అంటూ హరి పల్లవి గౌడ దగ్గరకు వెళ్ళాడు. వెంటనే ప్రదీప్ " రా అని నువ్వు వెళ్తావే" అన్నాడు. " ఆమె రాదు కదా అని" అన్నాడు హరి. " అందరికీ మనసుంటే వస్తది మార్గం నేనెక్కడ ఉంటే అదే స్వర్గం" అంటూ పెద్ద డైలాగ్ చెప్పింది గోమతి ప్రియా. పింక్ కలర్ కాస్ట్యూమ్ లో మెరిసిపోయింది. వెంటనే ఆలీ "వ్వావ్ మేనక్కరా? " అన్నారు. " మేనక గారు ఇలా ఉంటారా? " అని రాకేష్ అడిగాడు. వెంటనే ప్రదీప్ " ఆయనేమైనా వెళ్ళి చూసొచ్చారేంటి?" అన్నాడు. ఇక వెంటనే ఇమ్మానుయేల్ వచ్చాడు. " మా అక్క అనబెల్. నేను చెల్లి బెల్ " అన్నాడు. ఇక శ్రీదేవి ఐతే "ఎంత క్యూట్ గా ఉన్నారంటే " అంటూ తెగ మెచ్చుకుంది. " నేను అందరినీ బొమ్మలో బంధిస్తా డైరెక్ట్గా బొమ్మే వచ్చింది" అన్నాడు హరి . "వొద్దు నేనిప్పుడే వచ్చిన సీసాలో " అంటూ కాసేపు స్కిప్పింగ్ రోప్ ఆడుకున్నారు. ఇక రీతూ బ్లాక్ డ్రెస్ మంత్రగత్తెలా వచ్చి " సమస్య కుక్కు విత్ జాతరత్నాలకి ఉన్న సమస్య ఏంటంటే పవన్ని విన్నర్ చేస్తే సమస్య తీరిపోదు" అని చెప్పింది. " "ఇంట్లో ఉన్న సమస్యలు చెప్పకు ఈడ " అంటూ యాదమ్మ రాజు కౌంటర్ వేసాడు.
Jun 11, 2026 12:39PM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com








