English | Telugu

నీకు మ్యాటర్ లేదేమో.. కానీ నాకుంది : నయని పావని!

బిగ్ బాస్ హౌస్ లో గత వారం రోజుల నుండి మెగా ఛీఫ్ కోసం ఆడిన టాస్క్ లో అవినాష్ గెలిచాడు. అవినాష్ మెగా చీఫ్ అయ్యాక పొద్దు పొద్దున్నే అందరు కలిసి వేకప్ సాంగ్ కి డ్యాన్స్ వేసి.. గార్డెన్ ఏరియాలో కూర్చున్నారు.

ఇక ఒక దగ్గర నయని పావని, హరితేజ వారికి కొంత దూరంలో టేస్టీ తేజ, గౌతమ్ కూర్చున్నారు. ఇక అవినాష్, టేస్టీ తేజలకి మధ్య చిన్నగా గొడవపెట్టాలని చూసింది నయని పావని. విష్ణుప్రియ మెగా చీఫ్ గా ఉన్నప్పుడు తేజ నీకు ఎక్కువ పని చెప్పొద్దన్నాడు ఓన్లీ కటింగ్, అవినాష్ కి హెల్త్ బాగోలేదు కదా అన్నాడంటు అవినాష్ తో నయని అంది. అదే విషయాన్ని కొంత దూరంలో ఉన్న తేజని పిలిచి మాట్లాడుతుంది నయని. అక్కడే ఉన్న గౌతమ్ అది విని ఇలాంటి చిన్న చిన్న వాటి గురించి ఎందుకని అడిగాడు.

ఆ రోజు నువ్వు అవినాష్ కి ఒక కటింగ్ నే చెప్పాలి..హెల్త్ బాలేదు అన్నావ్ కదా అని నయని తేజని అడుగుతుంది. ఖచ్చితంగా తెలియదని తేజ అంటాడు. నేను నీతో అలా ఓన్లీ కటింగ్ ఇవ్వండి అని చెప్పానా అని తేజని అవినాష్ అడుగుతాడు. నేను అలా అనలేదు అన్నట్టుగా తేజ మాట్లాడేసరికి.. అంటే నేనే మాట మారుస్తున్ననా అని తేజపై కోప్పడుతుంది నయని పావని. ఎందుకు చిన్న విషయాన్ని పెద్దగా చేసి గొడవ పడతారని గౌతమ్ అనగానే.. నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకు గౌతమ్ అని నయని కోప్పడుతుంది. మ్యాటర్ లేకుండా గొడవపడతారని గౌతమ్ అనగానే.. నీకు మ్యాటర్ లేదేమో కానీ నాకుందని నయని అంటుంది. దాంతో మ్యాటర్ లేదని అంటున్నావా అని గౌతమ్ సీరియస్ అవుతాడు. ఇలానే చిన్న ఇష్యూని పెద్దగా చేస్తుంటావని గౌతమ్ అంటాడు. ఇద్దరికి కాసేపు అర్గుమెంట్ జరుగుతుంది. మళ్ళీ కాసేపటికి ఫ్యామిలీ నుండి వీడియో వస్తుంది. అప్పుడు గౌతమ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. నయని, యష్మీ ఇద్దరిలో ఎవరికి వీడియో చూపించాలని అనుకుంటున్నారంటూ బిగ్ బాస్ అడుగగా.. నయని అని గౌతమ్ చెప్తాడు. మరి నయని పావని-గౌతమ్ ల మధ్య జరిగిన ఈ ఆర్గుమెంట్స్ లో ఎవరిది తప్పు? ఎవరిది కరెక్ట్ కామెంట్ చేయండి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.