English | Telugu

పెళ్ళయ్యాకా నా మొగుడు ఇచ్చినా అంతా హ్యాపీగా ఉండదేమో


కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ శనివారం షో ఫుల్ జోష్ గా కలర్ ఫుల్ గా సాగింది. ఈ వారం ఈ ఎపిసోడ్ ని లవ్ థీమ్ గా జరుపుకున్నారు. ఇందులో బాయ్స్ అండ్ గర్ల్స్ జంటలుగా వచ్చారు. అలాగే అబ్బాయిలు వాళ్లకు వచ్చిన ఫస్ట్ రెడ్ రోజా పూలను పుస్తకంలో దాచుకున్నారు అంటూ అనసూయ చెప్పింది. శ్రీముఖి కూడా అలాగే చేసింది అనేసరికి ఆమె ఒక ఇంటరెస్టింగ్ విషయాన్ని చెప్పింది. "భోళా శంకర్ మూవీ టైములో వాలెంటైన్స్ డే రోజున చిరంజీవి గారితో షూట్ చేస్తున్నాం. అందరూ షూట్ మూడ్ లో ఉంటే నేను మాత్రం చిరంజీవి గారి దగ్గరకు వెళ్లి హ్యాపీ వాలెంటైన్స్ డే అని చెప్పాను. నేను అలా చెప్పిన వెంటనే ఆయన ఒక క్రేజి లుక్ కూడా ఇచ్చారు.

షూటింగ్ ఐపోయాక ప్యాకప్ ఐపోయే టైంకి చిరంజీవి గారు నన్ను పిలిచి చాలా రెడ్ రోజెస్ ఇచ్చారు. అన్ని రెడ్ రోజెస్ ఇచ్చేసరికి ఐపాయ్ నా పని..అప్పుడు కీర్తి సురేష్ గారు కూడా అక్కడే ఉన్నారు. అదేంటండి నాకు ఇవ్వరా రెడ్ రోజెస్ అని అడిగారు చిరంజీవి గారిని. అప్పుడాయన శ్రీముఖి హ్యాపీ వాలెంటైన్స్ డే అని చెప్పింది. నువ్వు వచ్చి చెప్పావా శ్రీముఖి చెప్పింది అందుకే ఇచ్చాను అని చెప్పారు. అది బెస్ట్ మోమెంట్. నేను ఒక రోజ్ ని నా బుక్ లో పెట్టుకున్నా. నాకు తెలిసి నాకు పెళ్ళయాక నా మొగుడు రెడ్ రోజెస్ ఇచ్చినా కానీ అంత హ్యాపీనెస్ ఉండదేమో..." అని శ్రీముఖి చెప్తుండగా మధ్యలో విష్ణు ప్రియా వచ్చి "అరే వాడు అసలు రాడు. నువ్వు ఈ విషయం చెప్తే వచ్చేవాడు కూడా రాడు" అని కౌంటర్ ఇచ్చింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో పృద్వి విష్ణుప్రియాను ఎత్తుకుని వచ్చాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.