English | Telugu

మ‌హేశ్ త‌ర్వాత.. తార‌క్ కోసం ప్రభాస్ కూడా!

'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి యంగ్ టైగర్ జూనియ‌ర్‌ ఎన్టీఆర్ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. తన పరిచయాలు అన్నిటినీ ఉపయోగించి ప్రముఖ హీరోలు, దర్శకులను షోకి రప్పిస్తున్నారు. కోటి రూపాయల కోసం ఆడే ఆటను రసవత్తరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో జూనియ‌ర్‌ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం 'ఆర్ఆర్ఆర్'. మరో స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అందులో నటిస్తున్న సంగతి తెలిసిందే. తొలి ఎపిసోడ్ కోసం ఆయ‌న‌ను తార‌క్ కార్యక్రమానికి తీసుకొచ్చారు. హీరోలు ఇద్దరూ కలిసి చేసిన హంగామా బుల్లితెర వీక్షకులను ఎంటర్‌టైన్ చేసింది. ఆ తర్వాత దర్శకులలో తనకు సన్నిహితులైన రాజమౌళి, కొరటాల శివను కూడా షో కి తీసుకోవచ్చారు తార‌క్‌. ఆ ఎపిసోడ్ సోమ‌వారం టెలికాస్ట్ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం తార‌క్‌ కోసం షో కి వచ్చారు. ఇప్ప‌టికే దానికి సంబంధించిన షూటింగ్ పూర్త‌యింది. మహేష్ ఎపిసోడ్ దసరాకి టెలికాస్ట్ కానుంది.

లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే... బాహుబలి ప్రభాస్ కూడా 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమంలో సందడి చేస్తారట.‌ ఆయన్ను తీసుకురావడం కోసం గేమ్ షో నిర్వాహకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తార‌క్‌కు ప్రభాస్ కూడా స‌న్నిహితుడే. మ‌రి ఆయ‌న‌ ఏమంటాడో చూడాలి మరి!

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.