English | Telugu

న‌య‌ని - విశాల్ తీసిన‌ పెట్టెను వ‌ల్ల‌భ బ‌ద్ద‌లు కొట్టాడా?  

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `త్రిన‌య‌ని`. గ‌త కొన్ని వారాలుగా జీ తెలుగులో ప్ర‌సారం అవుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా రూపొందినీ సీరియ‌ల్ గ‌త వారం రోజులుగా చిత్ర విచిత్ర‌మైన ట్విస్ట్ లు, మ‌లుపుల‌తో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. అషికా గోపాల్‌, చందూ గౌడ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో ప‌విత్ర జ‌య‌రామ్‌, నిహారిక హ‌ర్షు, విష్ణు ప్రియ‌, శ్రీ‌స‌త్య‌, భావ‌నా రెడ్డి, సురేష్ చంద్ర‌, అనిల్ చౌద‌రి, ద్వార‌కేష్ నాయుడు త‌దిత‌రులు న‌టించారు. బుధ‌వారం ఎపిసోడ్ ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌నుందో చూద్దాం.

న‌య‌ని - విశాల్ ల‌కు ల‌భించిన పురాత‌న పెట్టెలో ఏముందో తెలుసుకోవాల‌న్న కుట్ర‌కు తిలోత్త‌మ, క‌సి, వ‌ల్ల‌భ‌ తెర‌లేపుతారు. ఇందుకు న‌య‌ని చెల్లి సుమ‌న‌ని పావుగా వాడుకోవాల‌ని ప‌థ‌కం వేస్తారు. విక్రాంత్ లేని స‌మ‌యం చూసి త‌న‌ని న‌య‌ని ఇంటికి పంపిస్తారు. అయితే విక్రాంత్ కూడా అక్క‌డికే వెళ్లిపోతాడు. భోజ‌నం చేసి అంతా ప‌డుతున్నాక తిలోత్త‌మ చెప్పిన‌ట్టు ఆ పెట్టెలో ఏముందో తెలుసుకోవాల‌ని దొంగ‌లా సుమ‌న ప్ర‌య‌త్నాలు చేస్తుంది. ఈ విష‌యం ప‌సిగ‌ట్టిన విక్రాంత్ "దొంగ దొంగ" అంటూ అర‌వ‌డంతో న‌య‌ని - విశాల్ మేలుకుంటారు.

లైట్ వేసి చూస్తే సుమ‌న వుండ‌దు.. ఎక్క‌డి వెళ్లిందా అని వెతుకుతుంటే ఎక్క‌డ దొరికి పోతానో అని వెంట‌నే న‌య‌ని వున్న గ‌దిలోకి వ‌చ్చేస్తుంది సుమ‌న‌. వాష్ రూమ్ కి వెళ్లాన‌ని.. ఇంత‌లోనే గోల చేస్తున్నారంటుంది. ఇక తెల్లారాక తిలోత్త‌మ.. సుమ‌న‌కు ఫోన్ చేసి "ఏం చేశావ్‌.. పెట్టెలో ఏముంది?" అంటూ అడ‌గ‌డం మొద‌లు పెడుతుంది. ఇంత‌లో ఆ ఫోన్ విక్రాంత్ తీసుకుని తల్లి తిలోత్త‌మ మాట‌లు వింటాడు. ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రుగుతుంది.

క‌ట్ చేస్తే... తిలోత్త‌మ, క‌సి, వ‌ల్ల‌భ‌, ధురంద‌ర‌, హాసిని అంతా క‌ల‌సి న‌య‌ని ఇంటికి వ‌స్తారు. దాచిన పెట్టెలో మాకూ భాగం ఇవ్వాల్సిందే అంటూ గొడ‌వ‌కు దిగుతారు.. దీంతో న‌య‌ని తెలివిగా త‌న‌కు ప‌రిచ‌యం వున్న ఎస్.ఐ. కి ఫోన్ చేసి విష‌యం చెబుతుంది.. వెంట‌నే స్పాట్ కు వ‌చ్చిన ఎస్.ఐ. ఏం చేశాడు?.. వ‌ల్ల‌భ పెట్టెను బ‌ద్ద‌లు కొట్టాడా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.