English | Telugu

'బిగ్ బాస్‌ ఓటీటీ'లో జ‌రుగుతున్న‌ది ఇదీ.. స్విమ్మింగ్ పూల్‌లో చిల్‌!

ఓటీటీ ప్లాట్‌ఫామ్ కంటెంట్‌పై సెన్సార్‌షిప్ లేక‌పోవ‌డంతో అక్క‌డ రిలీజ‌వుతున్న సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల‌లో శృంగారం, హింస‌, బూతు మితిమీరుతున్నాయ‌నే విమ‌ర్శ‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. లేటెస్ట్‌గా 'బిగ్ బాస్ ఓటీటీ' షో కూడా బోల్డ్ డోస్ పెంచుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. క‌ర‌ణ్ జోహార్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న 'బీబీ ఓటీటీ' వీక్ష‌కుల్ని రంజింప చేస్తోంద‌న‌డంలో సందేహం లేదు. కొంత‌మంది కంటెస్టెంట్లు బోల్డ్‌గా క‌నిపించ‌డానికి వెనుకాడ్డం లేదు. తాజాగా కంటెస్టెంట్లు స్విమ్మింగ్ పూల్‌లో ఈత‌లు కొడుతూ, ఒక‌రిపై ఒక‌రు నీళ్లు చిమ్ముకుంటూ క‌నిపించారు. ఇంట్లో ప‌నుల విష‌యంలో ఒక‌రితో ఒక‌రు ఫైటింగ్ చేసుకుంటూ వ‌స్తున్న వాళ్లు ఇలా చిల్ అవుతూ క‌నిపించ‌డం వీక్ష‌కుల్ని అట్రాక్ట్ చేసింది.

నేహా భాసిన్‌, మిళింద్ గాబా, నిశాంత్ భ‌ట్‌, జీష‌న్ ఖాన్ పూల్‌లో బాగా ఎంజాయ్ చేశారు. మొద‌ట డ్ర‌స్‌తోటే నీళ్ల‌లోకి దూకిన నేహ‌, త‌ర్వాత స్విమ్మింగ్ కాస్ట్యూమ్‌లోకి మారింది. మిళింద్‌, నిశాంత్ ఒక‌రిపై ఒక‌రు నీళ్లు చ‌ల్లుకున్నారు. చిన్న‌పిల్ల‌ల మాదిరిగా ఉత్సాహంతో కేరింత‌లు కొట్టారు.

రిధిమా పంటిట్‌ను కూడా త‌మ‌తో జాయిన్ అవ్వాల్సిందిగా నేహ పిలిచినా, అప్ప‌టికే ఆమె డ్ర‌స్ వేసుకొని ఉండ‌టంతో ఆమె పూల్‌లోకి దిగ‌లేదు. అయితే పూల్ బ‌య‌ట నిల్చొనే వారిని ఎంక‌రేజ్ చేసింది. కొంత‌సేప‌టికి క‌ర‌ణ్ నాథ్ కూడా పూల్‌లో ఉన్న‌వాళ్ల‌తో క‌లిశాడు. ఐదుగురూ కొంత‌సేపు పూల్‌లో ఎంజాయ్ చేసి, త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చి ఫ్రెష్ అయ్యారు. ఇలాంటి సీన్ల‌తో వ్యూయ‌ర్స్ దృష్టిని 'బీబీ ఓటీటీ' అల‌రిస్తోంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.