English | Telugu

అభిమానుల‌కు షాక్‌.. శ్రీ‌ముఖి మ‌ళ్లీ బిస్కెట్ వేస్తోందా?

అభిమానుల‌కు శ్రీ‌ముఖి మ‌రోసారి బిస్కెట్ వేస్తోందా? అంటే అవున‌నే అనిపిస్తోంది అంటున్నారు ఆమె ఫ్యాన్స్‌. తాజాగా `క్యాష్` ప్రోగ్ర‌మ్ లో పాల్గొన్న శ్రీ‌ముఖి మ‌ళ్లీ పెళ్లి టాపిక్ ఎత్తుకుంది. ఈటీవిలో `ప‌టాస్‌` త‌ర‌హాలోనే డిజైన్ చేసిన షో `జాతిర‌త్నాలు`. ఈ కార్య‌క్ర‌మానికి శ్రీ‌ముఖి ప్ర‌స్తుతం యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌నిస్తోంది. అయితే త‌న టీమ్ తో క‌లిసి శ్రీ‌రామ‌న‌వ‌మి సంద‌ర్భంగా `క్యాష్‌` షో కోసం సుమ‌తో క‌లిసి స్పెషల్ ఈవెంట్ లో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా త‌న `జాతిర‌త్నాలు` టీమ్ ని ప‌రిచ‌యం చేసిన శ్రీ‌ముఖి మ‌ళ్లీ త‌న ప్రేమ, పెళ్లిగోల‌ని మొద‌లుపెట్టింది.

`నేను ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ప‌దేళ్లు అయిన‌ప్ప‌టికీ.. ఎంతో మంది అంద‌మైన హీరోలు, కో - యాక్ట‌ర్ ల‌తో వ‌ర్క్ చేసిన‌ప్ప‌టికి ఎవ్వ‌రికీ నా మ‌న‌సు ఇవ్వ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు పెళ్లి చేసుకోకుండా నా మెడ‌లో మూడు ముళ్లు ప‌డ‌కుండా ఉండ‌టానికి కార‌ణ‌మైన ఏకైక వ్య‌క్తి ఎవ‌రో కాదు..` అంటూ త‌న మ‌న‌సు దోచిన ప్రియుడి ని ప‌రిచ‌యం చేసే ప్ర‌య‌త్నం చేసింది. శ‌నివారం రాత్రి 9:30 గంట‌ల‌కు ప్ర‌సారం కానున్న `క్యాష్` స్పెష‌ల్ ఎపిసోడ్ కి సంబంధించిన ఈ ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది.

ఈ ఈవెంట్ ద్వారా శ్రీ‌ముఖి త‌న కు కాబోయే వ‌రుడిని నిజంగానే ప‌రిచ‌యం చేయ‌బోతోందా? లేక ప్రోమో కోస‌మే అలా చెప్పిందా? అన్న‌ది తెలియాలంటే శ‌నివారం రాత్రి 9:30 గంట‌ల‌కు ప్ర‌సారం అయ్యే `క్యాష్` ఎపిసోడ్ చూడాల్సిందే. గ‌త కొంత కాలంగా శ్రీ‌ముఖి ల‌వ్ లో వుందంటూ వ‌రుస క‌థ‌నాలు వినిపించాయి. అయితే ఈ వార్త వైర‌ల్ అయిన ప్ర‌తీ సారి అలాంటిది ఏమీ లేద‌ని కొట్టి పారేస్తూ వ‌స్తున్న శ్రీ‌ముఖి ఇటీవ‌ల ఇది త‌న వ్య‌క్తిగ‌త విష‌య‌మ‌ని, దీన్ని ఇంత‌టితో వ‌దిలేయండ‌ని చెప్పుకొచ్చింది. అయితే తాజాగా `క్యాష్‌` ప్రోమోలో మాత్రం త‌ను ఇప్ప‌టికి పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి ఓ వ్య‌క్తి కార‌ణం అంటూ బాహాటంగానే బ‌య‌ట‌పెట్ట‌డం.. ఆ వ్య‌క్తి పేరుని బ‌య‌ట‌పెట్టే ప్ర‌య‌త్నం చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అయితే శ్రీ‌ముఖి త‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవాల‌నుకున్న వ్య‌క్తి ఎవ‌రో ఈసారైనా బ‌య‌ట‌పెడుతుందో చూడాలి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.