English | Telugu
అందం, అభినయం, చలాకీతనం, సినిమా అంటే ప్యాషన్, డెడికేషన్, కష్టపడే మనస్తత్వం, వీటన్నింటికీ అదృష్టం
సినిమా హీరోయిన్ అవ్వాలంటే అదృష్టం ఉండాలి. అందులోను సినిమా ఉన్నాలేకపోయినా ప్రేక్షకులు తన గురించే ఆలోచిస్తు ఉండాలంటే పెట్టి పుట్టాలి. అతి తక్కువ మంది హీరోయిన్లకే అంతటి సినీ వరం లభిస్తుంది. ఆ జాబితాలో చేరిన అందాల భామ మృణాల్ ఠాకూర్(mrunal thakur) టూ డే టాక్ అఫ్ ది డే గా నిలిచింది.
'మిర్చి' వంటి సూపర్ హిట్ తో దర్శకుడిగా పరిచయమైన కొరటాల శివ.. ఆ తర్వాత అదే జోరుని కొనసాగిస్తూ 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'భరత్ అనే నేను' వంటి వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే దర్శకుడిగా ఆయనకు ఐదో సినిమా మాత్రం ఊహించని షాక్ ఇచ్చింది. అదే 2022 ఏప్రిల్ లో వచ్చిన 'ఆచార్య'.
కొన్ని లక్షల మంది అభిమానగణం ఇళయ దళపతి విజయ్ సొంతం.ఆయన చిటికేస్తే తమిళనాడు మొత్తం కదిలి వస్తుంది. అంతటి క్రేజ్ ని రాత్రికి రాత్రే సంపాదించలేదు. రెండున్నర దశాబ్దాల పై నుంచి ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తు వస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో హయ్యెస్ట్ పైడ్ రెమ్యునరేషన్ తీసుకునే మొదటి ఐదుగురులో కూడా ఒకడు.
మాస్ మహారాజ రవితేజ దొంగగా మారబోతున్నాడు. లేడీ పోలీస్ తో ప్రేమాయణం కూడా నడపబోతున్నాడు. అయితే ఇదంతా కూడా కె.వి. అనుదీప్ దర్శకత్వంలో చేయనున్న సినిమా కోసమే.
నరేష్ గారు మీరు అనవసరంగా తొందరపడ్డారు..వర్సటైల్ యాక్టర్ హోదాలో అలా మాట్లాడటం కరెక్ట్ కాదు.. అసలు మీరు పూర్తి వీడియోని చూడలేదు. ఇప్పుడు ఈ మాటలన్నీ సీనియర్ యాక్టర్ నరేష్ ని ఉద్దేశించి పవన్ ఫ్యాన్స్ చెప్తున్నారు. అసలు ఆయన ఏం మాట్లాడాడు.. పవన్ ఫ్యాన్స్ కి నరేష్ తో ఏం పని
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై అందరి దృష్టి నెలకొంది. ఈ ఎన్నికల్లో గెలిచేది ఎవరు? ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఎన్నికల సందడిలో.. వెండితెరపై ముఖ్యమంత్రులుగా అలరించిన తెలుగు హీరోలను ఒకసారి గుర్తు చేసుకుందాం.
తెలిసి చేసినా తెలియకుండా చేసినా తప్పు తప్పే. అందుకు తగ్గ శిక్ష కూడా అనుభవించాల్సిందే. పైగా సినిమా హీరోయిన్ అని చెప్పి డిస్కౌంట్ ఏమి ఉండదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ప్రముఖ నటి తమన్నా(Tamannaah)కి ఒక పెద్ద చిక్కొచ్చి పడింది. అదంతా ఆమె చేసుకున్నదే. మ్యాటర్ ఏంటో చూద్దాం
సినిమా వారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కొత్త కాదు. ఎందరో సినీ ప్రముఖులు రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పలువురు సినీ ప్రముఖులు రాజకీయాల్లో రాణిస్తున్నారు. మే 13న జరగనున్న ఎన్నికల బరిలో ఎందరో సినిమా వారు నిలిచారు. నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రోజా వంటి సినీ స్టార్స్ ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తూ మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరితో పాటు మరో సినీ స్టార్ కూడా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.
పుష్పలో ఎవడ్రా ఎవడ్రా నువ్వు కాల్చితే ఇనుమవుతాను అనే పాట ఒకటి ఉంటుంది. ఇప్పుడు అది సూపర్ స్టార్ మహేష్ బాబు( mahesh babu) కి పర్ఫెక్ట్ గా సూటవ్వుతుంది. పైగా అభిమానులు కూడా కాలర్ ఎగరేస్తున్నారు. కనపడ్డ ప్రతీ వారితో ఆ రెండు సినిమాలు సరిగా ఆడలేదని ఎవరు చెప్పారంటున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటో చూద్దాం
రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల లోపు బడ్జెట్ తో ఎందరో యంగ్ హీరోలు సినిమాలు చేస్తుంటారు. అలాంటిది ఓ హీరో నటిస్తున్న సినిమాలో కేవలం ఒక ఫైట్ సీన్ కే ఏకంగా రూ.8 కోట్లు బడ్జెట్ పెడితే ఆశ్చర్యం కలగకమానదు. యూత్ స్టార్ నితిన్ అప్ కమింగ్ మూవీ 'తమ్ముడు' కోసం ప్రముఖ నిర్మాత దిల్ రాజు అలాంటి రిస్కే చేస్తున్నట్లు తెలుస్తోంది.
స్మాల్.. బిగ్..వెరీ వెరీ బిగ్.. ఇలా ఎనీ మూవీ అవనీయండి..అప్ డేట్ చాలా ముఖ్యం..ఎంత కాలమైనా షూటింగ్ ని జరుపుకున్నా పర్లేదు. బట్ ప్రేక్షకులకి మాత్రం అప్ డేట్ ఇస్తూనే ఉండాలి. అప్పుడే సదరు మూవీ మీద ప్రేక్షకుల్లో ఆసక్తి కలుగుతుంది. ఈ విషయాన్ని డబుల్ ఇస్మార్ట్ టీం గుర్తుంచుకుందో లేదో తెలియదు.
ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. ఎన్నటికీ మాయని మమతా నీది నాది. ఈ లిరిక్ ఒక ఫేమస్ మూవీ లోనిది.రచయిత ఏ ముహూర్తాన ఆలోచించి రాశాడో గాని ఇప్పుడు రాజకీయాలకి సినిమాలకి అలాంటి పరిస్థితే వచ్చింది. ఇంకా చెప్పాలంటే సినిమాల్లోకి వచ్చేది రాజకీయాల కోసమే అనే పరిస్థితి కూడా ఉంది.
మొన్న కల్కి 2898 ఏడి(kalki 2898) నుంచి అమితాబ్ (amithab) క్యారక్టర్ అయిన అశ్వద్ధామకి సంబంధించిన చిన్నపాటి టీజర్ రిలీజ్అయ్యింది. దాంతో ప్రభాస్ (prabhas) క్యారక్టర్ ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ అందరిలో మొదలయ్యింది.
అసలే మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), దానికి తోడు మాస్ ని తన మ్యూజిక్ తో ఉర్రూతలూగించే అనిరుధ్. ఈ ఇద్దరూ కలిస్తే ఇంకేమైనా ఉందా. అందుకే 'దేవర'(Devara) సాంగ్స్ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే 'దేవర' నుంచి త్వరలోనే మాస్ జాతర చూడబోతున్నాం. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ కి ముహూర్తం ఖరారైందని సమాచారం.