English | Telugu

మోనిత బాబు శ్రీ‌వ‌ల్లి ఒడికి .. ఏం జ‌రుగుతోంది?

బుల్లితెర వీక్ష‌కుల్ని గ‌త కొంత కాలంగా ఎంట‌ర్‌టైన్ చేస్తూనే చిత్ర విచిత్ర‌మైన మ‌లుపులు, ట్విస్ట్ ల‌తో చిరాకు తెప్పిస్తున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. ఎండింగ్ అనుకున్న సీరియ‌ల్ ని ద‌ర్శ‌కుడు కాపు గంటి రాజేంద్ర సాగ‌దీస్తుండ‌టం ప్రేక్ష‌కుల్లో అస‌హ‌నాన్ని తెప్పిస్తోంది. ఇదిలా వుంటే బుధ‌వారం 1223వ ఎపిసోడ్ ప్ర‌సారం కానుంది. ఈ సంద‌ర్భంగా ఈ రోజు హైలైట్స్ ఏంటో ఓసారి చూద్దాం

Also Read:నిజం తెలుసుకున్న మోనిత‌..రౌడీల‌కు చుక్క‌లు చూపించిన కార్తీక్‌

కారులో వున్న త‌న బాబు క‌నిపించ‌కుండా పోవ‌డంతో ఆదిత్య‌ పై అనుమానంతో ఆనంద‌రావు ఇంటికి వ‌స్తుంది మోనిత‌. `నా బాబుని మీ ఆదిత్యే ఎత్తుకొచ్చాడు. కోపం వుంటే తిట్టండి.. కొట్టండి.. కానీ ఇలా నా బిడ్డ‌ని దూరం చేస్తారా? ` అని అరుస్తుంది మోనిత‌. వెంట‌నే `ఏం మాట్లాడుతున్నావ్‌` అని తిరిగి ప్ర‌శ్నిస్తుంది సౌంద‌ర్య‌.. కానీ మోనిత మాత్రం ఆమె మాట‌ల్ని పెద్ద‌గా ప‌ట్టించుకోదు. `నా కొడుకుని ఎత్తుకెళితే నేను ఏడుస్తూ కూర్చుంటాన‌నుకుంటున్నారా? .. త‌న‌ని ఎత్తుకెళ్లింది ఎవ‌రో తెలిసేదాకా ఇక్క‌డే కూర్చుంటాను. మీ కొడుకు, నా కొడుకు దొరికే వ‌ర‌కు ఇక్క‌డే వుంటాను` అంటూ అరుస్తుంది మోనిత‌.

క‌ట్ చేస్తే... ఆసుప‌త్రిలో శ్రీ‌వ‌ల్లి ఏడుస్తూ వుంటుంది. ఈ సారి కూడా కాన్పు పోయింద‌ని కుమిలిపోతూ వుంటుంది. ఇంత‌లో శ్రీ‌వ‌ల్లి భ‌ర్త కోటేష్ ఒక బాబుని తీసుకుని వ‌చ్చి శ్రీ‌వ‌ల్లి చేతుల్లో పెడుతూ `వ‌ల్లీ ఇదే ఆసుప‌త్రిలో త‌ల్లి చ‌నిపోయిన బిడ్డ అట‌.. మ‌గ బిడ్డే .. మ‌నం పెంచుకుందాం ` అంటాడు. వెంట‌నే బాబుని అందుకుని ముద్దాడిన‌ శ్రీ‌వ‌ల్లి దేవుడికి థ్యాంక్స్ చెబుతుంది. శ్రీ‌వ‌ల్లి ఆనందంతో వుండ‌గా అస‌లు ఆ బాబుని తాను ఎక్క‌డి నుంచి తీసుకొచ్చానో గుర్తు చేసుకుంటాడు కోటేష్‌. త‌ను వ‌ల్లి చేతుల్లో పెట్టిన బాబు మోనిత కొడుకు. ఈ ట్విస్ట్ ఏంటీ? .. అత‌ని చేతుల్లోకి మోనిత బాబు ఎలా వ‌చ్చాడు? .. అస‌లు ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.


Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.