English | Telugu

పలువురు సినిమా వాళ్ల ఆస్తుల జప్తు! బాలకృష్ణ హీరోయిన్ కూడా 

పలువురు సినీ తారలు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ప్రముఖ ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్‌ఫామ్  'వన్‌ ఎక్స్‌బెట్‌' కి ప్రమోటర్లు గా ఉన్నారు. వీరిలో సోను సూద్(Sonu Sood),ప్రముఖ హీరోయిన్, డాకు మహారాజ్ ఫేమ్ ఊర్వశి రౌతేలా(Urvashi Rautela)బెంగాలీ నటుడు అంకుష్ హజ్రాతో పాటు, కొంత మంది అగ్రశ్రేణి క్రికెట్ ప్లేయర్స్, పలువురు రాజకీయనాయకులు కూడా ఉన్నారు. వన్‌ ఎక్స్‌బెట్‌ ద్వారా వచ్చిన డబ్బుతో కొంత మంది భారత్‌తో పాటు విదేశాల్లోను ఆస్తులని కొనుగోలు చేసారని, ప్రముఖ దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ డైరెక్టరేట్(ఈడి) తమ విచారణలో గుర్తించింది. 

ఓజి నిర్మాతపై క్రిమినల్ కేసు.. డబ్బులు వెనక్కి ఇస్తారా!

ఓజి(OG)కి తెలంగాణ(Telangana)రాష్ట్ర ప్రభుత్వం టికెట్ల పెంపుకి పర్మిషన్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తు ప్రముఖ అడ్వకేట్ మల్లేష్ యాదవ్  హైకోర్టు లో పిటిషన్ వెయ్యడం తెలిసిన విషయమే.ఈ విషయంలో రీసెంట్ గా మల్లేష్ యాదవ్ మాట్లాడుతు తెలంగాణ హైకోర్ట్ ఇరవై ఐదవ తారీకు మధ్యాహ్నం నుంచే 'ఓజి' టికెట్ రేట్స్ తగ్గించాలని ఉత్తర్వులు జారీచేసింది. కానీ ఓజి ని నిర్మించిన డివివి ఎంటర్ టైన్ మెంట్స్ రేట్లు తగ్గించలేదు.  ఈ విషయంలో పోరాడుతున్న నాపై సదరు సంస్థ వాళ్ళు సోషల్ మీడియా వేదికగా   ట్రోల్స్ చేస్తు వస్తున్నారు. పైగా కోర్ట్ ఉత్తర్వులని పాటించకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది.