English | Telugu

Brahmamudi : భార్యతో ఉన్నట్టుగా పట్టపగలే ఊహల్లో భర్త! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -560 లో.. ధాన్యలక్ష్మి ప్రకాష్ ఇద్దరు కలిసి అప్పు, కళ్యాణ్ లని దీపావళికి ఇంటికి పిలవడానికి వస్తారు. కళ్యాణ్ ని రమ్మని ధాన్యలక్ష్మి అనగానే.. ఆలోచిస్తా అని కళ్యాణ్ అంటాడు. ఇక్కడికి వరకు వచ్చి పిలిస్తే అలా అంటావని ధాన్యలక్ష్మి అంటుంది. అప్పు నా భార్య.. తనని పిలవకుండా నన్ను పిలిస్తే ఎలా వస్తానని కళ్యాణ్ అనగానే.. నాకు తెలుసు అందుకే కదా పిలవడానికి వచ్చానని ధాన్యలక్ష్మి అంటుంది. అవునురా ఇద్దరిని పిలుస్తుందని ప్రకాష్ అనగానే.. వస్తాం మావయ్య అని అప్పు చెప్తుంది.

ఆ తర్వాత రాజ్ దగ్గరికి ఇందిరాదేవి వస్తుంది. ఇంకా నిద్ర లేవలేదా.. ఈ రోజు దీపావళి అంటూ రాజ్ ని నిద్ర లేపుతుంది. లేచి గుమ్మానికి పువ్వులు కట్టు అంటూ పువ్వుల దండలు ఇచ్చి వెళ్తుంది. ఇక రాజ్ ఏం పని చేసినా కావ్యని ఉహించుకుంటాడు. తనతో మాట్లాడినట్లు అనుకుంటాడు. ఆ తర్వాత కావ్య నిజంగానే వస్తుంటుంది. తనని చూసి మళ్ళీ ఉహ అనుకొని తన చుట్టూ తిరుగుతు ఉంటాడు. అది చూసి అపర్ణ, ఇందిరాదేవీలు ఎందుకు ఇలా చేస్తున్నావంటూ అడుగుతారు. అప్పుడు రాజ్ ని గిల్లుతుంది కావ్య. దాంతో రాజ్ ఉహలోనించి బయటకు వచ్చి ఎందుకు వచ్చవంటూ అడుగుతాడు. తను సీఈఓ తన చేతుల మీదుగా బోనస్ ఇవ్వాలని మీ తాతయ్య పిలిచాడనగానే రాజ్ కుళ్ళుకుంటాడు.

ఆ తర్వాత అనామికకి రుద్రాణి ఫోన్ చేసి.. ఏదో ప్లాన్ అన్నావ్ ఏంటని అడుగుతుంది. దాంతో అనామిక, కళ్యాణ్ ల డాక్యుమెంటరీ గురించి చెప్తుంది. టెలికాస్ట్ అయ్యే టైమ్ కి వాళ్ళని టీవీ చూసేలా చేయమని అనామిక అనగానే.. రుద్రాణి ఓకే అంటుంది.ఆ తర్వాత అపర్ణ సుభాష్ కి పాయసం చేసి తీసుకొని వస్తుంది. నువ్వే తినిపించు అనగానే అపర్ణ తినిపిస్తుంది. అప్పుడే కావ్య వచ్చి ఆటపట్టిస్తుంది. ఆ తర్వాత కావ్య దగ్గరికి ఇందిరాదేవి వచ్చి బోనస్ ఇచ్చే చెక్కు లు చెక్ చేయమంటుంది. తరువాయి భాగంలో రాజ్ దగ్గరికి కావ్య వెళ్లి.. బోనస్ నా చేతుల మీద కంటే మీరు ఇస్తేనే బాగుటుందని కావ్య అనగానే.. నీ దయ నాకు అవసరం లేదని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.