English | Telugu

అఖిల్ సార్థక్ సెలూన్ ని ఓపెన్ చేసిన నాగార్జున


బిగ్ బాస్ రన్నర్ గా నిలిచిన అఖిల్ సార్థక్ కొంతకాలంగా సోషల్ మీడియాలో సైలెంట్ అయిపోయాడు. వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో కూడా అఖిల్ సందడి చేయడం లేదు. నీతోనే డ్యాన్స్ షో అంటూ తేజస్వీతో అఖిల్ డ్యాన్స్ చేసాడు ఆ తర్వాత అస్సలు కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఇక ఇప్పుడు మళ్ళీ సందడి చేస్తున్నాడు అఖిల్. హైదరాబాద్ లో ఎలెవన్ సలోన్ ని ఓపెన్ చేసాడు. ఇక తన సలోన్ ఓపెనింగ్ ఫంక్షన్ కి తన ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేసాడు.

ఆర్జే కాజల్, రోల్ రైడ, సిరి హన్మంత్, నోయెల్, అలాగే హీరో నాగార్జున, బ్రహ్మముడి మానస్ వాళ్ళ అమ్మ పద్మిని, వచ్చారు. ఇక నాగార్జునతో సలోన్ ని ఓపెన్ చేయించాడు. బిగ్ బాస్ సీజన్ 4 లో రన్నరప్ గా నిలైహ్చాడు అఖిల్. ఐతే అఖిల్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక పెద్దగా ఎలాంటి ఆఫర్స్ రాలేదు. కొన్ని షోస్ కి హోస్ట్ చేసాడు కానీ పెద్దగా క్లిక్ కాలేదు. బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చాక అందరిలో కొందరికైనా దశ తిరుగుతుంది కానీ అఖిల్ కి మాత్రం ఇంకా మహర్దశ వచ్చినట్టు కనిపించడం లేదు. ఇక ఇప్పుడు సలోన్ ఓపెన్ చేసేసరికి నెటిజన్స్ అంతా కూడా విషెస్ చెప్తున్నారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.