English | Telugu

త‌మ్ముడు మ‌నోజ్‌తో గొడ‌వ‌పై విష్ణు ఏమ‌న్నాడు?

మోహ‌న్‌బాబు కుమారులు విష్ణు, మ‌నోజ్ మ‌ధ్య గొడ‌వ‌లున్నాయ‌ని కొంత కాలంగా ఇండ‌స్ట్రీలో న‌లుగుతున్న ప్రచారం. ఇద్ద‌రూ ఒక తండ్రి సంతాన‌మైనా, త‌ల్లులు వేరు. మోహ‌న్‌బాబు మొద‌టి భార్య కుమారుడు విష్ణు కాగా, చిన్న‌భార్య కుమారుడు మ‌నోజ్‌. మొద‌టి భార్య మృతి చెందిన త‌ర్వాతే ఆమె చెల్లెలు నిర్మ‌లాదేవిని మోహ‌న్‌బాబు రెండో పెళ్లి చేసుకున్నారు. కాగా మ‌నోజ్‌తో గొడ‌వ గురించి విష్ణును నేరుగా అడిగారు క‌మెడియ‌న్ అలీ.

'అలీతో స‌ర‌దాగా' కార్య‌క్ర‌మం నెక్ట్స్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో లేటెస్ట్‌గా విడుద‌లైంది. ఇందులో గెస్ట్‌గా విష్ణు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్‌లో అలీ, "ఒక సీరియ‌స్ క్వ‌శ్చ‌న్ అడుగుతాను. అది నువ్వే రివీల్ చేయాలి. నీకూ, మ‌నోజ్‌కూ ప‌డ‌టం లేదు, మ‌నోజ్ మీద చాలా కోపంగా ఉంటున్నావ‌ని.. ఇలా కొన్ని వ‌చ్చాయ్" అని అడిగారు.

దానికి సీరియ‌స్‌గా "వాళ్ల‌కు ఎందుకు చెప్పాలి సమాధానం?" అని చెప్పిన విష్ణు, వెంట‌నే లేచి నిల్చొని ఒంటిమీది కోటు విప్ప‌దీశారు. అది చూసి షాకైన‌ట్లు అలీ పోజిచ్చారు. అస‌లు అలీ ప్ర‌శ్న‌కు విష్ణు ఏమ‌ని చెప్పారు కోటు ఎందుకు విప్ప‌దీశారు అనేది తెలియాలంటే ఆగ‌స్ట్ 23న ప్ర‌సార‌మ‌య్యే ఎపిసోడ్ చూడాల్సిందే. ఇంత‌కీ త‌మ్మునితో గొడ‌వ‌లు ఉన్నాయ‌ని విష్ణు వెల్ల‌డించారా, లేదా?

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.