English | Telugu

బిగ్ బాస్-8 లో ఎనిమిదో వారం ఎలిమినేషన్ ఎవరంటే!

బిగ్ బాస్ సీజన్-8 ఇప్పటికే ఏడు వారాలు పూర్తి చేసుకొని ఎనిమిదో వారం ఎండింగ్ కి వచ్చేసింది. శనివారం, ఆదివారం అనగానే ఎలిమినేషన్ గుర్తొస్తుంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్న క్యూరియాసిటి అందరిలో ఉంది. ఇప్పటికే హౌస్ నుండి ఏడుగురు బయటకు వచ్చేసారు. గత వారం గౌతమ్ లీస్ట్ లో ఉండగా అప్పటికే మణికంఠ నేను వెళ్ళిపోతా అని అనడంతో గౌతమ్ ని ఆపి మణికంఠని పంపించేశారు.

బిగ్ బాస్ లో కొన్ని ఎలిమినేషన్స్ అన్ ఫెయిర్ అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. ఈ వారం ఆరుగురు నామినేషన్ లో ఉండగా నిఖిల్ ఓటింగ్ లో మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే లీస్ట్ లో నయని పావని, మెహబూబ్ ఇద్దరు ఉన్నారు. ఇక ఈ వారం ఎలిమినేట్ అయ్యేది మెహబూబ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటి వరకు వైల్డ్ కార్డ్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా బయటకు వెళ్ళలేదు. వాళ్ళు ఎనిమిది మంది ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఉన్నారు.. ఓజీ వాళ్ళు ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు మాత్రమే ఉన్నారు. ఈ వారం రాయల్స్ నుండి మెహబూబ్ ఎలిమినేషన్ అనేది మొదటిది. ఈ వారం హౌస్ లో మెహబూబ్ ఆటతీరు బానే ఉన్నా బయటకు వచ్చేసాడంటే నామినేషన్ లో అందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండడమే కారణం. మరి ఎవరు ఎలిమినేషన్ అవుతారనేది తెలియాలంటే సండే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.