English | Telugu

బిగ్ బాస్ నాన్ స్టాప్ నుంచి ముమైత్ ఖాన్ అవుట్.. ఏడ్చేసిన సరయు!

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి వారం పూర్తి చేసుకుంది. తొలి వారం సరయు లేదా మిత్రా శర్మ ఎలిమినేట్ అవుతారని మొదట్లో అభిప్రాయపడ్డారు అంతా. అయితే చివరిలో ఊహించని విధంగా ముమైత్ ఖాన్ పేరు తెరమీదకు వచ్చింది. అనుకున్నట్లుగానే మొదటి ఎలిమినేషన్ లో ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయింది.

ఆదివారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ తో సరదాగా మాట్లాడి, టాస్క్ లు ఆడించిన హోస్ట్ నాగార్జున మొదటి వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో ప్రకటించాడు. మొదట తాను ఎలిమినేట్ అవుతానని భావించిన సరయు తెగ ఏడ్చేసింది. ఆ తరువాత సరయు సేఫ్ అయ్యి, ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయిందని నాగ్ తెలిపాడు. సేఫ్ అయినప్పుడు సరయు అలాగే కాసేపు ఏడ్చింది.

బిగ్ బాస్ 5 లో పార్టిసిపేట్ చేసిన సరయు తన బిహేవియర్ తో మొదటి వారమే ఎలిమినేట్ అయింది. నాన్ స్టాప్ లో కూడా సరయు అలాగే ఎలిమినేట్ అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఒకవేళ సరయు కాకపోతే, ఆడియన్స్ కి పెద్దగా తెలియని మిత్రా శర్మ ఎలిమినేట్ అవుతుందని భావించారంతా. కానీ వీరిద్దరికంటే ముమైత్ కి తక్కువ ఓట్లు వచ్చాయి. ఆమె ఆర్జే చైతుతో సిగరెట్స్ ఇష్యూ గురించి పదే పదే వాదన పెట్టుకోవడంతో ఆమె పట్ల ఆడియెన్స్ పాజిటివ్ గా లేరని, అదే ఆమె ఎలిమినేషన్ కి కారణమని అంటున్నారు. ఎలిమినేట్ అవ్వడంతో ముమైత్ స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకుంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.