English | Telugu

ప్రియ ఇంట బిగ్‌బాస్ కంటెస్టెంట్‌ల సంద‌డి

`ప్రియ‌స‌ఖి` సీరియ‌ల్‌తో వెలుగులోకి వ‌చ్చిన న‌టి ప్రియ‌. ఆ త‌రువాత టీవీ సీరియ‌ళ్ల‌లో పాపులారిటీని సొంతం చేసుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ ఫ్రెండ్‌గా, హీరో చెల్లెలిగా న‌టించి మంచి పేరు తెచ్చుకున్న ప్రియ ప్ర‌స్తుతం త‌ల్లి పాత్ర‌ల్లో , క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టిస్తూ బిజీగా వుంది. ఇటీవ‌ల బిగ్‌బాస్ సీజ‌న్ 5లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియ కొన్ని రోజుల పాటు హౌస్‌లో కొన‌సాగి స‌న్నీ కార‌ణంగా వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే.

మ‌గాడివేనా.. , ద‌మ్ముందా?.. చెంప ప‌గిలిపోద్ది అంటూ స‌న్నీపై చిందులేని కొంత ఓవ‌రాక్ష‌న్ చేసిన ప్రియ ఆ ఓవ‌ర్ యాక్ష‌న్ కార‌ణంగానే ఇంటిదారి ప‌ట్టేసింది. నెటిజ‌న్‌ల ఆగ్ర‌హానికి గురైన ప్రియ ఓటింగ్ దారుణంగా ప‌డిపోవ‌డంతో ఏడ‌వ వారంలోనే ఎలిమినేట్ కావాల్సి వ‌చ్చింది. ఇక ఇదిలా వుంటే ప్రియ ఇంట పెళ్లి బాజా మోగింది. త‌న‌కు వ‌రుస‌కు కూతుర‌య్యే లోహిత పెళ్లి కుదిరింది. ఈ వేడుక‌కు బిగ్‌బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కి వ‌చ్చేసిన కంటెస్టెంట్‌లు స‌ర‌యు, ఉమా దేవి, జెస్సీ హాజ‌ర‌య్యారు.

ఈ పెళ్లి వేడుక‌కు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన వీరి ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తున్నాయి. `మా ఇంట్లో పెళ్లి వేడుక‌లు షురూ` అంటూ ఇంటి ముందు ముగ్గులు వేసిన ఫొటోని ప్రియ అభిమానుల‌తో పంచుకుంది. హ‌ల్దీ, మెహందీ వేడుక‌ల‌కు సంబంధించిన ఫొటోల‌ని కూడా ఈ సంద‌ర్భంగా ప్రియ పంచుకుంది. ఇదే సంద‌ర్భంగా స‌ర‌యు, జెస్సీల‌కు సంబంధించిన ఫొటోల‌ని కూడా ప్రియ ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసింది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.