Jayam Serial : వీరు మాటలకి బెదిరిపోయిన విభూది బాబా.. అతను చెప్పిందే చెప్తాడా!
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -173 లో... గంగకి రుద్ర పిజ్జా తీసుకుంటాడు. వాళ్ళ వెనకాలే వీరు ఫాలో అవుతాడు. వీళ్ళు ఏంటి ఇలా బేకరీల చుట్టూ తిరుగుతున్నారని వీరు అనుకుంటాడు. అ తర్వాత గంగ, రుద్ర కలిసి లక్ష్మీ చెప్పిన బాబా దగ్గరికి వెళ్తారు. గంగ జరిగింది మొత్తం బాబాకి చెప్తుంది. మీకు నరగోశ ఉంది.. ఇల్లు వాతావరణం చూసి మాట్లాడాలి.. అడ్రెస్ మా వాళ్ళకి ఇచ్చి వెళ్ళండి అని బాబా అంటాడు. అదంతా వీరు వింటాడు. గంగ, రుద్ర వాళ్ళు వెళ్ళిపోయాక బాబా దగ్గరికి వస్తాడు వీరు.