
Brahmamudi:వెంకీ లవ్ స్టోరీలో నందు మాస్టర్ ప్లాన్.. మధ్యలో ఎంటర్ అయిన పోలీసులు!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -994 లో......వెంకీ లవ్ కి హెల్ప్ చేస్తానని నందు మాటిస్తుంది. దాంతో వెంకీ లవర్ తనని నిజంగానే లవ్ చేస్తుందో లేదో టెస్ట్ చెయ్యడానికి రెస్టారెంట్ లో వెంకీని తన లవర్ రోజాతో కలవమని చెప్తుంది. వెంకీ, రోజా ఒక టేబుల్ పై కూర్చొని ఉంటారు. దూరంగా మరొక టేబుల్ మీద నందు కూర్చొని వెంకీకీ బ్లూ టూత్ ద్వారా ఏం మాట్లాడాలో చెప్తుంది. మొదట నందు చెప్పినట్లు వెంకీ మాట్లాడతాడు. దాంతో రోజా ఇంప్రెస్ అవుతుంది. ఆ తర్వాత నందు తన ముందు టేబుల్ పై ఒక దొంగ కన్పిస్తాడు. తనని పట్టుకోవడానికి నందు అతని వెంట పరుగెడుతుంది. వెంకీకీ రోజాతో ఏం మాట్లాడాలో అర్థం కాదు.. వెంకీ ఏదో మాట్లాడుతుంటే రోజా చిరాకుగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరొకవైపు ఇందు వెళ్తుంటే రాజు, లక్కీ తనకి డాష్ ఇస్తారు. దాంతో తన కూరగాయలన్నీ కిందపడిపోతాయ్. ఎప్పటిలాగా రాజు, ఇందులకి గొడవ అవుతుంది. కూరగాయలన్నీ తీసి లక్కీ ఇస్తాడు. నాకు కిందపడ్డ కూరగాయలు వద్దని ఇందు గొడవ చేస్తుంది. దాంతో లక్కీ తనని కూల్ చేసి ఫ్రెష్ కూరగాయలు నేను ఇప్పిస్తానంటూ అన్ని కూరగాయలు కొనిస్తాడు. మరొకవైపు నందు దొంగ వెంట పరుగెడుతుంది. నేను దొరికిన పర్వాలేదు గానీ ఈ బ్యాగ్ అన్నకి చేరాలని రౌడీ అనుకొని అటుగా వస్తున్న రాజు, లక్కీ లని రిక్వెస్ట్ చేస్తాడు. కొంచెం ఈ బ్యాగ్ ముందు ఒక అన్నకి ఇవ్వాలని చెప్తాడు. ఆ అన్నకి ఇస్తే మీకు పదివేలు ఇస్తానని రౌడీ అనగానే సరేనని రాజు, లక్కీ కక్కుర్తిపడి బ్యాగ్ పట్టుకొని వెళ్తారు. అందులో మత్తుకి సంబంధించిన ప్యాకెట్స్ ఉంటాయి. రౌడీ దగ్గరికి పోలీసులని తీసుకొని వస్తుంది నందు. రాజు, లక్కీ ఇద్దరు బ్యాగ్ తో వెళ్తుంటే పోలీసులు చూసి వాళ్ళని ఫాలో అవుతుంటే రాజు, లక్కీకి డౌట్ వచ్చి వాళ్ళకి దొరకకుండా వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 01, 2026
Podharillu : హారికకు షాక్ ఇచ్చిన మహా.. నారాయణ కోసం వైన్స్ షాపుకు వెళ్లిన కోడలు!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -82 లో.....నారాయణని మహా హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుంది. జరిగిందంతా చెప్పాడని చక్రికి ఫోన్ చేస్తుంది. అన్నయ్య కాలేజీకి వచ్చాడు.. ఇలా గొడవ జరిగింది.. అన్నయ్య కత్తితో పొడిచాడని చెప్పగానే చక్రి షాక్ అవుతాడు. ఏ హాస్పిటల్ నేను వస్తానని చక్రి అడుగుతాడు. వద్దు పర్వాలేదు నేను అంతా చూసుకుంటానని మహా చెప్తుంది. ఆ తర్వాత నారాయణ స్పృహలోకి వస్తాడు. డాక్టర్ చెకప్ చేసి డిశ్చార్జ్ చేస్తాడు. నారాయణని మహా పట్టుకొని నడిపించాలని ట్రై చేస్తుంటే అవసరం లేదమ్మ స్ట్రాంగ్ బాడీ ఇక్కడ అని తనే నడుస్తాడు. ఆ తర్వాత నారాయణని తీసుకొని మహా ఇంటికి బయలుదేర్తుంది.. నొప్పి అంటూ నారాయణ ఇబ్బంది పడుతాడు. మందు ఉంటే బాగుండు అని డ్రైవర్ తో నారాయణ అనడం మహా వింటుంది. ఆ మందు తాగి మత్తుగా పడుకుంటాడని మహా అనుకొని వైన్స్ దగ్గరికి వెళ్లి మందు కొనుక్కొని వస్తుంది. అది నారాయణకి ఇస్తుంది. అది చూసి నారాయణ షాక్ అవుతాడు. నువ్వు వెళ్లి తీసుకొని రావడం ఏంటమ్మా అని నారాయణ అంటాడు. మరి ఇచ్చేసి రానా అని మహా అనగానే వద్దులే అమ్మ అని తీసుకొని తాగి మత్తుగా పడుకుంటాడు. ఆ తర్వాత ఇంటికి చేరుకుంటారు. జరిగింది తెలిసి ఇంట్లో వాళ్లంతా మహా వాళ్ళ అన్నయ్యపై కోపంగా ఉంటారు. అసలు వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి ఇంకొకసారి మీ జోలికి రాకుండా చూస్తామని కేశవ వాళ్ళు అంటుంటే వద్దు వదిలెయ్యండి అని మహా అంటుంది. నారాయణకి దగ్గర ఉండి టాబ్లెట్స్ ఇస్తుంది మహా. ఆ తర్వాత రాత్రి మహాకి హారిక ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఏదో గొడవ జరిగిందంట అని అడుగుతుంది. గొడవ కాదు మీ ఆయన చక్రి వాళ్ళ నాన్నని కత్తితో పొడిచాడని అనగానే హారిక షాక్ అవుతుంది. ఇప్పుడు బాగున్నాడు తను కేసు పెడితే మీ ఆయన ఎక్కడ ఉంటాడు.. ఇంకొకసారి మా జోలికి రాకండి అని మహా కోపంగా ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 01, 2026
Jayam serial:పెద్దసారు ప్రాణాల మీదకు తెచ్చిన వీరు.. రుద్ర కాపాడగలడా?
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -231 లో...... గుడికి గంగ, రుద్ర, రంగా ముగ్గురు వచ్చి సీతారాముల కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తారు. ఆ తర్వాత పెద్దసారు కుటుంబంతో ఎంట్రీ ఇస్తాడు. శకుంతల కోపంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావ్.. నేను పోతే నువ్వు హ్యాపీగా ఉంటావా అని పెద్దసారు అనగానే ఏంటండీ ఆ మాటలు అని శకుంతల అంటుంది. పెద్దనాన్న ఆ మాటలు అనడం తప్పు.. ముందు పెద్దమ్మకి సారీ చెప్పు అని స్నేహ అనగానే సరే అని పెద్దసారు సారీ చెప్తాడు. దాంతో శకుంతల నవ్వుతుంది. ఆ తర్వాత తలంబ్రాలు తీసుకొని రమ్మంటే ఇవి తెచ్చారేంటి.. అయినా మీకు పెళ్లి గురించి ఏం తెలుసు.. ఏదో చిన్నపిల్లలకి చాక్లెట్ ఇచ్చినట్లు మెడలో తాళి కట్టి బాక్సింగ్ కి తీసుకొని వెళ్లారని రుద్రతో అనగానే అనగానే అయితే ఇప్పుడు మీకు మళ్ళీ పెళ్లి చేయమంటారా అని పెద్దసారు అడుగుతాడు. ఈ తింగరిదాన్ని ఒక్కసారి చేసుకునే భరించలేకపోతున్నాను.. ఇప్పుడు మళ్ళీ అంటే నాతో అవ్వదని రుద్ర అనగానే అందరు నవ్వుకుంటారు. అప్పుడే కార్తీక్ వస్తాడు. ఎవరు ఇతను అని పెద్దసారు అడుగగా సేల్స్ మేనేజర్ అని రుద్ర చెప్తాడు. ఎక్కడో చూసానని ఇషిక అనగానే..... ఇందుమతి గారు మీకు మనవడు కావాలంటే గుళ్లో ఇరవై ఒక్క ప్రధాక్షనలు మీ కోడలు చెయ్యాలని రంగా అనగానే ఇషిక పదా అని తనని ఇందుమతి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత పంతులు రాముడి గొప్పతనం గురించి అందరికి వివరిస్తాడు. వీరు మనుషులు పెద్దసారుని చంపాలని ట్రై చేస్తుంటే రుద్ర అడుగడుగునా అడ్డుకుంటాడు. ఆ తర్వాత ప్రమీలని చూసి కొంతమంది ఆడవాళ్లు తిడతారు. అప్పుడే కార్తీక్ వచ్చి మీరు మనుషులేనా అంటూ వాళ్ళపై కోప్పడి ప్రమీలకి ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత రౌడీలకి వీరు ఫోన్ చేసి మాట్లాడతాడు. తరువాయి భాగం లో వీరునే రంగంలోకి దిగి పెద్దసారుని షూట్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 01, 2026
Karthika Deepam2:జ్యోత్స్న పార్టీ ప్లాన్.. కార్తీక్ అనుమానం నిజమవుతుందా?
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2(Karthika Deepam2)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్- 632 లో.. దీప దగ్గరికి పారిజాతం వచ్చి మనవరాలా అంటూ హగ్ చేసుకుంటుంది. అది చూసి మనవరాలా అని కాంచన, అనసూయ, కార్తీక్ అడుగుతాడు. తను నాకు మనవరాలు లాంటిది అని పారిజాతం కవర్ చేస్తుంది. పొద్దున్నేమో తిట్టేసి ఇప్పడేమో మనవరాలా అంటు వస్తావా అని కార్తీక్ అడుగుతాడు. నాకు జ్ఞానోదయం అయిందిరా.. నా అంతరాత్మ నన్ను తిట్టిందిరా అని పారిజాతం అంటుంది. అప్పుడే శౌర్య వస్తుంది. తనని చూడగానే నా మునిమరాలు అని గట్టిగా హగ్ చేసుకొని ముద్దులు పెడుతుంది.ఈవిడేంటి తేడాగా ప్రవర్తిస్తుందని అనసూయ అనగానే నాకు కూడా అలాగే అనిపిస్తుందని కాంచన అంటుంది. అలా ఏం లేదు.. నేను బాగానే ఉన్నా కాంచన.. నువ్వు నా కూతురివి.. తను అనసూయ.. దీప నా మనవరాలు అంటూ మళ్ళీ ఆగిపోయి.. నా మనవరాలు లాంటిది అని పారిజాతం కవర్ చేస్తుంది. ఆ తర్వాత కుబేర్ ఫోటో చూసిన పారిజాతం.. చాలా గొప్ప మనసున్న మనిషి అని అంటుంది. కుబేర్ కి చిన్నపాటి గుడికట్టాలని పారిజాతం అనగానే వద్దులే అమ్మా మా వాడిని వదిలేయండి అని అనసూయ అంటుంది. ఆ తర్వాత పారిజాతాన్ని ఇంటికి పంపిస్తాడు కార్తీక్. ఇక తను వెళ్ళాక ఏంటి బావ ఇదంతా అని కార్తీక్ ని దీప అడుగగా.. దాస్ మామయ్య కూతురు నువ్వే అని చెప్పా అంతే అని కార్తీక్ అంటాడు. అయ్యో పాపం అని దీప అనగానే పాపాలు చేసేవాళ్ళని పాపం అనడం మహాపాపం అని కార్తీక్ అంటాడు. నీకు ఈ సమయంలో ఎంటర్టైన్మెంట్ చాలా అవసరం.. నేను ఇస్తాను కదా.. నువ్వు ఎంజాయ్ చెయ్ అని దీపతో కార్తీక్ అంటాడు. మరోవైపు సుమిత్ర, దశరథ్, జ్యోత్స్న, శివన్నారాయణ మాట్లాడుకుంటారు. మమ్మీ క్షేమంగా ఇంటికి వచ్చిన సందర్భంగా రేపు మన ఇంట్లో పార్టీ ఇద్దామనుకున్నా.. మన రెండు కుటుంబాల మధ్య ఉన్న చిన్నచిన్న అభిప్రాయభేదాలు తొలగిపోయి.. అందరం కలిసిపోవాలని జ్యోత్స్న చెప్తుంది. నీ ఆలోచన బాగుందని శివన్నారాయణ అంటాడు. మంచిదానివే .. తొందరగా పెళ్ళి చేసుకుంటే మేం సంతోషిస్తామని సుమిత్ర అనగానే రేపు చెప్తాను మమ్మీ అని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత సుమిత్ర, దశరథ్ తమ గదిలోకి వెళ్తారు. శివన్నారాయణ గుమ్మం దగ్గరికి వెళ్ళి పారిజాతం కోసం ఎదురుచూస్తుంటాడు. అప్పుడే ఎగురుకుంటూ వస్తుంది పారిజాతం. ఏంటి ఈ గంతులేంటి అని శివన్నారాయణ అనగానే వాకింగ్ కి వెళ్లానండి.. ఈ గల్లీ నుండి ఆ గల్లీకీ.. ఆ గల్లీ నుండి పక్క గల్లీకి వెళ్ళి వచ్చా అందుకే ఈ ఆయాసం, చెమటలు అని పారిజాతం అనగానే శివన్నారాయణ ఫోన్ లో ఒక వీడియో చూపిస్తాడు. అందులో దీప, శౌర్యలని పారిజాతం హగ్ చేసుకునేది ఉంటుంది. అది చూసి పారిజాతం షాక్ అవుతుంది. అర్థం అయిందా అని శివన్నారాయణ అనగానే అర్థమైంది.. ఆ కార్తీక్ గాడు నేనేం చేసినా నా వెనకే ఉంటాడని అనగానే అప్పుడే కార్తీక్ వస్తాడు. ఇక పారిజాతాన్ని కార్తీక్ కాసేపు ఆడుకుంటాడు. ఆ తర్వాత ఎందుకు వెళ్ళావ్ వాళ్ళింటికి అని శివన్నారాయణ అడుగుతాడు కానీ పారిజాతం కవర్ చేస్తుంది. జ్యోత్స్న వచ్చి అడుగుతుంది నా ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్ దగ్గరికి జ్యోత్స్న వచ్చి.. రేపు ఇంట్లో పార్టీ ఉంది.. దీప తప్పకుండా రావాలని జ్యోత్స్న అనగానే తను రాదని కార్తీక్ చెప్తాడు. లేదు రావాలి.. తను నాకిప్పుడు స్పెషల్ గెస్ట్ నేను స్పెషల్ గా ఇన్వైట్ చేసానని చెప్పు బావ అని జ్యోత్స్న అనగానే కాంచనకి నేను ఫోన్ చేసి చెప్తానని శివన్నారాయణ అంటాడు. చిన్నమరదలు ఏదో పెద్దగానే ప్లాన్ చేసినట్టుందని కార్తీక్ అనుకుంటాడు. ఇక దీప దగ్గరికి ఎందుకు వెళ్ళావని పారిజాతాన్ని జ్యోత్స్న నిలదీస్తుంది. నా ఇష్టం అని చెప్పేసి పారిజాతం వెళ్ళిపోతుంది. మరోవైపు కార్తీక్, కాంచన, అనసూయ, దీప మాట్లాడుకుంటారు. మళ్ళీ మనం ఏం ముఖం పెట్టుకుని వెళ్తామని కాంచన అనగానే మీ నాన్న నీకు ఫోన్ చేసాడు కాబట్టి నువ్వు వెళ్ళాలని కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 01, 2026
Illu illalu pillalu: బావ చేతిలో దెబ్బతిన్న శ్రీవల్లి.. అసలు నిజం తెలిశాక చందు ఏం చేశాడు?
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-433 లో.. శ్రీవల్లి ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చి టీచర్ జాబ్ చేస్తున్నట్టు అందరిని మోసం చేసిందని చందు తెలుసుకొని తన చెంప చెల్లుమనిపిస్తాడు. నిన్ను మా నాన్న ఎంతో నమ్మాడు కదే.. ఇన్ని అబద్ధాలు చెప్తారా..ఇంత మోసం చేస్తారా.. అయిన తనకి కాబోయే కోడలు చదువుకోవాలని మా నాన్న ఏం అడుగలేదు కదా.. నీ బ్రతుకే అబద్ధం అని చందు తిడతాడు. అయ్యో బావ.. అదేం కాదు.. నేను చెప్పేది విను బావ.. నిన్ను పెళ్ళి చేసుకోడానికే అలా చెప్పాను కానీ నిన్ను మోసం చేయాలని కాదు బావ అని శ్రీవల్లి రిక్వెస్ట్ చేస్తుంటే తనని అక్కడే వదిలేసి బైక్ పై వెళ్ళిపోతాడు. ఇక శ్రీవల్లి ఏడుస్తూ ఇంటికి వస్తుంటే భాగ్యం కాల్ చేస్తుంది. ఏమైంది అమ్మడు అని అనగానే తనపై కోప్పడుతుంది శ్రీవల్లి. నువ్వు ఇంటికి వెళ్లు.. మేం అక్కడికి వస్తున్నామని భాగ్యం అంటుంది. మరోవైపు శ్రీవల్లి కోసం నర్మద, ప్రేమ ఎదురుచూస్తుంటారు. అప్పుడే చందు ఫుల్ కోపంగా రావడం చూసి..వల్లికి గట్టిగనే అయినట్టుందని అనుకుంటారు. కాసేపటికి వల్లి ఏడ్చుకుంటూ చెంపకి చేతిని అడ్డుగా పెట్టుకొని వస్తుంది. ఇక నర్మద, ప్రేమ వెళ్ళి ఏంటి అక్కా అలా ఉన్నావని అడుగుతారు. చేసిందంతా చేసి ఏ తెలియనట్లు మళ్ళీ పుండు మీద కారం చల్లినట్టు మాట్లాడుతున్నారని కోపంగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత భాగ్యం , ఆనందరావు వస్తారు. ఏంటి బాబాయ్ ఈ టైమ్ లో వచ్చారని నర్మద, ప్రేమ అడుగుతారు. ఏం అయిందని ముహూర్తం బాలేదా అని భాగ్యం అడుగగా.. మీకు బ్యాడ్ టైమ్ నడుస్తుంది.. మామయ్య గారు మీ మీద ఫుల్ కోపంగా ఉన్నాడని నర్మద, ప్రేమ చెప్తారు. అదే సమయంలో రామరాజు గునపం తీసుకొని వస్తాడు. అది చూసి భాగ్యం, అనందరావులని నర్మద, ప్రేమ భయపెడతారు. వెళ్ళి కాళ్ళ మీద పడండి. క్షమిస్తాడని నర్మద, ప్రేమ అనగానే భాగ్యం, ఆనందరావు ఇద్దరు వెళ్ళి రామరాజు కాళ్ళ మీద పడతారు. మమ్మల్ని క్షమించమని అడుగుతారు. ఎందుకని రామరాజు అనగానే మీరు వృద్ధాశ్రమం కోసం పదిలక్షలు ఇచ్చారు కదా.. నష్టపోయామని భాగ్యం కవర్ చేస్తుంది. ఆ తర్వాత రామరాజు వెళ్ళిపోతాడు. ఏంటి అమ్మడు అంతా లీక్ అయిందని చెప్పావని భాగ్యం అడుగుతుంది. మీరు ఇంకొకసారి ఇంటికవచ్చినా.. ఇంకొక క్షణం ఇక్కడే ఉన్నా మీ బంఢారం బయటపడిపోద్దని నర్మద అనగానే ఆశ, దోశ, అప్పడం వడ మీకు ఆ ఛాన్స్ ఇస్తామా అని ఆనందరావు అంటాడు. భాగ్యం, ఆనందరావు ఇద్దరు పారిపోతారు. ఆ తర్వాత శ్రీవల్లి దగ్గరికి నర్మద, ప్రేమ వెళ్తారు. రేపు ఉదయం నీకు అసలు సినిమా ఉందని శ్రీవల్లితో నర్మద, ప్రేమ చెప్పి వెళ్తారు. అయ్యో దేవుడా.. వీళ్ళు మళ్ళీ ఏం పెంట చేశారో ఏమో అని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. మరోవైపు రామారాజు కొబ్బరి కాయలు పొట్టుతీస్తుంటాడు. కాసేపటికి వేదవతి మజ్జిగ తీసుకొని వచ్చి రామరాజుకి ఇస్తుంది. తను కూడా కొబ్బరి కాయలు పొట్టు తీస్తానని వేదవతి అడుగగా ఇద్దరు కలిసి తీస్తారు. ఆ తర్వాత ధీరజ్ వస్తాడు.. ముగ్గురం ఉన్నాం..ఇంకా నువ్వు ఇలా కష్టపడాలా.. నేను చేస్తాను మీరు వెళ్ళండి నాన్న అని రామారాజుని ధీరజ్ ఇంట్లోకి పంపిస్తాడు. ఆ తర్వాత ధీరజ్ కోసం ప్రేమ కాఫీ తీసుకొని వస్తుంది. తను వద్దని అంటాడు. రేయ్ చిన్నోడా నేనే నీ కోసం చేశానురా.. తనతో ఇచ్చి పంపించా అని వేదవతి అనగానే.. మా అమ్మ నా కోసం ప్రేమతో చేసింది కాబట్టి తాగుతున్నానని తాగుతాడు ధీరజ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 01, 2026
Brahmamudi: రాజు గతం వెనుక ఉన్న రహస్యం ఏంటి..లక్ష్మి దంపతుల భయం నిజమవుతుందా!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -993 లో..... రాజు ని చూసి రాజ్ బావ లాగా ఉన్నాడు ఏంటని రేఖ టెన్షన్ పడుతుంది. ఆ టెన్షన్ తో డ్రింక్ చేస్తుంది. అప్పుడే భ్రమరాంబ వస్తుంది. ఏంటి రేఖ నువ్వు ఐశ్వర్య ఫ్రెండ్స్ వచ్చి వెళ్ళినప్పటి నుండి కంగారు పడుతున్నావ్ ఏంటని అడుగుతుంది. చనిపోయాడనుకున్న వాడు వస్తే ఎలా ఉంటుంది. మా అమ్మ తన చేతులతో రాజ్ బావని చంపేసింది కానీ ప్రొద్దున వచ్చిన అతను అచ్చం రాజ్ భావాలాగే ఉన్నాడు అలా ఎలా సాధ్యమని రేఖ అనగానే భ్రమరాంబ షాక్ అవుతుంది. ఒకవేళ రాజ్ మేనల్లుడు స్వరాజ్ అయి ఉండొచ్చు అదే కనుక నిజం అయితే ఇన్నాళ్లు ఆస్తులు కోసం వేచి వున్నది వృధా అవుతుంది. వాడు వస్తే ఇప్పుడు ఆ ఇందుకి తోడుగా ఉంటే మనం ఏం చెయ్యలేమని రేఖ అంటుంది. ఆ తర్వాత రాజు నిద్రలో ఉల్లిక్కిపడి లేస్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ లక్ష్మి చూసి.. వీడేంటి ఇలా ప్రతీసారి నిద్రలో ఉలిక్కిపడి లేస్తున్నాడు. తనకి గతం గుర్తుకి వస్తుంది కావచ్చు .. మనం నిజం దాచి తప్పు చేసామా అని తన భర్తతో లక్ష్మీ అంటుంది. తన పేరెంట్స్ ఉంటే వెతుకుంటూ వచ్చేవాళ్ళు కదా అని లక్ష్మీ భర్త తనతో అంటాడు. ఆ తర్వాత రాజు గురించి తెలుసుకోవడానికి రేఖ తన మనిషిని జనాభా లెక్కల అధికారిగా రాజు ఇంటికి పంపిస్తుంది. అతను అన్ని కనుక్కొని రేఖ దగ్గరికి వెళ్తాడు. అతను వాళ్ళ కొడుకే అంట మేడం.. చుట్టుపక్కన వాళ్ళు కూడా చెప్పారని అతను రేఖకి చెప్పగానే హమ్మయ్య వాడు స్వరాజ్ కాదన్న మాట అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఐశ్వర్య దగ్గరికి ఇందు వస్తుంది. రేఖ అంటి నీకు డబ్బు ఇస్తుంది కదా మరి ఎందుకు నెక్లెస్ తీసావ్.. అన్ని అప్పులు అయ్యయా అని ఇందు అడుగుతుంటే తనపై ఐశ్వర్య సీరియస్ అవుతుంది. మరొకవైపు వెంకీనీ అతని లవర్ ని కలపడానికి నందు హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Mar 31, 2026
Podharillu: నారాయణపై ప్రాణాంతక దాడి చేసిన ఆది.. మహాలక్ష్మి పరిస్థితి ఏంటి?
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -81 లో......మాధవకి మహా ఫోన్ చేస్తుంది. నాతో పాటు మీ నాన్న కూడా వస్తున్నాడు.. నాకు ఇబ్బందిగా ఉందని మహా అనగానే మాధవ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి నువ్వు వెళ్ళకని అంటాడు. అవసరం లేదు నేను వెళ్తానని నారాయణ అంటాడు. ఆ తర్వాత నాన్న వెళ్తే ఏంట్రా మనం మహాలక్ష్మి ఎలా వెళ్లి వస్తుందోనని భయపడుతున్నాం కదా నాన్న ఉంటే సేఫ్టీగా తీసుకొని వస్తాడని చక్రితో మాధవ అనగానే అయితే తను వచ్చేవరకు నేను రిలాక్స్ గా ఉంటానని చక్రి అంటాడు. ఆ తర్వాత కేశవని ఇంట్లో ఇరికించిందని కేశవ కోపంగా శైలుని ఇంట్లో వాళ్ళ ముందు ఇరికిస్తాడు. ఫోన్ చేసి నేను కాలేజీ నుండి మాట్లాడుతున్న మీ అమ్మాయి చదవడం లేదు ఫోన్ రీల్స్ అని టైమ్ పాస్ చేస్తుందని అంటాడు. దాంతో నువ్వు కాలేజీలో ఏం చదవడం లేదంట మీ సర్ కాల్ చేసి చెప్పారని వాళ్ళ నాన్న శైలుని అడుగుతాడు. దాంతో కేశవకి కాల్ చేస్తుంది శైలు. తనని రిక్వెస్ట్ చేసి ఆ ఫోన్ వేరే వాళ్ళకి చెయ్యబోయ్ మీకు చేసామని చెప్పండి అని కేశవని శైలు రిక్వెస్ట్ చేయగా శైలు చెప్పమన్నట్లే చెప్తాడు. ఆ తర్వాత నారాయణ మధ్య మధ్యలో కార్ ఆపమంటూ మహాకి బిర్యానీ తీసుకొని రమ్మని అంటాడు. ఆ తర్వాత మహాని తీసుకొని నారాయణ కాలేజీకీ వస్తాడు. నేను బయట ఉంటాను ఏదైనా సమస్య ఉంటే పిలవమని నారాయణ చెప్తాడు. మహా తన ఫ్రెండ్ తో కలిసి లోపలికి వెళ్తుంది. అక్కడ క్లర్క్ ఉండి మహాతో మాట్లాడి సర్టిఫికేట్లు గురించి మేడమ్ తో మాట్లాడమని చెప్పి బయటకు వెళ్తాడు. క్లర్క్ మహా వాళ్ళ అన్నయ్య ఆదికి ఫోన్ చేస్తాడు. మీ చెల్లి కాలేజీకీ వచ్చిందని ఆదికి క్లర్క్ చెప్తాడు. మంచి టైమ్ ఇప్పుడే లాక్కొని వచ్చి ఇంట్లో పడేస్తానని ఆది అనుకోని.. నేను వస్తున్నాను.. వచ్చేవరకు అక్కడే ఉండేలా చూడమని ఆది చెప్తాడు. దాంతో క్లర్క్ సరే అంటాడు. ఆ తర్వాత సర్టిఫికేట్లు పోయాయని ముందుగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలని.. ఆ కాపీ మాకు కావాలని అక్కడ ఒక మేడమ్ చెప్తుంది. ఏమో నాకు తెలియదని మహా అంటుంది. అబ్బా మళ్ళీ మొదటికి వచ్చిందే అని మహా డిస్సపాయింట్ అవుతుంది. ఆ తర్వాత మహా బయటకు వస్తుంటే అప్పుడే ఆది కార్ లో వస్తాడు. నువ్వు ఎప్పుడు కాలేజీకి వస్తావోనని వెయిట్ చేస్తున్నానని మహాతో ఆది అంటాడు. మహాని బలవంతంగా తీసుకొని వెళ్లే ప్రయత్నం చేస్తాడు ఆది. దాంతో నారాయణ అడ్డుపడుతాడు. కాసేపు నారాయణ, ఆది మధ్యలో తోపులాట జరుగుతుంది. ఇక కార్ లో ఉన్న ఒక కత్తిని ఆది తీసుకొని నారాయణ కడుపులో పొడుస్తాడు. దాంతో ఆదిని మహా కొడుతుంది. వెంటనే నారాయణని తీసుకొని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుంది మహా. ఆ విషయం చక్రికి చెప్పాలని ఫోన్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Mar 31, 2026
Jayam Serial : రుద్ర, గంగలకు షాక్ ఇవ్వబోతున్న వీరు.. కళ్యాణం వేళ అసలు ప్లాన్ ఇదే!
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -230 లో..... వీరు దగ్గరికి ఇషిక వస్తుంది. బ్రో ఏం చేస్తున్నావని అడుగుతుంది. ఏం లేదు రేపు కళ్యాణానికి అవసరమైనవి చూస్తున్నానని అంటాడు. చూసావా రుద్ర, గంగల చేతుల మీదుగా కళ్యాణం జరుగుతుందంట.. నేను మా వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు నన్ను పక్కకి నెట్టారు చూసావా అని ఇషిక అంటుంది. రుద్ర, గంగల చేతుల మీదుగా జరిగితేనా వాళ్ళు బిజీగా ఉంటారు.. మనల్ని ఎవరు పట్టించుకోరు మన పని ఈజీ గ అవుతుందని వీరు అనగానే కరెక్ట్ బ్రో అని ఇషిక అంటుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి శకుంతలని కళ్యాణం దగ్గరికి వచ్చేలా రెచ్చగొడతారు. మరుసటిరోజు ఇందుమతి రెడీ అయి కోడలు కొడుకు దగ్గరికి వెళ్తుంది. సూర్య,ఇషిక రెడీ అవుతారు ఇద్దరు బాగున్నారు. మీ చేతిలో ఒక బేబీ ఉంటే బాగుంటుందని ఇందుమతి అనగానే సరే నేను వెళ్తున్నానని ఇషిక అక్కడ నుండి వీరు దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. తన వెనకాలే ఇందుమతి, సూర్య వెళ్తారు. దూరం నుండి వాళ్ళు మాట్లాడుకునేది వింటారు. బిజినెస్ గురించి అయి ఉంటుందని ఇద్దరు అనుకుంటారు. నేను అంతా చూసుకుంటాను. నువ్వు వెళ్లి మీ అత్తయ్య కోరిక తీరాలని మొక్కుకని వీరు అంటాడు. ఆ మాట ఇందుమతి విని వీరు ఎంత మంచోడు అని అనుకుంటుంది. ఇషిక అక్కడ నుండి వచ్చాక ఏంటి ఇషిక వీరుతో ఏం మాట్లాడుతున్నవని అడుగుతుంది. కొంపదీసి విందా ఏంటి అని ఇషిక టెన్షన్ పడుతుంది. వినలేదని తన మాటల్లో అర్థమవుతుంది. ఆ తర్వాత వీరు జ్యూస్ తీసుకొని వెళ్తుంటే రంగా ఎదరుపడతాడు. ఏంట్రా చుట్టంచూపులాగా వచ్చావ్ .. న్ని రోజులు ఇక్కడే ఉంటావని రంగాని వీరు అడుగుతాడు. అప్పుడే రుద్ర వచ్చి రంగాకి సైగ చేస్తాడు. అవును ఎన్ని రోజులు ఉంటావ్ ఇలా ఎవరు లేకుండా వచ్చి ఇక్కడే సెటిల్ అవుదామని అనుకుంటున్నావా అని రుద్ర అనగానే అప్పుడే గంగ వచ్చి మా అన్నయ్య ఏమైనా ఇక్కడే ఉండి కుట్రలు చేస్తున్నాడనుకుంటున్నారా అని వీరు మైండ్ బ్లాంక్ అయ్యేలా మాట్లాడతారు. ఎవరు ఎన్ని రోజులు అయినా ఉండొచ్చు.. నేను సరదాగా అన్నానని వీరు అంటాడు. ఆ తర్వాత కళ్యాణానికి కార్తీక్, మక్కామ్ ని కూడా పిలుస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Mar 31, 2026
Karthika Deepam2: నిజం తెలుసుకున్న జ్యోత్స్న.. దీపను మనవరాలుగా అంగీకరించిన పారిజాతం!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2 (Karthika Deepam2)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-631లో.. కాంచన వాళ్ళింట్లో కార్తీక్, దీప, కాంచన ముగ్గురు మాట్లాడుకుంటారు. మామయ్య వీలునామాలో ఆ సెకెండ్ క్లాజ్ పెట్టకుంటే..ఆస్తి ఎప్పటికైనా నాదే అని ధీమాతో పారిజాతంతో కలిసి జ్యోత్స్న ఎవరినో ఒకరిని ఇబ్బంది పెడుతూనే ఉంటుందని కార్తీక్ అనగానే అవునురా అని కాంచన అంటుంది. ఇలాంటి సమయంలో జ్యోత్స్నకి పారిజాతం ఏం సలహా ఇస్తుందంటే.. ఒసేయ్ మనవరాలా.. ఓ పదిహేను నెలల్లో నువ్వు పెళ్ళి చేసుకొని పిల్లల్ని కనకపోతే ఆ కార్తీక్ గాడు ఆస్తులన్నీ ఎగరేసుకుపోతాడని కార్తీక్ చెప్పగానే అవునురా అని కాంచన అంటుంది. నాకు ఏమనిపిస్తుందంటే పారిజాతం మనమరాలు ఆ జ్యోత్స్ననేమో అనిపిస్తుందిరా అని కాంచన అనగానే కార్తీక్, దీప షాక్ అవుతారు. ఎందుకమ్మ అలా అనిపిస్తుందని కార్తీక్ అడుగగానే తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పుకొస్తుంది కాంచన. మరోవైపు జ్యోత్స్న డిఎన్ఏ రిపోర్ట్స్ కోసం పంపిన అతను వచ్చి.. జ్యోత్స్నకి ఇస్తాడు. ఇందులో ఉన్నవాటి ప్రకారం సుమిత్ర కూతురు జ్యోత్స్న కాదు.. దీప.. జ్యోత్స్న డీఎన్ఏ సాంపిల్స్ సుమిత్రతో మ్యాచ్ అవ్వలేదు.. దీపవి మాత్రమే మ్యాచ్ అయ్యాయని అతను చెప్పగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇంతకి జ్యోత్స్న ఎవరు అని అతను అనగానే తనకి డబ్బులు ఇచ్చి పంపించేస్తుంది. డబ్బులు ఇవ్వం పారిజాతం చూసి ఏంటే వాడికి డబ్బులు ఇచ్చావను అడుగుతుంది. దాంతో జ్యోత్స్న ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది. అదే సమయంలో పారిజాతానికి దాస్ కాల్ చేస్తాడు. ఇక కాసేపటికి దాస్ ని పారిజాతం కలుస్తుంది. ఏంట్రా అని అడుగగా.. నీ మనవరాలు ఎవరో తెలిసింది. మన ముందే ఉంది.. పోల్చుకోలేకపోయామని దాస్ అనగానే ఎక్కడరా.. ఎవరురా.. అంటూ తెలుసుకోవాలని కుతూహలంతో అడుగుతుంది. ఇంకెవరో కాదమ్మా ఆ దీపే నీ మనవరాలు.. కుబేర్ తీసుకెళ్ళింది నీ మనవరాలు దీపే అని దాస్ చెప్పగానే పారిజాతం షాక్ అవుతుంది. ఈ విషయం ఎవరికి చెప్పకు.. నీకు నాకు తప్ప ఎవరికి తెలియదని దాస్ అంటాడు. ఎందుకురా అని పారిజాతం అనగానే పిల్లల్ని మార్చిన ఆలోచన నీదే అని తెలిస్తే నిన్ను శివన్నారాయణ చంపేస్తాడని అనగానే అవునని పారిజాతం అనుకుంటుంది. ఇక దీప దగ్గరికి పారిజాతం పరుగున వెళ్తుంది. కాంచన వాళ్ళ ఇంటికి వెళ్ళి డోర్ కొడుతుంది పారిజాతం. ఒరేయ్ కార్తీక్ డోర్ తొయ్యరా అని గట్టిగా అరుస్తూ డోర్ కొడుతుంది. దీప. నీకు ఒక సర్ ప్రైజ్ ఉంది..నువ్వు ఇప్పుడు లోపలికి వెళ్ళి నేను పిలిచినప్పుడు బయటకు రా అని కార్తీక్ లోపలికి పంపించి డోర్ తీస్తాడు. పారిజాతం ఆగకుండా లోపలికి వచ్చి..దీప, దీప అని పిలిస్తే కాంచన, అనసూయ వస్తారు. ఏంటని వాళ్లు అడుగగా దీప ఎక్కడ అని దీప దీప అంటూ పిలుస్తుంది కాంచన. ఇక కార్తీక్ దీపని పిలవగానే తను వస్తుంది. తను రాగానే మనవరాలా అని గట్టిగా హగ్ చేసుకుంటుంది పారిజాతం. దాంతో.. మనవరాలా అని అనసూయ, కాంచన, కార్తీక్ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Mar 31, 2026
Illu illalu pillalu: నర్మద మాస్టర్ ప్లాన్.. అడ్డంగా బుక్కైపోయిన శ్రీవల్లి!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu )'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-432 లో సాగర్ ఆఫీస్ కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. కానీ పర్స్ లో డబ్బులు లేక.. నర్మదని అడుగలేక సతమతమవుతుంటాడు. అప్పుడే నర్మద పర్స్ తీసుకొని చూస్తుంది. వెంటనే తన పర్స్ లోని డబ్బులు తీసి సాగర్ పర్స్ లో పెట్టి పొద్దున బట్టలు ఉతికేటప్పుడు నీ షర్ట్ పాకెట్ లో దొరికినయి అని నర్మద అంటుంది. ఆ తర్వాత ముద్దు కావాలని నర్మద అడుగగా లేదని నుదుటిపై ఒక ముద్దు ఇచ్చి వెళ్ళిపోతాడు. శ్రీవల్లిని చందు స్కూల్ లో డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. శ్రీవల్లి ఎప్పటిలాగే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పరుగున వెళ్తుంది. ఇక అదే సమయంలో నర్మద, ప్రేమ తమ ప్లాన్ ని వర్కవుట్ చేస్తారు. చందుకి కాల్ చేస్తుంది నర్మద. ఏంటి నర్మద అని అడుగగా వల్లి అక్క కల్లు తిరిగి పడకపోయిందని చెప్తుంది. దాంతో చందు ఫాస్ట్ గా స్కూల్ కి వెళ్తాడు. మరోవైపు శ్రీవల్లి తన అమ్మ వాళ్ళింట్లో అన్నీ తింటూ ఉంటుంది. ఆ నర్మద, ప్రేమల టార్చర్ కి ఏం తింటున్నావో .. ఏం తినట్లేదో.. సరిగ్గా తిను అమ్మడు అని శ్రీవల్లికి భాగ్యం, ఆనందరావు ఇద్దరు కలిసి అన్ని పిండివంటలు తినిపిస్తుంటారు. మరోవైపు చందు స్కూల్ కి వెళ్తాడు. అక్కడ ఒక టీచర్ అని వల్లి గురించి అడుగగా అలాంటి పేరుతో ఇక్కడ ఎవరూ లేరని అంటుంది. దాంతో చందు షాక్ అవుతాడు. అదే సమయంలో ప్రిన్సిపల్ అక్కడికి వస్తాడు. నా భార్య వల్లి ఇక్కడ చేస్తుంది. కళ్ళు తిరిగి పడిపోయిందంటే వచ్చానని చందు అనగానే ప్రిన్సిపల్ అలాంటిదేం లేదని అంటాడు. ఒకే వల్లి అప్పట్లో వచ్చేది కానీ ఇప్పుడు రావడం లేదు.. మేమే మీకు ఫోన్ చేసి చెప్దామని అనుకున్నాం.. తమ సర్టిఫికెట్లు ఫేక్.. ఒకవేళ తను మా స్కూల్ వస్తానని చెప్పినా మేం తీసుకోమని చందుతో ప్రిన్సిపల్ అంటాడు. దాంతో చందు షాక్ అవుతాడు. ఇక శ్రీవల్లి ఫేక్ సర్టిఫికేట్లు ఇస్తాడు ప్రిన్సిపల్. అవి తీసుకొని నర్మదకి కాల్ చేస్తాడు చందు. నాకు అన్నూ తెలుసు బావ.. మీకు తన గురించి తెలియాలనే కాల్ చేసానని నర్మద అనగానే శ్రీవల్లి గతంలో ఏం చేసిందోనని అన్నీ గుర్తుచేసుకుంటాడు. ఇక శ్రీవల్లి వాళ్ళ ఇంటికి వెళ్తాడు చందు. అక్కడికి వెళ్ళి చూసేసరికి శ్రీవల్లి పిండిపదార్థాలు తింటూ ఉంటుంది. అది చూసి చందు షాక్ అవుతాడు. ఇక శ్రీవల్లికి కాల్ చేస్తాడు చందు. తను స్కూల్ లో ఉన్నట్టు యాక్ట్ చేస్తుంది. అదంతా చూసిన చందుకి ఫుల్ కోపం వస్తుంది. ఇక చందుని భాగ్యం, ఆనందరావు చూసి షాక్ అవుతారు. శ్రీవల్లి ఫోన్ లో అబద్ధాలు చెప్తుంటే చందుని చూపిస్తారు. దాంతో తను షాక్ అవుతుంది. ఇక వొంట్లో బాలేదని వల్లి చెప్పగా మరి ఆ సర్టిఫికేట్లు ఎందుకు పదా తీసుకొచ్చుకుందామని తనని బైక్ పై ఎక్కించుకొని స్కూల్ కి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళాక.. మామయ్య బాధపడతాడు బావ.. నాకు ఆరోగ్యం బాలేకపోయిన జాబ్ చేస్తానని వల్లి అనగానే నాన్నకి నేను చెప్పుకుంటానని చందు అంటాడు. అయినా వల్లి రాకపోయేసరికి.. నీవి ఫేక్ సర్టిఫికేట్లు అని నాకు తెలుసు అని చందు అనగానే వల్లి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Mar 31, 2026
ఆమె గోమతి.. ఈరోజు నుంచి ప్రదీప్ గారి శ్రీమతి..గ్యాస్ బండ తెచ్చుకోండి!
కుక్కు విత్ జాతి రత్నాలు షో లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో చాలామంది ఎంటర్టైన్ చేయడానికి వచ్చారు. ఐతే ఇందులో ఒక ఇంటరెస్టింగ్ విషయం కనిపించింది. ప్రోమో ఫైనల్ లో గోమతి వచ్చింది. జడ్జెస్ ఈమె గోమతి అని చెప్పాడు ప్రదీప్. వెంటనే గోమతి "ఇప్పటి నుంచి ప్రదీప్ మాచిరాజు గారి శ్రీమతి " అనేసింది. వెంటనే అవినాష్, ఇమ్మానుయేల్ వచ్చి ఇద్దరికీ హారతులు అవీ ఇచ్చారు. గోమతి చేతిలో ఉన్న గిన్నె మూత తీసి పాల పాకెట్ ని చూపించేసరికి " అన్నా అప్పుడే పాల వరకు వచ్చేసావా " అంటూ హరి కామెంట్ చేసాడు. వెంటనే గోమతి ఇంకో బాక్స్ ఓపెన్ చేసి మైసూర్ పాక్ తినిపించింది. ఇక జడ్జ్ అలీ ఇదంతా చూసి "బాబోయ్ ఈ అమ్మాయి మొత్తం సెటప్ తో వచ్చిందిరోయ్. లైట్స్ ఆఫ్ " అనేశాడు. ఇక గోమతి కూడా గులాబీ పూ రేఖల్ని ప్రదీప్ మీద జల్లింది ఆనందంతో. ఇక ప్రోమో స్టార్టింగ్ లో ఐతే ప్రదీప్ అన్నాడు "మీరు గెస్ట్ గా వస్తేనే క్యాన్ లు క్యాన్ లు కీర్ తెస్తారు మీ ఇంటికి ఒకసారి భోజనానికి వస్తాను " అన్నాడు అలీతో. సరే రా కానీ ఒక ఐటెం నువ్వు తెచ్చుకో అన్నాడు "కూరగాయలా " అన్నాడు ప్రదీప్. "గ్యాస్ బండ " అన్నాడు. "యు మీన్ గ్యాస్ సిలిండర్ " అని సైడ్ ఐపోయాడు ప్రదీప్. అసలే ప్రపంచమంతా గ్యాస్, చమురు కష్టాలు ఎలా ఉన్నాయో ఇందులో చూపించారు.
Mar 30, 2026
స్రష్టి వర్మ మీద నెగటివిటీ ఉంది వద్దు అన్నారు...కానీ నేను ఆమెనే సెలెక్ట్ చేసుకున్న!
బిబి జోడి సీజన్ 2 గ్రాండ్ ఫినాలే పూర్తయిపోయింది. నాలుగు జోడీలు ఫినాలే లోకి ఎంట్రీ ఇచ్చాయి. మానస్ - స్రష్టి వర్మ అమరదీప్ - నైనికా, నేహా - విశ్వ, శ్రీసత్య- అర్జున్ కళ్యాణ్. అందరూ పోటాపోటీగా డాన్స్ చేశారు. ఇక థర్డ్ పొజిషన్ లో అమరదీప్ - నైనికా సెకండ్ పొజిషన్ లో నేహా - విశ్వ ఉండగా విన్నర్ గా మానస్ - స్రష్టి వర్మ నిలిచారు. టైటిల్ తో పాటు 15 లక్షల క్యాష్ ప్రైజ్ ని విన్ అయ్యారు. ఇక స్రష్టి వర్మ ఏడ్చేసింది. "మానస్ కి థ్యాంక్స్ చెప్పాలి నా పార్టనర్ గా ఉన్నందుకు.. ప్రతీదాన్ని ప్రూవ్ చేసుకుంటూ వెళ్లడం అనేది చాలా కష్టమైన పని. కానీ మన గురించి మనం ప్రూవ్ చేసుకోవాలి అంటే ఇదంతా చేయాల్సి వస్తుంది " అంటూ ఏడుస్తూ చెప్పింది. ఇక మానస్ కూడా మాట్లాడాడు " కంటెస్టెంట్ దగ్గర నుంచి నాకు స్రష్టి కావాలనే అనుకున్నా ఎందుకంటే తనలో కసి ఉంది. చాలామంది అన్నారు స్రష్టి ఎందుకు నెగటివిటీ ఉంది వద్దు అన్నారు. కానీ నేను మాత్రం స్రష్టి వర్మనే కావాలి అని పట్టు బట్టాను. ఎలాగైనా నేను ప్రూవ్ చేసుకోవాలి అందరి నోర్లు మూయించాలి అనుకుంది అలాగే కసితో డాన్స్ చేసింది. నేను స్రష్టి వర్మ కలిసి ఒక సాంగ్ చేసాం అక్కడి నుంచి మా ధ్యాస ఒక్కటే..బిబి జోడి టైటిల్ విన్ అవ్వాలని అంతే " అన్నాడు.
Mar 30, 2026
Jayam serial: జయం సీరియల్లో రసవత్తరంగా సీతారాముల కళ్యాణం ఎపిసోడ్!
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం(Jayam)'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-229 లో... సీతారాముల కళ్యాణం మీ చేతులు మీదుగా జరిపించండి అని దేవాలయ కార్యకర్తలు పెద్దసారు దగ్గరికి వస్తారు. అంతకు మించిన అదృష్టం ఏముంది.. ఏ లోటుపాట్లు లేకుండా జరిపిద్దామని పెద్దసారు అంటాడు. నా తర్వాత నా వారసుడుగా రుద్ర ఎప్పటికి ఉంటాడని పెద్దసారు అంటాడు. అలా ఎలా అవుతుంది.. మీ వారసుడిగా మన అల్లుడు వీరు ఉంటాడని శకుంతల అంటుంది. సీతారాముల కళ్యాణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు మా అల్లుడు చూసుకుంటాడని శకుంతల చెప్తుంది. కాసేపటికి దేవాలయ కార్యాకర్తలు వెళ్ళిపోతారు. వీరు అన్ని ఏర్పాట్లు నువ్వు చూసుకో కళ్యాణానికి సంబంధించిన వస్తువులన్నీ ఇషిక ఇందుమతి మీరు లిస్ట్ చెయ్యండి అని శకుంతల చెప్తుంది. రేపు సీతారాముల కళ్యాణం జరిపించాల్సింది మనం కాదు.. రుద్ర, గంగ అని పెద్దసారు అనగానే వద్దని శకుంతల అంటుంది. భాను ఉంటే వాడి చేతుల మీదుగా జరిపించే దానివి కదా అని పెద్దసారు అంటాడు. భాను అంటే మన వారసుడు అని శకుంతల అనగానే రుద్ర కూడా మన వారాసుడే అని పెద్దసారు అంటాడు. దాంతో శకుంతల కోపంగా వెళ్ళిపోతుంది. మావయ్య గారు మీరు ఇంటిపెద్ద మీరు కళ్యాణం జరిపించకుంటే మా మావయ్య, అత్తయ్య గార్ల చేతుల మీదుగా జరిపించాలి కానీ రుద్ర బావ, గంగ వాళ్ళు ఎందుకని ఇషిక అంటుంది. చెప్పు అన్నయ్య అని రాఘవ అనగానే అందరు షాక్ అవుతారు. ఈ ఇంట్లో ఏ నిర్ణయం అయినా నేనే తీసుకుంటానని చెప్పు అన్నయ్య అని రాఘవ అనగానే ఇషిక షాక్ అవుతుంది. అవును బావ మీరు ఏం చేసిన కరెక్ట్ చేస్తారు.. ఈ ఇషిక ఏం తెలియకుండా మాట్లాడిందని ఇందుమతి అంటుంది. గంగ, రుద్రచే కళ్యాణం జరిపించడం మాకు ఇష్టమే కానీ వదినని ఒప్పించండి అని రాఘవ అంటాడు. దాంతో పెద్దసారు రాఘవని హగ్ చేసుకుంటాడు. మీకేనా బాండింగ్ మాక్కూడా అని రుద్ర దగ్గరికి సూర్య, వంశీ వెళ్లి హగ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Mar 29, 2026
Illu Illalu Pillalu: శ్రీవల్లికి చుక్కలు చూపించిన ప్రేమ, నర్మద.. ఫోన్ కొట్టేసి అడ్డంగా బుక్కైపోయిందిగా!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu Illalu Pillalu)'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-431 లో.. భాగ్యం వాళ్ళ ఇంట్లో ఆనందరావు, భాగ్యం సరదాగా ఉంటారు. భాగ్యంకి జడ వేస్తూ సరదాగా పాట పాడుతుంటాడు ఆనందరావు. భాగ్యం తనపై కోప్పడతుంది. అదే సమయంలో భాగ్యం తన కూతురి గురించి ఆలోచిస్తుంది. వెంటనే కూతురు శ్రీవల్లికి కాల్ చేస్తుంది భాగ్యం. అక్కడ అంతా సేఫేనా.. సైడ్ ఎఫెక్ట్ ఏం అయినా ఉందా అని భాగ్యం అడుగుతుంది. వాళ్ళిద్దరు నన్ను ఆడుకుంటుంటే నువ్వేదో పెద్ద డాక్టర్ అయినట్టు సేఫేనా, సైడ్ ఎఫెక్ట్స్ ఏం అయినా ఉన్నాయా అంటావేంటని భాగ్యంపై శ్రీవల్లి కోప్పడుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ అంటే నీ వొంట్లో కాదు.. ఆ ఇంట్లో.. మ్యాటర్ ఎవరికైనా లీక్ అయిందా అని దాని అని భాగ్యం అడుగుతుంది. లీక్ అవ్వడమేంటి.. డైరెక్ట్ గా అందరిముందే చెప్తామని ఆ సెల్ ఫోన్ పట్టుకొని నా చుట్టూనే తిరుగుతున్నారు ఆ పిల్ల దెయ్యాలని శ్రీవల్లి అంటుంది. అవునా అని భాగ్యం అనగానే ఏదో ఒకటి చెయ్యవే అని శ్రీవల్లి అంటుంది. చెయ్యాల్సింది నేను కాదు నువ్వే అని భాగ్యం అంటుంది. ఏంటని శ్రీవల్లి అడుగగా ఆ ప్రేమ ఫోన్ లేపెయ్యి అని భాగ్యం చెప్తుంది. నా వల్ల అవుతుందా అని శ్రీవల్లి అనగానే భాగ్యం, ఆనందరావు ఇద్దరు కలిసి శ్రీవల్లిని మోటివేట్ చేస్తారు. ఇక తను ప్రేమ గదిలోకి వెళ్ళి ఫోన్ దొంగిలిస్తుంది. అప్పుడే ప్రేమ, నర్మద వస్తారు. ఏంటక్కాయ్ ఏదో దాసుకొని వెళ్తున్నావని అడుగుతారు. ఇదిగో నీ ఫోన్ అని దాన్ని నీల్లలో వేస్తుంది శ్రీవల్లి. దాంతో అది డమ్మీ ఫోన్ అని అసలు ఫోన్ ని చూపిస్తారు ప్రేమ నర్మద. ఇక ఆ తర్వాత శ్రీవల్లిని ప్రేమ, నర్మద బయటకు తీసుకెళ్ళి ఒక సర్కిల్ గీసి అందులోనే డ్యాన్స్ చేయమని చెప్తారు. దాంతో నాకు డ్యాన్స్ రాదని శ్రీవల్లి అంటుంది. ఆ సర్కిల్ లో ఒక బిందె పెట్టి దాని మీద డ్యాన్స్ చేయాలి లేకపోతే ఈ వాయిస్ రికార్డు అందరికి వెళ్ళిపోతుందని ప్రేమ, నర్మద బెదరిస్తారు. దాంతో చేసేదేమీలేక డ్యాన్స్ చేస్తుంది. అలా ఇద్దరు శ్రీవల్లిని ఆడుకుంటారు. మరోవైపు సాగర్ ఆఫీస్ కి రెడీ అవుతుంటాడు. తన పర్స్ చూసుకొని .. ఇందులో డబ్బులు లేవు.. బైక్ లో పెట్రోల్ లేదు.. ఎలా ఇప్పుడు అని సాగర్ అనుకుంటాడు. నర్మదని డబ్బులు అడగాలని అనుకుంటాడు కానీ అడుగలేడు. భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్ వస్తే కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలని నర్మద అంటుంది. దానికి సాగర్ ఒప్పుకోడు. ఇక సాగర్ కి బెల్ట్ పెట్టి, క్యారేజ్ ఇస్తుంది నర్మద. తర్వాత నర్మద పర్స్ అని అడుగుతాడు సాగర్. ఏం దాచావ్ పర్స్ లో నా ఫోటో పెట్టుకున్నావా ఏంటని నర్మద పర్స్ అంతా వెతుకుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Mar 29, 2026
Brahmamudi: రాజుని చూసి షాకయిన రేఖ.. ఐశ్వర్య చెంప చెల్లు మనిపించింది!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -992 లో...... రాజు, లక్కీ నెక్లెస్ తీసుకొని వస్తారు. రాజుని చూసి రేఖ షాక్ అవుతుంది. రాజు గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అప్పుడే అపర్ణ బయటకు వస్తుంటే కనిపెట్టి బయటకు రాకుండా చెయ్యమని భూషణ్ కి చెప్తుంది. ఎక్కడ రాజుని చూస్తే గుర్తుపడుతుందోనని భూషణ్ తో అలా చెప్తుంది. రాజు గురించి రేఖ అడుగుతుంది కానీ తనేం సమాధానం చెప్పడు. ఆ తర్వాత వెళ్ళిపోతాడు. అందరు వెళ్ళిపోయాక నా పెంపకాన్ని వేలెత్తిచూపెట్టేలా చేసావని ఐశ్వర్య చెంపచెల్లుమనిపిస్తుంది రేఖ. మీ నాన్న కూడా అంతే ఇలాంటి పనులు చేస్తూ దొరికిపోయేవాడని రేఖ కోప్పడుతుంది. ఆ తర్వాత అపర్ణ వాళ్ళ దగ్గరికి భూషణ్ వెళ్లి.. మీరు మాటిమాటికి బయటకు ఎందుకు వస్తున్నారు..మమ్మల్ని అడగకుండా రాకని వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే ఇందు వస్తుంది. ఏమైంది అతను అలా అంటున్నాడని ఇందుని అపర్ణ అడుగుతుంది. ఏం లేదని ఇందు కవర్ చేస్తుంది. మరొకవైపు నిజం చెప్పవే ఆ నెక్లెస్ ఎక్కడ దొరికిందని స్వాతిని భ్రమరాంబ అడుగుతుంది. చెప్పను కదా అని భ్రమరాంబని స్వాతి ఒక ఆట ఆడేసుకుంటుంది . ఆ తర్వాత వెంకీ తన లవర్ ఇంటి ముందు ఉంటాడు. నందు వెళ్లి అతనికి మూవీ టికెట్స్ ఇస్తుంది. మీరు మాట్లాడుకుంటున్నారో కాల్ చెయ్ వింటాను. అప్పుడు నేను ఎలా హెల్ప్ చెయ్యాలో తెలుస్తుందని నందు అంటుంది. రోజా బయటకు వచ్చి టికెట్స్ తీసుకొని, 'థాంక్స్ వెంకీ' నేను మా కజిన్ వెళ్తానని ఒక హగ్ ఇచ్చి లోపలకి వెళ్తుంది. అది నందు వింటుంది. చూసావా అది ఎవడితోనో మూవీకి వెళ్ళడానికి నిన్ను టికెట్స్ తీసుకొని రమ్మని చెప్పిందని వెంకీతో నందు అంటుంది. కజిన్ తో వెళ్లడం తప్పు కాదని వెంకీ అంటాడు. సరే రా రేపు రెస్టారెంట్ కి తీసుకొని రా.. అప్పుడు మీ మధ్య ఎంత లవ్ ఉందో చూస్తానని వెంకీతో నందు చెప్తుంది. ఆ తర్వాత ఇందుకి స్వాతి అన్నం తినిపిస్తుంది. దాంతో ఇందు ఎమోషనల్ అవుతుంది. అయినా వాళ్ళు కరెక్ట్ టైం కి ఎలా వచ్చారు అక్క అని స్వాతి అడుగుతుంది. నేనే రప్పించానని ఇందు చెప్తుంది.రాజు, లక్కీలు నక్లెస్ అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటే ఇందు వెళ్లి మీరు ఐశ్వర్యని ట్రాప్ చేసి మీ కార్ లో ఎక్కించుకొని వెళ్లి నెక్లెస్ కొట్టేసారు. ఇప్పుడు మర్యాదగా నెక్లెస్ తీసుకొని వెళ్ళండి..లేదంటే మర్యాదగా ఉండదని వాళ్లకి లొకేషన్ పంపి ఇంటికి వచ్చేలా చేసింది.. మొత్తం స్వాతికి చెప్తుంది. అక్క నువ్వు మాములు దానివి కాదని స్వాతి అంటుంది. తరువాయి భాగంలో రాజు ఇంటికి తన మనిషిని పంపించి రేఖ ఎంక్వయిరీ చేయిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Mar 28, 2026
Brahmamudi:ఐశ్వర్య పాచికలు పారలేదు.. రాజ్ ఎంట్రీతో రేఖకు మైండ్ బ్లాక్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -991 లో ఇందు నెక్లెస్ దొంగతనం చేసిందని తను వస్తే నిలదియ్యడానికి రెడీగా రేఖ ఉంటుంది. అప్పుడే ఇందు వస్తుంది. నెక్లెస్ దొంగతనం ఎందుకు చేసావని రేఖ అడుగుతుంది. నేను తియ్యలేదు ఆంటీ అని ఇందు చెప్తుంది. ఆ అవసరం ఇప్పుడు నీకే ఉందని ఐశ్వర్య అంటుంది. దీనికి ఇలా కాదు.. ఆ ముసలోడి నడుం విరగ్గొడితే నిజం చెప్తుందని భూషణ్ అంటాడు. వాళ్ళ జోలికి వెళ్ళకండి నన్ను ఏమన్నా పర్వాలేదు కానీ వాళ్ళని ఏం అనొద్దని ఇందు అంటుంది. మరొక అదంతా హాల్లో జరుగుతుంటే సుభాష్ తో అపర్ణ మాట్లాడుతుంది. అసలు స్వరాజ్ బ్రతికి ఉంటే ఇందుని ఇచ్చి పెళ్లి చెసేవాళ్ళం... ఆ రోజు అందరి బాడీస్ దొరికాయి ఒక బాబుది తప్ప.. నాకు తెలిసి స్వరాజ్ బ్రతికే ఉండి ఉంటాడు.. తప్పకుండా వస్తాడనిపిస్తుందని సుభాష్ తో అపర్ణ అంటుంది. ఆ తర్వాత రాజు, లక్కీ నెక్లెస్ ఇవ్వడానికి రేఖ దగ్గరికి వస్తారు. రాజు ఇంటికి రాగానే నాకు ఏదో గుర్తు వస్తుందన్నట్లు చూస్తాడు. ఇందుని తిడుతుంటే రాజు, లక్కీ లోపలికి వస్తారు. రాజుని చూసిన రేఖ.. బావ కదా అని షాక్ అవుతుంది. నువ్వు రాజ్ కదా అని రేఖ అనగానే అవును రాజు అని అంటాడు. మేం ఐశ్వర్య కోసం వచ్చామని లక్కీ అనగానే ఐశ్వర్య టెన్షన్ పడుతుంది. మనం బయటకు వెళ్లి మాట్లాడుకుందాం అంటుంది. ఇంప్రెషన్ కొట్టేయ్యడానికి వచ్చి బయటకు వెళ్తే ఏం బావుంటుందని లక్కీ అంటాడు. మేం ఎందుకు వచామంటే ఐశ్వర్య కార్ ప్రాబ్లమ్ వస్తే మా కార్ లో లిఫ్ట్ ఇచ్చాము. అప్పుడు ఈ నెక్లెస్ పడేసుకుందని లక్కీ చూపిస్తాడు. దాంతో రేఖ షాక్ అవుతుంది. మరి ఇంకొక నెక్లెస్ ఎక్కడ అని రేఖ అనగానే స్వాతి తీసుకొని వచ్చి ఇస్తుంది. దాంతో భ్రమరాంబ షాక్ అవుతుంది. వాళ్ళ అమ్మ దాచిపెట్టిన దగ్గర నుండి తీస్తుంది. రేఖ ఆంటీ మీ గది ముందు దొరికిందని స్వాతి చెప్తుంది. తరువాయి భాగంలో అసలు అతను రాజ్ బావలాగా ఉండడం ఏంటి నాకు అతని గురించి అన్ని డీటెయిల్స్ కావాలని రేఖ అనుకుంటుంది. ఆ తర్వాత కరెక్ట్ టైమ్ కీ వాళ్ళు వచ్చారు అక్క అని ఇందుతో స్వాతి అనగానే వాళ్లని నేనే రప్పించానని ఇందు అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Mar 28, 2026
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com



