English | Telugu

హౌస్ లో సూట్ కేస్ లు.. ఆ ముగ్గురికి బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే!

బిగ్ బాస్ సీజన్-8 రోజుకో ట్విస్ట్ తో దూసుకుపోతుంది. ఇన్ఫినిటీ సీజన్ అని దానికి తగ్గట్టుగానే ఎన్నో ట్విస్ట్ లు ఉన్నాయి. అందులో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ కి ఒక ఆఫర్ ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో మూడు సూట్ కేసు లని పెట్టాడు. అవి ఎవరు తీసుకుంటారో వాళ్ళ ఇష్టానికే వదిలేసాడు బిగ్ బాస్.

అందరు ఆ సూట్ కేసు తీసుకుంటే ఏం ఎఫెక్ట్ ఉంటుందోనని, ఏముంటుందో అని హౌస్ మేట్స్ అందరు టెన్షన్ పడుతుంటారు. కానీ ఫైనల్ గా నబీల్, పృథ్వీ, రోహిణి ముగ్గురు ధైర్యం చేసి ఒక్కొక్కరు ఒక్కో సూట్ కేసుని తీసుకుంటారు. అంత ఆశ తోటి పట్టుకోకూడదని గంగవ్వ అంటుంటే.. ఏది అయితే అది అయింది అనే ధైర్యం చేసే పట్టుకున్నానని నబీల్ అంటాడు. ఈ రోజు మీ దైర్యం మీకేం ఇచ్చిందనుకుంటున్నారని బిగ్ బాస్ అడుగగా.. మంచిని కోరుకున్నా మంచే జరుగుతుంది అనుకుంటున్నానని రోహిణి అంటుంది. మీ ముగ్గురు సూట్ కేసు పట్టుకున్నందున డైరెక్ట్ గా మెగా చీఫ్ కంటెండెర్స్ అయ్యారని బిగ్ బాస్ అనగానే.. ముగ్గురు హ్యాపీగా ఫీల్ అవుతారు. కంటెండర్ అయినప్పటికి మీరు కొన్ని ఛాలెంజ్ ఫేస్ చెయ్యాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్తాడు.

ఆ సూట్ కేసు ని తీసుకుంటే డైరెక్ట్ నామినేషనో లేక ఎలిమినేషన్ ఉంటుందోనని అందరు భయపడ్డారు. అందుకే ఆ రిస్క్ ఎందుకని హౌస్ మేట్స్ లైట్ తీసుకున్నారు. కానీ డేర్ చేసిన ముగ్గురికి బెన్ఫిట్ అని చెప్పాలి. వారమంతా జరిగే టాస్క్ లలో విన్ అయితే మెగా చీఫ్ కంటెండర్ చీఫ్ వస్తుంది. అలాంటది అలా ఓ సూట్ కేస్ తీసుకుంటే అవకాశం రావడం అనేది నిజంగా లక్ అనే చెప్పొచ్చు. మరి బిగ్ బాస్ మళ్ళీ ఏదైనా ట్విస్ట్ ఇస్తాడో లేదో చూడాలి మరి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.