English | Telugu

ఢీ సీజన్ 20 త్వరలో

బుల్లితెర మీద ఫేమస్ ఢీ డాన్స్ షో సీజన్ 20 త్వరలో మొదలుకాబోతోంది. ఐతే  ప్రముఖ డ్యాన్స్ షో ‘ఢీ’ కొత్త సీజన్ మొదలవ్వనుంది. ఈ కొత్త సీజన్ కి కూడా యాంకర్ గా నందు వచ్చాడు. ఐతే జడ్జెస్ గా విజయ్ బిన్నీ మాష్టర్ రాగా లేడీ జడ్జ్ గా రెజీనా కసాండ్ర రాబోతోంది. తాజాగా ఈ ఢీ న్యూ సీజన్ గ్రాండ్ లాంచో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్స్ ప్రతీ బుధవారం, గురువారం రాత్రి 9 .30 కి ప్రసారం కాబోతోంది. ఇక ఢీ హిస్టరీలో కొన్ని మైల్ స్టోన్స్ ఉండబోతున్నాయన్న విషయం తెలుస్తోంది. పల్సర్ బైక్ ఝాన్సీ, మణికంఠ, జానూ లిరి, అభి మాష్టర్, సుస్మిత ఆనాల, జతిన్, రాజు, పండు మాష్టర్, భూమిక, అన్షు రెడ్డి ఉండబోతున్నారు. అలాగే శ్రీవాణి కూతురు రాజనందిని కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేయబోతోంది. విక్రమాదిత్య వచ్చి కూతురి కాళ్లకు నల్ల తాడు కట్టాడు. జాను లిరి వాళ్ళ అబ్బాయి కూడా స్టేజి మీదకు వచ్చాడు.

Karthika Deepam2 : దీప చేసిన వంటలన్నీ తిన్న సుమిత్ర.. పందెంలో  గెలిచిందెవరంటే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -388 లో.... సుమిత్రని అమ్మగారు అని శౌర్య పిలవడంతో సుమిత్రకి కోపం వస్తుంది. దీప దగ్గరికి వచ్చి ఎందుకు చిన్నపిల్లని పాడుచేస్తున్నావ్.. నీ మీద కోపం తన మీద కాదు.. అయినా నేను భోజనం చెయ్యలేదని దానికేల తెలుసని సుమిత్ర అడుగుతుంది. అంటే ఇంట్లో అనుకుంటుంటే విన్నదని దీప అంటుంది. అయితే ఇంట్లో కూడా నన్ను చెడ్డదాన్ని చేస్తున్నావన్న మాట.. నీతో ఏ బంధం లేదు కానీ దానితో ఒక బంధం ఉందని దీపతో సుమిత్ర అనగానే దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది.

జబర్దస్త్ వర్ష కన్నీళ్లు..బావ చనిపోయాడంటూ ఎమోషనల్

జీవితాలు పైకి కనిపించనంత అందంగా ఎవరివీ ఉండవు. ఏదో ఒక రూపంలో ప్రతీ మనిషీ బాధపడుతూనే ఉంటాడు ఇక బుల్లితెర మీద ఉండేవాళ్లు జీవితాల్లోనూ ఎన్నో విషాదాలు ఉంటాయి. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో జబర్దస్త్ వర్ష తన జీవితంలో జరిగిన సంఘటన చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది.  "రీసెంట్ నా లైఫ్ లో ఒక ఇష్యూ జరిగింది. ఏ సోషల్ మీడియాలో కూడా చెప్పలేదు. మనకు మనుషులు అనేవాళ్ళు చాలా అవసరం. మా అక్క ఏదో అడిగింది అని మా బావగారు షాప్ కి వెళ్లారు. బావగారు షాప్ కి వెళ్లి రోడ్డు దాటుతుంటే ఒక బైక్ గుద్దేసింది. బైక్ డాష్ ఇచ్చిందంటే మాములుగా దెబ్బలు తగులుతాయి. ఇంతలో మా అక్కకు ఫోన్ వచ్చింది. బావగారిని బైక్ గుద్దేసింది అని. ఇదేంటి ఇప్పుడే కదా మా ఆయన వెళ్లారు ఎం జరిగింది అనేసరికి హాస్పిటల్ కి రమ్మన్నారు. అక్కడికి వెళ్లేసరికి మా బావగారు చనిపోయి ఉన్నారు. మా బావగారు చనిపోయిన దగ్గర నుంచి అక్క డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది.

అల్లు అర్జున్ ని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేస్తా

భానుశ్రీ బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తూ అలరిస్తూ ఉంటుంది. బాహుబలి మూవీలో తమన్నాతో కలిసి చేసింది. బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా వెళ్ళింది. అలాంటి భానుశ్రీ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకి వచ్చింది. భానుశ్రీకి స్వయంవరం పెడితే ఎవరెవరు ఉండాలనుకుంటుంది అంటూ హోస్ట్ అడిగేసరికి ఎవరైనా ఉండొచ్చా అంది..ఎవరైనా అంది హోస్ట్. బిగ్ స్క్రీన్ మీద రణ్వీర్ కపూర్, విజయ్ దేవరకొండ అని చెప్పేసరికి టీవీలో చెప్పు అంది. "టీవీలో అంత అందగాళ్ళు లేరే..నా పక్కన నిలబడేంత స్టేటస్ ఉన్నవాళ్లు ఎవరూ లేరు. " అంది భాను. "టీవీలో మా హైపర్ ఆది ఎంత అందంగా ఉంటాడు" అంది హోస్ట్. "నా కటౌట్ నా హాట్ చూసి మాట్లాడు" అంది భాను. "నిఖిల్ ఉన్నాడు" అని హోస్ట్ అంది. 'ఆయనకు లాస్ట్ టైం బ్రేకప్ అయ్యిందట" అని భాను చెప్పింది.

అమరదీప్ కి డెబ్జానీ అంటే ఇష్టం

కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ లాస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో అమరదీప్ చేసిన పనికి అందరూ షాకయ్యారు. అమరదీప్ కి రవితేజ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. ఐతే ఈ షో గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఐతే అమరదీప్ కి రవితేజ అంటే ఎంత ఇష్టమో తెలిసిన విషయమే. హెయిర్ స్టైల్ కానీ టోటల్ ఆటిట్యూడ్ కానీ అంతా కూడా రవితేజనే ఫాలో అవుతూ ఉంటాడు. ఐతే అమరదీప్ కి డెబ్జానీ అంటే ఇష్టం ఈ షోలో ఈమెతో పరాచికాలు ఆడుతూ ఉంటాడు. ఆమె కూడా సరదాగా కౌంటర్లు ఇస్తూ ఉంటుంది. ఈ న్యూ ప్రోమోలో అమరదీప్, డెబ్జానీ ఇద్దరూ కాళీ ఇడియట్ పోస్టర్ ని స్పూఫ్ చేస్తే వెనక నుంచి సాకేత్ కొమాండూరి "జింతాతా జితాజితా" సాంగ్ ని వాళ్ళ ఇద్దరి పేర్లతో రాసి పాడుతూ అందరినీ ఎంటర్టైన్ చేసాడు. ఇక అలా చూడలేని శ్రీముఖి వీపు మీద బాధేసింది..డెబ్జానీ ఐతే అమరదీప్ జుట్టు పట్టుకుని పీకేసింది. ఇక జడ్జ్ అనసూయ ఐతే దొంగ సచ్చినోడా అంటూ క్యూట్ గా తిట్టింది. "తేజు షర్ట్ తీయమంది..నాకు వాతలు పెట్టేసింది" అంటూ సాకేత్ పడేసరికి డెబ్జానీ ఫుల్ ఎంటర్టైన్ అయ్యింది. అమరదీప్ ఐతే బాగా నవ్వుకున్నాడు.

Illu illalu pillalu : శ్రీవల్లిని జాబ్ చేయమన్న చందు.. కొడుకు కష్టాన్ని చూసి తండ్రి ఎమోషనల్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -188 లో... ప్రేమ డాన్స్ క్లాస్ చెప్తున్న విషయం  రామరాజుకి శ్రీవల్లి చెప్పిందని ప్రేమ, నర్మదలకి అర్ధమవుతుంది. దాంతో ఇండైరెక్ట్ గా ఎవరు మావయ్యకి చెప్పారని శ్రీవల్లిని అడుగుతారు. నువ్వు గానీ చెప్పావా అక్క.. నిన్న మీ అమ్మ వాళ్ళింటికి వెళ్ళావటా అని నర్మద అంటుంది. నేను వేరొక రూట్ నుండి వెళ్ళాను.. బ్యాంకు కాలనీ నుండి వెళ్ళలేదని శ్రీవల్లి అనగానే మేమ్ బ్యాంక్  కాలనీలో డాన్స్ నేర్పిస్తున్న విషయం నీకెలా తెలుసని నర్మద అనగానే శ్రీవల్లికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది.

గెలిస్తే 1000 వాలా అంటిస్తాం గెలవకపోతే సెట్ అంటించేస్తాం

కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ షో గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఈ షో ప్రోమో లేటెస్ట్ గా రిలీజ్ అయ్యింది. "మాష్టర్ ఫినాలేకి ప్రిపరేషన్ ఎలా ఉంది" అని శ్రీముఖి శేఖర్ మాష్టర్ ని అడిగింది. చూసావు కదా అంటూ అమరదీప్ గట్టిగా అరుస్తూ "1000 వాలా తెచ్చి స్టేజి మీద పెట్టి మాష్టర్ చెప్పండి వెలిగించేస్తాం" అన్నాడు మంచి జోష్ తో. "గెలిస్తే ఇవి అంటిస్తాం గెలవకపోతే సెట్ అంటించేస్తాం" అంటూ విన్నింగ్ కెప్టెన్ ఇమ్మానుయేల్ చెప్పుకొచ్చాడు. ఇక లేడీస్ సైడ్ నుంచి ప్రియాంక జైన్ వచ్చి కోసేయమంటారా అంటూ కేక్ ని చూపించి అడిగింది.