English | Telugu

Yawar Misbehaved with Tanuja: బిగ్ బాస్ హౌస్‌లో తనూజతో మిస్ బిహేవ్ చేసిన యావర్!

బిగ్ బాస్ సీజన్-9 లో ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి రావడం, వారితో హౌస్ లోని కంటెస్టెంట్స్ ని టాస్క్ లు ఆడుతుంటే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ వస్తుంది. ఇందులో భాగంగా నిన్నటి ఎపిసోడ్ లో సోహెల్, యావర్ ఎంట్రీ ఇచ్చారు. సీజన్-4 కంటెస్టెంట్ సోహెల్, సీజన్-7 కంటెస్టెంట్ యావర్. అయితే ఆ సీజన్ లో రతికరోజ్ తో యావర్ లవ్ ట్రాక్ నడపాలని చూశాడు కానీ అప్పటికే తను కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ తో లవ్ లో ఉండటంతో సైలైంట్ అయిపోయాడు.

ఇక నిన్నటి ఎపిసోడ్ లో యావర్ హౌస్ లోకి వచ్చీ రాగానే అందరిని నవ్వుతూ పలకరించాడు. హౌస్‌లో ఎవరూ చేయలేని పనిని యావర్ చేశాడు. అదేంటంటే తనూజతో పులిహోర. మామూలుగా కాదు.. తను చేసిన పనికి తనూజ అయితే ఇబ్బంది పడింది. హౌస్ లోకి రాగానే తనూజ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగాడు. తను లేడని చెప్పడంతో మనోడు చెలరేగిపోయాడు. మోకాళ్ళ మీద కూర్చొని మరీ ప్రపోజ్ చేయడంతో తనూజకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక ఆ తర్వాత తనని ఎత్తుకొని గిరగిరా తిప్పేశాడు.

తనూజని యావర్ ఎత్తుకొని తిప్పుతున్నప్పుడు తను అన్ కంఫర్టెబుల్ గా ఫీల్ అయింది. అదంతా చూస్తూ కళ్యాణ్ మొహం మాడిపోయింది.ఇక ఆ తర్వాత ఎక్కువ స్ట్రెస్ తీసుకోకురా మొత్తం ఊడిపోతుందని ఇమ్మాన్యుయల్ తో యావర్ అనగా.. స్ట్రెస్ గురించి నువ్వు చెప్తున్నావా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. ఇక ఆ తర్వాత ఇమ్మాన్యుయల్, యావర్ మధ్య కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరిగింది. ఇందులో యావర్ పై ఇమ్మాన్యుయల్ గెలిచి కెప్టెన్సీ కంటెండర్ రేస్ లో నిలిచాడు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.