English | Telugu

Eto Vellipoyindhi Manasu : భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టిన సవతి తల్లి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -246 లో.....రామలక్ష్మి అభి ఉన్నా ఫోటోని చూసి సీతాకాంత్ షాక్ అవుతాడు. అదే టైమ్ అనుకొని శ్రీలత, శ్రీవల్లి, సందీప్ లు రామలక్ష్మి పై నెగటివ్ గా సీతాకాంత్ కి చెప్తారు. భర్తకి చెప్పకుండా అలా రామలక్ష్మి అక్క తనకి ప్రాబ్లమ్ క్రియేట్ చేసిన అభిని కలవడం ఏంటో అని అంటారు. ఈ విషయం ఇక్కడితో వదిలేయండి అని సీతాకాంత్ అంటాడు. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావ్ అంటూ శ్రీలత అడుగుతుంది. అది మీకు చెప్పనవసరం లేదని రామలక్ష్మి అంటుంది.

ఆ తర్వాత ఈ ఫోటోలో ఉన్నవాటికి సమాధానం చెప్పమని ఆ ఫొటోస్ విసిరేస్తుంది. అవి చూసి రామలక్ష్మి షాక్ అవుతుంది. ఎందుకు ఆ అభి ని కలవడానికి వెళ్ళావని శ్రీలత అడుగుతుంది. అది సీతాకాంత్ కి చెప్పకుండా ఎందుకు వెళ్ళావంటూ శ్రీలత అడుగుతుంది. నేను చెప్పాలి అనుకున్న కానీ మీరు ఎక్కడ నాకు దూరం అవుతారోనని భయపడ్డా అని రామలక్ష్మి అనగానే.. ఇక చాలు ఒక్కొక్క రిగా కుటుంబం నుండి మమ్మల్ని దూరం చేసి ఆస్తులన్నీ తీసుకొని సీతాకంత్ ని ఒంటరిని చెయ్యాలని ప్లాన్ చేసావని శ్రీలత అనగానే.. శ్రీలత పై చెయ్ ఎత్తుతుంది రామలక్ష్మి. దాంతో మా అమ్మపై చెయ్ ఎత్తుతావా అంటూ రామలక్ష్మిపై సీతాకాంత్ చెయ్ ఎత్తుతాడు. చేసింది తప్పు.. అది చెప్పిన వాళ్ళని అలా అంటావా.. నా భార్య గా ఉండే అర్హత లేదని సీతాకాంత్ చెప్పి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత ప్లాన్ సక్సెస్ అంటూ జరిగింది మొత్తం నందినికి శ్రీలత ఫోన్ చేసి చెప్తుంది. ఆ తర్వాత శ్రీలత, శ్రీవల్లి, సందీప్ ముగ్గురు సంబరపడుతుంటారు. మరొకవైపు హారికతో నందిని తన హ్యాపీ నెస్ ని షేర్ చేసుకుంటంది. రామలక్ష్మి జరిగింది గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. సీతాకాంత్ దగ్గరికి శ్రీలత వచ్చి.. నేను ఇంట్లో ఉండను. మీ భార్యకి నేను ఇష్టం లేదని యాక్టింగ్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.