English | Telugu

ఓటింగ్ లో గౌతమ్ కృష్ణ ఫస్ట్.. విష్ణుప్రియ లాస్ట్!

బిగ్ బాస్ సీజన్-8 లో నిన్నటి దాకా నామినేషన్ లో హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. ఇక ఓటింగ్ రోజుకో మలుపు తిరుగుతుంది. పృథ్వీ , నిఖిల్, యష్మీ, ప్రేరణ, విష్ణుప్రియ, హరితేజ, గౌతమ్ ఇప్పుడు నామినేషన్ లో ఉన్నారు.

ఇక నామినేషన్ లో ఓటింగ్ విధానం చూస్తుంటే బుర్రపాడు అంతే. అసలు లాస్ట్ లో ఉన్నవాళ్ళు ఫస్ట్ లో ఉన్నారు. గౌతమ్ కి అత్యధికంగా 27 శాతం ఓటింగ్ పడుతుండగా.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినటువంటి నిఖిల్ కు 21 శాతం మాత్రమే ఓటింగ్ ఉంది. ఇక బిగ్ బాస్ దత్తపుత్రిక విష్ణుప్రియకి అసలు ఓటింగే లేదు. జస్ట్ 8 శాతం ఓటింగ్ తో లాస్ట్ లో ఉంది. పృథ్వీ, హరితేజ, యష్మీ, విష్ణుప్రియ వీళ్లు నలుగురు సేమ్ ఎనిమిది శాతం ఓటింగ్ తో లీస్ట్ లో ఉన్నారు. ఇక ఈ ఓటింగ్ ని బట్టి ఈ వారం ఆ చెత్త లవ్ స్టోరీకీ బ్రేక్ పడేలా ఉంది. అదే విష్ణుప్రియ-పృథ్వీలలో నుండి ఎవరో ఒకరు ఎలిమినేషన్ అయ్యేలా ఉన్నారు.

పృథ్వీ నామినేషన్ పాయింట్లు చూస్తే.. బానే ఎక్స్ ట్రాలు.. అన్నట్టుగా ఉంటుంది. ఇక మన నత్తి బ్రెయిన్ విష్ణుప్రియకి ఏ రీజన్ చెప్పి నామినేట్ చెయ్యాలో కూడా తెలియదు. మరి మన బిగ్ బాస్ మామ దత్తపుత్రిక విష్ణుప్రియని ఎలిమినేషన్ చేయగలడా లేక టాప్-5 లో ఉంచుతాడా చూడాలి మరి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.