English | Telugu

Bigboss 8 episode review : బిగ్ బాస్ సీజన్-8 రివ్యూ!

బిగ్ బాస్ సీజన్-8 లో పదో వారం ఆసక్తికరంగా సాగుతుంది. వారం నుండి మెగా చీఫ్ కోసం హౌస్ లో పోటీ జరుగుతుంది. అందులో భాగంగానే విష్ణుప్రియ, యష్మీకి ఒక టాస్క్ జరిగింది. అది స్క్రూలు తిప్పి పజిల్ సెట్ చెయ్యాలి. ఇక మన నత్తి బ్రెయిన్ విష్ణు గురించి తెలిసిందే కదా.. చెత్త ఆటతీరును కొనసాగించింది. యష్మీ కాస్త స్మార్ట్ గా థింక్ చేసి హౌస్ మేట్స్ సపోర్ట్ తో ఆ టాస్క్ విన్ అయింది. ఇక ఆ తర్వాత ఆరెంజ్ కలర్ సూట్ కేసు ఓపెన్ చేయమని బిగ్ బాస్ యష్మీ కి చెప్తాడు.

యష్మీ సూట్ కేసు ఓపెన్ చేసేసరికి అందులో డెబ్భై అయిదు వేలు ఉంటాయి‌ అవి ప్రైజ్ మనీ కి ఆడ్ చెయ్యాలి. తీరా చూస్తే యష్మీ ఓపెన్ చేసింది విష్ణుప్రియ సూట్ కేస్. యష్మీ సూట్ కేసు లో లక్ష ఏనబై వేలు ఉంటాయి. దాంతో అందరూ బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేస్తారు. కానీ అమౌంట్ డెబ్భై అయిదు వేయిలు మాత్రమే విన్నర్ ప్రైజ్ మనీకి ఆడ్ అవుతాయి. ఇక ఆ తర్వాత విషయానికి వస్తే హరితేజ, విష్ణుప్రియ కిచెన్ లో ఉంటారు. ఏం చేస్తున్నారు అంది అని గాసిప్ క్వీన్ అలిగితే నత్తి బ్రెయిన్ విష్ణు వెళ్లి బుజ్జగించింది.. ఇక కామెడీ అడిషన్స్ టాస్క్ లో రోహిణి, అవినాష్ ఫుల్ గా ఎంటర్టైన్ చేశారు.

టాస్క్ తర్వాత విష్ణుని పృథ్వీ ఏమో అన్నాడని.. విష్ణు హర్ట్ అయింది. వాళ్ళకి పంచాయతీ చెప్పడానికి యష్మీ ట్రై చేసింది కానీ కాసేపటికి విష్ణు వెళ్ళి అడిగి మరి పృథ్వీతో సారి చెప్పించుకుంది. ఆ తర్వాత టాస్క్ లో మంతనాలు ఎప్పటిలాగే ఇంకా ఏదో సాధించాలని యష్మీ ఆరాటం.. ఇక రేపటితో మెగా ఛీఫ్ ఎవరు అవుతారో తెలుస్తుంది. ఈ వారం మెగా ఛీఫ్ ఎవరు అవుతారో చూడాలి మరి!

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.