English | Telugu

మణికంఠ భార్య సంచలన పోస్ట్.. బిగ్ బాస్ నుంచి రాగానే విడాకులేనా?

బిగ్ బాస్ సీజన్-8 లో ఫస్ట్ వీక్ లోనే సెంటిమెంట్ కార్డుతో ఫేమస్ అయ్యాడు నాగ మణికంఠ. ప్రేరణ తన నామినేషన్ లో మణికంఠని ఓపెన్ అవ్వమని చెప్పగా.. తను తన వివరాలు చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. అక్కడి నుండి అతడితో హౌస్ మేట్స్ కాస్త జాగ్రత్తగా ఉంటున్నారు. అయితే తాజాగా అతని భార్య చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. అదేంటో ఓసారి చూసేద్దాం.

మణికంఠ భార్య ప్రియ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోని షేర్ చేసింది. సమాజం కోసం వారితో కలిసి ఉండటం కంటే ఆ విషపూరిత సంబంధం నుంచి విడిపోవడమే మంచిదంటు ఆ పోస్ట్ లో రాసుకొచ్చింది. అలాగే భార్యా,భర్తలు తరచూ గొడవలు పడటం వల్ల అవి పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో కళ్లకి కడుతూ ఆలోచింపజేసేలా ఒక ఫొటోని కూడా షేర్ చేసింది. చిన్నపిల్లల అంతరంగాన్ని వినండి.. ఇది చాలా పవర్ ఫుల్ ఇమేజ్. భార్యాభర్తలు గొడవ పడటం వల్ల అది పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుందని శ్రీప్రియ ఈ పోస్ట్ ద్వారా తెలియజేసింది.

ఇక బిగ్ బాస్ సీజన్ 8 లాంఛింగ్ డే నాడు.. మణికంఠ స్పెషల్ వీడియోలో తన భార్య.. తనని ఇండియాకి వెళ్లిపొమ్మన్నదని భార్య, కూతురు ఉన్నా ఒంటరివాడినయ్యానని చెప్పి ఎమోషనల్ అయ్యాడు. అది ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. అయితే హౌస్‌లోకి వచ్చిన తరువాత మాత్రం.. తన భార్య ప్రియ గురించి చాలా గొప్పగా చెప్పాడు‌. అతని వీడియో చూసి ఆమె గురించి చాలామంది నెగిటివ్‌గా అనుకున్నారు. కూతుర్ని తన దగ్గరే ఉంచుకుని భర్తని ఇండియాకి పొమ్మదనే మీనింగ్‌లో ఆ వీడియోను కట్ చేయడంతో.. అంతా నాగ మణికంఠ భార్య గురించి తప్పుగా అనుకున్నారు. కానీ హౌస్ లో ఓ సందర్భంలో నా వైఫ్ బంగారం అంటు చెప్పడంతో వీళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ ఏం లేవేమో అని అనుకున్నారంతా కానీ ఈ పోస్ట్ తో అది నిజమేనని స్పష్టమవుతుంది. మరి ఈ పోస్ట్ పై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి‌.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.