English | Telugu

ఆది - రష్మీ ప్రేమకు ఇన్నేళ్ళుగా అడ్డుపడిన సుధీర్


జబర్దస్త్ టైం నుంచి మనం చూస్తే ఆన్ స్క్రీన్ జోడీగా బాగా క్లిక్ ఐన పెయిర్ ఎవరైనా ఉన్నారంటే అది రష్మీ - సుధీర్ జోడి మాత్రమే. కార్తీక దీపం సీరియల్ జోడి తరువాత జబర్దస్త్ జోడి బాగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఐతే అదంతా ఆన్ స్క్రీన్ మీద తప్ప అసలు బయట ఎవరికీ వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటాం అని కూడా చాలా సార్లు చెప్పారు. కానీ ఆడియన్స్ ఊరుకోలేదు. సుధీర్ - రష్మీ పెళ్లి చేసుకుంటే చూడాలని అనుకునేవాళ్లే ఎక్కువగా ఉండేవాళ్ళు. ఐతే తరువాత కాలంలో ఇద్దరూ వేరు వేరు షోస్ చేసుకుంటూ దూరమైపోయారు.

ఐనా కానీ వీళ్ళ జోడి మాత్రం ఎవర్ గ్రీన్ అని చెప్పొద్దూ. బుల్లితెర జోడి అంటే వీళ్ళే గుర్తొస్తారు. ఐతే ఇప్పుడు ఆది తన మనసులో అసలు విషయాన్ని బయటపెట్టాడు. రష్మీ సుధీర్ మీద మనసు పడిందో లేదో కానీ ఆది మాత్రం రష్మీ మీద మనసు పడినట్టు తన కామెంట్స్ ద్వారా చెప్పకనే చెప్పాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమోలో ఈ విషయం బయట పెట్టాడు. రష్మీని కుర్చీలో కూర్చోబెట్టి నెమలి ఈకల్తో ఆమెను సవరదీస్తూ "రష్మీ నాకు వాడు తొమ్మిది సంవత్సరాలు అడ్డుపడ్డాడు.." అనేసరికి అందరూ షాకైపోయారు. అంటే దీన్ని బట్టి రష్మీ అంటే ఆదికి ఇష్టం అనే విషయం తెలుస్తోంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.