English | Telugu

Brahmamudi : ఇంటి కోడలి కోసం దిగొచ్చిన దుగ్గిరాల కుటుంబం.. భార్యకి క్షమాపణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -517 లో....కావ్య ఇంట్లో నుండి వెళ్లిపోయిన విషయం అపర్ణ కి తెలియడంతో షాక్ అవుతుంది. అసలు ఇంట్లో ఏం జరిగిందని మొత్తం అపర్ణకి చెప్తుంది స్వప్న. నా కోడలు పౌరుషం కలది.. ఆత్మభిమనo కలది.. అందుకే ఇంట్లో నుండి వెళ్ళిపోయింది.. నేను వెళ్ళమంటెనే నన్ను వదిలేసి వెళ్ళిందని అపర్ణ అనగానే.. చూసారా ఇప్పుడైనా నిజం తెలుసుకున్నారా అని స్వప్న అంటుంది.

నా కోడలు వెళ్లిపోవడం లో తప్పులేదు.. తన మనసు ముక్కలు చేసి పంపించారు. నీ మీద నాకు కోపం రావడం లేదని రుద్రాణిని అపర్ణ అంటుంది. ఎందుకంటే చెప్పిన వారి కంటే చెప్పుడు మాటలు విన్న వాళ్ళది తప్పు. నా కొడుకుది తప్పు. నువ్వు వెళ్లి క్షమించమని అడిగి నా కోడలిని తీసుకొని రా అని రాజ్ కి అపర్ణ చేప్తుంది. నేను వెళ్ళమనలేదు నేను తీసుకొని రాలేనని రాజ్ వెళ్ళిపోతాడు. నా కోడలిని నేనే తీసుకొని వస్తానని అపర్ణ వెళ్తుంటే.. నీ ఆరోగ్యం బాలేదు.. మేమ్ వెళ్లి తీసుకొని వస్తామని సీతారామయ్య ఇందిరాదేవిలు అంటారు. ఇప్పుడు ఆ కావ్య ఇంటికి వస్తే మనం ఇప్పటివరకు చేసింది మొత్తం ఫెయిల్ అవుతుందని రాహుల్ అంటాడు. కావ్య మనసు ముక్కలు అయింది రాదని రుద్రాణి అంటుంది.

మరుసటి రోజు ఉదయం సీతారామయ్య, ఇందిరాదేవిలు కావ్య దగ్గరికి వస్తారు. ఇంటికి రమ్మని పిలుస్తారు నేను రాలేను. ఏ స్థానంలో రావాలి. భర్తకి తన మనసులో చోటు లేనప్పుడు నేను ఎలా వస్తానంటూ కావ్య డైరెక్ట్ గా చెప్తుంది. నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు అర్ధమవుతుంది వాడే వచ్చి నిన్ను క్షమించమని అడుగుతాడంటూ సీతారామయ్య, ఇందిరాదేవిలు వెళ్లిపోతారు. తరువాయి భాగంలో కావ్య దగ్గరకి రాజ్ వెళ్లి రమ్మని పిలిస్తాడు. రానని కావ్య అనగానే రాకుంటే కాళ్ళు పట్టుకొని తీసుకొని వెళ్తానని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.