English | Telugu

సరేగమప ది నెక్స్ట్ సింగింగ్ యూత్ ఐకాన్ త్వరలో


జీ తెలుగు ఇప్పుడొక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చేసింది. సరేగమప ది నెక్స్ట్ సింగింగ్ యూత్ ఐకాన్ పేరుతో సరికొత్త షో త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. హోస్ట్ గా శ్రీముఖి వచ్చింది. ఇక దుమ్ము బాబోయ్ దుమ్ము అంటున్నారు నెటిజన్స్. అలాగే జడ్జెస్ గా అందరికీ ఇష్టమైన కోటి, ఎస్పి. శైలజ, కాసర్ల శ్యామ్ వచ్చారు. ఈ సీజన్ జీ సరేగమప సరదాగా ఉండబోతోంది అని శైలజ అంటే ఈ సారి సీజన్ తీన్ మారే అంటూ శ్యామ్ అన్నారు. ఇక మెంటార్స్ గా సింగర్స్ రేవంత్, రమ్య బెహరా కనిపించారు. అలాగే సింగర్ చిన్మయి, విజయ్ ఏసుదాస్ వంటి వాళ్ళు కూడా ఎంట్రీ ఇచ్చారు.

జీ తెలుగు ఇప్పుడు సరేగమప సరి కొత్త సీజన్లో ని త్వరలో గ్రాండ్ గా లాంచ్ చేయబోతోంది. దానితో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ప్రతిభావంతులైన సింగర్స్ ని ఈ షోలోకి తీసుకురాబోతోంది. ఈ సీజన్ కోసం ఆగష్టు ఎండింగ్ వరకు ఆడిషన్స్ కూడా నిర్వహించింది. జీ తెలుగు కూడా మిగతా ఛానెల్స్ కి తక్కువ కాదన్నట్టు ఎన్నో షోస్ ని అందిస్తోంది. సీరియల్స్, కామెడీ షోస్ అలాగే రియాలిటీ షోస్ అన్నీ ఆడియన్స్ ముందుకు తీసుకువస్తోంది. ఇక ఇప్పుడు సరేగమప కొత్త సీజన్ తో రాబోతోంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.