English | Telugu

అభయ్ కి రెడ్ కార్డ్ చూపించిన నాగార్జున.. హౌస్ నుండి వెళ్ళిపోతాడా!

బిగ్ బాస్ సీజన్ 8 శనివారం నాటి ప్రోమో రానే వచ్చింది. ఇక హౌస్ లో ఎవరెవరు ఏంటని చెప్తూ నాగార్జున క్లాస్ పీకుతాడని అందరు ఎదురుచూస్తుంటారు. ఇక నాగార్జున రావడం రావడమే ఓ కర్రతో వచ్చేశాడు.

ఫుల్ ఫైర్ తో నాగార్జున స్టేజ్ మీదకి వచ్చేశాడు. ఇక హౌస్ లో అభయ్ నిల్చొని ఉండగా.. బిగ్ బాస్ గురించి అభయ్ మాట్లాడిన మాటలన్నీ స్టేజ్ మీద ప్లే చేశారు నాగార్జున. ఇక అభయ్ తో పాటు హౌస్ మేట్స్ కి నోట మాట రాలేదు. " నీ ఫేసే.. నీ మాటలే.. అన్నీ లఫంగీ మాటలే.. అభయ్ దిజ్ ఈజ్ బిగ్ బాస్ హౌస్ .. బిగ్ బాస్ విల్ రూల్ " అంటు నాగార్జున చెప్పాడు. ఇక అభయ్ మోకాళ్ళ మీద కూర్చొని సారీ సర్.. సారీ బిగ్ బాస్ అంటు చెప్పాడు. బిగ్ బాస్ మీద రెస్పెక్ట్ లేకపోతే‌.. నేను చూస్తూ ఊరుకోలేను.. బిగ్ బాస్ ఓపెన్ ది డోర్స్.. అభయ్ గెట్ అవుట్ ఆఫ్ ది హౌస్.. మై డెసిషన్ ఈజ్ ఫైనల్ " అంటూ నాగార్జున కోపంతో చెప్పాడు. ఇక అభయ్ కి సపోర్ట్ గా యష్మీ నిల్చుంది. ప్లీజ్ సర్ ఒక్క ఛాన్స్ అంటు యష్మీ అడిగింది. ప్లీజ్ సర్ ఒక్కటే ఒక్క ఛాన్స్ అంటు అభయ్ రిక్వెస్ట్ చేయగా.. హౌస్ నుండి వెళ్ళిపోమన్నాడు నాగార్జున.

ఇక అభయ్ కి నాగార్జున ఇచ్చిన వార్నింగ్ తో హౌస్ మేట్స్ అంతా సెటిల్ అయినట్టు తెలుస్తోంది. ఇక అభయ్ హౌస్ లో ఉంటాడా లేదా అనేది తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. అయితే టాస్క్ లో పృథ్వీ ఆట చూసిన బిబి అభిమానులు.. అసలు రెడ్ కార్డ్ పృథ్వీకి ఇవ్వాలంటూ ప్రోమో కింద కామెంట్లు చేస్తున్నారు. ఇక హౌస్ లో‌ ఒక్కో కంటెస్టెంట్ పర్ఫామెన్స్ ఎలా ఉందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.