English | Telugu

తెలుగు బుల్లితెర‌పై క‌న్న‌డ రౌడీ బేబీ!

ఇప్ప‌టికే తెలుగు బుల్లితెర‌ను ప‌లువురు క‌న్న‌డ భామ‌లు ఏలుతుండ‌గా, లేటెస్ట్‌గా మ‌రో క‌న్న‌డ న‌టి ప‌రిచ‌యం కాబోతోంది. ముత్య‌మంత ముద్దు సీరియ‌ల్‌లో హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఆ తార‌.. నిషా ర‌వికృష్ణ‌న్. వ‌చ్చే సోమ‌వారం రాత్రి 7.30 గంట‌ల‌కు ఆ సీరియ‌ల్ తొలి ఎపిసోడ్ ప్ర‌సారం కానున్న‌ది. నెల్లూరు బ్యాక్‌డ్రాప్‌లో రూపొందే ఆ సీరియ‌ల్‌లో హీరోయిన్ గీత క్యారెక్ట‌ర్‌ను పోషిస్తోంది నిష‌. క‌థ ప్ర‌కారం ఆమె త‌మిళియ‌న్‌గా క‌నిపించ‌నున్న‌ది.

ఇంట్లో చిన్న కూతురైన ఆమె పెళ్ల‌య్యాక త‌న అత్తామామ‌ల‌తో పాటు అమ్మానాన్న‌లు కూడా ఒకే ఇంట్లో ఆనందంగా గ‌డ‌పాల‌ని ఆశిస్తుంటుంది. అలాంటి ఆమె గోవింద్ అనే యువ‌కుడితో ప్రేమ‌లో ప‌డుతుంది. ఆ పాత్ర‌ను సిద్ధార్థ్ వ‌ర్మ చేస్తున్నాడు. అత‌నిది పాత త‌ర‌హా ప‌ద్ధ‌తి. కోడ‌లు ఇంట్లో ఉండి ప‌నిపాట‌లు చూసుకోవాల‌ని, పెళ్లిలో క‌ట్నం తీసుకోవాల‌నే టైప్‌. రెండు భిన్న ధ్రువాలైన ఆ ఇద్ద‌రికీ ఎలా సెట్ట‌వుతుందనేది ఆస‌క్తిక‌రం.

క‌న్న‌డంలో నిష‌కు "రౌడీ బేబీ" అని పిలుస్తుంటారు. అంటే 'గ‌ట్టిమేళ' సీరియ‌ల్‌లోని పాత్ర ద్వారా ఆమెకు ఆ పేరు వ‌చ్చింది. ఆ సీరియ‌ల్ టీఆర్పీలో టాప్‌గా నిలిచింది. అక్క‌డ ఎలా అయితే త‌ను స‌క్సెస్ అయ్యిందో తెలుగులోనూ అలాంటి స‌క్సెస్‌ను అందుకుంటాన‌ని న‌మ్ముతోంది నిష‌.

ఆమెకు క‌న్న‌డ సినిమాల ఆఫ‌ర్లు కూడా వ‌స్తున్నాయి. త్వ‌ర‌లో ఆమె 'అండోడిత్తు కాల' సినిమాలో హీరోయిన్‌ పాత్ర‌లో ద‌ర్శ‌నం ఇవ్వ‌నుంది. హీరోగా విన‌య్ రాజ్‌కుమార్ న‌టిస్తోన్న ఆ మూవీలో అదితి ప్ర‌భుదేవా మ‌రో హీరోయిన్‌.

చైత్ర రాయ్‌, మంజుల‌, మేఘ‌నా లోకేశ్‌, న‌వ్య స్వామి, నిత్యా రామ్‌, చంద‌న‌, కావ్య‌శ్రీ లాంటి క‌న్న‌డ తార‌లు తెలుగు సీరియ‌ల్స్ ద్వారా పాపుల‌ర్ అయ్యారు. నిష కూడా వారి త‌ర‌హాలో ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంటుందేమో చూడాలి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.