.webp)
Jayam serial : జయకు పెళ్లి చేసి పంపించేయాలని విశ్వ సంచలన నిర్ణయం.. వీరు మాస్టర్ ప్లాన్!
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -322 లో....ఇషిక పూజ చేస్తుంటే అందరు షాక్ అవుతారు. అప్పుడే సూర్య వచ్చి ఏంటి ఈ వింత అని అంటాడు. ఇషిక పూజ అయ్యాక అందరికి హారతి ఇస్తుంది. రుద్ర హారతి తీసుకుంటుంటే దీపం ఆరిపోతుంది. దాంతో రుద్ర షాక్ అవుతాడు. ఏంటి గంగ గురించి మొక్కుకుంటే ఇలా అయిందని కంగారుపడతాడు. ఎందుకు అయినా మంచిది గంగని జాగ్రత్తగా ఉండమను అని శకుంతల అంటుంది. మరొకవైపు జయ చేసిన గొడవ విశ్వకి తెలుస్తుంది. ఏంటి జయ నువ్వు ఒంటరిగా పెరిగానంటావ్ ఒంటరిగా పెరిగితే బంధాలు పెంచుకుంటారు కానీ ఇలా అవమానించారు ఇక నువ్వు ఇక్కడ అవసరం లేదు నిన్ను హాస్టల్ లో ఉంచి చదివిస్తానని విశ్వ అనగానే ఎందుకు అలా అంటున్నారని సుధా అంటుంది. నా నిర్ణయం ఫైనల్ అని విశ్వ చెప్పి వెళ్తుంటే అప్పుడే వీరు వచ్చి బాబాయ్ మీరు తీసుకున్న నిర్ణయం తప్పు.. తనకి పెళ్లి చెయ్యండి అప్పుడు బంధాల గురించి తెలుస్తుందని వీరు సలహా ఇస్తాడు. దాంతో జయ షాక్ అవుతుంది. మంచి సలహా ఇచ్చావ్ రేపే వెళ్లి మ్యారేజ్ బ్యూరో వాళ్ళని కలుస్తానని విశ్వ అంటాడు. జయ, వీరు పక్కకు వెళ్లి మాట్లాడుకుంటారు. ఇప్పుడు పెళ్లి ఏంటని జయ కోప్పడుతుంది. అప్పుడే నువ్వు విశ్వనాథ్ కూతురు అని ప్రపంచానికి తెలుస్తుంది. పైగా ఆస్తులు ఇచ్చి మరి పెళ్లి చేస్తారని వీరు అంటాడు. పేరుకే పెళ్లి అని వీరు అనగానే జయ సరే అంటుంది. మరొకవైపు రంగ, గంగ మార్కెట్ నుంచి వస్తుంటే కొంతమంది రౌడీలు గంగని పోటీ నుంచి తప్పుకో లేదా ఓడిపోమని బెదిరిస్తాడు. గంగ ఎదురు తిరిగి మాట్లాడాలని ట్రై చేస్తుంటే తనని కత్తితో పోడవడానికి ట్రై చేస్తారు రౌడీలు. అప్పుడే రుద్ర వచ్చి సేవ్ చేస్తాడు. ఆ విషయాలన్నీ రుద్ర, గంగ ఇంటికి వెళ్లి చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jul 17, 2026 10:44AM.webp)
లైవ్లోనే తన రిలేషన్షిప్పై అఖిల్ అక్కినేని షాకింగ్ కామెంట్స్!
ఆదివారం విత్ స్టార్ మా పరివారం లేటెస్ట్ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ ఉంది. ఈ ఎపిసోడ్ కి లెనిన్ హీరో ఎంట్రీ ఇచ్చాడు. "అమ్మాయిల కలల రాజకుమారుడు, అభిమానుల గుండెల్లో అయ్యగారు, సిల్వర్ స్క్రీన్ పై సునామి సృష్టించిన అఖిల్ అక్కినేని " అంటూ గట్టిగా పరిచయం చేసింది శ్రీముఖి. ఇక హీరోయిన్ స్టేజి మీదకు రాకపోయేసరికి అఖిల్ "ఏయ్ బంగారం " అని పిలిచాడు. వెంటనే హీరోయిన్ కూడా వచ్చేసి అఖిల్ కి షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఈ ప్రోమోలో కనిపించిన దీపికా హీరో అఖిల్ అని ఆటపట్టించింది. "ఆడుకుందాం రా ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ " అంది . "నేనింక ఎలిజిబుల్ కాదమ్మా " అని చెప్పాడు అఖిల్. దాంతో దీపికా బుంగమూతి పెట్టింది. స్టేజి మీద ఉన్నవాళ్ళంతా నవ్వేశారు. "ఆయనే అది మర్చిపోయి ఈ సెట్ కి వచ్చారు " అని మళ్ళీ కౌంటర్ వేసింది దీపికా. "మర్చిపోలేదు , అస్సలు మర్చిపోలేదు " అని చెప్పాడు. తర్వాత కర్రసాము చేసి "వాసి వాడి తస్సాదియ్యా" అంటూ వాళ్ళ నాన్న నాగార్జున నటించిన "సోగ్గాడే చిన్ని నాయనా " మూవీలోని డైలాగ్ చెప్పి ఆ సిలంబం స్టిక్ ని స్టేజి మీద గట్టిగా కొట్టి కొట్టాడు. తండ్రికి తగ్గ తనయుడు ఎక్కడా తగ్గేదిలే అన్నట్టు కనిపించాడు. ఇక ఈ ప్రోమో కింద నెటిజన్స్ కూడా కామెంట్స్ పెడుతున్నారు. " మీరు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న విజయం "లెనిన్" రూపంలో ఇన్నాళ్లకు మీకు లభించినందుకు తెలుగు ప్రేక్షకులు అందరి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు"అఖిల్" గారు... అయ్యగారే నంబర్ వన్ ...సమంత రాకతో ఆదివారం షోకి స్టార్ స్టేటస్ వచ్చింది , ఇక స్టార్స్ ఈ షోకి క్యూ కడతారు , తెలుగులో వన్ అఫ్ ది టాప్ షో ... " అంటూ అఖిల్ కి విషెస్ చెప్తున్నారు.
Jul 16, 2026 4:06PM.webp)
స్టేజీపైనే అనిల్ రావిపూడికి ఆఫర్ ఇచ్చిన అఖిల్!
డ్రామా జూనియర్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి లెనిన్ మూవీ హీరో అఖిల్ అక్కినేని, హీరోయిన్ భాగ్యశ్రీ వచ్చారు. "మీరు డెఫినిట్లీ కనిపించే వ్యక్తిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి." అని చెప్పాడు హోస్ట్ సుధీర్. వెనక స్క్రీన్ మీద అఖిల్ పాకే వయసులోనే నటించిన సిసింద్రీ మూవీ నుంచి పిక్ ని వేసి చూపించాడు. "ఇక్కడున్న పిల్లలకన్నా చాలా యంగ్ ఏజ్ లోనే నటించారు " అని చెప్పాడు సుధీర్. "ఇప్పటి నుంచి చూడబోయే అఖిల్ వేరు అన్నంత స్టేజి ఉందన్నమాట జనులందరిలో " అన్నాడు సుధీర్. "లెనిన్ మూవీ నా సమాధానం ఎవరైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో బాబాయ్ కూడా " అంటూ హీరో శ్రీకాంత్ ని చూపించారు. "చిన్నప్పుడు సిసింద్రితోనే ఇండస్ట్రీని షేక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు " అంటూ అఖిల్ గురించి చెప్పారు అనిల్ రావిపూడి. వెంటనే అఖిల్ "వచ్చే సంక్రాంతికి మనం ఒక సినిమా తీయాలి " అని చెప్పాడు. ఇక స్క్రీన్ మీద పెద్ది రాంచరణ్ పిక్ చూపించారు. "మై ఆర్ సి . మై హార్ట్ బీట్" అన్నాడు. తర్వాత సమంత పిక్ తో ఉన్న "మా ఇంటి బంగారం " పోస్టర్ వేశారు. "ఫిమేల్ పవర్ చూపించింది " అన్నాడు. "మాసివ్ బ్లాక్ బస్టర్ లెనిన్ " అనే పోస్టర్ వేశారు. "అఖిల్ గారే నంబర్ వన్ " అని చెప్పారు అనిల్ రావిపూడి. కాదు అని అఖిల్ తల ఊపి " ఇంట్లో ఇంకొకరు ఉన్నారు నాతో పాటు. ఆ పెయిన్ వాళ్ళు ఫీలయ్యారు. కంప్లీట్లీ నాచురల్ గా ఆ మూమెంట్ లో వచ్చేసింది " అన్నాడు. వెనక కేక్ కట్ చేసిన నాగార్జున అఖిల్ ని హగ్ చేసుకుంటున్న వీడియోని ప్లే చేశారు. అఖిల్ అక్కినేని రీసెంట్ గా నటించిన మూవీ "లెనిన్ ". ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి దూసుకుపోతోంది. అఖిల్ చేసిన మూవీస్ తక్కువే ఐనా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసే మూవీస్ లో నటించాడు. 1995లో 'సిసింద్రి' మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. 2015 లో అఖిల్ అనే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 'హలో', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్', 'ఏజెంట్' మూవీస్ లో నటించాడు.
Jul 16, 2026 3:56PM.webp)
Ye Devi Varamo Nevvu: మనవరాలిని చూసి మురిసిపోయిన తాతయ్య..
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'(Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -09 లో.....అనాధాశ్రమం నుంచి జానకమ్మ ఒక్కొక్కరిని పంపిస్తుంది. రేవతి తీసుకొని వెళ్లడానికి ఇద్దరు భార్యాభర్తలు వస్తారు. అంజలిని వదిలివెళ్తుంటే రేవతి ఎమోషనల్ అవుతుంది. అక్కాచెల్లెల్ల కంటే ఎక్కువ ఉంటారు.. అందుకే అంత బాధపడుతున్నారని జానకమ్మ అంటుంది. అందరిని పంపించేసావ్ కదమ్మా అని అంజలి ఏడుస్తుంది. మరొకవైపు మనీష్ దగ్గరికి గీతాంజలి వస్తుంది.నీతో మాట్లాడాలిరా.. మీ తాతయ్య ఏంటి అలా ఉన్నాడు.. ఏదో విషయం గురించి బాధపడుతున్నాడు.. అదేంటో కనుక్కోవాలి.. ఏ విషయం అయిన నాకు చెప్పేవాడు.. ఇప్పుడు చెప్పడం లేదంటే తను బాధపడేది నా గురించి అనుకుంటా అని గీతాంజలి అనగానే అలా ఏం అయి ఉండదు అత్తయ్య మీ గురించి బాధపడడానికి ఏం ఉంటుందని మనీష్ చెప్తాడు. మరొకవైపు జానకమ్మ దగ్గరికి రాజారాం వస్తాడు. మీరు వస్తారు అనుకోలేదని జానకమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా మనవరాలిని పిలవండి అని రాజారాం అనగానే అంజలిని జానకమ్మ పిలుస్తుంది. అంజలిని చూసి రాజారాం హ్యాపీగా ఫీల్ అవుతాడు. అతను మీ తాతయ్య అని జానకమ్మ చెప్పగానే అంజలి హ్యాపీగా ఫీల్ అవుతుంది. తాతయ్య లాంటి వాడిని అని రాజారాం అనగానే అంజలి డిస్సపాయింట్ అవుతుంది. అంజలి నువ్వు వెళ్లి కాఫీ తీసుకొని రా అని జానకమ్మ తనని పంపిస్తుంది. ఆ తర్వాత జానకమ్మకి రాజారాం చెక్ ఇస్తాడు. అంజలి భవిష్యత్తు కోసం అంటాడు. అప్పుడు మీ కొడుకు చేసిన తప్పు ఇప్పుడు మీరు చేస్తున్నారని జానకమ్మ కోప్పడుతుంది. తరువాయి భాగంలో ఇవి ఫ్యామిలీ గురించి తెలిపే ఆధారాలు అని అంజలికి కొన్ని పేపర్స్ ఇస్తుంది జానకమ్మ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jul 16, 2026 11:14AM.webp)
Godhavari : జానుపై నందు తీవ్ర ఆగ్రహం.. అమెరికా జ్ఞాపకాలను తగలబెట్టిన కొత్త పెళ్ళికూతురు!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -57 లో.....నందుని మురళి పెళ్లి చేసుకున్నాడని ఇద్దరిని శాంతి ఇంట్లోకి రానివ్వదు. దాంతో వాళ్ళు శారద ఇంటికి వెళ్తారు. అక్కడున్న వాళ్ళంతా శాంతి సంగతి తెలిసిందే కదా కట్నం తీసుకొని రాలేదని లోపలికి రానివ్వలేదనుకుంటా అయిన పెళ్లి చేసుకున్నాక అత్తారింట్లో ఉండాలి కానీ ఇలా పుట్టింట్లోకి రావడం ఏంటని అక్కడ అంటుంటే ఇప్పుడు నన్నేం చెయ్యమంటారు. మా అత్త రానివ్వడం లేదని అందరిపై నందు కోప్పడుతుంది. మీరు పెళ్లికి వచ్చారు.. చూసారు.. మా ఇంటి విషయాల్లో ఇన్వాల్వ్ కావద్దని పెళ్ళికి వచ్చినవాళ్ళతో జాను అంటుంది. ఆ తర్వాత నందు, మురళిలకి గౌతమి హారతి ఇస్తుంది. అత్త ఇంట్లోకీ అయితే కుడి కాలు అంటారు. ఇప్పుడు ఏ కాలు పెట్టి వస్తుందని అక్కడ వాళ్ళు అంటుంటే నందు కోపంగా ఒక్కతే లోపలికి వెళ్తుంది. అక్కడ శంకర్ ఫోటోని చూస్తూ ఏడుస్తుంది. మరొకవైపు సూర్యకి భువన ఫోన్ చేస్తుంది. తను లిఫ్ట్ చెయ్యదు. దాంతో వాయిస్ మెసేజ్ పెడుతుంది. ఇద్దరు వాయిస్ మెసేజ్ ద్వారానే మాట్లాడుకుంటారు. అప్పుడే సింహాద్రితో కార్ లో రౌడీలు వెళ్లడం సూర్య చూస్తాడు. వాళ్ళని ఫాలో అవుతాడు. రౌడీలని సింహాద్రి తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. తోట మీదే అయింది. ఇక మేనల్లుడుని అల్లుడు చేసుకొని ఆ ఆస్తులు కూడా మీకే అవుతాయని వాళ్ళు సింహాద్రితో అంటారు. ఇప్పుడు తోటని నాకు ఎక్కవ ధరకి అమ్మి పెట్టండి అని వాళ్ళతో సింహాద్రి అంటాడు. అప్పుడే సూర్య వచ్చి రౌడీలపై కోప్పడతాడు. సూర్య వాళ్ళు నా బిజినెస్ పార్టనర్స్ అని సింహాద్రి అనగానే ఆ రోజు వాళ్ళు అమ్మని ఎంత అవమానించారని సూర్య అనగానే అవన్నీ వదిలేయ్ అని సింహాద్రి అంటాడు. వాళ్లని పంపించి సూర్య పై కోప్పడతాడు సింహాద్రి. మరొకవైపు నందు తన అమెరికాకి సంబందించిన ఫొటోస్ అన్ని కాల్చేస్తుంది. ఏంటి అక్క ఇదంతా అని జాను అడుగుతుంది. ఇదంతా నువ్వు కావాలనే చేసావ్ పెళ్లి కొడుకు గురించి నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు.. పెళ్లి మండపంలో చెప్పి మురళి బావని పెళ్లి చేసుకోవడానికి కారణం అయ్యావని నందు ఏడుస్తుంది. తరువాయి భాగంలో నందుకి మురళికి ఫస్ట్ నైట్ జరిపించాలని పెద్దావిడ నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jul 16, 2026 11:11AM.webp)
Brahmamudi : కావ్యతో కలిసి చలపతి ఇంటికి చేరిన రాజు!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1085 లో..... ఇందుని హాస్పిటల్ నుంచి వెళ్ళమని చలపతి చెప్తాడు. నా బావని నా ఇంటికి తీసుకొని వెళ్లి తనని కాపాడుకుంటానని ఇందు రిక్వెస్ట్ చేస్తుంది. చలపతి ఒప్పుకోకపోవడంతో ఇందు అతని కాళ్లపై పడి బ్రతిమిలాడుతుంది. దాంతో చలపతి సరే అంటాడు.ఆ తర్వాత రాజు స్పృహలోకి వచ్చాడని డాక్టర్ చెప్పగానే ముగ్గురు లోపలికి వెళ్తారు. నాన్న ఆక్సిడెంట్ చేసిన వాడు దొరికాడా డబ్బులు ఇవ్వమను అంటుంటే ఇందు నవ్వుకుంటుంది. అప్పుడే ఇందుకి అపర్ణ ఫోన్ చేసి రాజు ఎక్కడ అని అడుగుతుంది. ఇప్పుడు బావ దగ్గరే ఉన్నాను వచ్చాక చెప్తానని ఇందు అంటుంది. బావ ఏంటని రాజు అనగానే భర్తని బావ అనొచ్చని ఇందు అనగానే అవునని చలపతి అంటాడు. మరొకవైపు రేఖ రెడీ అవుతుంటే ఎక్కడికి అని భ్రమరాంబ అడుగుతుంది. ఆ రాజు గాడు చచ్చాడు కదా వాళ్ళ ఇంటికి అని రేఖ అంటుంది. ఎందుకు వాడిని చంపించేసావని భ్రమరాంబ అడుగగానే వాడు నా గతం అని చెప్పబోయి ఆగిపోతుంది. వాడు మనం చేసే ప్రతీ పనికి అడ్డుపడుతున్నాడని రేఖ అంటుంది కానీ భ్రమరాంబకు డౌట్ వస్తుంది. ఆ తర్వాత రేఖ, భ్రమరాంబ కిందకి వస్తారు. స్వాతి అపర్ణ సరదాగా మాట్లాడుకుంటుంటే ఇంకా వాళ్ళకి విషయం తెలియనట్లు ఉందని రేఖ, భ్రమరాంబ అనుకుంటారు. ఇందు ఎక్కడ అని రేఖ అంటుంది. రాజు దగ్గర ఉందని అపర్ణ అనగానే రేఖ షాక్ అవుతుంది. అయితే మీకు విషయం తెలియదా అని భ్రమరాంబ అనగానే రేఖ తనని బయటకి లాక్కొని వెళ్తుంది. నువ్వు వాడిని చంపించేసానన్నావ్ మరి వాళ్ళు ఏంటి అలా అంటున్నారని భ్రమరాంబ అడుగుతుంది. దాంతో రేఖ రౌడీకి ఫోన్ చేసి ఏమైందని అడుగుతుంది. చంపేసానని చెప్తాడు. అది విని రేఖ రిలాక్స్ అవుతుంది. మరొకవైపు చలపతి ఇంటికి రాజు, కావ్య వెళ్తారు. మీ అత్తగారి ఇంటికి వెళ్ళమంటే వెళ్లకుండా ఇక్కడికి వచ్చావ్ ఏంట్రా అని చలపతి అంటాడు. అప్పుడే ఇందు వాటర్ తీసుకొని వస్తుంది. అప్పుడేమో మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావ్.. ఇప్పుడెమో వెళ్ళనని బెట్టు చేస్తున్నావని చలపతి అంటాడు. భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలని చలపతి, లక్ష్మి వాళ్ళకి చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jul 16, 2026 11:07AM.webp)
Karthika Deepam2 : పారిజాతం వేసిన ప్లాన్ రివర్స్.. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న విలన్లు!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -723 లో....పారిజాతం కార్ బ్రేకులు తీసేసి జ్యోత్స్నకి చెప్తుంది. ఇప్పుడు ఈ కార్ ఆ సూరజ్ గాడు నడిపేలా చెయ్యాలి.. అప్పుడు వాడి పీడ విరుగడవుతుందని జ్యోత్స్న, పారిజాతం ప్లాన్ చేస్తారు. మరొకవైపు శౌర్యని కాంచన, అనసూయ రెడీ చేస్తారు. దీప నువ్వు ముందు టిఫిన్ చెయ్ తర్వాత ఫోన్ మాట్లాడమని దీపతో అనసూయ అంటుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. చూడు బాబు ఇప్పటికి దీప ఏం తినలేదు.. ఎప్పుడు ఫోన్ నే మాట్లాడుతుందని అనసూయ అనగానే నన్నే అసలు పట్టించుకోవడం లేదని కార్తీక్ అనగానే ఏంటే బాబు చెప్పేది నిజమేనా అని అనసూయ అడుగుతుంది. బావ నువ్వు ఏంటని దీప అనగానే అదేం లేదు పెద్దమ్మ దీప తన కడుపులో బిడ్డ కంటే కూడా నాకే ఇంపార్టెన్స్ ఇస్తుందని కార్తీక్ అంటాడు. మీరు ఇద్దరు మంచి భార్యాభర్తలు అని అనసూయ అంటుంది. మరొకవైపు సూరజ్ బయటకి రాగానే జ్యోత్స్న, పారిజాతం యాక్టింగ్ మొదలుపెడుతారు. గ్రానీ పార్లర్ కి వెళ్ళాలి కానీ కార్ స్టార్ట్ అవ్వడం లేదని జ్యోత్స్న అనగానే దాంతో సూరజ్ ని పారిజాతం పిలుస్తుంది. బాబు ఒకసారి కార్ చూడమని పారిజాతం అంటుంది. దాంతో సూరజ్ కార్ ఎక్కి బానే ఉంది కదా అని అంటాడు. అది కాదు ఒకసారి టెస్ట్ చేసి రా కార్ ఏ కండిషన్ లో ఉందోనని తెలుసుకోవచ్చని జ్యోత్స్న అనగానే సూరజ్ వెళ్తాడు. దాంతో ప్లాన్ సక్సెస్ అని జ్యోత్స్న, పారిజాతం అనుకుంటారు. మరొకవైపు మాలిని ఎలాంటిదో కార్తీక్, దీప ఇద్దరితో కాంచన చెప్తుంది. కాంచన మాటలు విన్న కార్తీక్ ఎందుకు అమ్మా అలా అంటున్నావ్ ఆవిడ వల్ల మన కుటుంబానికి ఏమైనా నష్టం జరిగిందా అని కార్తీక్ అనగానే అదంతా ఇప్పుడు అవసరం లేదు. మీరు అయితే జాగ్రత్తగా ఉండండి అని కాంచన చెప్తుంది. మరొకవైపు సూరజ్ కార్ టెస్ట్ చెయ్యడానికి వెళ్లి సేఫ్ గా వస్తాడు. దాంతో జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతారు. అప్పుడ్ కార్తీక్ వస్తాడు. ఏమైందని అడుగుతాడు. మేడమ్ పార్లల్ కి వెళ్ళాలి అంట.. కార్ ప్రాబ్లమ్ లో ఉందంటే టెస్ట్ చేశాను బానే ఉంది.. మీరు ఇక పార్లర్ కి వెళ్లొచ్చని సూరజ్ అనగానే తప్పక పారుని తీసుకొని జ్యోత్స్న అక్కడ నుంచి కార్ లో వెళ్తుంది. జ్యోత్స్న కార్ డ్రైవ్ చేస్తూ బ్రేక్ లు ఫెయిల్ అయ్యాయని తెలుసుకుంటుంది. ఇక ఇద్దరు టెన్షన్ పడుతారు. ఒక చెట్టు దగ్గర వెళ్లి ఆక్సిడెంట్ చేస్తుంది. అది చూసి సూరజ్, కార్తీక్ వస్తారు. జ్యోత్స్న, పారు షాక్ లో ఉంటారు కానీ ఎవరికి ఏం కాదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jul 16, 2026 11:03AM.webp)
Illu illalu pillalu : ప్రేమకు పోలీస్ ఎన్క్వైరీ నోటీస్.. సాగర్ లంచం భాగోతం!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -524 లో.... ప్రేమని తీసుకొని ధీరజ్ పోలీస్ కోచింగ్ దగ్గరికి వెళ్తాడు. క్లాస్ లోకి వెళ్లేందుకు ప్రేమ భయపడుతుంటే క్లాస్ వరకు వచ్చి పంపిస్తాడు. ఏంటి చిన్నపిల్లలాగా తనని క్లాస్ వరకు వచ్చి పంపిస్తున్నారని అక్కడ సర్ అంటుంటే తను ఇంట్లో చాల గారాబంగా పెరిగింది సర్ అందుకే అని ధీరజ్ అంటాడు. ఆ తర్వాత ప్రేమ క్లాస్ లో కూర్చొని ఉంటుంది. ధీరజ్ కిటికీ నుంచి చూసేసరికి ప్రేమ నిద్రపోతు ఉంటుంది. అది చూసి తనకి నిద్ర రాకుండా టీ తీసుకొని వస్తాడు. అలా ఏదో ఒకటి తనకి తీసుకొని వస్తుంటే అందరు నవ్వుకుంటారు. మరొకవైపు సాగర్ దగ్గరికి ఒకతను వచ్చి లంచం ఇచ్చి సంతకం పెట్టమని చెప్తాడు. దాంతో సాగర్ అక్కడ క్లర్క్ ని పిలిచి.. ఏంటి ఇది అని అంటాడు. వచ్చిన అతన్ని గుమస్తా పక్కకి తీసుకొని వెళ్తాడు. అతను ఇచ్చిన డబ్బు గుమస్తా తీసుకొని వచ్చి సాగర్ కి ఇస్తాడు. సర్ ఇలా చేస్తేనే బాగుపడుతారు. మీరు ఆ ఫైల్ పై సంతకం పెట్టండి అని గుమస్తా అనగానే రామరాజు న్యాయం గురించి మాట్లాడిన మాటలు గుర్తుచేసుకొని ఆగిపోతాడు కానీ తర్వాత ఫైల్ పై సంతకం పెడుతాడు. గుమస్తా ఆ ఫైల్ తీసుకొని వెళ్లి అతనికి ఇస్తాడు. రిస్క్ చేశాను సర్ అని గుమస్తా అనగానే నీకేం ప్రాబ్లెమ్ రాదు పోతే తన జాబ్ పోతుందని అతను అంటాడు. మరొకవైపు రామరాజుకి వేదవతి కాఫీ తీసుకొని వస్తుంది. చాలా థాంక్స్ అండి ప్రేమ విషయం తనకి నచ్చింది చెయ్యమన్నందుకు అని వేదవతి అంటుంది. నువ్వు ఎప్పుడు ఏం అడగలేదు కదా అని రామరాజు అంటాడు. ఏవండీ మా అమ్మ పుట్టినరోజు మా ఇంట్లో చేసుకుందామని వేదవతి అనగానే నేను ఎందుకు వద్దని అంటానని రామరాజు అంటాడు. అప్పుడే నర్మద వస్తుంది. ఇంతసేపు అవుతుంది. కోడలికి కాఫీ తేవాలని తెలియదా అని నర్మద అనగానే వేదవతి నవ్వుకుంటుంది. మరొకవైపు ప్రేమ దగ్గరికి ధీరజ్ వెళ్తాడు. అప్పుడే ప్రేమకి మోపిదేవి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది. మీరు ఎనమిది నెలలు క్రితం ఇక్కడ లాడ్జ్ లో స్టే చేసినప్పుడు అక్కడ ఒక కేసు ఫైల్ అయింది. దాని గురించి మిమ్మల్ని ఎంక్వయిరీ చెయ్యాలని ఇన్స్పెక్టర్ చెప్తాడు. దాంతో ప్రేమ టెన్షన్ పడుతుంది. ధీరజ్ కీ చెప్తుంది ఇద్దరు కలిసి బయల్దేరతారు. ఆ విషయం నర్మదకి చెప్తారు. నర్మద ఆ విషయం వేదవతికి చెప్తుంది. వేదవతి టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jul 16, 2026 11:01AM.webp)
Podharillu : చక్రి, మహాలకు విడాకులు నిరాకరించిన జడ్జ్.. అసలు నిజం బయటపడుతుందా?
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -158 లో....చక్రితో మహా విడాకులు తీసుకోవడానికి సిద్ధమవుతుంది. దాంతో అన్నయ్య నాకొక హెల్ప్ చేస్తావా మహా నాకు విడాకులు ఇవ్వకుండా నువ్వే ఆపాలని మాధవతో చక్రి అనగానే నేను ఎలా అనగలనురా అని మాధవ అంటాడు. నీ ప్రేమ నిజం అయితే మీకు విడాకులు అవ్వవని మాధవ అనగానే చక్రి తనని హగ్ చేసుకుంటాడు. ఆ మాటలన్నీ నారాయణ వింటాడు. మహా రెడీ అయి విడాకులు రావాలని దేవుడికి మొక్కుకుంటుంది. ఇప్పుడు విడాకులు ఎందుకని మహాని నారాయణ అడుగుతాడు. ఇప్పుడు విడాకులు తీసుకోకుంటే ప్రాబ్లమ్ అవుతుందని మహా అంటుంది. ఆ తర్వాత ఇద్దరు కోర్ట్ కి వెళ్లి జడ్జ్ ముందు నిల్చుంటారు. మీ ప్రాబ్లమ్ ఏంటి అని జడ్జ్ అడుగుతుంది. ఏం లేదని మహా చెప్తుంది. మరి ఎందుకు విడాకులు అని జడ్జ్ అడుగుతుంది. మేం ఇష్టపడి పెళ్లి చేసుకోలేదని మహా చెప్తుంది. అయితే విడాకులు ఇస్తావా పెళ్లి అంటే బొమ్మలాటలాగా ఉందా అని జడ్జ్ కోప్పడుతుంది. మీకు విడాకులు అసలు ఇవ్వను కావాలంటే ఆరు నెలల తర్వాత రండీ ఆలోచిస్తానని జడ్జ్ అనగానే చక్రి మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. ఇద్దరు భోజనం చేస్తూ విడాకుల గురించి మాట్లాడుకుంటారు. విడాకులు వస్తే నాకు పార్టీ ఇవ్వాలి. ఎందుకు అంటే మన పెళ్లి వల్లే కదా ఇవన్నీ ప్రాబ్లమ్స్ .. అప్పుడు మీరు ఫ్రీ బర్డ్ అవుతారని మహా అనగానే ఎంత బాగా అర్థం చేసుకున్నావ్ తల్లి అని చక్రి మనసులో అనుకుంటాడు. ఇప్పుడు మీరు వేరే పెళ్లి చేసుకున్నా.. కూడా రెండో పెళ్లి అంటారు కదా అని మహ మాటలతో చక్రిని టార్చర్ పెడుతుంది. మరొకవైపు అసలు ఏమైందో ఏంటోనని ఇంట్లో ఉన్న మాధవ వాళ్ళు టెన్షన్ పడుతారు. వాళ్ళ దగ్గరికి నారాయణ వస్తాడు. అతనితో కన్నా గొడవ పడుతాడు. తరువాయి భాగంలో మహా బర్త్ డే కి చక్రి సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తాడు. కేక్ కట్ చేయిస్తాడు. తనకి సారీ గిఫ్ట్ ఇస్తాడు. ఆ సారి కట్టుకొని మహా వస్తుంది. తనను చూసి చక్రి ఫ్లాట్ అవుతాడు. అసలు ఆ రోజు స్టేషన్ లో ఏం జరిగిందో కానిస్టేబుల్ ని అడగాలని మహా అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jul 16, 2026 10:58AM.webp)
Jayam serial : బయటపడ్డ భాను కళ్ల రహస్యం.. శకుంతలకు మైండ్ బ్లాక్, జయ చెంప పగలగొట్టిన గంగ!
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -321 లో..... కార్తీక్, ప్రమీల గురించి శకుంతల తప్పుగా మాట్లాడుతుంది. కార్తీక్ తో ప్రమీల క్లోజ్ గా ఉండడానికి కారణం తన కళ్ళు తన కళ్ళు బాగుండాలని వంటలు చేసుకొని ఇచ్చేది. కళ్ళని మాత్రమే ఆరాధించేదని కార్తీక్ చెప్తాడు. ప్రమీల తప్పుగా ప్రవర్తించందని చెప్తే ఇలా మాట్లాడుతావు ఏంటని శకుంతల కోప్పడుతుంది. చెప్తున్నా కదా అంతా ఆ కళ్ళ కోసమే అని రుద్ర అనగానే ఆ కళ్ళు ఉంటే ఎంతా పోతే ఎంత అని శకుంతల అనగానే అత్తయ్య గారు ఆ కళ్ళని ఏం అనొద్దు ఎందుకు అంటే అవి భాను గారి కళ్ళు అని ప్రమీల అనగానే అందరు షాక్ అవుతారు. అంటే భాను కళ్ళు డొనేట్ చేసింది అతనికేనా అని పెద్దసారు అనగానే అవును అందుకే అతనికి మార్ట్ లో జాబ్ ఇచ్చారని గంగ చెప్తుంది. దాంతో శకుంతల ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత భాను ఫోటో దగ్గరికి వెళ్లి శకుంతల బాధపడుతుంది. ఈ రోజు నీ కళ్ళని బాధపెట్టానని అంటుంటే అప్పుడే పెద్దసారు వస్తాడు. నువ్వు ప్రమీల విషయం లో తొందరపడ్డావ్ అందుకే ఆవేశం తగ్గించుకోమని చెప్పేది అని పెద్దసారు అంటాడు. మరొకవైపు లక్ష్మి, పైడిరాజు కోసం గంగ చేపల పులుసు తీసుకొని వెళ్తుంది. అక్కడ లక్ష్మిని జయ డైనింగ్ టేబుల్ దగ్గర తక్కువ చేసి మాట్లాడుతుంటే గంగ వచ్చి తన చెంపచెల్లుమనిపిస్తుంది. అప్పుడే సుధా వచ్చి ఏమైందని అడుగుతుంది. నేను ఏం అనలేదని జయ అంటుంది. లేదు అమ్మ మా అమ్మని తక్కువ చేసి మాట్లాడిందని గంగ చెప్తుంది జయ నువ్వు లక్ష్మీకి సారీ చెప్పమని సుధా అనగానే అందరు వాళ్లకే సపోర్ట్ అని డ్రామా ప్లే చేస్తుంది. ఆ తర్వాత ప్రమీల జరిగిన దానికి బాధపడుతుంది. నాకు ఎందుకు బావ గారు సూపర్ మార్కెట్ బాధ్యతలు అప్పగించారు. ఇంట్లో ఉంటే ఇవన్నీ ఏం ఉండేవి కావని ప్రమీల అంటుంది. అవన్నీ ఏం మనసులో పెట్టుకోకు సూపర్ మార్కెట్ బాధ్యతలు నువ్వే చూసుకుంటున్నావని రుద్ర చెప్తాడు. ఆ తర్వాత ఇషిక పూజ చేస్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jul 16, 2026 10:56AM
Ye Devi Varamo Neevu : జానకమ్మ మాటలు నిజమే.. ఆశ్రమం ఫైల్ చూసి షాకైన తాతయ్య!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'(Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -08 లో..... జానకమ్మ అన్న మాటలు గుర్తుచేసుకొని పెద్దాయన టెన్షన్ పడుతాడు. తన కొడుకు శివశంకర్ నిజంగానే పాపని ఆశ్రమంలో వదిలేసాడా.. జానకమ్మ మాటలు ఎంత వరకు నిజమని ఆలోచిస్తాడు. అంతలో గతంలో శివ శంకర్ జానకమ్మ పేరు మీద ప్రతీనెల అనాధ ఆశ్రమానికి డబ్బు పంపించడం దానికి సంబంధించిన ఫైల్ చూసి అప్పుడు పెద్దాయన జానకమ్మ చెప్పింది నిజమని కన్ఫమ్ చేసుకుంటాడు. మరొకవైపు గీతాంజలి దగ్గరికి మనీష్ వెళ్తాడు. అత్తయ్య నీకు ఇష్టమైన జున్ను తీసుకొని వచ్చానని చెప్తాడు. తన చేత్తో తినిపిస్తాడు. నేను ఈ జున్ను తీసుకొని రావడం కోసం వెళ్ళాను అందుకే మీటింగ్ కి రాలేదు. ఇప్పుడు ఇది ఎందుకు తెచ్చానంటే ఆ వైజాగ్ ఇని స్టిట్యూట్ కి సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. అందరు ఆశ్రమం నుంచి వెళ్లిపోతున్నారని మనీష్ చెప్పగానే ఆ రోజు గొడవ పడ్డ అమ్మాయి అని గీతాంజలి అనగానే ఆ అమ్మాయి ఏదో అందరి కోసం అలా గొడవ పడిందని మనీష్ అంటాడు. మరొకవైపు జానకమ్మ అనాధాశ్రమం నుంచి అందరిని పంపిస్తుంది. నిన్న ఎక్కడికి వెళ్ళావ్.. నన్ను కూడా ఇక్కడ నుంచి పంపించడానికి వెళ్ళావా.. నా వాళ్ళని కలవడానికి వెళ్ళావా.. నేను ఎక్కడికి వెళ్ళనని గీతాంజలి ఎమోషనల్ అవుతుంది. మరొకవైపు పెద్దాయన అదే ఆలోచిస్తుంటాడు. మనిష్ వస్తాడు. మీ తాతయ్య ప్రొద్దున నుంచి ఇలాగే ఉన్నాడని వాళ్ళ నానమ్మ చెప్తుంది. ఆ తర్వాత గీతాంజలి వాళ్ళు అందరు వస్తారు. మీరు అందరు బయటకి వెళ్ళండి. నేను మా నాన్నతో మాట్లాడాలని గీతాంజలి అంటుంది. నీ కూతురు అని పెద్దాయన ఏదో చెప్పబోయి బయట అందరిని చూసి ఆగిపోతాడు. తర్వాత నా కూతుళ్ల గురించి నేను చూసుకుంటానని గీతాంజలి అంటుంది. తరువాయి భాగంలో జానకమ్మ దగ్గరికి పెద్దాయన వస్తాడు. మనవరాలు కోసం వచ్చాడని జానకమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీ తాతయ్య అని అంజలికి జానకమ్మ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jul 15, 2026 12:03PM
Godavari : శారద ఆత్మహత్యాయత్నం.. మురళి మెడలో తాళి తీసేయమంటూ శాంతి రచ్చ!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -56 లో.... మురళిని పెళ్లి చేసుకోకుంటే చస్తానని శారద డోర్ వేసుకొని ఊరి వేసుకోవాలనుకుంటుంది. దాంతో డోర్ పగులగొట్టి శారద దగ్గరికి వెళ్తారు. శారద ఏడుస్తుంటే నందు కరిగిపోయి.. మురళితో పెళ్లికి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత మురళి, నందులకి పెళ్లి జరుగుతుంది. మనం అలా ఎప్పుడు కూర్చుంటామోనని జానూతో సూర్య అంటాడు. నీ డెస్టినీని అడుగని జానూ అంటుంది మరొకవైపు సింహాద్రి మొహం మాడ్చుకొను చూస్తుంటే జాను తన దగ్గరికి వెళ్లి అంకుల్ ఆశీర్వదించండి అని అంటుంది. మరొకవైపు మురళి పెళ్లిచూపూలు అని శాంతి హడావుడి చేస్తుంది. బ్యాండ్ మేళంతో వెళ్ళడానికి రెడీగా ఉంటుంది. అప్పుడే పెళ్లి చేసుకున్న నందు, మురళి వస్తారు. వాళ్ళని చూసి శాంతి షాక్ అవుతుంది. వాళ్ళు మోసం అని తెలిసింది అమ్మ అందుకే నేను చేసుకున్నానని మురళి అనగానే ఓహ్ అది నిన్ను ఇష్టపడి చేసుకోలేదన్నమాట ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు.. దాని మెడలో నుంచి తాళి తీసేయ్ అని శాంతి తన మెడలో తాళి పట్టకుంటుంది. వదులు అమ్మ అని మురళి తన చెయ్ పట్టుకుంటాడు. ఆపండి అత్తయ్య అని జాను కోప్పడుతుంది. అన్ని మర్చిపోయి మమ్మల్ని ఆశీర్వదించండి అని మురళి అనగానే నువ్వు ఒక్కడివి అయితే లోపలికిరా లేదంటే రాకు అని శాంతి తెగేసి చెప్తుంది. మరొకవైపు శారద ఇంట్లో అందరికి కూల్ డ్రింక్ ఇస్తుందిమ అప్పుడే మురళి, నందులని తీసుకొని జానూ వస్తుంది. దాంతో శారద షాక్ అవుతుంది. అక్కడున్న వాళ్లంతా శాంతి ఒప్పుకోలేదనుకుంటా కట్నం తేకుండా ఫ్రీగా వెళ్తే అసలు ఊరుకోదని అక్కడున్న వాళ్ళు అంటారు. తరువాయి భాగంలో నన్ను బ్లాక్ మెయిల్ చేసి ఈ పెళ్లి జరిపించారని నందు ఏడుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jul 15, 2026 11:51AM
Brahmamudi : చావు బతుకుల్లో రాజు.. హాస్పిటల్లో అసలు నిజం బయటపెట్టిన చలపతి!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmmudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1084 లో... హాస్పిటల్ లో రాజుని ఆ పరిస్థితిలో చూసి ఇందుకి చలపతి నిజం చెప్పేస్తాడు. అది విని ఇందు షాక్ అవుతుంది. రాజు నీ మేనత్త కొడుకు మా కొడుకు కాదు మేం పెంచుకున్నామని చలపతి అంటాడు. ప్లీజ్ అమ్మ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని ఇందుతో చలపతి అంటాడు. మరొకవైపు అపర్ణ కిచెన్ లో ఉండగా రేఖ వెళ్తుంది. ఏంటి ఎంతో ధైర్యంగా కనిపిస్తున్నావ్.. ఈ ధైర్యానికి కారణం ఆ రాజు గాడే కదా వాడికి ముందు భయమంటే ఏంటో చూపిస్తానని రేఖ అంటుంది. దాంతో అపర్ణ టెన్షన్ పడి రాజుకి ఫోన్ చేస్తుంది. అతను లిఫ్ట్ చెయ్యకపోయేసరికి అప్పుడే ఇందుకి కాల్ చేస్తుంది. తను కూడా లిఫ్ట్ చెయ్యదు. ఆ తర్వాత ఇందు నా బావని క్షేమంగా ఉంచు దేవుడా అని ఇందు మొక్కుకుంటుంది. మళ్ళీ రాజు దగ్గరికి ఇందు వెళ్తుంది. మళ్ళీ ఎందుకు వచ్చావని ఇందుని చలపతి కోప్పడతాడు. ఆ తర్వాత డాక్టర్ బయటకి వస్తాడు. ప్రమాదం ఏం లేదు వేరే రూమ్ కి మారుస్తాను.. వెళ్లి చూడండి అని డాక్టర్ చెప్తాడు. ఆ తర్వాత దయచేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అమ్మ అని చలపతి అనగానే బావని తీసుకొని నా ఇంటికి వెళ్తానని ఇందు అనగానే వాళ్ళు షాక్ అవుతారు. అంకుల్ రాజు మీ దగ్గర ఉంటేనే ప్రాబ్లమ్ కానీ నా దగ్గరుంటే నేను బాగా చూసుకుంటానని ఇందు చెప్తుంది. ధైర్యం లేని మాకు రాజు ఒక ధైర్యం కల్పించాడు.. ప్లీజ్ అంకుల్ మాకు రాజు వల్లే ఒక ఆశ కలిగింది.. మీరే అన్నారు కదా ఎప్పుడు రాజు ఎప్పుడు మా గురించే అలోచించేవాడని.. అందుకే నేను తీసుకొని వెళ్తానని ఇందు అంటుంది. తరువాయి భాగంలో రాజు డిశ్చార్జ్ అయి చలపతి ఇంటికి వస్తాడు. అక్కడే ఇందు కూడా ఉంటుంది. రాజును చూడడానికి రేఖ వస్తుంది. ఎక్కడ లక్కీ విషయం బయటపెడతానోనని ఇదంతా చేసావ్ కదా ఆంటీ కానీ ఆ నిజం ఇంకొకరికి కూడా తెలుసని రాజు అనగానే రేఖ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jul 15, 2026 11:50AM
Podharillu : విడాకుల కోర్టు మెట్లెక్కిన చక్రి, మహా.. మాధవ నమ్మకం నిజమవుతుందా?
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -157 లో.... మాధవ దగ్గరికి చక్రి వచ్చి లాయర్ నుంచి ఫోన్ వచ్చింది.. అన్ని డాక్యుమెంట్స్ రెడీగా ఉన్నాయి.. వచ్చి సంతకాలు పెడితే కోర్ట్ కి పంపిస్తామని అంటున్నారని చెప్పి చక్రి బాధపడతాడు. తనకి మాధవ దైర్యం చెప్తాడు. మహాని బయటకి తీసుకొని వచ్చి తన ప్రేమ విషయం చెప్పాలని చక్రి అనుకుంటాడు. మహా ఆఫీస్ అయ్యాక తన ఫ్రెండ్ తో బయటకి వస్తుంది. అప్పుడే విక్కీ తనని డ్రాప్ చేస్తానని అంటాడు. అంతలోనే చక్రి వస్తాడు. మీ అన్నయ్య వచ్చాడని విక్కీ అనగానే కజిన్ అంటే అత్త కొడుకు కూడా అవుతుందిరా దరిద్రుడా అని విక్కీని చక్రి తన మనసులో తిట్టుకుంటాడు. సరే మీ అన్నయ్య వచ్చాడు కదా తనతో వెళ్ళు అని విక్కీ అంటాడు. కొంచెం మీతో పర్సనల్ గా మాట్లాడాలని మహాని చక్రి పార్క్ కి తీసుకొని వెళ్తాడు. అక్కడ ఎవరో ఒకరు డిస్టబ్ చేస్తూనే ఉంటారు. తన ప్రేమ విషయం చెప్పినట్లు ఉహించుకుంటాడు చక్రి. తీరా చెప్పే టైమ్ కి చక్రి వాళ్ళ ఫ్రెండ్ తన లవర్ తో పాటు పార్క్ కి వచ్చి గొడవపడతారు. నన్ను బలవంతంగా ప్రేమించమని అంటున్నారని ఆ అమ్మాయి అనగానే అలా ఎలా ప్రేమిస్తారని మహా అంటుంది. ఇక అప్పటికే చక్రి తన మనసులో మాట చెప్పలేకపోతాడు. ఆ తర్వాత చక్రి ఇంకా ఇంటికి రాలేదని మాధవ కన్నా వెయిట్ చేస్తారు. అప్పుడే కేశవ వచ్చి ఏమైందని అడుగుతాడు. లాయర్ ఫోన్ చేసినప్పటి నుంచి చక్రి డల్ గా ఉన్నాడని మాధవ చెప్తాడు. ఆ తర్వాత అందరు భోజనం చేస్తారు. చక్రి ఒక్కడే బయట కూర్చొని బాధపడతాడు. మాధవ వచ్చి చక్రికి నచ్చజెప్పుతాడు. మరుసటిరోజు చక్రితో మాధవ మాట్లాడుతాడు. ఎందుకు అన్నయ్య నేనంటే తనకి ఇష్టం లేదు అందరు అంటే ఇష్టమే నేనంటే మాత్రమే ఇష్టం లేదని చక్రి ఎమోషనల్ అవుతాడు. తరువాయి భాగంలో మహా లాయర్ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతుంటే.. ఇప్పుడు విడాకులు అవసరమా అని నారాయణ అడుగుతాడు. చక్రి, మహా ఇద్దరు జడ్జ్ ముందు నిల్చొని ఉంటారు. చక్రికి మాధవ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. నీ ప్రేమ నిజం అయితే విడాకులు జరగవనే మాటలు గుర్తుచేసుకుంటాడు చక్రి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jul 15, 2026 11:46AM
Jayam serial : జయకు షాకిచ్చిన విశ్వ.. కార్తీక్, ప్రమీలల బంధంపై శకుంతల అనుమానం!
జీ తెలుగు లో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -320 లో..... గంగ లేట్ గా వచ్చినందుకు తనకి రంగాకి విశ్వ పనిష్ మెంట్ ఇస్తాడు. అప్పుడే జయని తీసుకొని రుద్ర వస్తాడు. జయ నిద్ర మత్తులో ఉంటుంది. నువ్వు రేపటి నుంచి త్వరగా లేవాలి.. జాగింగ్ కి వెళ్ళాలి.. అసలు నీ డ్రీమ్ ఏంటి స్పోర్ట్స్ కి సంబంధించిన ఏమైనా ఉంటే చెప్పమని విశ్వ అడుగుతాడు. ఎందుకు ఉండదు మావయ్య అక్కడ విశ్వనాథ్ కూతురు కదా అని రుద్ర అనగానే బాగా ఆడుకుంటున్నారని జయ అనుకొని రన్నింగ్ నాన్న అంటుంది. సరే వెళ్లి రన్నింగ్ చెయ్యమని విశ్వ చెప్తాడు. వేరే దారి లేక జయ వెళ్లి చేస్తుంది. గంగ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే అప్పుడే సుధా వచ్చి జ్యూస్ ఇస్తుంది. విశ్వకి ఒక జ్యూస్ ఇస్తుంది. అది కూడా గంగకి ఇవ్వమని విశ్వ పాజిటివ్ గా మాట్లాడుతాడు. రేపటి నుంచి త్వరగా రమ్మని గంగకి విశ్వ చెప్తాడు. మరొకవైపు కార్తీక్ కి ప్రమీల టిఫిన్ పెడుతుంది. తను వెళ్తుంటే దేవుడికి మొక్కుకొని వెళ్ళండి. మా అత్తయ్య ఎప్పుడు ఈ విభూది భాను గారికి పెడుతుందని అనుకొని కార్తీక్ కి కూడా విభూది పెడుతుంది. అది కళ్ళలో పడుతుంటే ఊదుతుంది ప్రమీల. అప్పుడే శకుంతల వాళ్ళు అందరు వస్తారు. వాళ్ళని అలా చూసి శకుంతల తప్పుగా అర్ధం చేసుకొని ప్రమీలని కొడుతుంది. మేడమ్ ని ఏం అనకండి అని కార్తీక్ అంటాడు. వీరు, ఇషిక ఇంకా గొడవ పెద్దది అయ్యేలా మాట్లాడతారు. అప్పుడే రుద్ర వస్తాడు. సర్ వీళ్ళందరు మేడమ్ ని తిడుతున్నారని కార్తీక్ చెప్తాడు. కార్తీక్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ప్రమీల గురించి ఇషిక తప్పుగా మాట్లాడుతుంటే తనపై రుద్ర కోప్పడతాడు. నా భార్య ఏం తప్పుగా మాట్లాడిందని సూర్య అనగానే తనని కొట్టడానికి చెయ్ ఎత్తుతాడు. అదే మాట నేను అంటే ఏం చేస్తావని శకుంతల అంటుంది. ప్రమీల అలా చెయ్యడానికి కారణం ఉందని రుద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jul 15, 2026 11:44AM
Karthika Deepam2 : చీర కట్టిన తుపాకీలా మారిన మాలిని.. సొంత కుటుంబానికే వెన్నుపోటు పొడవనున్న జ్యోత్స్న!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -722 లో.... శివన్నారాయణకి దక్షిణామూర్తి కాల్ చేసి.. నాతో పోటీకి దిగితే ఓడిపోతావని భయమా అని రెచ్చగొట్టేలా మాట్లాడతాడు. దాంతో పోటీలో గెలిచి మెట్టింటి పౌరుషం ఏంటో తెలియజేయ్యాలి మావయ్య అని సుమిత్ర అంటుంది. దాంతో రేయ్ కార్తీక్ వాళ్ళకి ఫోన్ చేసి పోటీకి సిద్ధమని చెప్పు అని శివన్నారాయణ అంటాడు. దీప నువ్వు సీఈఓ కాబట్టి ఈ బాధ్యత నువ్వే తీసుకోవాలని శివన్నారాయణ చెప్పగానే కార్తీక్, సూరజ్ వంక చూసి వాళ్ళు ఒకే అని చెప్పమని అనగానే దీప సరే అంటుంది. నేను పోటీలో ఓడిపోతే చచ్చినట్లే అని శివన్నారాయణ అంటాడు. దీప ఖచ్చితంగా మనం గెలవాలని సుమిత్ర చెప్తుంది. మరొకవైపు సుమిత్ర గురించి దక్షిణామూర్తి బాధపడతాడు. మీరు ఏం టెన్షన్ పడకండి మావయ్య సుమిత్ర మన దగ్గరికి వస్తుందని మాలిని ధైర్యం చెప్తుంది. దక్షిణామూర్తి వెళ్ళాక మంచి అవకాశం కోసం ఎదురు చూసాను మావయ్య.. ఇప్పుడు దొరికింది శివన్నారాయణ కుటుంబం పునాధులతో సహా కూల్చేస్తానని మాలిని అనుకుంటుంది. ఆ తర్వాత దీప, కార్తీక్ ఇంటికి వస్తారు. శ్రీధర్ వచ్చాడని అనుకుంటారు కానీ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది రాలేకపోతున్నానని వీడియో మెసేజ్ చేస్తాడు. దాంతో అందరు డిస్సపాయింట్ అవుతారు. ఆ తర్వాత అనసూయని చూసి ఎప్పుడు వచ్చారు అత్తయ్య అని దీప హగ్ చేసుకుంటుంది. అందరు సరదాగా మాట్లాడుకుంటారు. మరొకవైపు అందరు ఎంత కోపంగా ఉన్నారు గ్రానీ అని పారు తో జ్యోత్స్న అంటుంది. ఆ మాలిని అంటే ఏం అనుకున్నావే చీర కట్టిన తుపాకి అని పారిజాతం అంటుంది. ఇప్పుడు మనం ఓడిపోతే దీపని తిడతారు. ఇప్పుడు అదే చెయ్యాలి.. ఏం చెయ్యాలో తెలుసు కదా అని జ్యోత్స్న అనగానే తెలుసని పారు అంటుంది. మరొకవైపు రేపు అక్క వెళ్ళిపోతుంది అంట అని కాంచన అనగానే ఎక్కడికి లేదు ఇక్కడే ఉంటుందని దీప అంటుంది. అప్పుడే శౌర్య వచ్చి నానమ్మ నువ్వు మాతోనే ఉండాలని అనగానే అనసూయ ఎమోషనల్ అవుతుంది. ఉంటానులే అని అనసూయ అనగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jul 15, 2026 11:38AM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com








