అను ఇమ్మాన్యుయేల్ ని 'ఊర్వశివో రాక్షసివో' అంటున్న అల్లు శిరీష్
on Sep 26, 2022
'భలే భలే మగాడివోయ్', 'గీత గోవిందం' లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన జీఏ2 పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం 'ఊర్వశివో రాక్షసివో'. అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి 'విజేత' ఫేమ్ రాకేష్ శశి దర్శకుడు.
మొదట ఈ చిత్రానికి 'ప్రేమ కాదంట' అనే టైటిల్ ని అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ చిత్ర టైటిల్ ను 'ఊర్వశివో రాక్షసివో' అని మార్చి అధికారికంగా ప్రకటించారు మేకర్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'జల్సా' చిత్రంలోని 'గాల్లో తేలినట్టుందే' సాంగ్ లో "ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు ప్రేయసివో నువ్వు నా కళ్లకి" అనే లైన్ ఉంటుంది. దాని నుంచే ఈ 'ఊర్వశివో రాక్షసివో' అనే టైటిల్ పెట్టారని తెలుస్తోంది.
టైటిల్ తో తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ యూత్ ను ఆకర్షించేలా ఉంది. శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ కెమిస్ట్రీ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిన ఫీల్ ను క్రియేట్ చేస్తుంది. పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా యూత్పుల్ లవ్ ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది. ఈ సినిమా టీజర్ ను సెప్టెంబర్ 29న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. అచ్చు రాజమణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
జీఏ2 పిక్చర్స్ పై ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ ఎం సహనిర్మాతగా వ్యవహారించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఈ సినిమాను నవంబర్ 4న విడుదల చేయనున్నారు.
Also Read