'బాహుబలి' భామకు కరోనా!
'టెంపర్'లో "ఇట్టాగే రెచ్చిపోదాం", 'బాహుబలి'లో "మనోహరీ" పాటలతో ఆకట్టుకున్న బాలీవుడ్ భామ నోరా ఫతేహి కరోనా వైరస్ బారిన పడింది. కొద్ది రోజులుగా ఒక్కొక్కరుగా సెలబ్రిటీలు కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అవుతూ వస్తున్నారు. కమల్ హాసన్, కరీనా కపూర్, మంచు మనోజ్, అర్జున్ కపూర్, తర్వాత ఇప్పుడు నోరా ఫతేహి టెస్టులో కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఆమె టీమ్ ఓ స్టేట్మెంట్ ద్వారా తెలియజేసింది.