English | Telugu

Nagarjuna Warns Sanjana: నాగార్జున మాట లెక్కచెయ్యని సంజన.. ఈ వీకెండ్ వార్నింగ్ తప్పేలా లేదుగా!

బిగ్ బాస్ సీజన్-9 లో సంజన కంటెంట్ క్రియేటర్ గా ముద్ర వేసుకుంది. హౌస్ లో ఇప్పటివరకు చేయని విధంగా దొంగగా ముద్ర తెచ్చుకున్న కంటెస్టెంట్ సంజన అనడంలో ఆశ్చర్యం లేదు. మొదటి వీక్ నే హౌస్ లో గుడ్లు దొంగతనం చేసి హౌస్ ఫోకస్ మొత్తం తనపై తిప్పుకుంది సంజన. చూసే ఆడియన్స్ కి సైతం గేమ్ చేంజర్ సంజన అనిపించింది. కానీ అలా ప్రతీసారీ దొంగతనాలు చేస్తూ ఉండడంతో హౌస్ మేట్స్ కి చిరాకు వచ్చింది.

నాగార్జున మొదట్లో కామెడీగా తీసుకున్నా ఆ తర్వాత దొంగతనాలు చెయ్యొద్దని వార్నింగ్ ఇచ్చాడు. వినకపోయేసరికి దొంగలున్నారు జాగ్రత్త అని రాసి ఉన్న బోర్డ్ సంజన మెడలో వేశారు. నువ్వు జోక్ అనుకుంటున్నది అన్నివేళలా అందరికి జోక్ కాకపోవచ్చని నాగార్జున ఒక వీకెండ్ లో చెప్పాడు. ఫ్యామిలీ వీక్ లో ఇంకా ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు మీరు దొంగతనం చేసినప్పుడు చాలా ఫన్ గా ఉండేదని చెప్పడంతో మళ్ళీ హౌస్ లో దొంగతనం మొదలుపెట్టింది సంజన. నిన్నటి ఎపిసోడ్ లో భరణికి సంబంధించిన టాబ్లెట్స్ అన్నీ దాచేసింది.. ఎవరు తీశారని కెప్టెన్ అయిన రీతూ అందరిని అడుగుతుంది. ఎవరిని అడిగినా ఎవరు తియ్యలేదని అంటారు. సంజన గారు మీరు తీసేటప్పుడు తనూజ చూసిందంట ప్లీజ్ ఇవ్వండి అని రీతూ అనగానే నాకు తెలియదని సంజన అంటుంది. ఇక రాత్రి కాగానే భరణి దగ్గరికి సంజన వెళ్ళి మాట్లాడుతుంది. నేనే తీసాను టాబ్లెట్స్.. మీతో మాట్లాడాలని అని సంజన అనగానే.. రేపు మాట్లాడుదామని భరణి అంటాడు.

మరుసటిరోజు భరణి దగ్గరికి సంజన వచ్చి.. నేను ఏదో ఫన్ క్రియేట్ చేయాలని చేసాను కానీ ఇమ్మాన్యుయల్, దివ్య మొత్తం స్పాయిల్ చేశారని సంజన అంటుంది. దివ్య వచ్చి ఏడ్చింది టాబ్లెట్స్ ఇవ్వండి అని అందుకే ఇచ్చేసానని సంజన చెప్తుంది. ఈ వీకెండ్ లో నాగార్జున సంజన విషయంలో ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.