TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

political-news-img

జగన్ హయాంలో సామ్రాజ్యంగా విస్తరించిన మతమార్పిడి నెట్ వర్క్.. విజయసాయి.!

నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడు, జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయి.. ఇప్పుడు జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున బలవంతపు మతమార్పిడులు జరిగాయనీ, లవ్ జిహాద్ పేర పెద్ద ఎత్తున అమాయకులను మోసం చేశారనీ విమర్శలు గుప్పించారు. కాకినాడ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబాన్ని పరామర్శించిన విజయసాయి రెడ్డి కోనసీమలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రంలో మత మార్పిడులను విపరీతంగా ప్రోత్సహించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక మతమార్పిడి కుట్ర దాగి ఉందన్న విజయసాయి అందుకు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. వైసీపీ హయాం నుంచే ఆంధ్రప్రదేశ్‌లో లవ్ జిహాద్, అక్రమ మత మార్పిడుల నెట్‌వర్క్ క్రియాశీలకంగా మారాయన్న ఆయన.. అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతోనే సాదిక్ ఖాన్ లాంటి కరడుగట్టిన నేరస్థులు రెచ్చిపోయారన్నారు. అమాయక హిందూ కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేశారని విమర్శించారు. ఈ అక్రమ మత మార్పిడి ముఠా కేవలం మతం మార్చడమే కాకుండా, బాధితుల ఆస్తులను అక్రమంగా కాజేసిందన్నారు. రావులపాలెంలో ఏఈ నూకరాజుకు చెందిన దాదాపు 40 కోట్ల రూపాయల విలువైన భూములను సాదిక్ ఖాన్ దౌర్జన్యంగా తన పేరు మీద రాయించుకున్నాడని తెలిపారు. 40 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని కోల్పోవడం, మరోవైపు నిరంతరం సాగిన మానసిక వేధింపులు తాళలేకే నూకరాజు తన కుటుంబంతో బలవన్మరణానికి పాల్పడాల్సి వచ్చిందన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఈ మత మార్పిడి నెట్‌వర్క్ ఒక సామ్రాజ్యంగా విస్తరించిందనీ.. బాధితుల వెతలు వర్ణనాతీతమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితంగా, పార్టీలో కీలక నాయకుడిగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి, ఇప్పుడు నేరుగా జగన్ పాలనలోనే బలవంతపు మతమార్పిడులు జరిగాయనీ, లవ్ జిహాద్ పేరిట భూదందాలు సాగాయంటే విమర్శల దాడి చేయడం ఏపీ రాజకీయాలలో సంచలనం రేపుతోంది. బాధితులకు న్యాయం జరగాలని, ఈ మత మార్పిడి కుట్రల వెనుక ఉన్న అసలు సూత్రధారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. Love Jihad in Ap, Jagan Tenure, Vijayasai Reddy comments, Jagan conversion allegations, AE Nookaraju suicide case,Andhra Pradesh politics, Vijayasai Reddy press meet

Published on: Mon Aug 24, 2026 4:37PM

political-news-img

చంద్రబాబుపై ఉపరాష్ట్రపతి ప్రశంసల వర్షం.. ఏ విషయంలోనో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పాలనా దక్షత, దార్శనికతపై ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తాజాగా ప్రశంసలు గుప్పించారు. చంద్రబాబును ఆయన నిజమైన జాతీయవాదిగా ప్రశంసించారు. ఏలూరు జిల్లా ముసునూరులో నిర్వహించిన నాన్-జీఎంఓ హై ఎక్స్‌పాన్షన్ పాప్‌కార్న్ హైబ్రిడ్ విత్తన ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్.. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు ఇస్తున్న ప్రాధాన్యత ఏ విధంగానూ ఆయన జాతీయవాదానికి అడ్డంకిగా ఉండదన్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆయన జాతీయవాద దృక్ఫథం రాష్ట్ర ప్రగతికి ఆటంకం కలిగించదన్నారు. చంద్రబాబులోని ప్రత్యేకత, గొప్పదనం అదేనన్నారు. ఒకవైపు దేశహితం, మరొకవైపు రాష్ట్ర ప్రగతి రెండింటినీ.. సమానంగా చూస్తూ పాలన సాగించడం చంద్రబాబు ప్రత్యేకత అన్నారు. ముసునూరు గ్రామాన్ని వ్యవసాయ రంగంలో ఒక విజయగాథగా తీర్చిదిద్దినందుకు ఆయనను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, నారా లోకేష్, కొలుసు పార్థసారథి, కోర్టెవా పాప్‌కార్నికా ఎండి పట్టాభి రామారావు తదితరులు పాల్టొన్నారు. Vice President Radhakrishnan praises Chandrababu Naidu, Eluru Musunuru Event, NonGMO Popcorn Seed, Andhra Pradesh Agriculture, TeluguOne

Published on: Mon Aug 24, 2026 3:57PM

political-news-img

విజయవాడ మెట్రోపై నాని వ్యాఖ్యలు.. సర్వత్రా విమర్శలు.!

విజయవాడ ఎంపీగా రెండు సార్ల పని చేసిన కేశినేని నాని.. ఇప్పుడు అదే విజయవాడ అభివృద్ధిని అడ్డుకుంటానంటున్నారు. ప్రతిష్ఠాత్మకమైన మెట్రో ప్రాజెక్టు వద్దంటున్నారు కేశినేని నాని. మెట్రో ప్రాజెక్టు విషయంలో మాజీ ఎంపీ కేశినేని నాని లేవనెత్తుతున్న అభ్యంతరాలు, విమర్శలపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపాదిత మెట్రో రైలు ప్రాజెక్టు విజయవాడ నగరానికి వరమా కాదు శాపం అంటూ ఆయన జస్ట్ ఆస్కింగ్ అంటూ సంధించిన ప్రశ్నలపై నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ కేశినేని నాని అంటున్నదేమిటయ్యా అంటే.. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం వ్యయం చేసే వేల కోట్ల నిధులను నగరంలో రోడ్లు, డ్రైనేజీ, తాగు నీరు వంటి మౌలిక వసతులపై వెచ్చించాలని. అయితే ఇక్కడ ఎంపీగా పని చేసిన కేశినేని నాని మిస్ అయిన లాజిక్ ఏమిటంటే.. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు లాంటి మౌలిక వసతులపై మున్సిపల్ కార్పొరేషన్లు , రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయింపులు చేస్తూనే ఉంటాయి. అవి ఆగవు.. కానీ మెట్రో రైల్ ప్రాజెక్టు వంటి అర్బన్ మాస్ ట్రాన్సిట్ సిస్టమ్స్ కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు సాఫ్ట్ లోన్స్ మంజూరు చేస్తాయి. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ నిధులు ఇస్తుంది. అటువంటి నిధులను రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్య వంటి వాటి కోసం వ్యయం చేయడానికి ఏ మాత్రం అవకాశం ఉండదు. నిజమైన విజనరీ ఎవరైనా సరే.. ప్రాథమిక సదుపాయాలు కల్పించడంతో పాటు మెట్రో రైల్ వంటి ప్రాజెక్టులను సాధించేదుకు కృష్టి చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదే చేశారు. ఆ విషయాన్ని విస్మరించి మెట్రో వద్దు, ఆ నిధులను మౌలిక సదుపాయాలపై ఖర్చు చేయాలంటూ కేశినేని నాని జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రశ్నించడం ఆయనను నవ్వుల పాలు చేస్తున్నది. బెజవాడలో జనాభా , ట్రాఫిక్ విపరీతంగా పెరిగాయి. ట్రాఫిక్ కారణంగా ఐటీ కారిడార్లు, గన్నవరం ఎయిర్‌పోర్ట్, మంగళగిరి గుంటూరు కనెక్టివిటీ పెద్ద సమస్యగా మారింది. ఈ పరిస్థితుల్లో మెట్రో రైల్ అన్నిటికీ పరిష్కారంగా మారుతుందనడంలో సందేహం లేదు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో లాంటి ప్రజా రవాణా వ్యవస్థ లేకపోతే బెజవాడ ట్రాఫిక్ స్తంభించిపోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అవేమీపట్టించుకోకుండా కేశినేని ట్రావెల్స్ పేరిట సుదీర్ఘ కాలం ట్రావెల్ ఏజెన్సీ నడిపి, రవాణా రంగంలో అనుభవం ఉందని తనకుతాను భుజాలు చరుచుకుంటున్న కేశినేని నాని మెట్రో రైల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడటం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 2024 ఎన్నికలలో కేశినేని నాని వైసీపీ అభ్యర్థిగా విజయవాడ లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. అప్పటి నుంచీ రాజకీయంగా దాదాపు సైలెంట్ అయిపోయిన ఆయన ఇప్పుడిప్పుడే రాజకీయంగా తన పునరాగమనం కోసం అడుగులు వేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఆయన బెజవాడ మెట్రోకు వ్యతిరేకంగా మాట్లాడటం ఆయన రాజకీయ అపరిపక్వతకు నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ రాజధానికి ప్రత్యామ్నాయంగా మావిగన్ ప్రతిపాదన ఎలా ఆయన ప్రతిష్ఠను దిగజార్చి నెటిజన్ల ట్రోలింగ్ కు గురి చేసిందో, ఇప్పుడు కేశినేని మెట్రో వద్దు అంటూ చేస్తున్న వ్యాఖ్యలు, మెట్రోకు వ్యతిరేకంగా సంధిస్తున్న ప్రశ్నలు, విమర్శలు కూడా నానిని నెటిజనుల ట్రోలింగ్ కు గురి చేస్తున్నాయి. ప్రజలలో ఉన్న కాస్తో కూస్తో ప్రతిష్ఠను కూడా దిగజారుస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. Kesineni Nani Oppose Vijayawada Metro Rail Project, Kesineni Nani Metro Comments, Vijayawada Infrastructure Development, Netizens Troll, APpolitics, TeluguOne

Published on: Mon Aug 24, 2026 3:44PM

political-news-img

హోంమంత్రి అనిత చేతికి గాయం.. ఏం జరిగిందంటే?

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరం తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్‌షిప్‌ పోటీలు సోమవారం (ఆగస్టు 24) ఘనంగా ఆరంభమయ్యాయి. అయితే ఈ వేడుక సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి అనిత స్వల్పంగా గాయపడ్డారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోంమంత్రి అనిత ప్రసంగిస్తుండగా, కార్యక్రమం కవరేజ్ కోసంఉపయోగించిన డ్రోన్లలో ఓ డ్రోన్ బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోవడంతో అదుపు తప్పి కిందకు పడిపోతున్న సమయంలో డ్రోన్ నుండి ఊడిపోయిన బరువైన బ్యాటరీ నేరుగా వేదికపై ఉన్న అనిత గారి కుడిచేతిపై పడింది. వెంటనే ఆమెకు అక్కడే ఫస్ట్ ఎయిడ్ చేశారు. చేతికి బ్యాండేజ్ వేశారు. గాయం నొప్పి తీవ్రంగా ఉన్నప్పటికీ అనిత తన ప్రసంగం కొనసాగించారు. అయితే, వీఐపీలు ఉండే వేదికల వద్ద డ్రోన్ల వినియోగం, సాంకేతిక భద్రతపై ఈ సంఘటన ప్రశ్నలకు తావిచ్చింది. ప్రమాదానికి కారణమైన డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇది సాంకేతిక లోపం వల్ల జరిగిన ప్రమాదమా.. ర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. Home Minister Vangalapudi Anitha Injured, Tirupati Drone Battery Incident, Amaravati Championship, Andhra Pradesh News, TeluguOne

Published on: Mon Aug 24, 2026 2:15PM

political-news-img

షీ ప్లే.. బాలికల్లో క్రీడా వికాసానికి కీలక ముందడుగు.!

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల స్థాయి నుంచే విద్యార్థినులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు, అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం షీ ప్లే విధానాన్ని అమలులోకి తీసుకురానుంది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ స్వయంగా ప్రకటించారు. విశాఖపట్నంలోని మధురవాడ పరిధిలో ఉన్న చంద్రంపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆరున్నర కోట్ల రూపాయల భారీ వ్యయంతో దివీస్ ల్యాబ్స్ ప్రాజెక్ట్ చంద్ర నిధులతో ఆధునీకరించిన క్లాస్‌రూమ్‌లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్.. సాధారణంగా పాఠశాల స్థాయిలో బాలికలు క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవడానికి అనేక అడ్డంకులు ఎదురవుతుంటాయనీ, సమాజం నుంచీ, కుటుంబం నుంచీ పెద్దగా ప్రోత్సాహం ఉండదనీ, అలాగే పాఠశాలల్లో క్రీడా వసతులు అందుబాటులో ఉ:డకపోవడంతో ప్రతిభావంతులైన బాలికలు వెనకబడిపోతున్నారన్నారు. ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపేలా ప్రతీ ప్రభుత్వ పాఠశాలలోనూ క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేయడంతో పాటు బాలికలకు విస్తృతమైన అవకాశాలు కల్పించడమే షీ ప్లే' విధానం లక్ష్యమని చెప్పారు. ఈ సందర్భంగా తెలుగు క్రీడాకారిణి, క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీ చరణి సాధించిన ఘనతను మంత్రి ఉదాహరించారు. ప్రారంభంలో ఆమె క్రీడల్లోకి రావడంపై కుటుంబ సభ్యుల నుంచి ఆటంకాలు ఎదురైనప్పటికీ, ఆమె పట్టుదలను చూసి వారు మద్దతుగా నిలిచారని, సరైన ప్రోత్సాహం అందిస్తే మన ఆడబిడ్డలు ప్రపంచ స్థాయిలో ముందంజలో ఉంటారని శ్రీచరణి నిరూపించారన్నారు. అలాగే చంద్రంపాలెం స్కూల్ నుంచే ఇద్దరు విద్యార్థినులు ఇప్పటికే బాస్కెట్‌బాల్ విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ విద్యార్థులతో ముఖాముఖి సంభాషించారు. విద్యార్థినులతో కలిసి వాలీబాల్ ఆడారు. A key step forward for sports development among girls, She Play, Policy, Minister, Nara Lokesh

Published on: Mon Aug 24, 2026 12:31PM

political-news-img

చిరు బర్త్ డే వేడుకల్లో కొడాలి నాని.. ఏం జరుగుతోంది?

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఆయన అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. గుడివాడలో మాత్రం చిరంజీవి బర్త్ డే వేడుకలు ఒకింత ప్రత్యేకత సంతరించుకున్నాయి. ఇందుకు కారణంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, గతంలో జనసేన అధినేత, చిరంజీవి సోదరుడు అయిన పవన్ కల్యాణ్ పై ఇష్ఠారీతిగా నోరు పారేసుకున్న కొడాలి నాని గుడివాడలో జరిగిన చిరు బర్త్ డే వేడుకల్లో స్వయంగా పాల్గొని కేక్ కట్ చేశారు. గుడివాడ చిరంజీవి అభిమాన సంఘాల ప్రతినిధులు, వైసీపీ శ్రేణులూ కలిసి ఈ కర్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొడాలి నాని చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు. స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి.. ఎంతోమంది యువ నటులకు మార్గదర్శకుడిగా, స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఐదేళ్ల పాటు అంటే వైసీపీ అధికారంలో ఉన్న 2019, 2024 మధ్య కాలంలో ఇదే కొడాలి నాని.. పవన్ కళ్యాణ్‌ను తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. అటువంటి కొడాలి నాని గత కొంత కాలంగా తన నోటిని అదుపులో పెట్టుకుని తాను మారాను అన్న సంకేతాలు ఇవ్వడానికి శతధా ప్రయత్నిస్తున్నారు. 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం తరువాత కొడాలి నాని.. తన నోటి దురుసుకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. అయినప్పటికీ ఆయనపై ఉన్న బూతుల నాని ముద్ర ఇసుమంతైనా తగ్గలేదు. ఇప్పుడు హఠాత్తుగా పవన్ సోదరుడు, మెగా స్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని, తాను మారిపోయానని, మెగా అభిమానులను నమ్మించడానికి ప్రయత్నాలు చేశారు. చిరంజీవి పట్ల ఆయనలో అకస్మాత్తుగా కలిగిన ఈ ఆదరణకు ఇదే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే చిరు బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న కొడాలి నాని ఫొటోను జత చేస్తూ నెటిజనులు.. జగన్ హయాంలో పవన్ కళ్యాణ్ పట్ల నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను నెట్టింట పోస్టు చేస్తూ తెగ ట్రోల్ చేస్తున్నారు. దీంతో పాపం తాను మారానని చెప్పుకోవడానికి నాని చేసిన ప్రయత్నం ఏ మాత్రం ఫలించలేదని పరిశీలకులు అంటున్నారు. Kodali Nani in Chiranjeevi Birthday celebrations, Megastar Birthday Celebrations Gudivada, Megafans, TeluguOne, Ap Politics

Published on: Mon Aug 24, 2026 11:39AM

political-news-img

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్..!

ఏపీ లిక్కర్ రవాణా స్కామ్‌లో కీలక పరిణామం..! ఏపీ లిక్కర్ రవాణా స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని కొండాపూర్ పరిధిలో ఉన్న ఆయన నివాసం వద్ద ఈడీ బృందాలు దాడులు నిర్వహించి, సుదీర్ఘ విచారణ అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నాయి. రాష్ట్రంలో మద్యం విక్రయాలు, టెండర్ల కేటాయింపులు మరియు రవాణా కాంట్రాక్టులలో భారీగా ఆర్థిక అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ కేసులో మద్యం సరఫరా, టెండర్ల ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం ద్వారా కోట్ల రూపాయల నగదు చేతులు మారిందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ముఖ్యంగా టెండర్ల దక్కించుకోవడంలో ఒక శెల్ కంపెనీ లేదా ఫ్రంట్ కంపెనీగా ‘సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్’ అనే సంస్థను అడ్డగోలుగా వినియోగించుకున్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ వ్యూహాత్మక అక్రమాలలో హవాలా మార్గాల ద్వారా నిధుల మళ్లింపు కూడా పెద్ద ఎత్తున జరిగిందనే కోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ లోతుగా విచారణ సాగిస్తోంది. మద్యం రవాణా ద్వారా వచ్చిన అక్రమ సొమ్మును ఎక్కడెక్కడ డిపాజిట్ చేశారు, ఏ మార్గాల్లో మళ్లించారనే వివరాలపై స్పష్టత సాధించేందుకు అధికారులు ఈ ఆర్థిక లావాదేవీల చిట్టాను సేకరిస్తున్నారు. ఇదివరకే ఈ బహుళ ప్రాచుర్యం పొందిన కేసులో పలువురు కీలక వ్యక్తులను దర్యాప్తు బృందాలు అరెస్ట్ చేయడం గమనార్హం. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్‌తో పాటు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డి, రాజ్ కేసీ రెడ్డిలను అధికారులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం శాఖపై వచ్చిన తీవ్ర అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈడీ విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టింది. కాగా, పొరుగు రాష్ట్రంలో ఉన్న ముఖ్య నేతలను సైతం వెతికి మరీ అరెస్ట్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష నేతలు దీనిని కక్షసాధింపు చర్యగా అభివర్ణిస్తుండగా, చట్టం తన పని తాను చేసుకుపోతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రాబోయే రోజుల్లో కారుమూరి నాగేశ్వరరావును న్యాయస్థానం ముందు హాజరుపరిచి, కేసులోని మరిన్ని రహస్యాలను వెలికితీసేందుకు ఈడీ కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఈ కేసుతో ముడిపడి ఉన్న మరికొందరు కీలక రాజకీయ ప్రముఖులు, ఐఏఎస్ అధికారులకు కూడా ఈడీ నుంచి నోటీసులు వెళ్లే అవకాశం ఉందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో పెను కలకలం రేపుతున్నాయి. Karumuri Nageswara Rao Arrest, AP Liquor Scam ED Case, YSRCP Ex Minister Arrest, Sigma Supply Chain Solutions Case, AP Beverage Corporation ED Investigation, Vasudeva Reddy

Published on: Sun Aug 23, 2026 6:50PM

political-news-img

వినుకొండలో రూ.239.91 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు పనులను శ్రీకారం..!

అమృత్ 2.0 పథకం కింద రూ.239 కోట్లతో పనులను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి..! పల్నాడు జిల్లా వినుకొండ పట్టణవాసుల దశాబ్దాల తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టుంది. పట్టణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన, రక్షిత మంచి నీటిని నిరంతరం అందించాలనే లక్ష్యంతో రూ. 239.91 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మక తాగునీటి అభివృద్ధి పనులను అధికారికంగా ప్రారంభించారు. ఎన్ఎస్పీ కాలనీ వేదికగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు సంయుక్తంగా పాల్గొని పనులకు సంబంధించిన శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కేంద్రం అందించే యూఐడీఎఫ్ అమృత్ 2.0 (AMRUT 2.0) నిధుల సహాయంతో ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. ఈ పథకం ద్వారా వినుకొండ పురపాలక పరిధిలోని విస్తరించిన అన్ని నివాస ప్రాంతాలకు కుళాయిల ద్వారా పరిశుభ్రమైన తాగునీటి సరఫరా వ్యవస్థను పునర్నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న పట్టణ ప్రాంతాల రూపురేఖలు మార్చడానికి, పట్టణాల్లో మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు ఇటీవల కేబినెట్ భేటీలో ఏకంగా రూ. 5,000 కోట్ల నిధుల కేటాయింపునకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. తాగునీరు, డ్రైనేజీ, అంతర్గత రహదారుల విస్తరణ పనులకు త్వరలోనే కొత్త టెండర్లు పిలుస్తామని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో కాంట్రాక్టర్లు ఈ తాగునీటి పథకం పనుల్లో ఎలాంటి నాణ్యతా లోపాలు లేకుండా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా, పిఎం సూర్యఘర్ పథకం కింద వెనుకబడిన వర్గాల (బీసీ) గృహాలకు సోలార్ కనెక్షన్లు అందించేందుకు కేంద్రం ఇచ్చే రూ. 60 వేల సబ్సిడీకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 20 వేలు ఆర్థిక సాయం అందించనుందని వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. ప్రజారోగ్యానికి తాగునీరే ప్రధాన ఆధారమని, ఈ పనులను రాబోయే ఎన్నికల నాటికే పూర్తి చేసి ప్రజా వినియోగంలోకి తీసుకురావాలని అధికారులకు, గుత్తేదారులకు సూచించారు. తాగునీటి వ్యవస్థ పునర్నిర్మాణంతో పట్టణంలో వందల కొద్దీ కుటుంబాలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. పట్టణాభివృద్ధి, ప్రజారోగ్య రంగాల్లో కూటమి ప్రభుత్వం వేగవంతంగా అడుగులు వేస్తోందనడానికి ఈ రూ. 239 కోట్ల ప్రాజెక్టే నిదర్శనమని స్థానిక ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో నీటి కొరత లేకుండా వినుకొండ పట్టణం స్వయం సమృద్ధి సాధిస్తుందని పట్టణ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ శంకుస్థాపన ఉత్సవంలో ప్రజారోగ్య శాఖ ఈఈ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ కే. నాగేశ్వరరావు, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. Vinukonda Drinking Water Project, Gottipati Ravi Kumar, Amrut 2.0 AP, Palnadu District Development, TeluguOne News Urban Infrastructure

Published on: Sun Aug 23, 2026 6:21PM

political-news-img

భక్తులకు మెరుగైన రహదారి సౌకర్యమే లక్ష్యం : పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. భక్తులు ఆలయాలకు సులభంగా చేరుకునేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 100కుపైగా ప్రధాన క్షేత్రాలను 205 కిలోమీటర్ల మేర రహదారులతో అనుసంధానిస్తున్నారు. ఇందుకోసం సుమారు రూ.120 కోట్లను ఖర్చు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పలు ఆలయాలకు సరైన రహదారి సౌకర్యం లేక భక్తులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యం లభించింది. క్షేత్రస్థాయి పర్యటనల్లోనూ ఇలాంటి సమస్యలను గుర్తించిన ఆయన.. భక్తుల ఇబ్బందులను తొలగించేలా ఆలయాలకు వెళ్లే రహదారులను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 26 రహదారుల నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 40 శాతం రహదారుల పనులు సుమారు 50 శాతం మేర పూర్తయ్యాయి. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం, అహోబిలం, ఐ.ఎస్. జగన్నాథపురం, సింగిరికోన, సోమేశ్వరం, తలుపులమ్మలోవ తదితర పుణ్యక్షేత్రాలకు వెళ్లే రహదారుల నిర్మాణం పూర్తయింది. సాస్కీ నిధులతో కోనసీమ తిరుమలగా పేరొందిన వాడపల్లి క్షేత్రం కరకట్ట మార్గం అభివృద్ధి పనులుకొనసాగుతున్నాయి. రూ.3 కోట్లతో అర్థగిరి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ రహదారి నిర్మాణం చేపట్టారు. నిడదవోలు, తెనాలి, రాయచోటి, పూతలపట్టు తదితర ప్రాంతాల్లోని ఆలయాలకు సంబంధించిన రహదారి పనులు కూడా వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తి అనుసంధాన రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.30 కోట్లు కేటాయించింది. శ్రీ సత్యసాయి జిల్లాలో సుమారు 72 కిలోమీటర్ల మేర రహదారి పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఆలయాలకు వెళ్లే రహదారుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నిర్మించే రోడ్లు భక్తులకు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలని సూచించారు. పూర్తయిన రహదారులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, భవిష్యత్తులో మరిన్ని పుణ్యక్షేత్రాలకు రహదారి సౌకర్యం కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. Panchayat Raj Department, Sri Sathya Sai Baba Centenary Celebrations, Pawan Kalyan, Singirikona, Someshwaram, CM Chandrababu, AP Goverment

Published on: Sun Aug 23, 2026 5:52PM

political-news-img

విజయనగరం పోలీసు వాహనం బోల్తా.. కానిస్టేబుల్ మృతి..!

విజయనగరం జిల్లాలో పోలీసు వాహనం బోల్తా పడిన ఘటన విషాదం నింపింది. కేసు విచారణ నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా కొండకరకం ఘాట్ వద్ద పోలీసు వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు పోలీసు సిబ్బందికి గాయాలు కాగా.. చికిత్స పొందుతూ కానిస్టేబుల్ రమణ (45) మృతి చెందారు. పోలీసు వాహనం కొండకరకం ఘాట్ మీదుగా వస్తుండగా ఒక్కసారిగా బ్రేకులు పనిచేయకపోవడంతో అదుపు తప్పి బోల్తా పడటంతో అందులో ఉన్న ఎస్‌ఐ, డ్రైవర్, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ రమణకు గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు, ఇతర సిబ్బంది వెంటనే క్షతగాత్రులను వాహనం నుంచి బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందించారు. అయితే కానిస్టేబుల్ రమణ పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు విచారణకు వెళ్లి విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో పోలీసు సిబ్బందిలో విషాదం నెలకొంది. ప్రమాదానికి బ్రేకులు పనిచేయకపోవడమే కారణమా.. లేక మరేదైనా సాంకేతిక లోపం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Vizianagaram District Police Vehicle, Kondakarakam Ghat, Constable Ramana, Crime news, Home Minister Vangalapudi Anitha, CM Chandrababu

Published on: Sun Aug 23, 2026 5:34PM