English | Telugu

Jayam Serial: రుద్రపై చెడుగా చెప్పిన వీరు.. ఆమెను శకుంతల బయటకి పంపిస్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -75 లో... వీరు దగ్గరకి ఇషిక వస్తుంది. నీకోక విషయం చెప్పాలని అంటుంది. రుద్ర అంటే మనకి ఇష్టం లేదు.. ఎప్పుడెప్పుడు ఇంట్లో నుండి గంగని బయటకు గెంటేద్దామని చూస్తుంటే.. తను ఏకంగా ఈ ఇంటికి కోడలు అవ్వాలని చూస్తుందని, గంగ తనలో తాను మాట్లాడుకున్న విషయం వీరుకి చెప్పగానే అతను షాక్ అవుతాడు.

ఆ తర్వాత శంకుతల దగ్గరికి వీరు వచ్చి.. రుద్ర బావ మీకు దగ్గర అవ్వాలని చూస్తున్నాడు. అందుకు గంగని వాడుకుంటున్నాడని వీరు చెప్తాడు. శకుంతలకి ఇంకా రుద్రపై కోపం కలిగేలా వీరు మాట్లాడతాడు. ఇప్పుడు మీరు గంగని పంపిస్తానని చెప్పండి.. అందుకు రుద్ర అసలు ఒప్పుకోడు.. ఒప్పుకుంటే నేను చెప్పింది నమ్మకండి అని వీరు అంటాడు.

ఆ తర్వాత ఇంటికి పోలీసులు వస్తారు. మీరు కేక్ లో విషం కలిసిందని కంప్లైంట్ ఇచ్చారు కదా.. అందులో ఎవరో కావాలనే విషం కలిపారు.. బేకరిలో అది జరగలేదని పోలీసులు చెప్పి వెళ్తారు. మరి ఎవరు చేసి ఉంటారని పెద్దసారు అంటాడు.

ఇంట్లో వాళ్లే చేసి ఉంటారు.. ఈ మధ్య తప్పుని ఒప్పు అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారని రుద్రను ఉద్దేశించి శకుంతల మాట్లాడుతుంది. నేను గంగని ఇంట్లో నుండి పంపించేస్తాను.. సేఫ్ ప్లేస్ లో పెడతానని శకుంతల అనగానే వద్దని రుద్ర అంటాడు.

తరువాయి భాగంలో చిట్టి, పారుకి పార్క్ లో గొడవ అవుతుంది. చిట్టి వెంటనే రుద్రకి ఫోన్ చేసి రమ్మంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.