English | Telugu

'ఆలీతో స‌ర‌దాగా 250'లో మోహన్‌బాబు ఏం పేలుస్తారో?!

ముక్కుసూటిగా మాట్లాడటం మంచు మోహన్‌బాబు నైజం. మనసులో ఉన్నది ఉన్నట్టుగా, ఎటువంటి డొంక తిరుగుడు లేకుండా సూటిగా మాట్లాడతారు. క్యాజువల్‌గా సీరియస్ టాపిక్స్ గురించి ప్రశ్నలు వేయడం అలీకి అలవాటు. ఇప్పుడు మోహన్ బాబును అలీ ఏం అడుగుతారు? మోహన్ బాబు ఏం పేలుస్తారో? అని బుల్లితెర వీక్షకులతో పాటు పరిశ్రమలో ఆసక్తి నెలకొంది.

హాస్యనటుడిగా, కథానాయకుడిగా వెండితెరపై విజయవంతమైన అలీ... 'ఆలీతో సరదాగా' కార్యక్రమంతో బుల్లితెరపై తన ప్రత్యేకత చాటుకున్నారు. ఇప్పుడీ టాక్ షో 250వ ఎపిసోడ్‌ మైలురాయికి చేరుకుంది. 250వ‌ ఎపిసోడ్‌కి మంచు మోహన్ బాబును అతిథిగా ఆహ్వానించారు. ఆయనతో చిత్రీకరణ కూడా పూర్తి చేశారు.

ఇటీవల 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విష్ణు మంచు వచ్చారు. 'మనోజ్‌కు, నీకు గొడవలు అంట' అని, 'మా' ఎన్నికల గురించి అలీ ప్రశ్నించారు. విష్ణు చాలా అంశాల గురించి ఓపెన్ గా మాట్లాడారు. అలాగే, మంచు కుటుంబ విషయాలూ డిస్కస్ చేశారు. 'మా' ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఈ టాక్ షోలో మోహన్ బాబు ఆ విషయాలు ఏమైనా మాట్లాడతారా? పరిశ్రమలో సమస్యలను ప్రస్తావిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.