.webp)
14 ఏళ్ళ రిలేషన్ షిప్...నెక్లెస్ రోడ్ లో పరిగెడుతున్నా, అరుస్తున్నా
సర్కార్ లేటెస్ట్ ప్రోమోలో సుధీర్ తో పాటు విష్ణు ప్రియా కూడా హోస్ట్ చేయడానికి వచ్చేసింది. ఈ ఎపిసోడ్ కి "పాపం ప్రతాప్ "మూవీ టీమ్ నుంచి తిరువీర్, ప్రసాద్ బెహ్రా, స్నేహ, రవి వచ్చారు. ఈ ప్రోమో లాస్ట్ లో సుధీర్ అందరితో కన్నీళ్లు పెట్టించేలా మాట్లాడాడు. "ఇక్కడ ఉన్న ప్రతీ ఒక్కరి తొలి ప్రేమ ఏంటి " అంటూ సుధీర్ అడిగాడు. వెంటనే తిరువీర్ "మీ ఫస్ట్ లవ్ ఏంటి మీరు చెప్పండి " అన్నాడు. "14 ఏళ్ళ రిలేషన్ షిప్ కదా ఎందుకు బ్రేక్ అయ్యింది " అంటూ విష్ణు ప్రియా కూడా చాలా హృదయ విదారకంగా అడిగింది. "తాను వేరే వాళ్ళను పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. నాకు తెలిసి ఈ విషయం ఏంటి ఇదంతా అని అడిగాను. అప్పుడు ఆమె నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నన్ను డిస్టర్బ్ చేయొద్దు అన్నారు. నెక్లెస్ రోడ్ లో పరిగెడుతున్నా, అరుస్తున్నా ఏంటేంటో చేస్తున్నా" అనేసరికి అందరూ మొహాలు డల్ గా ఐపోయాయి. ఇక విష్ణు ప్రియా సుధీర్ కి కో - హోస్ట్ గా రాబోతోంది. వీళ్ళిద్దరూ కామెడీ టైమింగ్ కానీ, ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో వీళ్ళను మించిన వాళ్ళు ప్రస్తుతం లేరు. ఇక వీళ్ళ కాంబో మీద నెటిజన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నారు. తెగ మెసేజెస్ పెట్టి పోవే - పోరా వైబ్ ఉండబోతోంది. ప్రతీ సర్కార్ సీజన్ కి వీళ్ళిద్దరినే కంటిన్యూ చేయండి. ఇక ఈ షో సూపర్ హిట్ జోడి సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Apr 07, 2026.webp)
పాపులర్ ఉత్తమ జోడీగా అవార్డు రానందుకు అలిగిన బాలు - శ్రీముఖి
ఆదివారం విత్ స్టార్ మా పరివారం నెక్స్ట్ సండే ప్రోమో వచ్చేసింది. పరివార్ అవార్డ్స్ సక్సెస్ పార్టీ పేరుతో ఈ షో రాబోతోంది. ఇక ఇందులో కార్తీక దీపం 2 లో నటిస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్ చైత్ర లక్ష్మి పరివార్ అవార్డు తీసుకుని వచ్చింది. "ఈ ఇద్దరు అన్నయ్యలకు అవార్డు రాలేదు వాళ్లకు ఏమన్నా చెప్తావా " అంటూ శ్రీముఖి అవినాష్, హరిని చూపిస్తూ చెప్పింది. "ఇప్పటినుంచైనా బాగా చెయ్యండి అన్నయ్యలు. బాగా చేస్తే మీకు కూడా అవార్డ్స్ వస్తాయి " అని చెప్పింది. " నా మొహమే చూసి చెప్తున్నావ్ ఎం హరికి చెప్పవా " అని అడిగాడు అవినాష్. "వాడికి చెప్పినా వేస్ట్ అని చెప్పలేదు " అంటూ వెనక నుంచి మానస్ కోరస్ ఇచ్చాడు. ఇంతలో ప్రభాకర్ వచ్చాడు. శ్రీముఖి వెంటనే "ఆయన ఉత్తమ నాన్న అవార్డు ఇవ్వడమేంట్రా " అని అడిగింది. "ఉత్తమ నాన్న కాదు ఉత్తమ తాత అంటూ హరి ఇంకొంచెం ఎక్కువ చేసాడు. "మనం ఇంత చిన్న వయసులో అంత నన్నలా యాక్ట్ చేసినందుకు ఇచ్చారు " అని అవార్డు ఇచ్చారు అంటూ ప్రభాకర్ చెప్పేసరికి "ఏ వయసులో " అంటూ అవినాష్ మధ్యలో అడ్డుపడ్డాడు. ఇంతలో బాలు వచ్చాడు. అంతే ఇద్దరూ కలిసి రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేశారు. ఇక శ్రీముఖి తెగ సిగ్గుపడిపోతూ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మాములుగా లేవు. "అవార్డు ఇచ్చినప్పుడు బాగుందా ఇప్పుడు శ్రీముఖిని ఎత్తుకున్నప్పుడు బాగుందా " అంటూ హరి అడిగాడు. "ఓటేసి నన్ను గెలిపించారు కాబట్టి నాకు ఈ అవార్డు గొప్ప " అని బాలు అనేసరికి శ్రీముఖి అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెనకే బాలు వెళ్లి శ్రీముఖి సారీ నేను కొంచెం అలిగి ఉన్నాను అన్నాడు. నువ్వెందుకు అలిగావ్ అని శ్రీముఖి అడిగింది. పాపులర్ జోడి అవార్డు సీరియల్ లో బాలు - మీనాకు వచ్చింది. బాలు - శ్రీముఖికి రాలేదని అందుకే అన్నాడు. అంతే శ్రీముఖి నవ్వేసి బాలుతో స్టేజి మీదకు వచ్చేసింది. "ఇదో తింగరిది ఏది చెప్తే అది నమ్మేస్తది " అంటూ వెనక నుంచి హరి శ్రీముఖిని అనేశాడు.
Apr 07, 2026.webp)
వరుణ్ కాలేజ్ లోనే అలా చేసావ్..అదే గర్ల్స్ కాలేజీలో చేర్పిస్తే ఎం చేసేదానివో!
నెక్స్ట్ వీక్ ఆట షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి జడ్జ్ నిహారిక వాళ్ళ అమ్మ పద్మ వచ్చారు. "నాకు చాలా నచ్చుతుంది ఎవరైనా మీ అమ్మలా ఉన్నవని చెపితే ఎందుకంటే మా అమ్మ చాలా అందమైన అమ్మాయి" అని చెప్పింది. ఇక సుధీర్ వాళ్ళ అమ్మతో చిట్ చాట్ చేసాడు. "ఇంట్లో డామినేషన్ ఎవరు వరుణ్ గారా నిహారిక గారా. చిన్నప్పుడు వరుణ్ గారిని బాగా కొట్టేదంట కదా " అని అడిగాడు. నిహారికనే డామినేషన్.. చిన్నప్పుడు వరుణ్ ని బాగా కొట్టేది అని చెప్పారు. "చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడూ మా అన్నకే సపోర్ట్ చేసింది నాకెప్పుడూ సపోర్ట్ చేయలేదు " అంది నిహారిక. "నువ్వు మీ నాన్న ఒకటి కాదమ్మా " అన్నారు నిహారిక వాళ్ళ అమ్మ . "స్కూల్ ఎగ్గొట్టడాలు లేకపోతె కాలేజీలు " అని సుధీర్ అడిగేసరికి "బోర్డు మీద టీచర్ ఎం రాసినా రాసుకునేది కాదు రెండో రోజు నేను వెళ్లి అన్నీ నోట్సులు నేను రాసుకుని వచ్చేదాన్ని వరుణ్ ఉన్న కాలేజీ నుంచే ఎగ్గొట్టి బయటకు వెళ్లేదానివి అదే ఇంకా గర్ల్స్ కాలేజీ లో చేర్పిస్తే ఇంకేం చేసేదానివో" అనేసరికి నిహారిక సైలెంట్ గ తలదించుకుని కూర్చుంది. "నీహారిక గారు వంట చేస్తారా అండి " అని సుధీర్ అడిగాడు. "నిహారిక వంట చేస్తది కానీ ఆ తర్వాత మనం కిచెన్ లోకి వెళ్లాం అంటే సర్దుకోలేక చచ్చిపోవాలి." అనేసారు నిహారిక వాళ్ళ అమ్మ ."ఏవండీ కన్ను ఏమీ అనొద్దు అని చెప్పండి. ఏదైనా స్వీర్ వార్నింగ్ ఇవ్వండి" అని అడిగాడు సుధీర్. "నిన్ను అంటేనే బాగుంటుంది " అని ఆవిడ అనేసరికి అందరూ నవ్వేశారు. ఆ తర్వాత నిహారిక వాళ్ళ అమ్మ గుసగుసలాడుకున్నారు. "ఈ రెండు గంటలకు నా రెమ్యూనరేషన్ ఇస్తే వెళ్ళిపోతాను అంటోంది " అని వాళ్ళ అమ్మ అన్న విషయాన్ని చెప్పేసింది నిహారిక.
Apr 07, 2026.webp)
బ్రహ్మముడి నేటి ఎపిసోడ్: ఇందుని మార్చేందుకు అపర్ణ మాస్టర్ ప్లాన్.. రేఖ కుట్రలు ఫలిస్తాయా!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -999 లో..... కావ్య ఎక్కడ సంతకం పెడుతుందోనని సుభాష్, అపర్ణ టెన్షన్ పడతారు. ఇందు వాళ్ళ అమ్మ కావ్య కూడా చాలా మొండిగా ఉండేది. ఎవరు ఏం చెప్పినా తను అనుకుందే చేస్తుంది. ఇప్పుడు ఇందు కూడా అలాగే తయారైందని సుభాష్, అపర్ణ అనుకుంటారు. ఇందుని మనం ఒప్పించలేం కానీ వాళ్ళ అమ్మ ఒప్పిస్తుందని అపర్ణ అనగానే వాళ్ళ అమ్మ లేదు కదా అని సుభాష్ అంటాడు. గతంలో కళ్యాణ్ తన వదిన కావ్య గురించి ఒక పుస్తకం రాసాడని.. గతం తాలూకా జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంది అపర్ణ. గతంలో కావ్య తన గొప్పతనన్ని వివరిస్తూ కళ్యాణ్ ఒక బుక్ రాస్తాడు. ఆ పుస్తకాన్ని అపర్ణ తీసుకొని వచ్చి ఇందుకి ఇస్తుంది. ఇదేంటి నానమ్మ అని ఇందు అడుగుతుంది. ఇది మీ అమ్మ గురించి మీ బాబాయ్ కళ్యాణ్ రాసిన పుస్తకం.. అప్పుడు మీ అమ్మ అంటే ఏంటో తెలుస్తుందని ఇందు చేతికి అపర్ణ బుక్ ఇస్తుంది. మరొక వైపు రాహుల్, రుద్రాణి ఫోటో దగ్గరికి రేఖ వెళ్లి రేపటితో మీరు కన్న కల నిజమవుతుంది కానీ మీరు లేరని అనుకుంటూ రేఖ బాధపడుతుంది. అప్పుడే భ్రమరాంబ వచ్చి రేపు పార్టీ అంటున్నావ్.. అంతమందిలో ఆ ఇందు మనం సంతకం పెట్టమంటే పెడుతుందా అని భ్రమరాంబ అడుగుతుంది. ఆ అపర్ణ వెనకాల ఉండి ఏదో నడిపిస్తుందని భ్రమరాంబ అంటుంది. ఇందు వాళ్ళ అమ్మ లాగే బంధాలు బంధుత్వాలు అంటూ ఎమోషనల్ అవుతుంది. ఈ ఇద్దరు ముసలి ప్రాణాలు మన చేతిలో ఉన్నంతవరకు ఇందు ధైర్యం చెయ్యదని భ్రమరాంబతో రేఖ అంటుంది. ఈ ఇందుకి ధైర్యం లేదు. అలాగే తోడు కావాలి. అది లేదు.. అలాంటప్పుడు ఏం చేస్తుంది. మనం చెప్పింది చెయ్యక తప్పదని భ్రమరాంబతో రేఖ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 07, 2026
Podharillu:మాధవ పెళ్లి సంబంధం ఫిక్స్. పొదరిల్లు సీరియల్లో ఊహించని మలుపు!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -86 లో..... శైలు తన ఫోన్ కేశవ దగ్గర నుండి తీసుకొని రీల్స్ చేస్తుంది. ప్లీజ్ రోజుకు రెండు రీల్స్ చేసి ఇస్తాను ఫోన్ ఇస్తారా అని కేశవని శైలు రిక్వెస్ట్ చేస్తుంది. నాకు ఆ టార్చర్ వద్దు బాబోయ్.. నువ్వు నీ ఫోన్ తీసుకోమని కేశవ అంటాడు. మరి నా దగ్గర డబ్బు లేదని శైలు అంటుంది. సరే ఉన్నప్పుడు ఇవ్వమని కేశవ అంటాడు. నేను పారిపోతే అని శైలు అనగానే మీ నాన్న నెంబర్ సేవ్ చేసానని కేశవ అంటాడు. థాంక్స్ అని శైలు హ్యాపీగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కేశవ, చక్రి, కన్నా, మహా నలుగురు కూర్చొని మాధవకి పెళ్లి సంబంధం చూడడానికి మాట్రిమోనీలో మాధవ ఫొటోస్ పెడతారు. అప్పుడే మాధవ వచ్చి ఏంటి నలుగురు ఒక దగ్గర కూర్చొని ఉన్నారు.. అంటే ఏదో చేస్తున్నారని అర్థం అని మాధవ అంటాడు. ఏం లేదు పెద్ది.. నీకు మంచి సంబంధం కోసం మ్యాట్రీమోనిలో సంబంధం చూస్తున్నామని మహా చెప్పగానే అదంతా ఎందుకని మాధవ అంటాడు. అంటే నువ్వు ఇంకా గాయత్రిని మర్చిపోలేదు అన్నమాట అని చక్రి అంటాడు. అదేం లేదు మర్చిపోయానని మాధవ అంటాడు. ఇక చేసేదేమీ లేక సరే మీ ఇష్టం అని మాధవ అనగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత నారాయణ డ్రింక్ చెయ్యడానికి మందు తెచ్చుకుంటాడు. వద్దు ట్యాబ్లెట్ వేసుకోవాలని మహా ఆపుతుంది. కేశవ వాళ్ళని పిలిచి మందు సేసా లాక్కోమని చెప్తుంది మహా. ఆ తర్వాత మాధవ ప్రొఫైల్ నచ్చి ఒక సంబంధం ఒకే అంటారు. దాంతో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మాధవ మాత్రం గాయత్రిని గుర్తుచేసుకుంటాడు. మరుసటి రోజు మహాని ఇంప్రెస్ చెయ్యడానికి చక్రి స్నానం చెయ్యకుండానే పూజ చేస్తాడు. అప్పుడే కేశవ, కన్నా వచ్చి చక్రిని ఆటపట్టిస్తారు. వాడు స్నానం చెయ్యకుండా పూజ చేశాడని కేశవ అనగానే మహా కోప్పడుతుంది. ఆ తర్వాత మాధవ ప్రొఫైల్ నచ్చిన వాళ్ళు ఫోన్ నెంబర్ పెడతారు. చక్రి వాళ్ళతో ఫోన్ మాట్లాడితే అందరి గురించి ఎలా బిల్డప్ ఇస్తాడోనని మహా ఇమిటేట్ చేస్తుంది. ఆ తర్వాత మహా అమ్మాయి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుతుంది. మంచి రోజు చూసుకొని రమ్మని వాళ్ళు చెప్పగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ విషయం నారాయణకి చెప్పడానికి తనని లోపలికి పిలుస్తారు. నాకెందుకు చెప్పడం మీరు ఉండగా అంటూ అతను వెటకారంగా మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 07, 2026
Karthika Deepam2: తండ్రి అని చూడకుండా దాస్ను అవమానించిన జ్యోత్స్న.. షాక్లో కార్తీక్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika deepam 2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -637 లో.....జ్యోత్స్న నిజస్వరూపం పూర్తిగా దాస్, కార్తీక్ కి తెలిసిపోతుంది. నేను నీ కూతురు అని తెలిసినప్పటి నుండి ఒక జత బట్టలు అయినా కొన్నావా.. కొనలేదు.. ఎందుకు అంటే నాకు బట్టలు కొనాలంటే నువ్వు జేబులు తడుముకోవాలి.. ఛీ అని జ్యోత్స్న అనగానే దాస్ కోపంగా జ్యోత్స్న అని అంటాడు. నేను ఊసింది నీ మీద కాదు.. మన బతుకుల మీద..... నానమ్మ పిల్లల్ని మార్చేసిందని నీకు తెలుసు.. అయినా నువ్వు సైలెంట్ గా ఉన్నావ్.. ఎందుకంటే నీ కూతురు రాణిలాగా బ్రతకడం నీక్కూడ ఇష్టమే కానీ ఇప్పుడు ఏదో మారిపోయి నిజం చెప్తానని వచ్చేసావ్. ఇప్పుడు శౌర్య నా కూతురు అంటూ ఎవరైనా వచ్చి తీసుకొని వెళ్తానంటే శౌర్య వెళ్తుందా.. వెళ్ళదు ఎందుకంటే బావ చూసుకున్నంత బాగా తనని ఇంకెవరు చూసుకోలేరు.. నేను కూడా అంతే దశరథ్, సుమిత్ర కూతురు నేనే.. ఈ ఆస్తులకి వారసురాలిని నేనే అని జ్యోత్స్న అంటుంది. ఇప్పుడే వెళ్లి అందరికి నిజం చెప్పేస్తానని దాస్ అంటాడు. నువ్వు వెళ్తే ఈ మేడ మీద నుండి దూకేస్తానని జ్యోత్స్న అంటుంది. అప్పుడు నిజం తెలిసి మా అమ్మ చచ్చిపోతుంది. ఆ తర్వాత మా డాడీ.. తాత.. ఎవరు ఉండరు అని జ్యోత్స్న అంటుంది.. నా కూతురిని చుస్తే భయంగా ఉందిరా అని కార్తీక్ తో దాస్ అంటాడు. మీరు ఇక్కడ నుండి వెళ్ళండి మావయ్య అని కార్తీక్ అతన్ని పంపిస్తాడు. మరొక వైపు దీప, శ్రీధర్, కాంచన ఇంటికి వెళ్తారు. కార్తీక్ ఎందుకో పార్టీలో టెన్షన్ గా కనపడ్డాడు అని కాంచన, శ్రీధర్ అనుకుంటారు. ఏమైందని దీపని అడుగుతారు. నిజంగానే బావకి జ్యోత్స్న ఏదో గురించి తెలిసినట్లు ఉందని దీప అనుకుంటుంది. నాకేం తెలియదని దీప అనగానే మీరు ఏం చెప్తారు.. ఏం చెప్పరని కాంచన కోప్పడుతుంది. మరొకవైపు దాస్ వెళ్ళిపోయాక కార్తీక్ తో జ్యోత్స్న మాట్లాడుతుంది. నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకోమని కార్తీక్ అంటాడు. సరే ఒక పని చెయ్ బావ.. నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటానని జ్యోత్స్న అంటుంది. ఏంటది అని కార్తీక్ అడుగుతాడు. నన్ను పెళ్లి చేసుకోమని జ్యోత్స్న అనగానే నాకు ఆల్రెడీ పెళ్లి అయిందని కార్తీక్ అంటాడు. ఆల్రెడీ పెళ్లి అయిన దీపనే పెళ్లి చేసుకున్నావ్ కదా అని జ్యోత్స్న అంటుంది. నువ్వు ఎలా అయితే దీపని నీ భార్య అని ఫీల్ అవుతున్నావో నేను కూడా ఈ ఆస్తులకి వారసురాలిని అని ఫీల్ అవుతున్నానని జ్యోత్స్న అంటుంది. నిజం ఒప్పుకోమని కార్తీక్ అనగానే ఒప్పుకోనని జ్యోత్స్న అంటుంది. నీ నోటితో నువ్వే నిజం ఒప్పుకునేలా చేస్తానని జ్యోత్స్నతో కార్తీక్ ఛాలెంజ్ చేస్తాడు. ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వచ్చి మాట్లాడుతుంటే సుమిత్ర, దశరత్, శివన్నారాయణ వస్తారు. ఎందుకు అత్తయ్య ఎప్పుడు జ్యోత్స్నని ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారని సుమిత్ర అంటుంది. మరొకవైపు కార్తీక్ ఇంటికి వెళ్లి దీపకి దిష్టి తీస్తాడు. ఏంట్రా అలా తీస్తున్నావని కాంచన అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 07, 2026
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్: ప్రేమపై ధీరజ్ ఆగ్రహం.. వల్లి నిజం బయటపెట్టనున్న చందు!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-438లో.. ధీరజ్ తో ప్రేమ మట్లాడుతుంది. అరెయ్ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావ్ రా.. అమూల్య విషయంలో నాకేం పాపం తెలియదురా.. ఇది నా కుటుంబం.. నా కుటుంబానికి నేను ప్రాణం పోయినా ద్రోహం చేయనురా అని ధీరజ్ ప్రేమ అంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా నేను నీతో ప్రేమగా ఉన్నట్టు నటించడం కాదురా.. నా మనసులో నిజంగానే స్వచ్చమైన ప్రేమ ఉంది రా అని ప్రేమ అనగానే ఆపుతావా నీ నాటకాలు అని ధీరజ్ అంటాడు. నువ్వేం చెప్పినా నమ్మడానికి నేను పాత ధీరజ్ ని కాదు.. నన్ను ఇంకా మోసం చేయాలని చూడకు అని ప్రేమతో ధీరజ్ అంటాడు. మోసం కాదురా నిజం.. నా మీద నీకు ప్రేమ కలగడానికి ముందే నేను నిన్ను ప్రేమించాను కానీ నీకు చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదురా.. నువ్వు ప్రపోజ్ చేసాక. నాలో ఉన్న ప్రేమని నీకు చెప్పకుండా దాచడం నా వల్ల కాలేదు.. అప్పుడే ఈ గొడవ జరిగింది.. అందుకే ఇప్పుడు చెప్తున్నా..ఐ లవ్ యూ రా ధీరజ్ అని చెప్తూ లవ్ బర్డ్స్ ని ఇస్తుంది. కానీ ధీరజ్ ఆ బొమ్మని విసిరేస్తాడు. అది విరిగిపోతుంది. ఇక ప్రేమ ఆ పగిలిన బొమ్మని తీస్తుంటే తన చేతికి గాయమై రక్తం కారుతుంది. అప్పుడే అటుగా నర్మద వస్తుంది. ప్రేమకి గాయం తగిలింది చూసి, వచ్చే రక్తం చూసి.. ఏంటి ధీరజ్ ఇలా చేస్తున్నావని నర్మద నిలదీస్తుంది. దాంతో ధీరజ్ అక్కడినుండి వెళ్ళిపోతాడు. ప్రేమని నర్మద ఓదారుస్తుంది. మరోవైపు శ్రీవల్లి జరిగినది తలుచుకొని బాధపడుతుంది. అదే సమయంలో ఆనందరావు కోసం మిర్చీ బజ్జీలు చేస్తుంది భాగ్యం. ఇక ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటారు. అది చూసి శ్రీవల్లి ఓర్వలేకపోతుంది. ఇక ఒక చీపురుకట్ట తీసుకొచ్చి ఇద్దరిని చెడామడా బాదుతుంది. ఎందుకు కొడుతున్నావని భాగ్యం అడుగుతుంది. నా కాపురం కూల్చేసి ఇక్కడ మీరు సరసాలు ఆడుతున్నారా అని ఫైర్ అవుతుంది శ్రీవల్లి. నిన్ను పదిరోజుల్లో ఆ ఇంట్లోకి పంపిస్తానని చెప్పాను కదా.. సరే రేపే నిన్ను మీ అత్త వారింట్లో దింపొస్తానని శ్రీవల్లికి భాగ్యం మాటిస్తుంది. దాంతో తను కూల్ అవుతుంది. ఇక రాత్రివేళ చందు బాగా తాగేసి బండి తోసుకుంటూ వస్తాడు. మా నాన్నని మోసం చేశావే.. ఈరోజు నీ గురించి చెప్పేస్తానని చందు అనుకుంటాడు. ఇక చందు ఇంటికి రాగానే ధీరజ్, తిరుపతి, సాగర్, నర్మద, ప్రేమ, అమూల్య అందరు వస్తారు. ఇక నాన్న.. నాన్న అంటూ రామరాజుని పిలుస్తాడు చందు. కాసేపటికి రామరాజు బయటకి వస్తాడు. ఏమైందిరా అని రామరాజు అడుగగా నేనే లైట్ గా తాగేసి బైక్ పడేసానని తిరుపతి అబద్ధం చెప్తాడు. నాన్న బండి నేనే పడేసానని చందు అంటాడు. దాంతో రామరాజు షాక్ అవుతాడు. వల్లి గురించి మీకు ముఖ్యమైన విషయం చెప్పాలని చందు అంటాడు. ఏంట్రా తాగేసి వచ్చావా అని రామరాజు అడుగుతాడు. మరోవైపు నర్మద, ప్రేమ అసలు విషయం కవర్ చేయడానికి పదండి బావ.. తినేసి పడుకోండి రేపు పొద్దున్నే మాట్లాడుకుందామని అంటారు. లేదు నేను తాగి రావడానికి కారణం వల్లీనే అని చందు అంటాడు. అదేంట్రా అని రామరాజు అంటాడు. అసలు నిజమేంటంటే అని చందు చెప్పబోతుంటే.. అదేం లేదు మామయ్య.. వల్లీ అక్క ఇంటికెళ్ళాక ఫోన్ చేయలేదంట అని నర్మద చెప్తుంది. ఇక ధీరజ్ , తిరుపతి ఇద్దరు కవర్ చేసి చందుని లోపలికి తీసుకెళ్తుంటే సూపర్.. సూపర్ అంటు ఇక్కడ ఒక పెద్ద సెంటిమెంట్ డ్రామా జరుగుతుందని సాగర్ క్లాప్స్ కొడతాడు. అది విని.. ఏంటి సాగర్ అని నర్మద అడుగుతుంది. పెద్దకొడుకు తాగేసి వచ్చాడు కాబట్టి ఏం అనడం లేదు.. అదే పని నేను చేస్తే ఏదో దేశద్రోహం చేసినవాడిని చూసినట్టుగా చూసి నా చెంపచెల్లుమనిపిస్తాడు ఈయన అని రామరాజుతో సాగర్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 07, 2026.webp)
Jayam serial : సూర్య సక్సెస్లో రుద్ర మాస్టర్ ప్లాన్.. ఇషికకు గట్టి కౌంటర్ ఇచ్చిన బావ!
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -236 లో..... అందరు హాల్లో ఉండగా చాలా హ్యాపీగా రాఘవ, సూర్య ఇంటికి వస్తారు. పెద్ద గవర్నమెంట్ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసాను పెద్దనాన్న అని గుడ్ న్యూస్ అందరికి చెప్తాడు సూర్య. దాంతో అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సూర్య ఈరోజు ప్రెజెంటేషన్ ఇస్తుంటే ఒక తండ్రిగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని రాఘవ చెప్తాడు. థాంక్స్ రుద్ర.. నీ వల్లే ఇదంతా అసలు ఆ ప్రాజెక్ట్ రావడానికి కారణం నువ్వే.. దాని వెనకాల ఎంత గ్రౌండ్ వర్క్ చేసావో నాకు తెలుసు.. వాడు ఇచ్చిన ప్రెజెంటేషన్ కూడా నువ్వు ప్రిపేర్ చేసిందేనని రాఘవ అనగానే అందరూ షాక్ అవుతారు. అవునా అని పెద్దసారు అంటాడు. ఎవరి బాధ్యతలు వారికి అప్పగించారు కానీ ప్రతీ దాంట్లో సాయంగా ఉంటున్నాడని రుద్ర గురించి రాఘవ పొగుడుతాడు. నాకు తెలుసు రుద్ర ఈ కుటుంబం కోసం ఏదైనా చేస్తాడని పెద్దసారు అంటాడు. నాకు ఈ కుటుంబం సంతోషంగా ఉండడం కావాలి దానికోసం ఏదైనా చేస్తానని రుద్ర అంటాడు. ఇషిక ఇప్పటికైనా అర్థం అయిందా సూర్య స్టామినా.. హాఫ్ నాలెడ్జ్ అన్నావ్ కదా.. ఎప్పుడు కూడా భర్తని తక్కువ చేసి మాట్లాడకూడదు. తనకి సపోర్ట్ గా ఉండాలని రుద్ర అనగానే తప్పకుండా బావగారు అని ఇషిక అంటుంది. మరి సూర్యకి కంగ్రాట్స్ చెప్పమని గంగ అనగానే కంగ్రాట్స్ సూర్య అని ఇషిక చెప్తుంది. ఆ తర్వాత ఇంత గుడ్ న్యూస్ చెప్పావ్ కదా.. ఈ రోజు పాయసం చేస్తానని గంగ అంటుంది. ఆ తర్వాత వీరు ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతుంటే ఇషిక వెళ్తుంది. దేని గురించి మాట్లాడుతున్నావో తెలుసుకోవచ్చా అని ఇషిక అంటుంది. అవసరం ఉన్నప్పుడు చెప్తాను..... కంగ్రాట్స్ ఫర్ యువర్ హస్బెండ్ సక్సెస్ అని వీరు అంటాడు. తన సక్సెస్ తనది.. నాది కాదు.. బిజినెస్ మొత్తం నా గ్రిప్ లో పెట్టుకోవాలనుకుంటే ఇలా జరిగింది ఏంటని ఇషిక డిస్సపాయింట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 07, 2026
కార్తీక దీపం సీరియల్ హీరోని నేను కాదు.. కార్తీక్ నాకు కలిసొచ్చింది!
బుల్లితెర మీద కార్తీక దీపం సీరియల్ ఆడియన్స్ ని ఎంతలా ట్రాన్స్ లోకి తీసుకెళ్ళిందో అందరికీ తెలుసు. ఇందులో నటించిన నిరుపమ్ అలియాస్ కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబు పేరు ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది. ఐతే నిరుపమ్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పాడు. ఐతే కార్తీక దీపం సీరియల్ కి ఫస్ట్ ఛాయస్ కార్తిక్ కాదట. ఐతే అప్పటికే కుంకుమ అనే సీరియల్ చేస్తున్నాడట నిరుపమ్. "ఆ ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్. ఈ కార్తీక దీపం ప్రొడ్యూసర్ కి ఆల్రెడీ మూగమనసులు అనే సీరియల్ చేసాను. ఐతే కార్తీక దీపం సీరియల్ తీస్తున్నారని తెలిసింది. కానీ అప్పటికే మా టీవిలో ఉన్నా కానీ ఆ సీరియల్ కి కూడా నన్నే పెట్టుకోవడం సాధ్యం కాదు కాబట్టి నన్ను అడగలేదు కానీ ఈ సీరియల్ గురించి డిస్కస్ చేశారు. ఎవరైనా హీరోలుంటే చెప్పండి అని అడిగారు. నేను కూడా ఇద్దరినీ పంపించా. వాళ్లకు స్క్రీన్ టెస్టులు ఆడిషన్స్ చేశారు. కానీ ఎవరూ సెలెక్ట్ కాకపోతున్నప్పుడు నా పేరు మళ్ళీ వచ్చింది. కుంకుమ పువ్వులో చేస్తున్నా కూడా కార్తీక దీపం సీరియల్ కి సూట్ అవుతాడని చెప్పి ఒప్పించారు దాంతో నేను అనుకోకుండా ఈ సీరియల్ లోకి ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. చంద్రముఖిలో నా పేరు కార్తీక కార్తీక దీపంలో కూడా నా పేరు కార్తీక్ . బయట ఎవరైనా కార్తీక్ అనే పిలుస్తారు ఆ పేరే సూటయ్యింది అంటారు. ఎందుకో ఆ పేరే కలిసొచ్చింది. మలయాళంలో ఈ సీరియల్ బాగా సక్సెస్ అయ్యింది. ఐతే అందులో నాలుగు తెలుపు అమ్మాయిలు అనే కాన్సెప్ట్ తీసుకుని మన నేటివిటీకి తగ్గట్టు రాసుకున్నాం. సినిమా సెలబ్రిటీస్ కూడా ఈ సీరియల్ మీద పోస్టులు పెట్టడం వలన కూడా ఈ సీరియల్ బాగా వైరల్ అయింది. లక్ష్మి మంచి, వెన్నెల కిషోర్ వంటి సెలబ్రిటీస్ కూడా వాళ్ళ మూవీస్ లో ఈ సీరియల్ డైలాగ్స్ ని చెప్పేసరికి కూడా ఈ సీరియల్ ఆడియన్స్ లోకి బాగా వెళ్ళింది.
Apr 06, 2026
కిల్లర్ వయసెంతో తెలుసా...
గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి రోల్ లో నటించిన జ్యోతి పూర్వజ్ గురించి తెలియని వారుండరు. అందమైన తల్లిగా ఆ సీరియల్ లో నటించి ఎంతోమందిని మెప్పించింది. అలాంటి జ్యోతి పూర్వజ్ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో "ప్రశ్నలు అడగండి...రైట్ క్వశ్చన్స్ కె ఆన్సర్ ఇస్తా " అని చెప్పింది. దాంతో చాలామంది చాలా ప్రశ్నలు అడిగారు. "నీ పేరేంటి" "డోనాల్డ్ ట్రంప్". "పవన్ కళ్యాణ్ తో ఎప్పుడు నటిస్తున్నారు.. ఆయనలో నచ్చింది ఏంటి" "వచ్చే ఏడాది. మంచి మనిషి", "ఛాన్స్ వస్తే హాలీవుడ్ కి వెళ్తారా బాలీవుడ్ కా" "హాలీవుడ్ కి ", "ఇంతకు మీ వయసెంత" "ఇదిగో పాన్ కార్డు చూసుకోండి 1994 జులై". "కిల్లర్ మూవీలో కాకుండా ఇంకా ఎందులో నటిస్తున్నారు" "ఏ మాస్టర్ పీస్ తెలుగులో, కన్నడలో హల్కా డాన్ ..ఈ ఏడాది విడుదలవుతున్నాయి ". "మహేష్ బాబు గారి గురించి ఒక్కమాటలో" "చాలా హై ఎనర్జీ నటుడు " "శ్రద్దా కపూర్ కంటే క్యూట్ గా మలైకా కంటే హాట్ గా ఉంటారు ". "అల్లు అర్జున్ గురించి " " బెస్ట్ పెర్ఫార్మర్" "యాక్టర్ ప్రభాస్ గురించి "క్యూట్" " ధనుష్ సర్ గురించి ఒక్క మాటలో" "పెర్ఫార్మర్" "తారక్ అన్న గురించి " "టైగర్" "రామ్ చరణ్ సర్ గురించి" "హార్డ్ వర్కింగ్ పెర్ఫార్మర్, పర్ఫెక్షనిస్ట్" "కిచ్చ సుదీప్ సర్ గురించి" "స్టైలిష్, పవర్ఫుల్ పెర్ఫార్మర్" " చిరంజీవి సర్ గురించి" "ది మైటీ మెగాస్టార్ ..మంచి మనసున్న వ్యక్తి" అంటూ నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు టకాటకా ఆన్సర్స్ ని తన ఇన్స్టా స్టేటస్ లో పోస్ట్ చేసింది.
Apr 06, 2026
Karthika deepam2 : కార్తీక దీపం 2 లేటెస్ట్ ట్విస్ట్: దీపను చంపాలనుకున్న జ్యోత్స్న.. షాకిచ్చిన కార్తీక్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika deepam2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -636 లో..... కేక్ కటింగ్ దగ్గరికి అందరు వస్తారు. ప్రతీ ఇంట్లో దీప లాంటి అమ్మాయి ఉంటే.. ఆ ఇల్లు బాగుంటుందని పారిజాతం అంటుంది. సుమిత్ర కేక్ కట్ చేస్తుంది. కేక్ లో జ్యోత్స్న విషం కలుపుతుంది. ఎక్కడ తనకి తినిపిస్తుందోనని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ముందు దీపకి తినిపించమని దశరథ్ అంటాడు. సుమిత్రని కాపాడింది ఒకరకంగా దీప కూడా కారణం.. ఇద్దరు నా కూతుళ్ళే దీప నా పెద్ద కూతురు అని దశరథ్ అనగానే నేను డాడీ మాటకి సరే అంటున్నా దీపకే తినిపించు మమ్మీ అని జ్యోత్స్న అంటుంది. దాంతో కార్తీక్ కంగారుపడతాడు దీపకి సుమిత్ర కేక్ తినిపిస్తుంది. కార్తీక్ కూడా తింటాడు. అదేంటీ ఇంకా దీప చావలేదని జ్యోత్స్న అనుకుటుంది. జ్యోత్స్న దగ్గరికి కార్తీక్ వెళ్లి షాక్ అయ్యావా మరదలా.. నువ్వు విషం కల్పడం నేను చూసాను.. నేను ఎందుకు టెన్షన్ పడ్డాననుకుంటున్నావా నాకు తెలిసిపోయిందని నీకు తెలిస్తే ప్లాన్ చేంజ్ చేస్తావ్ కదా అందుకే యాక్టింగ్ చేసానని కార్తీక్ అనగానే జ్యోత్స్న కోపంతో రగిలిపోతుంది. ఆ తర్వాత జ్యోత్స్న, కార్తీక్ ఇద్దరు పక్కకి వెళ్తారు. ఇక జ్యోత్స్న ఓపెన్ గానే కార్తీక్ తో మాట్లాడుతుంది. ఏంటి మరదలా డిఎన్ఏ టెస్ట్ చేయించినట్లున్నావ్.. నిజం తెలిసి పోయిందా అని కార్తీక్ అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. నేను ఎక్కడ ఏది దాచిన కూడా వట్టిగనే తెలిసిపోతుంది బావ అని జ్యోత్స్న అంటుంది. అప్పుడే దాస్ వస్తాడు. నా గురించి బావకి నువ్వే చెప్పావ్ కదా నాన్న అని దాస్ ని జ్యోత్స్న అడుగుతుంది. మావయ్యకి నీ గురించి నిజం తెలియలేదు తెలిస్తే ఇలా ఎందుకు ఉంటాడని కార్తీక్ అంటాడు. ఇంకా నన్ను మభ్యపెట్టాలని చూడకు బావ అని జ్యోత్స్న అంటుంది. అల్లుడు చెప్పేది నిజమే అని దాస్ అనగానే నువ్వు మాట్లాడకు నాన్న నా మీద ఒట్టేసినా కూడా అందరికి నిజం చెప్పావని దాస్ పై జ్యోత్స్న ఫైర్ అవుతుంది. నువ్వు నన్ను చంపాలని ట్రై చేసావని దాస్ అంటాడు. అప్పుడు నువ్వు నిజం చెప్పకుండా ఆపాలని అలా చేశాను కానీ చాలా సార్లు గిల్టీగా ఫిల్ అయ్యానని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 05, 2026.webp)
బ్రహ్మముడి: ఇందు కిడ్నాప్కు మాస్టర్ ప్లాన్.. రాజుకు సాహో సీరియస్ వార్నింగ్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -998 లో..... రాజు లక్కీ ఇంటికి వస్తారు. వాళ్ళు వచ్చేసరికి సాహోతో రాజు పేరెంట్స్ సరదాగా కబుర్లు చెప్తుంటారు. నీ ఫ్రెండ్ సాహో మంచిగా చాపలు తీసుకొని వచ్చాడ్రా అని లక్ష్మి చెప్తుంది. అప్పుడే దెబ్బలతో వెంకీ ఎంట్రీ ఇస్తాడు. ఏమైంది రా అని రాజు అడుగుతాడు. రాజుకి దగ్గరగా సాహో వచ్చి అదంతా నా పనే.. నేను చెప్పింది నువ్వు చెయ్యకపోతే విషయం ఇంకా సీరియస్ అవుతుందని రాజుకి సాహో వార్నింగ్ ఇస్తాడు. దాంతో రాజులో టెన్షన్ మొదలవుతుంది. రేయ్ లక్కీ వెంటనే ఐశ్వర్యకి ఫోన్ చేసి నేను తన డిలీంగ్ కి ఒకే అన్నానని చెప్పమని రాజు అంటాడు. దాంతో ఐశ్వర్యతో కలవాలని చెప్తాడు లక్కీ. కాసేపటికి ఐశ్వర్యని రాజు, లక్కీ వాళ్ళు కలుస్తారు. మేం కిడ్నాప్ చేసేవాళ్ళలాగా కన్పిస్తున్నామా అని అన్నారు.. ఇప్పుడు మీ అంతటా మీరే వచ్చారు ఏంటని ఐశ్వర్య అడుగుతుంది. నీకు అదంతా అనవసరం.. ముందు ఎవరిని కిడ్నాప్ చెయ్యాలో చెప్పమని రాజు అడుగుతాడు. ఇందుని అని ఐశ్వర్య చెప్పగానే తను మిడిల్ క్లాస్ ఫ్యామిలీలాగా ఉంది.. తనని కిడ్నాప్ చేస్తే ఏమోస్తుందని రాజు అంటాడు. రేపు తన బర్త్ డే తను ఒక సంతకం పెడితే కోట్ల ఆస్తులు వస్తాయని మా ఆంటీ చెప్పింది.. ఇప్పుడు తనని కిడ్నాప్ చేసి మా ఆంటీని డబ్బు ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేద్దామని ఐశ్వర్య అంటుంది. దానికి వాళ్ళు ఒప్పుకుంటారు. మరొకవైపు ఇందు కిచెన్ లో వంట చేస్తుంటే భ్రమరాంబ లేని ప్రేమ నటిస్తుంది. అప్పుడే ఐశ్వర్య వచ్చి ఇదంతా రేపటి కోసమే కదా అని వెటకారంగా మాట్లాడుతుంది.. ఆ తర్వాత రేపు ఇందు బర్త్ డే చాలా గ్రాంఢ్ గా ఫామ్ హౌస్ లో చేస్తున్నామని ఇంట్లో వాళ్ళతో రేఖ అనగానే ఆ మాటలు ఐశ్వర్య విని రాజు, లక్కీకి చెప్తుంది. దాంతో రేపు ఆ ఇందు సంతకం పెట్టేలోపు తనని అక్కడ నుండి కిడ్నాప్ చేస్తానని లక్కీతో రాజు అంటాడు. మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలని రాజు అనగానే.. అక్కడుంది ఇందు.. నీ శత్రువు తనతో జాగ్రత్త అని లక్కీ అంటాడు. మరొకవైపు సంతకం చెయ్యకని సుభాష్, అపర్ణ ఇద్దరు ఇందుతో చెప్తారు. నాకు ఆ దేవుడే ఏదో ఒకదారి చూపిస్తాడని ఇందు అంటుంది. తరువాయి భాగంలో ఇందుని రేఖ నిద్రలేపి విషెస్ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 05, 2026.webp)
ఇల్లు ఇల్లాలు పిల్లలు: కాళ్ళు పట్టుకుని వేడుకున్న శ్రీవల్లి.. నర్మద, ప్రేమ కనికరిస్తారా?
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు '(Illu illalu pillalu ). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -437 లో.....రామరాజు ఇంట్లో ప్రేమ, ధీరజ్ కలిసి శ్రీరామనవని సందర్బంగా చేస్తున్న పూజలో కూర్చుంటారు. ఆ తర్వాత అందరు ప్రసాదం తింటూ సరదాగా మాట్లాడుకుంటారు. అల్లుడు గారు మాతో పాటు ఒక వారం రోజులు వేదవతి పంపండి అని రామరాజుని వేదవతి వాళ్ళ అమ్మ అడుగుతుంది. లేదు అమ్మ ఇల్లు పిల్లల్ని వదిలేసి రాలేనని వేదవతి అంటుంది. నువ్వు అలా అంటావనే అల్లుడు గారిని అడుగుతున్నానని వేదవతి వాళ్ళ అమ్మ అంటుంది. పోండి అత్తయ్య మంచిగా ఎంజాయ్ చేసి రండి అని ప్రేమ, నర్మద అంటారు. ఇక అందరు వెళ్ళమంటారు.. రామరాజు కూడా సరే అనడంతో వేదవతి సరే అంటుంది. ఆ తర్వాత ప్రేమ, నర్మదలతో మాట్లాడాలని శ్రీవల్లి పిలుస్తుంది. జరిగిందేదో జరిగింది.. వదిలెయ్యండి చెల్లెళ్లు అని వాళ్ళిద్దరిని శ్రీవల్లి రిక్వెస్ట్ చేస్తుంది. చూసావా ఈ వల్లి తప్పు అని ఒప్పుకోవడం లేదని ప్రేమ అంటుంది. ప్లీజ్ ఇద్దరు కలిసి నా కాపురం ఇలా చేశారు.. మీరే నన్ను ఆ ఇంటికి తీసుకొని వెళ్ళండి అని వాళ్ళని శ్రీవల్లి రిక్వెస్ట్ చేస్తుంది. నిన్ను నమ్మితే మా పని అంతే అని నర్మద అంటుంది. ప్లీజ్ చెలెళ్లు అని శ్రీవల్లి రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటుంది. అది చూసి భాగ్యం వచ్చి ఏంటే నువ్వు వీళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నావని కోప్పడుతుంది. నీకేం తెలియదు అమ్మ సైలెంట్ గా ఉండమని శ్రీవల్లి అంటుంది. నువ్వు అసలు తల్లివేనా తనకి ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే అని నర్మద అంటుంది. పది రోజుల్లో నా కూతురు ఆ ఇంట్లో ఉండేలా చేస్తాను. నువ్వు వాళ్ళని బ్రతిమిలాడడం ఏంటే అని శ్రీవల్లిని భాగ్యం లాక్కొని వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 05, 2026
గంగ గతం వెనుక విషాదం.. ఆశయం కోసం బిడ్డను కాదనుకున్న తండ్రి కథ!
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -235 లో.....గంగ పేరెంట్స్ ఇంటికి రావడంతో శకుంతల వాళ్లని అవమానించి పంపిస్తుంది. గంగ వాళ్ళ పేరేంట్స్ బయటకు వెళ్తుంటే ఎదురుగా కార్ వస్తుంది. అందులో నుండి దిగి రుద్ర, రంగా వస్తారు. ఏం అయిందని అడుగగా జరిగింది చెప్తారు. దాంతో గంగ వాళ్ళ పేరేంంట్స్ కి రుద్ర సారీ చెప్తాడు. ఇక వాళ్ళకి గంగ ఎలా దొరికిందో చెప్పాలని గంగ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు అనుకుంటారు. ఇక గంగ వాళ్ళ అమ్మ లక్ష్మీ అసలు గతంలో ఏం జరిగిందో రుద్రతో చెప్తుంది. బాబు గంగని మేమేం తీసుకొని రాలేదు.. తన తండ్రి వద్దనుకొని వదిలేసి వెళ్ళాడని రుద్రకి లక్ష్మీ జరిగింది మొత్తం చెప్తుంది. గతంలో గంగ వాళ్ళ నాన్న గంగని తన ఆశయానికి ఉపయోగపడే బిడ్డ కాదని వదిలించుకుంటాడు. అటుగా వెళ్తున్న లక్ష్మీ తనని తీసుకొని వచ్చింది సాదుకుంటుంది. ఆశయం కోసం బిడ్డని వదులుకునే తండ్రి కూడా ఉన్నాడా అని జరిగింది విని రుద్ర షాక్ అవుతాడు. మరొకవైపు గంగ అసలైన తండ్రి విశ్వనాథ్ బాక్సింగ్ కోచ్.. అతను ఒక అతనికీ ట్రైనింగ్ ఇస్తాడు. అతడి పేరు ధీరజ్. ధీరజ్ ని పోటీకీ సిద్ధం చేస్తాడు విశ్వనాథ్. ఇన్నిరోజులకి నా ఆశయాన్ని నిలబెట్టే రోజు వచ్చింది.. నువ్వు త్వరలో వైజాగ్ లో జరగబోయే పోటీలో పార్టీసిపేట్ చేస్తున్నావని విశ్వనాథ్ తన శిష్యుడు ధీరజ్ కి చెప్తాడు. మరొకవైపు రుద్ర వచ్చేసరికి గంగ కోపంగా ఉంటుంది. గంగ త్వరలో వైజాగ్ లో బాక్సింగ్ పోటీ ఉంది.. అది విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది.. ఆయనా ఇక్కడికి వచ్చి మన అకాడమీలో సెషన్స్ తీసుకుంటాడని గొప్పగా చెప్తాడు. అయినా గంగ డల్ గా ఉంటుంది. ఎవరో వస్తే ఏంటి.. ఆయనేమైనా వచ్చేది మా నాన్ననా..మా కోచ్ ఆ.. అని గంగ అంటుంది. అది కాదు ఆయన క్లాస్ లు వింటే బాగుంటుందని గంగతో రుద్ర చెప్తాడు. ఆ తర్వాత ప్రమీల డల్ గా సూపర్ మార్కెట్ కి వెళ్తుంది. తనని నవ్వించడానికి మక్కామ్, కార్తీక్ ప్లాన్ చేస్తారు. ఇద్దరు కలిసి ఏదో ఒకటి చేసి ప్రమీలని నవ్విస్తారు. ఆ తర్వాత పెద్దసారు హాల్లోకి వచ్చి మాట్లాడతాడు. అప్పుడే రాఘవ, సూర్య వచ్చి గవర్నమెంట్ ప్రాజెక్ట్ వచ్చిందని అందరికి చెప్తాడు. తరువాయి భాగంలో పెద్దసారు చెల్లి గురించి మాట్లాడుతుంటే తన గురించి టాపిక్ తియ్యకండి అని శకుంతల కోప్పడుతుంది. ఆ విషయం గంగ విని రుద్రకి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 05, 2026.webp)
నేను మంచోళ్ళకు మంచోడిని...చెడ్డోళ్లకు చెడ్డోడిని
బిగ్ బాస్ సీజన్ 9తో బాగా పాపులరైన వాళ్ళల్లో డెమోన్ పవన్ కూడా ఒక వ్యక్తి. రీసెంట్గా అతను తండ్రిని కోల్పోయాడు. అలాంటి డెమోన్ కూకు విత్ జాతి రత్నాలు షోకి వచ్చాడు. ఇక రీతూ చౌదరితో మంచి ఫ్రెండ్ షిప్ కూడా ఉంది. రీసెంట్గా డెమోన్ తన స్టేటస్లో ఒక పోస్ట్ పెట్టాడు. " నా ప్రియమైన వారందరికీ మీ ప్రేమకు మీ సపోర్ట్కి చాలా చాలా ధన్యవాదాలు. చాలా మంది నన్ను తప్పుగా అర్థం చేసుకుంటు న్నారు. నేను తప్పు చేయకపోయినా, వ్యతిరేకతను, ద్వేషాన్ని భరించాల్సి వస్తోంది. ఐనా కానీ మౌనంగా ఉంటున్నాను. కానీ అది నా వాళ్లను ఇబ్బంది పెట్టె పరిస్థితికి వస్తోంది. ఒక వేళ అలా జరిగితే నాలోని రాక్షసుడు బయటకు వస్తాడు అప్పుడు వాడిని తట్టుకోవడం చాలా కష్టం .చాలా మంది తెలియకుండానే తప్పులు చేస్తారు. తర్వాత తెలుసుకుని మారతారని నేనేప్పుడూ అనుకుంటాను. అందుకే నేను అలాంటి వాళ్ళను క్షమించి, ప్రశాంతంగా ఉంటున్నాను. నేను మంచోళ్ళకు మంచోడిని, చెడ్డోళ్లకు చెడ్డోడిని . మీరందరూ ఇక మీదట ఇవన్నీ ఆపేస్తారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను ఎప్పటికీ ఇలాగే ఉంటాను" అంటూ తనను ట్రోల్ చేసేవారికి, కామెంట్స్ చేసేవారికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు డెమోన్ పవన్. అలాగే స్టేటస్లో పెట్టిన మరో పోస్ట్ చూస్తే వాళ్ళ నాన్నగారు లేకపోవడంతో వాళ్ళ అమ్మ తనతో పాటు ఉండటానికి తన ఇంటికి హైదరాబాద్ వచ్చేసిందని చెప్పాడు.
Apr 05, 2026
నా ఫ్యామిలీకి లేని ప్రాబ్లమ్ మీకెందుకు...నాతో పెట్టుకోవద్దు ఖబడ్దార్
నైనికా ఆనసురు బుల్లితెర మీద ఫుల్ ఫేమస్. ఢీ షో తర్వాత బిగ్ బాస్లో ఇక ఇప్పుడు బిబి జోడిలో అమరదీప్తో కలిసి పెర్ఫార్మ్ చేసింది. అలాంటి నైనికా రీసెంట్గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో ఒక పోస్ట్ పెట్టింది. "నేనేం చేస్తున్నాను, ఏమి తాగుతున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఎవరితో వెళ్తున్నాను, ఎలాంటి బట్టలు వేసుకున్నాను అనే విషయాలపై చాలామంది ఎంతలా ఆసక్తి చూపిస్తున్నారో నేను గమనిస్తున్నాను. నేను ఒక పబ్లిక్ ఫిగర్ని కాబట్టి అందరూ నేను చేసే పనుల మీద దృష్టి పెడతారని నాకు తెలుసు. కానీ కొంతమంది చేస్తున్న కామెంట్స్, పెడుతున్న వీడియోస్ నాకు అస్సలు నచ్చడం లేదు. మీరు నమ్మరు కానీ నాకున్న పవర్తో నేను మిమ్మల్ని నాశనం చేయగలను. నేనే గనక ఆ విషయాలను కోర్ట్ వరకు తీసుకెళ్తే మీరే పెద్ద చిక్కుల్లో పడతారు. నేనేంటో నా ఫ్యామిలీకి తెలుసు. వాళ్లకు ఏం ప్రాబ్లమ్ లేనప్పుడు మీరు మీ ఫ్యామిలీని మంచిగా చూసుకుంటే బెటర్. నా జోలికి రాకండి. అందరికీ ధన్యవాదాలు హ్యాపీగా మీరు మీ జీవితాలను చూసుకోండి. నా ప్రియమైన వారందరికీ అసలు ఏమైందని నన్ను అడగొద్దు. ఏమీ జరగలేదు. కానీ అప్పుడప్పుడు నాకు బాధ కలిగినప్పుడల్లా నాకు నేను కూడా నిలబడాలిగా " అంటూ చాలా ఘాటైన స్టేటస్ పెట్టుకుంది.
Apr 05, 2026
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com



