English | Telugu

Eto Vellipoyindhi Manasu : భర్తతో భార్యని గెంటించేలా చేసిన సవతి తల్లి.. ఇదేం ట్విస్ట్ రా మామ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -221 లో.....రౌడీని తీసుకొని వచ్చి రామలక్ష్మి, మాణిక్యంలు నిజం చెప్పిస్తారు. ఇదంతా చేసింది ఈ సందీప్ అని రౌడీ చెప్పి మళ్ళీ ఇలా చెప్పకుంటే.. ఈ రామలక్ష్మి మాణిక్యంలు చంపేస్తానని బెదిరించారు. ఇప్పుడు నిజం చెప్తున్నాను.. నన్ను ఎప్పుడు ఈ సందీప్ చూడలేదని రౌడీ చెప్తాడు. దాంతో అందరు షాక్ అవుతారు. రౌడీ చెప్పి వెళ్లిపోతుంటే.. వద్దని మాణిక్యం అంటాడు. వెళ్లనివ్వని సీతాకాంత్ అంటాడు.

చూసావా సీతా.. నీ భార్య ఎలా చేసిందో.. అన్నాతమ్ముడిని విడదియ్యానుకుంటుంది. ఎప్పుడు నిన్ను గానీ తనని గాని పరాయిలాగా చూసానా అని శ్రీలత యాక్టింగ్ చేస్తుంది. ఇప్పుడు ఏమంటారు బావ గారు.. ఇందాక తప్పు చేసాడని మీ భార్య అనగానే.. తమ్ముడని చూడకుండా కొట్టారు. ఇప్పుడు నిజం తెలిసింది కదా ఇప్పుడు ఎం చేస్తారని శ్రీవల్లి అంటుంది. నేనేం తప్పు చెయ్యలేదు.. ఎప్పుడు ఆయన క్షేమం కోసం మాత్రమే చేశానని రామలక్ష్మి అంటుంది. చక్కగా ఉన్న కుటుంబంలోకి వచ్చి అన్న తమ్ముళ్లని విడదీసి ఆస్తులు కొట్టేయాలనుకుందని శ్రీలత అంటుంది. ఇంత అవమానం జరిగిన తర్వాత ఈ ఇంట్లో ఎందుకు ఉండడమంటూ శ్రీవల్లి సందీప్ లు బ్యాగ్ తో బయలుదేరతారు. ఉండండి అని శ్రీలత అంటుంది. వదిన నాపై ఉన్నా కోపంతో ఆస్తులు కోసం అన్నయ్యనే చంపాలనుకుంటున్నానని చెప్తుంది అందుకే దూరంగా ఉండి.. నాకు నేనే శిక్ష వేసుకుంటా అని సందీప్ వెళ్లిపోతుంటే.. ఆగండీ మీరెందుకు వెళ్లడం తప్పు చేసిన వాళ్ళు వెళ్తారని సీతాకాంత్ అంటాడు.

నేను తప్పు చేసానని అనుకుంటున్నారా అని రామలక్ష్మి అనగానే.. అది నీ మనసుకి తెలుసని సీతాకాంత్ అంటాడు. దాంతో రామలక్ష్మి బాధపడుతూ లోపలికి వెళ్లి బట్టలు సర్దుకొని బ్యాగ్ తో బయటకు వస్తుంటే.. సీతాకాంత్ బాధపడతాడు. శ్రీలత, సందీప్, శ్రీవల్లిలు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.