English | Telugu
సవతి తల్లి కపట ప్రేమని గుర్తించని కొడుకు.. భార్యని అనుమానిస్తాడా!
Updated : Nov 7, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -247 లో... సీతాకాంత్ దగ్గరికి శ్రీలత వచ్చి.. తన కపట ప్రేమని నటిస్తుంది. నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను.. నేను ఉండడం నీ భార్యకి ఇష్టం లేదు.. మీరు హ్యాపీగా ఉండండి అని శ్రీలత అంటుంది. ఈ ఆస్తులు సంపాదించింది ఎవరికోసం మన కుటుంబం కోసం కదా.. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంతగా వెళ్తే తప్పు చేసిన వాళ్ళు వెళ్తారని సీతాకాంత్ అంటాడు.
నువు ఎక్కడికి వెళ్లకంటూ శ్రీలత దగ్గర మాట తీసుకుంటాడు సీతాకాంత్. ఆ తర్వాత రామలక్ష్మి జరిగింది గుర్తుచేసుకుంటూ ఉంటుంది. ఇది కచ్చితంగా అత్తమ్మ పనే అనుకుంటుంది. అప్పుడే శ్రీలత వస్తుంది. ఏంటి అంత కోపంగా చూస్తున్నావని శ్రీలత అడుగుతుంది. తనకి కోపం వచ్చేలా మాట్లాడేసరికి శ్రీలతపై రామలక్ష్మి చెయ్ ఎత్తుతుంది. ఏంటి భయపడుతున్నవా.. ఇంకొకసారి రామలక్ష్మి జోలికి వెళ్ళకూడదనేలా చేస్తాను చూడమని శ్రీలతకి సవాలు విసురుతుంది రామలక్ష్మి.ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వస్తుంది. మాట్లాడే ప్రయత్నం చేస్తే కోప్పడతాడు. నా తల్లి పై చెయ్ ఎత్తావంటూ కోప్పడతాడు. తను మీకు నా గురించి చెడుగా చెప్పి అనుమానం వచ్చేలా చేస్తుంది.. అసలు మీకు ఏమైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తాడేమో అని వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళాను.. మీకు చెప్పకపోవడం నా తప్పేనని రామలక్ష్మి అంటుంది.
నాకు నీపై అనుమానం లేదు కానీ నువ్వు నా తల్లిపై చెయ్ ఎత్తావు అంటూ సీతాకాంత్ కోప్పడి వెళ్ళిపోతాడు. నాపై ఎలాంటి అనుమానం లేదని చెప్పాడని హ్యాపీగా ఫీల్ అవుతుంది రామలక్ష్మి.ఆ తర్వాత మరుసటి రోజు సీతాకాంత్ కి రామలక్ష్మి అన్ని తీస్తుంటే.. తను ఇచ్చిందేం తీసుకోడు. మరొక వైపు డిటెక్టివ్ తప్పించుకుంటాడు. అభి ఆ విషయం నందినికి ఫోన్ చేసి చెప్పగా కోప్పడుతుంది. వాడి సంగతి నేనే చూసుకుంటానని నందిని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.