English | Telugu

నబీల్ వన్ మ్యాన్ షో.. అటు హౌస్ మేట్స్, ఇటు ఆడియన్స్ ఫిధా!

బిగ్ బాస్ హౌస్ లో ఎవరి ఊహకి అందకుండా కంటెస్టెంట్స్ తమ పర్ఫామెన్స్ ఇస్తున్నారు. రోజులు గడిచేకొద్దీ ఒక్కో కంటెస్టెంట్ యొక్క నేచర్ బయటకొస్తుంది‌.‌ మొదట్లో గంభీరంగా, స్టిక్ట్ గా ఉన్న నిఖిల్ ఇప్పుడు సోనియా మాయలో పడిపోయాడు.

ఇక ఫస్ట్ టూ వీక్స్ అసలు నబీల్ ఉన్నాడో లేదా అనిపించింది కానీ ఎప్పుడైతే తనలో ఫైర్ లేదని , వాయిస్ వినిపించడం లేదని నామినేషన్ లో అన్నారో.. అప్పటి నుంటి నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నాడు. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్‌ లో నబీల్ హవా కొనసాగింది. బిగ్‌బాస్ గోల్డెన్ బ్యాండ్ అంటూ ఓ స్పెషల్ ఐటెమ్‌ను కంటెస్టెంట్లకి చూపించాడు. దానికి స్పెషల్ పవర్స్ ఉంటాయని చెప్పినా సరే కంటెస్టెంట్లు ఎవరూ తీసుకోలేదు. కానీ మణికంఠ మాత్రం తెలివిగా దాన్ని అందుకున్నాడు. అయితే మణికంఠ తీసుకున్న తర్వాతే దాని పవర్ ఏంటో అందరికీ అర్థమైంది. ఆ గోల్డెన్ బ్యాండ్‌తో ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇక ఆ తర్వాత కంటెస్టెంట్లు అందరూ వేరే సభ్యుల్ని ఇమిటేట్ చేస్తూ నటించమని చెప్పాడు. ఇందులో అందరికంటే నబీల్ మాత్రం ఇరగదీశాడు. ఆదిత్యను అద్భుతంగా ఇమిటేట్ చేశాడు.

ఇక పృథ్వీ, విష్ణుప్రియ లాగా నిఖిల్ అండ్ కిర్రాక్ సీత నటించారు. అలాగే మణికంఠ లాగా ప్రేరణ చక్కగా చేసింది. ఇక హౌస్ లో ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. కొన్ని సౌండ్స్ వినిపిస్తాయి వాటిని ఇరు టీమ్ లు గెస్ చేసి ఆర్డర్ లో రాయాలి. అందులో శక్తి టీమ్ కు రెండు పాయింట్లు, కాంతారా టీమ్ కి ఒక్క పాయింట్ వచ్చింది‌. ఇక ఈ టాస్క్ కి సంఛాలక్ గా నబీల్ ఉన్నాడు. ఇక‌ నిన్నటి ఎపిసోడ్ లో నబీల్ ది వన్ మ్యాన్ షో అని చెప్పాలి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.