English | Telugu

హరి గుండెలపై 'అషు'! చాచి కొట్టింది బాసూ!

డబ్ స్మాష్ వీడియోలతో పాపులర్ అయిన అషురెడ్డి.. బిగ్ బాస్ షోతో మరింత పాపులారిటీ దక్కిచుకుంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ టాటూని తన ఎదపై వేయించుకొని సోషల్ మీడియాలో హల్చల్ చేసింది . ఈ మధ్యకాలంలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ఎఫైర్ పెట్టుకుందంటూ ఆమెపై ఓ రూమర్ చక్కర్లు కొడుతుంది. వాటిని ప్రమోషన్స్ కోసం వాడేసింది అషురెడ్డి. సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలు, వీడియోలతో రచ్చ చేసే ఈ బ్యూటీ స్టార్ మాలో 'కామెడీ స్టార్స్' అనే షోలో పాల్గొంటుంది.

ఈ షోలో కమెడియన్ హరితో కలిసి సందడి చేస్తుంటుంది అషురెడ్డి. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో హరి.. అషురెడ్డికి పెద్ద షాకే ఇచ్చాడు. ఈ మధ్య వీరిద్దరూ కలిసి స్కిట్ లు చేస్తుండడంతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీటికి మ‌రింత‌ బలాన్ని చేకూరుస్తూ హరి తన గుండెలపై అషురెడ్డి పేరుని టాటూగా వేయించుకున్నాడు.

ముందుగా అషురెడ్డి వెంటపడే వ్యక్తిగా స్కిట్ చేసిన హరి.. ''నువ్ ఛీ కొట్టినా, చెంపమీద కొట్టినా.. నీ వెనకాలే తిరిగి నువ్వే కావాలనుకుంటున్నాను చూశావా? అందులోనే నిజమైన ప్రేమ ఉంది.. అమ్మాయి ప్రేమ కళ్లల్లో కనిపిస్తుంది.. కానీ అబ్బాయి ప్రేమ కన్నీళ్లలో మాత్రమే కనిపిస్తుంది'' అంటూ భారీ డైలాగ్‌లు పలికిస్తూ.. ''నిన్ను ఎంతలా గుర్తుపెట్టుకున్నానో తెలుసా.. నువ్ ఎప్పటికీ నా గుండెలపై ఉండిపోయేంతలా.." అంటూ తన గుండెలపై ఉన్న అషురెడ్డి పచ్చబొట్టును చూపించాడు. అది చూసి బిత్త‌ర‌పోయింది అషు. స్కిట్ కోసం కాదని.. నిజంగానే టాటూ వేయించుకున్నానని హరి ఎమోషనల్ అవుతూ చెప్పడంతో అషురెడ్డి అతడి చెంపపై కొట్టింది.

హ‌రి టాటూ వేయించుకోవ‌డం చూసి అక్క‌డున్న జ‌డ్జిలు స‌హా అంద‌రూ షాకైపోయారు. హ‌రి దీన్ని స్కిట్ లో భాగంగా చేశాడా..? లేక నిజంగానే అషుపై ప్రేమ‌తో అలా ప‌చ్చ‌బొట్టు పొడిపించుకున్నాడా..? అనే ఈ విష‌యం ఈరోజు మ‌ధ్యాహ్నం మ‌న‌కు తెలుస్తుంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.