English | Telugu

శ్యామ‌ల భ‌ర్త న‌ర‌సింహ‌తో ఫొటో షేర్ చేసిన ప్రేమి! 'కార్తీక‌దీపం'లో దుర్గ రి-ఎంట్రీ!!

అభిమానుల‌ను ఎలా ఆనందింప‌జేయాలో, వారి సంఖ్య‌ను ఎలా పెంచుకోవాలో 'కార్తీక‌దీపం' ఫేమ్ ప్రేమి విశ్వ‌నాథ్‌కు బాగా తెలిసిపోయిన‌ట్లుంది. అందుకే ఆ సీరియ‌ల్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌తో వారిని ఆక‌ట్టుకుంటూ వ‌స్తోంది వంట‌ల‌క్క‌. అంతేకాదు, త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా అప్పుడ‌ప్పుడు ఆమె షేర్ చేస్తోంది.

రీసెంట్‌గా ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా త‌న స‌హ‌న‌టులు న‌ర‌సింహ‌, భ‌ర‌ద్వాజ్‌తో క‌లిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. ఆ ఇద్ద‌రూ 'కార్తీక‌దీపం'లో దుర్గ, అంజి పాత్ర‌ల్ని చేస్తున్నారు. ఆ సీరియ‌ల్ లొకేష‌న్‌కు న‌ర‌సింహ (యాంక‌ర్ శ్యామ‌ల భ‌ర్త‌) రావ‌డం, అత‌నితో ప్రేమి ఫొటో దిగ‌డంతో దుర్గ క్యారెక్ట‌ర్ రి-ఎంట్రీ ఇస్తుంద‌ని అర్థ‌మైపోయింది. ఈ ఫొటోల్లో ప్రేమి న‌వ్వులు చిందిస్తోంది. న‌ర‌సింహ‌తో చేతులు క‌లుపుతున్న ఫొటో ఒక‌టి అయితే, ఆ ఇద్ద‌రి మ‌ధ్య‌లో నిల్చొని వాళ్ల చేతుల్ని త‌న చేతుల్లోని తీసుకున్న ఫొటో ఇంకొకొటి.

ప్ర‌స్తుతం సీరియ‌ల్‌లో మోనిత మిస్సింగ్ కేస్ న‌డుస్తోంది. ఆమెను కార్తీక్ హ‌త్య చేశాడని అనుమానిస్తూ డీసీపీ రోషిణి అత‌డిని పోలీస్ స్టేష‌న్‌లో పెట్ట‌గా, దీప‌ను హ‌త్య చేయ‌డానికి మోనిక ప‌థ‌కం వేయ‌డం చూస్తున్నాం. మోనిత‌ను ఎవ‌రో మ‌ర్డ‌ర్ చేసి ఉండార‌నీ, ఆ నేరం కార్తీక్ మీద‌కు వ‌చ్చింద‌నీ దీప‌తో అంజి చెప్ప‌డంతో, ఆ ప‌నిచేసింది దుర్గ అని అనుకుంటుంది దీప‌.

దీంతో రానున్న ఎపిసోడ్స్‌లో దుర్గ క్యారెక్ట‌ర్ కీల‌కం కానున్న‌ద‌ని ఊహించ‌వ‌చ్చు. మోనిత‌కు ప్ర‌బ‌ల శ‌త్రువైన దుర్గ‌.. దీప‌కు న్యాయం జ‌ర‌గాల‌ని అనుకుంటుంటాడు. కాబ‌ట్టి.. దీప‌కు హెల్ప్ చేయ‌డానికి అత‌ను త‌ప్ప‌కుండా వ‌స్తాడ‌న్న మాటే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.