English | Telugu

Bigg Boss 9 Telugu Shobha shetty : హౌస్ లోకి శోభాశెట్టి.. కెప్టెన్సీ రేస్‌లో నిలిచిన కంటెస్టెంట్స్ ఎవరంటే!


బిగ్ బాస్ సీజన్-9 లో ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి రావడంతో ఫుల్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ వస్తుంది. హౌస్ లోని కంటెస్టెంట్స్ అంతా ఎక్స్ కంటెస్టెంట్స్ ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దానితో పాటు కెప్టెన్సీ కోసం టాస్క్ లతో ప్రతీ ఎపిసోడ్ ఫుల్ ప్యాక్ అవుతుంది.

ఇక నిన్నటి ఎపిసోడ్ లో సోహెల్ రాగా అతడితో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ వచ్చింది. ఇక సోహెల్ తో రీతూ, సంజన పోటీపడి గెలిచి కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచారు. ఇప్పటివరకు భరణి, తనూజ, సుమన్ శెట్టి కెప్టెన్సీ రేస్ నుండి తప్పుకోగా కళ్యాణ్, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయల్, రీతూ, సంజన కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచారు. అయితే యావర్ వర్సెస్ ఇమ్మాన్యుయల్ జరిగిన టాస్క్ హోరాహోరీగా సాగింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో సోహెల్ తో రీతూ చౌదరి, సంజన పోటీపడ్డారు. సోహెల్ ఓడిపోవడంతో రీతూ , సంజన కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచారు‌. ఇక తర్వాత శోభా శెట్టి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కాసేపు ఇమ్మాన్యుయల్ తో మాట్లాడింది. ఇక ఆ తర్వాత దివ్యతో కెప్టెన్సీ రేస్ లో పాల్గొంది శోభాశెట్టి. ఇందులో దివ్య ఈజీగా గెలిచింది.

ఇక ఇప్పటివరకు జరిగిన అన్ని టాస్క్ లలో అందరు కంటెస్టెంట్స్ పోటీపడ్డారు. ఇక వీరిలో సుమన్ శెట్టి, భరణి, తనూజ కెప్టెన్సీ రేస్ నుండి తప్పుకోగా.. దివ్య, సంజన, రీతూ, ఇమ్మాన్యుయల్, డీమాన్ పవన్, కళ్యాణ్ మొత్తం ఆరుగురు కెప్టెన్సీ రేస్ లో నిలిచారు. మరి వీరిలో కెప్టెన్ అయ్యేదెవరు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.