English | Telugu

సుధీర్-రష్మీ మ‌ళ్లీ పెళ్లి!

'సుడిగాలి' సుధీర్, యాంకర్ రష్మీ గౌతమ్ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందని కామెంట్లు వినిపిస్తుంటాయి. ఏదో ఎఫైర్ వుందని అంటారంతా. కాని తమ మధ్య ఏమీ లేదని ఇద్దరూ ఎప్పుడూ ఖండించలేదు. మీమధ్య ప్రేమ వుందంట కదా అని అడిగితే ముసిముసి నవ్వులు నవ్వుతూ 'మంచి స్నేహితులం మాత్రమే' అంటూ ఆన్సర్ ఇస్తారు ఇద్దరూ.

ఆడియన్స్‌లో సుధీర్, రష్మీ జోడీకి వున్న క్రేజ్ క్యాష్ చేసుకోవడం కోసం ఈటీవీ కోసం మల్లెమాల వాళ్ళు 'అహ‌ నా పెళ్ళంట' అని ఒక పండక్కి ప్రోగ్రామ్ చేశారు. వాళ్ల పెళ్లి చేశారు. రియల్ లైఫ్‌లో సుధీర్, రష్మీ గౌతమ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారోనని వెయిట్ చేస్తున్న జనాలు వున్నారు. రీసెంట్‌గా 'రెచ్చిపోదాం బ్రదర్' షోలో సుధీర్‌ను, 'ఎక్సట్రా జబర్దస్త్'లో రష్మీను 'బుల్లెట్' భాస్కర్ ఫాదర్ 'మీ పెళ్లి ఎప్పుడు?' అని అడిగాడు. ఇద్దరూ సమాధానం దాటవేశారు. రియల్ లైఫ్‌లో ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో, అసలు చేసుకోరో తెలియదు గానీ... రీల్ లైఫ్‌లో ఇంకోసారి సుధీర్, రష్మీ పెళ్లి చేసుకున్నారు.

ఇప్పుడు సుధీర్, రష్మీ పెళ్లికి 'హైపర్' ఆది పెద్ద. ఎందుకంటే... ఈసారి వాళ్ళిద్దరి పెళ్లి చేసింది అతడే. ప్రతి వారం తన స్కిట్‌లో సమ్‌థింగ్ వుండేలా చూసుకోవడం ఆది స్పెషాలిటీ. ఎవరో ఒకరిని అతిథులుగా తీసుకొస్తాడు. జూలై 15న టెలికాస్ట్ కానున్న జ‌బ‌ర్ద‌స్త్‌ ఎపిసోడ్ కోసం సుధీర్, రష్మీ, దీపికా పిల్లిని తీసుకొచ్చాడు. స్కిట్‌ను కూడా మ్యారేజ్ థీమ్‌లో డిజైన్ చేశాడు. అందులో సుధీర్ - రష్మీ, ఆది - దీపికా పెళ్లి చేసుకోబోతున్న జంటలుగా కనిపించారు.

'ఆ సూర్య రశ్మిలు వున్నంత కాలం ఈ సుధీర్, రష్మీలు అలాగే వుంటారు' అని సుధీర్ డైలాగ్ చెప్పడం గమనార్హం. దానికి 'రాత్రి ఎక్కడ వుంటాడు?' అని ఆది కౌంటర్ వేయడం, ఎప్పటిలా ప్లేబాయ్ ఇమేజ్ కంటిన్యూ చేస్తూ... 'పదిన్నర అయ్యింది. ఏంటిమరి?' అని రష్మీని సుధీర్ అడగటం ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.