English | Telugu
Karthika Deepam2 : పారిజాతంకి బుద్ధి చెప్పిన జ్యోత్స్న...
Updated : Aug 20, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -127 లో.. దీపకి కార్తీక్ ఫోన్ చేసి శౌర్య ఆరోగ్యం గురించి అడుగుతాడు. ఆ తర్వాత కోర్టులో జరిగిన దాని గురించి మీ నాన్న ఏమైనా అన్నారా అని దీప అడుగగా.. అదేం లేదు.. కానీ జ్యోత్స్న ఏదైనా గొడవ చేసిందా అని కార్తీక్ అంటాడు. అలా అడగ్గానే దీప పలకకుండా ఉండిపోతుంది. తర్వాత ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తుంటారు. మరోవైపు దాసు గురించి పారిజాతం ఆలోచిస్తుంది. జ్యోత్స్నకు ఎలాగైనా బుద్ధి చెప్పి, ఎలాగైనా దాస్ కి సారి చెప్పించాలని అనుకుంటుంది. అప్పుడే ఎదురుగా జ్యోత్స్న ఉంటుంది.
తాతకు నువ్వు రెండో భార్య అని తెలుసు.. మరి దాసు ఎక్కడ నుంచి వచ్చాడని జ్యోత్స్న అడుగగా.. ఇది మీ తాతయ్యకే కాదు నాకు రెండో పెళ్లి. మీ తాతయ్యను పెళ్లి చేసుకోవడానికి ముందే నాకు దాసు కొడుకు. మీ నాన్న చెప్పాడు కదా బాబాయ్ అవుతాడని ఇంకోసారి కనిపిస్తే అలాగే పిలువమని పారిజాతం అంటుంది. నువ్వే చెప్పావ్ కదా మనిషిని బట్టి విలువ ఇవ్వాలని. రెస్టారెంట్ లో నేను కొట్టింది నీ కొడుకునే అని నీకు తెలుసు నాకు అక్కడే ఎందుకు చెప్పలేదు. అయిన కుటుంబమే దూరం పెట్టిన ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిన అవసరం తనకు లేదంటుంది జ్యోత్స్న . నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు. వాడు వీడు అంటావేంటని పారిజాతం అనగా.. నేను ఇలా మాట్లాడటానికి కారణం నువ్వే. అలాంటి వాళ్ళకు విలువ ఇవ్వకూడదని చెప్పింది నువ్వే. ఇప్పుడు నువ్వే ఇవ్వమని అంటున్నావని జ్యోత్స్న కోపంగా అంటుంది. మరోవైపు దీపతో దశరథ, సుమిత్ర మాట్లాడతారు.
మా ఇంటికి వచ్చినప్పటి నుంచి కష్టాలు అనుభవిస్తూనే ఉన్నావు. ఇప్పుడు నీ జీవితం, నీ కూతురు జీవితం నీ చేతుల్లోనే ఉందని దీపతో సుమిత్ర అంటుంది. ఇప్పుడు నీకేం సాయం కావాలో చెప్పు దీప చేస్తాం. నువ్వు సొంతంగా వ్యాపారం పెట్టుకుంటానంటే చెప్పు సాయం చేస్తాం. లేదంటే మా రెస్టారెంట్ లో పని చేస్తావా? నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావని దీపని దశరథ్ అడుగుతాడు.. మీ అమ్మానాన్న అడిగితే ఇలాగే ఆలోచిస్తావా దీప అని సుమిత్ర అడుగుతుంది. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. దీపతో వెటకారంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.