English | Telugu

ములక్కాడ తిను నీ కళ్ళు బయటికొస్తాయి..

స్టార్ మాలో రీసెంట్ గా "కూకు విత్ జాతిరత్నాలు" పేరుతో ఒక కుకింగ్ షో స్టార్ట్ అయ్యింది. ఇక ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ప్రతీ శని, ఆదివారాల్లో ఈ షో ప్రసారమవుతుంది. లేటెస్ట్ ప్రోమోలో దీక్ష పంత్ చేసిన కామెంట్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి. "మీకు అసలు సిసలైన ఫుల్ మీల్స్ ని రెడీ చేసాం" అన్నాడు ప్రదీప్. రాగానే జడ్జ్ ఆశిష్ విద్యార్థి రాధా మీద మంచి కామెంట్ చేసాడు. "ప్రదీప్ వండర్స్ ఎన్ని" అనేసరికి సెవెన్ అన్నాడు కాదు ఎయిట్ అది రాధమ్మ స్మైల్ ప్రదీప్ అనేసరికి రాధ పగలబడి నవ్వేసింది. ఇక కిచెన్ రూకీస్ పేరుతో అవినాష్, దీక్ష పంత్, విష్ణు ప్రియా, బిత్తిరి సత్తి, ఆర్జే హేమంత్ వచ్చారు. "జడ్జెస్ మీరు దీక్ష గారు గుర్తు ఉన్నారు కదా షో లాంచ్ లో మంచి టిప్స్ ఇచ్చారు" అన్నాడు. "గోంగూర తింటే గోల్స్ రీచ్ అవుతారు" అని చెప్పింది దీక్ష. "ఈవిడ ఆ టిప్ చెప్పాక గోంగూరకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది సర్" అన్నాడు ప్రదీప్. "నాకు తెలుసు ప్రదీప్" అంది.

బిగ్ బాస్ షో పై రాజా రవీంద్ర కామెంట్స్

కాకమ్మ కథలు షో ఫినాలే ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి నవీన్ చంద్ర, రాజా రవీంద్ర వచ్చారు. ఇక వీళ్ళ మధ్య నడిచిన కాన్వర్జేషన్ మరీ డబుల్ మీనింగ్ గా సాగింది. "నవీన్ చంద్ర మీరు అనవసరంగా రాజా రవీంద్రతో రావాల్సి వచ్చినందుకు సో సారీ..సీజన్ 3 లో మళ్ళీ పిలుస్తాను" అని చెప్పింది. ఇక రాజా రవీంద్రతో ఎం అన్నదంటే "రాజా రవీంద్రను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కానీ నాకు ఆయన షేడ్స్ అర్ధం కావడం లేదు. ఒక మనిషిని చూస్తే ఆయన ఈ రోల్ అయ్యుంటుంది అని మనం అనుకుంటాం. మీరు ఏ రోల్ చేసినా అలాగే ఉండదు" అంది తేజు. "జనాలు నన్ను ఒక ఇమేజ్ లో చూస్తారుగా క్యారెక్టర్ లో అది ఉండదు. "మనిద్దరం కలిసి ఒక సినిమా చేసాం ఐతే క్యారవాన్ లోంచి నువ్వు బయటకు రాలేదు." అని రాజా రవీంద్ర అనేసరికి "మీరు క్యారవాన్ రాలేదా ఐతే" అని కౌంటర్ వేసింది తేజు. "సోషల్ మీడియా లేక ముందు మీరే సోషల్ మీడియా మీకు గుర్తుందా " అని అడిగింది తేజు. దానికి రాజా రవీంద్ర పడీ పడీ నవ్వేసాడు.

అరేయ్ చూడండిరా...కీర్తి సురేష్ గారు నన్ను పొగిడారు..

సుహాస్ బిగ్ స్క్రీన్ మీద ఆచి తూచి మంచి మూవీస్ చేస్తూ ఉంటాడు. ఆయన చేసే మూవీస్ తో ఇండస్ట్రీకి ఒక ప్రామిసింగ్ హీరోగా మారిపోయాడు. కలర్ ఫోటో, ప్రసన్న వదనం, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఇలాంటి ఆడియన్స్ కి నచ్చే ఎన్నో మూవీస్ చేసాడు. ఐతే సుహాస్ మీద ఇంత వరకు నెగటివ్ ట్రోలింగ్ అనేది ఆడియన్స్ నుంచి ఎప్పుడూ ఎదురుకాలేదు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రమే తిడుతూ ఉంటారట. ఇక రీసెంట్ కీర్తి సురేష్, సుహాస్ సుమ చాట్ షోకి వచ్చారు. "పవన్ కళ్యాణ్ , ప్రభాస్ అవకాశం వస్తే వీళ్లల్లో ఎవరితో డైరెక్షన్ చేస్తారు" అని సుమ అడిగింది.  "వామ్మో నేను అంత రిస్క్ చేయలేను, టెన్షన్ పడలేను..డైరెక్షన్ మానేసి ఇంటికి వెళ్ళిపోతాను. నేను నిజంగా డైరెక్షన్ చేస్తే నాని అన్నతో చేస్తాను. డైరెక్షన్ అవ్వాలని ఉంది.

మహానటి మూవీకి నో చెప్పాను...ఎందుకంటే

మహానటి సావిత్రి బియోగ్రఫీతో వచ్చిన మూవీ "మహానటి". అందులో కీర్తి సురేష్ అచ్చం సావిత్రిలానే నటించింది. నటించింది అనడం కంటే జీవించింది అంటే బాగుంటుంది. ఐతే ఈ మూవీ కోసం కీర్తి సురేష్ ని అప్ప్రోచ్ ఐతే నో చెప్పిందట. ఐతే ఎందుకు నో చెప్పిందో కూడా రీసెంట్ గా రిలీజ్ ఐన "చాట్ షో విత్ సుమ" ఎపిసోడ్ లో చెప్పింది. మహానటి మూవీ మొదట్లో చేయకూడదు అనుకున్నారా "అవును.. నేను ఈ మూవీకి మొదట్లో నో చెప్పాను. ఎందుకంటే అంత పెద్ద క్యారెక్టర్ ని మెప్పించగలనా అనిపించింది. ఆడియన్స్ ని నా వైపు తిప్పుకోగలనా..నేను ఏదైనా చేశా అంత మహానటి సావిత్రి గారి పేరును చెడగొడతానేమో అని భయం. కానీ నాగి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మీరు చేస్తారు కచ్చితంగా అటూ నన్ను మోటివేట్ చేశారు. వేరెవరో నా మీద అంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు నేనెందుకు సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా ఉండకూడదు అనిపించింది.

సూపర్ మాన్ గా ఊహించుకుంటూ ఉంటాను.. ఆర్మీలో కానీ పోలీస్ ఫోర్స్ లో కానీ ఉండేవాడిని

మంచు విష్ణు హీరోగా రీసెంట్ గా కన్నప్ప మూవీ రిలీజ్ అయ్యింది. ఈ మూవీ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. మంచు విష్ణు, మోహన్ బాబు నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఐతే విష్ణు ఒక ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసాడు. అందులో ఇలాంటి ఇంటరెస్టింగ్ ఆన్సర్స్ చెప్పాడు. "మీకు సౌత్ ఇండియన్ డిషెస్ లో ఏది ఇష్టం" అనడంతో "దోస" అన్నాడు.  "ప్రజలు మీ గురించి అనుకునే ఏ విషయం కరెక్ట్ కాదు అని మీరు అనుకుంటారు" అన్నారు.  "ప్రజలు నన్ను గుడ్ పర్సన్  అనుకుంటారు" అనేసరికి  "అంటే మీరు గుడ్ పర్సన్ కాదా" అని రివర్స్ లో మళ్ళీ అడిగారు.  "నేను గుడ్ పర్సన్ నీ కానీ డర్టీ మైండ్ నాది " అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. "సండే వస్తే మంచు వారి ఇంట్లో బ్రన్చ్ ఎలా ఉంటుంది" అని అడగడంతో  "లైక్ రెస్టారెంట్ లా ఉంటుంది" అని చెప్పాడు. " ఇంట్లో ఆర్గుమెంట్స్ జరిగినప్పుడు ఎవరు గెలుస్తారు..నిజం చెప్పండి" అని అడిగారు.

Brahmamudi: సిద్దార్థ్, కావ్యల మధ్య వార్.. అది యామిని స్కెచ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి (Brahmamudi)'. ఈ  సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-761 లో..  కావ్య, ఇందిరాదేవి మాట్లాడుకుంటారు. నిజంగానే నీకు అంత కోరిక ఉందంటే రాజ్ రాగానే వాడు ఐ లవ్యూ చెప్పగానే నువ్వు కూడా ఐ లవ్యూ టూ అని చెప్పెయ్.. అప్పుడు నమ్ముతామని కావ్యతో ఇందిరాదేవి అంటుంది.  అలాగే చెబుతాను నాకేమైనా భయమా అమ్మమ్మగారు అని కావ్య అంటుంది. నీకేం భయం లేదు చెల్లి.. నువ్వు ఎక్కడ చివరి నిమిషంలో జారుకుంటావో అన్నదే మా అందరి భయం అని స్వప్న అంటుంది. ఇంతలో రాజ్ కారు వచ్చి ఆగుతుంది. అదిగో నా మనవడు వచ్చాడు.. రెడీగా ఉండు కావ్యా అని ఇందిరాదేవి అంటుంది. అంతా చూస్తున్న రుద్రాణీ మనసులో.. ఇది అయ్యే పని కాదులే.. యామినీ ఏదో స్కెచ్ వేసే ఉంటుందని అనుకుంటుంది. ఇక రాజ్ వచ్చి కావ్యకు హాయ్ చెప్పడం.. నిన్న వెళ్లిపోవడం గురించి కావ్య.. రాజ్‌కి సారీ చెప్పడం పూర్తి అయిన తర్వాత.. కళావతి గారు మనం బయటికి వెళ్దామా అని రాజ్ అంటాడు. రేయ్ బయటికి వెళ్లే పనులేం వద్దు.. ఇక్కడే ఇక్కడే ఆ మూడు ముక్కలు(ఐ లవ్ యూ) చెప్పెయ్.. మీరు బయటికి వెళ్తుంటే విషయం చెప్పడానికి వీలు కావట్లేదు కదా అని ఇందిరాదేవి అంటుంది. దాంతో సరే అని రాజ్ స్టార్ట్ చేస్తాడు.

Illu illalu pillalu: శ్రీవల్లి చేసిన పనికి నర్మద, సాగర్ బుక్ అవుతారా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్- 198 లో.. భాగ్యం, శ్రీవల్లి మాట్లాడుకుంటారు. అమ్మడూ ఊరకే కంగారు పడకు.. బ్యాంక్‌లో బంగారం తాకట్టు పెట్టేటప్పుడు మాత్రమే ఒరిజినలా కాదా అని చెక్ చేస్తారు.. అంతే తప్ప దాచుకోవడానికి, లాకర్‌లో పెట్టేటప్పుడు కాదని శ్రీవల్లితో భాగ్యం అంటుంది భాగ్యం. బతికించావే అమ్మా.. ఎక్కడ మన బండారం భయపడి చచ్చానే అమ్మా అని శ్రీవల్లి అంటుంది. బ్యాంక్ వాళ్లు చెక్ చేయరు కదా అని అజాగ్రత్తగా ఉండకు.. వాటిని ఎవరైనా పరిశీలనగా చూస్తే అవి రోల్డ్ గోల్డ్ అని కనిపెట్టే ప్రమాదం ఉంది.. కాబట్టి వాటిని ఎవరూ చూడకుండా మూటగట్టి ఇచ్చేయ్ అని భాగ్యం అంటుంది‌. ఇంతలో వేదవతి పిలివడంతో.. సరేనమ్మా అంటూ నగల్ని మూటకట్టేస్తుంది శ్రీవల్లి.

Karthika Deepam2: శ్రీధర్ లో మార్పు.. కాంచన కాళ్ళపై పడి మరీ ఏడ్చాడుగా! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2(Karthika Deepam2)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-397 లో..  మనసుకి తగిలిన గాయాలకు మాటలు సరిపోతాయేమో కానీ ఒంటికి తగిలిన గాయాలకు మాత్రలు కావాలి. నేను నీకు అవసరం లేకపోవచ్చు. ఇప్పుడు ఇది నీకు అవసరం వేసుకోమంటూ కాంచనకి శ్రీధర్ ఇస్తాడు. దాంతో కాంచన టాబ్లెట్ తీసుకుని వేసుకుంటుంది. మనసుకి గాయాలను ఎప్పటికీ మందులుండవుగా అని కాంచన అంటుంది. నీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోవచ్చు కానీ నీ మీద నేను చూపించే ప్రేమ అయితే నిజం కాంచనా అని ఎమోషనల్ గా శ్రీధర్ చెప్తాడు. ఇంతలో అనసూయ వచ్చి మీరెందుకు వచ్చారని శ్రీధర్ ని అడుగుతుంది. నా భార్య కోసం వచ్చానని శ్రీధర్ అంటాడు. అయితే మీరు రాంగ్ అడ్రస్‌కి వచ్చారు మాస్టారు అంటూ కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. కార్తీక్ వెనుకే దీప కూడా ఉంటుంది.

బిగ్ బాస్ నుంచి ఈ ఇయర్ ఆఫర్ వచ్చింది.. కానీ కిల్లర్ మూవీ మీదనే దృష్టంతా

గుప్పెడంత మనసు సీరియల్ హీరో రిషి వాళ్ళ అమ్మ రోల్ లో నటించిన జగతి మేడం అంటే అందరికీ తెలుసు. ఆమె అసలు పేరు జ్యోతి పూర్వాజ్. ఐతే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 త్వరలో ఆడియన్స్ ముందు రాబోతోంది. ఐతే హౌస్ లోకి కంటెస్టెంట్స్ కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. అలాగే చాల మంది పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు జ్యోతి పూర్వాజ్ కూడా బిగ్ బాస్ లోకి వెళ్లబోతోందా..అనే టాక్ నడుస్తోంది. ఆమె బిగ్ బాస్ కి వస్తే టిఆర్పిలు బద్దలైపోతాయి అనే చర్చ కూడా నడుస్తోంది. జ్యోతి ఇటు తెలుగులో అటు కన్నడలో సీరియల్స్, మూవీస్ లో నటిస్తోంది.

"జయమ్ము నిశ్చయమ్మురా" అంటున్న శుభలగ్నం హీరో..జీ తెలుగులో త్వరలో న్యూ షో

ఒకప్పుడు లేడీ ఫాలోయింగ్ ఉన్న హీరో జగపతి బాబు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. జగపతి బాబు అంటే గుర్తొచ్చే ఒకే ఒక్క సినిమా "శుభలగ్నం". ఆయన కెరీర్ ని మార్చేసిన మూవీ. అలాంటి జగపతి బాబు ఇప్పుడు బుల్లితెర మీద కనిపించబోతున్నారు. "జయమ్ము నిశ్చయమ్మురా" అనే ఒక కొత్త టాక్  షో ద్వారా హోస్ట్ గా రాబోతున్నారు.."జ్ఞాపకం దాని విలువ ఒక జీవితం..అన్నీ నేరుగా చెప్పుకోలేక అమ్మకు రాసిన ఉత్తరం. నాన్న కంట పడకుండా గడిపిన బాల్యం. ఆట కోసమే బతికిన రోజులు..అమ్మా నాన్న కోసమే చదువుకున్న క్షణాలు..అలవాటుగా మారిన అల్లరి పనులు..అన్నీ ఉన్నా కూడా చేసిన చిన్ని చిన్ని దొంగతనాలు.

బిగ్ బాస్ 9 లోకి రాజ్ తరుణ్, ఇమ్మానుయేల్

బిగ్ బాస్ సీజన్ 9 త్వరలో స్టార్ట్ కాబోతోంది. ఈ షో ప్రోమోలు కూడా వస్తున్నాయి. ఐతే హౌస్ లోకి వెళ్లే వాళ్ళ లిస్ట్  మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఐతే సోషల్ మీడియాలో లో వేళ్ళు వెళ్లొచ్చు, వాళ్ళు వెళ్లొచ్చు అంటూ కొన్ని గాసిప్స్ నడుస్తున్నాయి. ఐతే రీసెంట్ గా జబర్దస్త్ కమెడియన్  ఇమ్మానుయేల్ అలాగే హీరో రాజ్ తరుణ్ వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇమ్మానుయేల్ బిగ్ బాస్ కి వెళ్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఇమ్ము జర్నీ జబర్దస్త్ లో కమెడియన్ నుంచి టీమ్ లీడర్ అయ్యాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి వస్తున్నాడు అలాగే కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలో కెప్టెన్ కూడా అయ్యాడు. అతని ఇన్స్పైరింగ్ జర్నీ కాబట్టి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. ఇక రాజ్ తరుణ్ విషయానికి వస్తే హీరోగా కొన్ని సినిమాలు చేసి ప్రామిసింగ్ యాక్టర్ అనిపించుకున్నాడు.