English | Telugu

మోనిత‌కు దిమ్మ‌తిరిగే షాకిచ్చిన కార్తీక్‌

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొంత కాలంగా టాప్ రేటింగ్‌తో దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ సీరియ‌ల్ ఈ బుధ‌వారం 1205వ ఎపిసోడ్‌లోకి ఎంట‌ర‌వుతోంది. అంతే కాకుండా గ‌త కొన్ని రోజులుగా చిత్ర విచిత్ర‌మైన ట్విస్ట్‌ల‌తో మ‌లుపులు తిరుగుతున్న `కార్తీక దీపం` ఈ బుధ‌వారం ఎపిసోడ్ హైలైట్‌గా నిల‌వ‌బోతోంది. మోనిత కొడుకు బార‌సాల కోసం దీప ... మోనిత ఇంట మ‌ళ్లీ వంట‌ల‌క్క అవ‌తారం ఎత్త‌డం తెలిసిందే.

ఇదిలా వుంటే మోనిత ఇంటి ముందు కారు ఆపిన కార్తీక్ `తిరిగి వెళ్లిపోదాం మ‌మ్మీ` అంటాడు. నేను వ‌చ్చింది నా కోడ‌లు దీప కోసం నువ్వు కూడా రావాల్సిందే అంటూ సౌంద‌ర్య భ‌ర్త ఆనంద‌రావుతో క‌లిసి కారు దిగుతుంది. వెంట‌నే కార్తీక్ కూడా దిగేస్తాడు. అక్క‌డే అచేత‌నంగా నిల‌బ‌డివున్న వార‌ణాసిని చూసి కార్తీక్ షాక్ అవుతాడు. ఏంటి వార‌నాసి ఇక్క‌డున్నావ్ .. దీప వ‌చ్చిందా? అంటాడు. `వ‌చ్చింది డాక్ట‌ర్ బాబు.. అక్క మాట‌లు వింటున్నా.. త‌న చేష్ట‌లు చూస్తుంటే భ‌యంవేస్తోంది` అని చెబుతాడు వార‌ణాసి.

క‌ట్ చేస్తే .. బార‌సాల జ‌రిపించ‌డానికి వ‌చ్చిన పంతులుతో ..`పంతులుగారు ఈవిడే నా భార్య అని కార్తీక్ అన‌డంతో మోనిత‌తో పాటు అంతా షాక్‌కు గుర‌వుతారు. `ఇదేం విడ్డూరం అండీ.. ఈవిడ మీ భార్యా` అవంటాడు పంతులు.. `అవును పంతులుగారు ఈవిడే నా భార్య‌... నా అర్థాంగి` అంటూ దీప భుజంపై చెయ్యివేసి ధైర్యంగా చెబుతాడు కార్తీక్‌. అంతే కాకుండా `ఆమె నా జీవితం.. ఆమె నా ప్ర‌పంచం` అంటాడు. ఆ మాట‌ల‌కు దీప పొంగిపోతూ మోనిత వంక పెద్ద పెద్ద క‌ళ్ల‌తో ఉరిమి చూస్తుంది.

ఈవిడ మీ భార్య అయితే మ‌రి ఆవిడ ఎవ‌రు? అని మోనిత‌ని చూపిస్తాడు పంతులు. `మంచి ప్ర‌శ్న వేశారు పంతులుగారు` అంటుంది దీప.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. దీప మాట‌ల‌కు మోనిత రియాక్ష‌న్ ఏంటి? దీప , డాక్ట‌ర్ బాబు.. మోనిత‌కు ఎలాంటి షాకిచ్చారు. అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ ఖ‌చ్చితంగా చూడాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.