English | Telugu

మోస్ట్ వరెస్ట్ కంటెస్టెంట్ గా ఆఫ్ ది సీజన్ గా విష్ణుప్రియ!

బిగ్ బాస్ సీజన్-8 ఇప్పటికి తొమ్మిది వారాలు పూర్తయ్యాయి. ఇప్పుడు పదో వారం నడుస్తోంది. ఇక హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, వీక్ కంటెస్టెంట్స్ అంటు ఓ కేటగిరీ తీస్తే వారిలో కన్నడ బ్యాచ్ తమ మాటలతో, ఆటలతో, స్ట్రాటజీలతో సూపర్ గా రాణిస్తున్నారు.

నబీల్ గేమ్ ఛేంజర్.. కానీ అతని ఒకే ఒక్క వీక్ నెస్ మాట. ఒక్కసారి అతను మాట ఇస్తే అది చేస్తాడు. ‌కానీ ఇది గేమ్ షో.‌ ఇక్కడ ఎవరి గేమ్ వారికి ఉంటుంది. టాస్క్ లు బాగా ఆడిన సరైన స్ట్రాటజీ ప్లే చేయకుంటే ఓడిపోవాల్సిందే. ప్రతీసారీ నబీల్ కి అదే జరుగుతుంది. ఎవరికోసమో త్యాగం చేస్తూ తన కంటెండర్ షిప్ ని కోల్పోతున్నాడు‌. ఇలాగే ఉంటే కన్నడ బ్యాచ్ నబీల్ ని జోకర్ కార్డు లా వాడుకొని వదిలేస్తారు.‌ ఇక టాప్-5లో ఉన్నా నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, యష్మీ చేస్తున్న స్ట్రాటజీలలో‌ నబీల్ షేర్ కాదు జీరో అవుతాడు.

మరోవైపు బిగ్ బాస్ మామ ఎడిట్ చేసే ప్రోమోలు, ఎపిసోడ్ లు అంతా విష్ణుప్రియకి ఫేవర్ గాను మిగతావారికి నెగెటివ్ గాను ఉంటున్నాయి. ఇప్పటివరకు జరిగిన ఒక్క టాస్క్ లో కూడా గెలవలేదు విష్ణుప్రియ.. చెత్త రీజన్స్ తో నామినేషన్ చేసినా, పృథ్వీకి బహిరంగంగా కిస్సులు, హగ్గులు ఇచ్చినా బిగ్ బాస్ తన ఫుల్ సపోర్ట్ ఇచ్చేస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే మన నత్తి బ్రెయిన్ విష్ణుప్రియని టాప్-5 కి తెచ్చే ఆలోచనలో బిగ్ బాస్ మామ ఉన్నట్టు తెలుస్తోంది. నిన్నటి లైవ్ ఎపిసోడ్ లో ఓ వైపు బిగ్ బాస్ టాస్క్ గురించి అనోన్స్ మెంట్ చేస్తుంటే పృథ్వీ వేసుకున్న షూ లేస్ ని కడుతుంది విష్ణుప్రియ. దాంతో బిగ్ బాస్ మామ తనని అలర్ట్ చేసి మళ్ళీ రూల్స్ చెప్తుంటాడు. లైవ్ లో ఇది ఉంది కానీ ఇది విష్ణుప్రియని నెగెటివ్ చేస్తోందని భావించిన బిగ్ బాస్ ఎడిటర్ మామని లేపేయమన్నాడు. ఇంకేం ఉంది విష్ణుప్రియని నెగెటివ్ చేసే కంటెంట్ అంతా లేపేస్తున్నారు బిబి టీమ్. ఇక జెన్యున్ గా ఆడే టేస్టీ తేజ, రోహిణి, అవినాష్, నబీల్, ప్రేరణ వారి పరిస్థితి ఏంటో.. ఇదో షో అని మర్చిపోయి విష్ణుప్రియ ఏం చేసినా కరెక్ట్.. అంటు మిగతావారిని తప్పుగా చూపిస్తున్నారు. ఓటింగ్ లో మాత్రం విష్ణుప్రియకి స్ట్రాంగ్ ఉంది. ఇది నిజమేనా లేక బిబి టీమ్ అంతా కలిసి ఓట్లు వేపిస్తున్నారో చూడాలి. ఇది ఇలానే ఉంటే జెన్యున్ గా ఆడే కంటెస్టెంట్స్ కి తీవ్ర నిరాశే మిగులుతుందనడంలో ఆశ్చర్యం లేదు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.