పలువురు సినిమా వాళ్ల ఆస్తుల జప్తు! బాలకృష్ణ హీరోయిన్ కూడా
పలువురు సినీ తారలు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ప్రముఖ ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్ఫామ్ 'వన్ ఎక్స్బెట్' కి ప్రమోటర్లు గా ఉన్నారు. వీరిలో సోను సూద్(Sonu Sood),ప్రముఖ హీరోయిన్, డాకు మహారాజ్ ఫేమ్ ఊర్వశి రౌతేలా(Urvashi Rautela)బెంగాలీ నటుడు అంకుష్ హజ్రాతో పాటు, కొంత మంది అగ్రశ్రేణి క్రికెట్ ప్లేయర్స్, పలువురు రాజకీయనాయకులు కూడా ఉన్నారు. వన్ ఎక్స్బెట్ ద్వారా వచ్చిన డబ్బుతో కొంత మంది భారత్తో పాటు విదేశాల్లోను ఆస్తులని కొనుగోలు చేసారని, ప్రముఖ దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ డైరెక్టరేట్(ఈడి) తమ విచారణలో గుర్తించింది.