English | Telugu

గతం గుర్తుందా తేజు...మగాళ్ళన్నాక ఆడవాళ్ళనే కదరా చూసేది

ఆదివారం విత్ స్టార్ మా పరివారం లీగ్ తో ఈ షో ప్రోమో చాలా ఫన్నీగా ఉంది. ఈ ఎపిసోడ్ కి నిఖిల్, అలీ రెజా, రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత, తేజస్విని గౌడ, శోభా శెట్టి, ఐశ్వర్య పిస్సే, దీపికా రంగరాజు ఇంకా కొంతమంది బుల్లితెర స్టార్స్ వచ్చారు. ఇక నిఖిల్ ఈ షోకి నల్ల కళ్ళజోడు పెట్టుకుని వచ్చాడు. అది చూసి హరి చాలా ఫీలయ్యాడు. "ఈయన్ని కళ్ళజోడు తియ్యమని చెప్పండి. కేవలం అమ్మాయిలనే చూస్తున్నాడు" అన్నాడు. "మగాళ్ళన్నాక ఆడవాళ్ళనే కదరా చూసేది " అని శ్రీముఖి ఆన్సర్ ఇవ్వడంతో అందరూ నవ్వేశారు. తర్వాత నిఖిల్ వెళ్లి తేజుతో డాన్స్ చేయడాన్ని తట్టుకోలేకపోయాడు హరి. "పాయింట్ పోయింది కాక సిగ్గులేకుండా డాన్స్ వేస్తున్నాడు నిఖిల్" అనేశాడు. "ఆయన జీవితంలోంచి ఒకావిడా వెళ్ళిపోయాక మీరే ఎక్కువగా ఆయన మీద కన్నేసినట్టు ఉన్నారు" అంటూ హరి మీద కౌంటర్ డైలాగ్ వేసింది శ్రీముఖి.

"అరే ఎం కావాలో చెప్పు నీకు" అని నిఖిల్ అడిగేసరికి "నువ్వే కావాలి" అన్నాడు అవినాష్. "ఒక్క పాయింట్ రాలేదు కానీ చూడు కాలు మీద కాలేసుకుని కూర్చున్నారు" అన్నాడు హరి. "నిఖిల్ అండ్ అలీ మీరు కాలేసుకోవడం ఆయనకు నచ్చట్లేదు ఆయన మీద కాలేయాలని ఆయన కోరుకుంటున్నారు" అని శ్రీముఖి చెప్పేసరికి ఒక్కసారిగా హరి షాకయ్యాడు. తర్వాత వీళ్ళతో గేమ్స్ ఆడించింది శ్రీముఖి. ఇందులో తేజుకు బాల్ వచ్చి గట్టిగా తగిలేసరికి గతం మర్చిపోయిందేమో అంటూ శ్రీముఖి పలకరించింది. "నీకు పెళ్లి ఎవరితో అయ్యింది" అని అడిగేసరికి అమరదీప్ తో అని చెప్పింది తేజు. ఇలా ఈ ఆదివారం ఈ ఎపిసోడ్ అందరినీ అలరించబోతోంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.