English | Telugu

ఒక ఓల్డేజ్ హోమ్ పెట్టి పెద్దవాళ్ళను చూసుకునే శక్తి ఇవ్వు శివయ్యా

ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్తీక పౌర్ణమి స్పెషల్ గా వచ్చింది. ఐతే ఇందులో కొంతమంది వాళ్ళ వాళ్ళ కోరికలు ఆ శివయ్యకు విన్నవించుకున్నారు. వాటిని ప్లే చేసి అందరూ విన్నారు. ఇక మంజుల పరిటాల ఒక మంచి కోరికను కోరుకున్నారు. "శివయ్య తండ్రి ఒక కూతురిగా కొడుకుగా మా అమ్మానాన్నను చూసుకునే శక్తీ, ధైర్యం ఇచ్చావ్. అలాగే చాలామంది ఆడపిల్లలు వాళ్ళ తల్లితండ్రులను చూసుకోలేక బాధపడుతున్నారు. సో అలాంటి తల్లితండ్రులను ఓల్డేజ్ హోమ్ లో పెట్టి చూసుకునేంత అదృష్టం, శక్తీ నవ్వు ఇవ్వు తండ్రి" అని మంజుల పరిటాల కోరుకుంది.

"ఇలాంటి ఒక కోరికకు ఇక్కడ ఉన్న చాలామంది కూడా హెల్ప్ చేస్తారు. ఐతే ఇలాంటి ఒక కోరికను కోరుకోవడానికి కారణం ఏమిటి" అని రష్మీ అడిగింది. "నిజానికి మా అమ్మకు మేము నలుగురం ఆడపిల్లలం. ఐతే చూసిన వాళ్లంతా కూడా నలుగురు ఆడపిల్లలా అని ఆమె బాధపడేలా కామెంట్స్ చేసేవారట చిన్నప్పుడు. అప్పుడు అమ్మ చాలా బాధపడిందట. ఆడపిల్లలు కూడా ఎందులోనూ తక్కువ కారు. వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ ని మంచిగా చూసుకుంటున్నారు. కానీ కొంతమందికి మాత్రం వాళ్ళ పేరెంట్స్ ని చూసుకోవాలి అనుకున్నా చూసుకోవడానికి అవ్వట్లేదు. వాళ్ళు ఆ విషయంలో బాధపడడం నేను చూసాను కాబట్టి అలాంటి పరిస్థితి ఎవరికీ రాకున్నా వాళ్ళను నేను ఒక చోట ఉంచి చూసుకోవాలి అనుకునేదాన్ని. చూడాలి ఎంత వరకు అవుతుంది అని. దానికి నాకు శక్తి ఇవ్వమని ఆ శివయ్యను కోరుకున్నా" అంటూ మంజుల తన మనసులో కోరికను బయట పెట్టింది. "మీ కోరికను ఎలా బయట పెట్టారో మీ ప్లాన్ ని కూడా ఆఫ్ - కెమెరా డిస్కస్ చేయండి. కచ్చితంగా ఇక్కడ ఉన్నవాళ్ళంతా మనఃస్ఫూర్తిగా సహాయం చేస్తారు. ఇలాంటి ఒక మంచి పనిలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు అవుతారు" అంటూ రష్మీ చెప్పింది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.